-
చంద్రబాబు వల్లే రాష్ట్రం దివాలా: మంత్రి రాజా
తుని రూరల్: చంద్రబాబు హయాంలో అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని దివాలా తీయించారని రోడ్లు భవనాలశాఖ మంత్రి దాడిశెట్టి రాజా విమర్శించారు. కాకినాడ జిల్లా తుని మండలం గెడ్లబీడు వద్ద శుక్రవారం జరిగిన జేసీఎస్ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రాజా మాట్లాడుతూ ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని చంద్రబాబు, యనమల రామకృష్ణుడు చేస్తున్న తప్పుడు ప్రచారంపై ధ్వజమెత్తారు. తనపై యనమల రామకృష్ణుడు తప్పుడు ప్రచారం చేస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటనందూరు మండలంలో తాను 150 ఎకరాలు కొనుగోలు చేసినట్లు నిరూపిస్తే ఆ భూమిని ఆయనకే రాసిచ్చేస్తానని సవాల్ విసిరారు. -
కేసీఆర్కు గుణపాఠం తప్పదు..
సాక్షి, న్యూఢిల్లీ: ప్రజలు సీఎం కేసీఆర్కు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు, ఎంపీ బండి సంజయ్ హెచ్చరించారు. తెలంగాణ పోలీసులు కేంద్రమంత్రి కిషన్రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేయ డాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అరెస్టులతో బీజేపీ వెనకడుగు వేయబోదన్నారు. కేసీఆర్ మోనార్క్లా వ్యవహరిస్తున్నారని, ఇకనైనా ఆ బుద్ధులు మానుకోవాలని హితవు పలికారు. గురువారం ఢిల్లీలోని తెలంగాణభవన్లో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించడంలో తప్పేముందన్నారు. డబుల్ బెడ్రూమ్ల కోసం ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఎన్ని ఇచ్చారు? ఎన్ని కట్టిచ్చారు? అనే ప్రశ్నలకు స్పష్టమైన సమా ధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చిన ఇళ్లు పూర్తి చేశాం అని కేంద్రానికి నివేదిక ఇచ్చిన కేసీఆర్... లబ్ధిదారుల లిస్ట్ ఎందుకు ఇవ్వ డం లేదని కేంద్రం ప్రశ్నిస్తే స్పందించకపోవడానికి గల కారణాలను ప్రజలకు వివరించాలన్నారు. కేసీఆర్ చూపిన గ్రాఫి క్స్కు, కట్టిన డబుల్ ఇళ్లకు పొంతనే లేదని, నా పాదయాత్రలో రాష్ట్ర ప్రభుత్వం కట్టించిన ఆ ఇళ్లను పరిశీలిస్తే ముట్టుకుంటే కూలిపోయేలా ఉన్నాయని తెలిపారు. అరెస్టులు, గృహ నిర్బంధాలు కేసీఆర్ నియంత పాలనకు నిదర్శనమని, ఎంపీల అరెస్టులపై పార్లమెంట్లో ప్రివిలేజ్ నోటీసులు కూడా ఇచ్చామన్నారు. -
'దేవాలయం కంటే తక్కువేం కాదు..' గీతా ప్రెస్పై ప్రధాని ప్రసంశలు..
లక్నో: ఉత్తరప్రదేశ్లో గీతా ప్రెస్పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంశలు కురిపించారు. గీతా ప్రెస్ దేవాలయం కంటే తక్కువేం కాదని అన్నారు. ఈ మేరకు గీతా ప్రెస్ శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోదీ.. ప్రతిపక్షాల చర్యలను ఎండగట్టారు. గీతా ప్రెస్కు గాంధీ శాంతి బహుమతి ఇవ్వడంపై ప్రతిపక్షాలు తప్పుబట్టిన విషయం తెలిసిందే. 'కొన్నిసార్లు సన్యాసులు దారి చూపిస్తారు. మరికొన్ని సార్లు గీతా ప్రెస్ లాంటి సంస్థలు మార్గం చూపిస్తాయి' అని మోదీ చెప్పారు. గీతా ప్రెస్ మానవత్వానికి దారి చూపిస్తోందని అన్నారు. మహాత్మా గాంధీకి గీతా ప్రెస్తో మంచి సంబంధం ఉందని గుర్తు చేశారు. గాంధీ నెలవారీ మ్యాగజీన్ 'కల్యాన్'ను ఈ సంస్థకే కేటాయించారని తెలిపారు. ఇప్పటివరకు కూడా ఆ మ్యాగజీన్ను ప్రకటనలు లేకుండా కొనసాగిస్తున్నారని చెప్పారు. గీతా ప్రెస్కు మహాత్మాగాంధీ శాంతి బహుమతిని కేటాయిస్తూ కొన్నిరోజుల క్రితం కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనిపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ సహా పలు రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి. బీజేపీ పార్టీ భావాజాలానికి చెందిన సంస్థకే కేటాయించారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో గీతా ప్రెస్ ఆ బహుమతికి చెందిన ప్రైజ్ మనీ కోటి రూపాయలను నిరాకరించింది. అనంతరం ప్రధాని మోదీ గీతా ప్రెస్పై మాట్లాడింది ఇదే తొలిసారి. గీతా ప్రెస్ ఎంతో మంచి పుస్తకాలను ముద్రిస్తుందని ప్రధాని తెలిపారు. ఎక్కడ గీత ఉంటుందో అక్కడ సాక్షాత్తు కృష్ణుడు ఉంటాడని అన్నారు. గీతా ప్రెస్ దేశాన్ని ఐక్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. దేశ జ్ఞాన సంపదను పెంచుతోందని కొనియాడారు. 'ఏక్ భారత్.. శ్రేష్ఠ భారత్' విధానాన్ని గీతా ప్రెస్ ప్రతిబింబిస్తోందని ప్రధాని మోదీ చెప్పారు. ఇదీ చదవండి: 'భయపడేవాడు కాదు మోదీ..' ప్రతిపక్షాలపై ప్రధాని ఘాటు వ్యాఖ్యలు.. -
చిత్తూరు: కుప్పంలో మరోసారి టీడీపీ నేతల దౌర్జన్యం
-
కుప్పంలో మరోసారి టీడీపీ నేతల దౌర్జన్యం
సాక్షి, చిత్తూరు: కుప్పంలో టీడీపీ అరాచకం కొనసాగుతోంది. మరోసారి టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. విజయవాణి స్కూల్పై టీడీపీ గూండాలు దాడి చేశారు. వందలాదిగా తరలివచ్చి స్కూల్ అద్ధాలు ధ్వంసం చేశారు. అనంతరం వంట సిబ్బందిపై కూడా దాడికి పాల్పడ్డారు. టీడీపీ గూండాల దాడిలో మహిళ గాయపడింది. మహిళల వద్ద సెల్ఫోన్లు, మెడలో గోల్డ్చైన్లు టీడీపీ గూండాలు లాక్కెళ్లారు. చదవండి: kuppam: ఓటర్లను నేరుగా ప్రలోభపెడుతున్న చంద్రబాబు
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
విజృంభిస్తున్న ఎండలు
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
పోలింగ్కు సర్వం సిద్ధం
రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు
ప్రజ్వల్పై కఠిన చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
Advertisement