-
ఆసీస్లో లంక క్రికెటర్ గుణతిలక అరెస్ట్
సిడ్నీ: టి20 ప్రపంచకప్ ఆడేందుకు ఆస్ట్రేలియా వెళ్లిన శ్రీలంక క్రికెటర్ దనుష్క గుణతిలక కటకటాల పాలయ్యాడు. ఈ నెల 2న ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలతో సిడ్నీ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. 31 ఏళ్ల గుణతిలకపై అత్యాచారం కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టినట్లు సిడ్నీ పోలీసులు వెల్లడించారు. దీంతో సూపర్–12లో నిష్క్రమించిన శ్రీలంక జట్టు గుణతిలక లేకుండానే ఆదివారం స్వదేశానికి పయనమైంది. ఆన్లైన్ డేటింగ్ ద్వారా పరిచయమైన 29 ఏళ్ల మహిళను రోజ్ బేలోని ఇంట్లో కలిసిన లంక క్రికెటర్ ఆమెపై అత్యాచారం చేసినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో పేర్కొన్నారు. క్వాలిఫయింగ్ తొలి రౌండ్ పోటీల్లో ఒక్క నమీబియాతో ఆడిన గుణతిలక గాయం కారణంగా ఇతర మ్యాచ్లు ఆడలేకపోయాడు. ఇప్పటివరకు తన కెరీర్లో 8 టెస్టులు, 47 వన్డేలు, 46 టి20లు ఆడిన గుణతిలక వివాదాస్పద క్రికెటర్గా ముద్రపడ్డాడు. 2017లో అనుచిత ప్రవర్తన, ట్రెయినింగ్ సెషన్కు చెప్పాపెట్టకుండా గైర్హాజరు కావడంతో 6 వన్డేల సస్పెన్షన్ వేటు వేశారు. 2018లో కర్ఫ్యూ నిబంధనలు అతిక్రమించడంతో ఆరు నెలలు నిషేధం విధించారు. గతేడాది ఇంగ్లండ్ పర్యటనలో బయో బబుల్ బయటకు రావడంతో ఏడాది పాటు సస్పెండ్ చేసి చివరకు ఆరు నెలలకు తగ్గించారు. -
వార్నీ! సొంత తండ్రితోనే సినీ నటుడి ఆన్లైన్ డేటింగ్..
వాషింగ్టన్: హాలీవుడ్ నటుడు, దర్శకుడు జేమ్స్ మోరొసినికి వింత సమస్య వచ్చి పడింది. ఆయన గత కొన్ని రోజులుగా ఫేస్బుక్లో ఒక అమ్మాయితో చాట్ చేస్తున్నాడు. ఆన్లైన్ వేదికగా 31 ఏళ్ల జేమ్స్ మోరొసినికి, బెక్కా అనే అమ్మాయికి పరిచయమైంది. అభిరుచులు, అలవాట్లు, ఆసక్తులు కలవడంతో వారి మధ్య స్నేహం చిగురించింది. స్నేహం కాస్తా ఆన్లైన్ డేటింగ్కు దారితీసింది. ఇలా కొన్ని రోజులు ఆ అమ్మాయితో మనోడు డేటింగ్, చాటింగ్ చేస్తూనే ఉన్నాడు. ఈక్రమంలోనే తనకు సంబంధించిన చాలా విషయాలు ఆ అమ్మాయి చెప్తున్నవాటితో సరిపోలడంతో అతనికి డౌట్కొట్టింది. దీంతో మరింత లోతుగా ఆ యువతి బెక్కా వివరాలు తెలుసుకుని షాకయ్యాడు. అతడు ఆన్లైన్లో ఇన్నిరోజులూ డేటింగ్ చేస్తున్నది తన తండ్రితో అని తెలిసి బిక్కచచ్చిపోయాడు. అయితే, తన తండ్రి ఫేక్ ఫేస్బుక్ ప్రొఫైల్తో అలా ఎందుకు చేశాడో తెలుసుకుని కుదుటపడ్డాడు. (చదవండి: మార్లిన్ మన్రో చిత్రానికి భారీ ధర.. అక్షరాలా రూ.1521కోట్లా..!) అమ్మాయిల పట్ల తన ప్రవర్తన ఎలా ఉంది. ఇతరులతో ఆన్లైన్ స్నేహాలు గట్రా చేసే క్రమంలో ఓవర్ చేస్తున్నాడా? అని తెలుసుకునేందుకే ఆయన అలా చేశాడని తెలిసింది. ఆన్లైన్ యుగంలో సైబర్ నేరాలకు కొదవే లేకుండా పోయింది. గుడ్డిగా నమ్మి మోసపోయినవారెందరో ఉన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లల డిజిటల్ వ్యవహారాలపట్ల అప్రమత్తంగా ఉండటం మంచిదే కదా! (చదవండి: అర్ధరాత్రి పరుగులు.. ఫేమస్ చేయొద్దంటూ దణ్ణం పెడుతున్నాడు!) -
మొదట డేటింగ్..ఆపై ఇంటికి రప్పించుకుని.. నగ్నంగా మార్చి..
న్యూఢిల్లీ: ఆన్లైన్లో డేటింగ్ పేరిట పురుషులను ట్రాప్ చేసి, ఆపై వారిని బెదిరించి డబ్బు వసూలు చేస్తున్న కిలాడీలను కటకటాల వెనక్కి నెట్టారు ఢిల్లీ పోలీసులు. ఈ డేటింగ్ బాగోతం దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో చోటుచేసుకుంది. తాజాగా ఓ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో ఈ ఘటన వెలుగుచూసింది. దీంతో ఇందులో ప్రధాన పాత్ర పోషించిన మహిళను ఆమెకు సహకరించిన మరో నలుగురిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. నిందితులు మొదట ఆన్లైన్ డేటింగ్ యాప్ ద్వారా బాధితులతో స్నేహం చేసి, తర్వాత వారిని తమ ఇంటికి రప్పించుకుంటారు. అలా వచ్చని వారికి మత్తుమందు కలిపిన నీరు లేదా కూల్డ్రింక్స్ ఇస్తారు. అది తాగి స్పృహ కోల్పోయిన తరువాత వారిని మహిళతో చనువుగా ఉన్నట్లు ఫోటోలు తీయడంతో పాటు అభ్యంతకరమైన ఫోటోలు తీసి బెదిరింపుల పర్వాన్ని మొదలుపెడతారు. ఈ తరహాలోనే ఇటీవల ఓ వ్యాపారికి ప్లై బోర్డు కావాలని ఓ మహిళ నుంచి కాల్ వచ్చింది. దీంతో అతను అక్టోబర్ 21న జనక్పురి ప్రాంతంలోని నిందితురాలి ఇంటికి వెళ్లాడు. అక్కడ ఆమె తాగడానికి ఒక గ్లాసు మంచినీరు ఇవ్వగా దాన్ని తాగిన వెంటనే అతను స్పృహతప్పి పడిపోయాడు. వ్యాపారి స్పృహలోకి వచ్చినప్పుడు నగ్నంగా మంచం మీద ఉన్నాడు. కళ్లు తెరచి చూడగా చూట్టూ ఆరుగురు మహిళలు, ముగ్గురు పురుషులు అతనిపై దాడి చేసి, తన వద్ద ఉన్న సుమారు 16 వేల రూపాయల నగదు, చేతి గడియారం, బంగారు ఉంగరం లాక్కున్నారు. అంతే కాకుండా మరో రూ.7 లక్షలు ఇవ్వకుంటే చంపేస్తామని బెదిరించారు. దీంతో ఆ వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఈ ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వ్యక్తుల నుంచి తాము కొన్ని ఫైళ్లు, డబ్బు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నామని ఢిల్లీ పోలీసులు చెప్పారు. గత రెండేళ్లలో ఈ ముఠా దాదాపు 40 మంది పురుషుల నుంచి విలువైన వస్తువులను తీసుకున్నట్లు విచారణలో తేలిందని తెలిపారు. చదవండి: భర్తకు అన్నం వడ్డించి.. అంగడికి వెళ్లొస్తానని చెప్పి నవవధువు అదృశ్యం -
లవ్ ఆర్ట్స్ పేరుతో కాల్ సెంటర్.. డేటింగ్ ఆఫర్స్
సాక్షి, సిటీబ్యూరో: ఎదుటివారి బలహీనతల్ని ఆసరాగా చేసుకుంటూ ఆన్లైన్లో డేటింగ్ సైట్ పేరుతో రిజిస్టర్ చేయడంతో పాటు ఫోన్కాల్స్ ద్వారానూ ఎర వేసి, బెదిరింపులకు పాల్పడి, అందినకాడికి దండుకుంటున్న ముఠా గుట్టును సిటీ సైబర్ క్రైమ్పోలీసులు రట్టు చేశారు. కోల్కతా కేంద్రంగా పని చేస్తున్న కాల్ సెంటర్పై దాడి చేసిన అధికారులు ముగ్గురిని అరెస్టు చేశారు. మరో 16 మంది నిందితులకు నోటీసులు జారీ చేసినట్లు సీసీఎస్ సంయుక్త పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి సోమవారం తెలిపారు. పశ్చిమ బెంగాల్లోని కోల్కతాకు చెందిన సోమ రోక అక్కడ ‘లవ్ ఆర్ట్స్’ పేరుతో ఓ కాల్సెంటర్ ఏర్పాటు చేశారు. ఇందులో అర్నబ్సూర్ డెవలపర్గా, మహ్మద్ ఇమ్రాన్ జూనియర్ డెవలపర్గా పని చేస్తున్నారు. ఈ ముగ్గురు మరో 16 మంది యువతులను టెలీ కాలర్స్గా నియమించుకున్నారు. వీరికి నెలవారీ జీతాలు చెల్లిస్తూ ఫోన్లు చేయించడం, వచ్చిన కాల్స్ను రిసీవ్ చేసుకుని మాట్లాడటం వంటి బాధ్యతలు అప్పగించారు. వీరు పాటించాల్సిన అంశాలకు సంబంధించి ఓ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) సైతం సోమ ఏర్పాటు చేసింది. వీళ్లు ఆన్లైన్ డేటింగ్ సర్వీస్ ఇస్తామంటూ ఇంటర్నెట్లో పొందుపరిచారు. దీంతో పాటు వివిధ మార్గాల్లో పలువురి సెల్ఫోన్ నెంబర్లు సంగ్రహించి కాల్స్ చేస్తున్నారు. ఈ ఫోన్లకు స్పందించిన వారితో పాటు ఆన్లైన్లో తమ నెంబర్లు చూసి కాల్ చేసిన వారితోనూ టెలీకాలర్స్ మాట్లాడతారు. తాము ఆన్లైన్లో డేటింగ్ సేవలు అందిస్తామంటూ చెప్తారు. అవతలి వ్యక్తులు ఆసక్తి చూపితే వారి నుంచి ప్రాథమికంగా రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.1025 ఆన్లైన్లో కట్టించుకుంటున్నారు. ఆపై తాము ప్లాటినం, గోల్డ్, సిల్వర్ పేర్లతో స్కీములు నిర్విహిస్తున్నామని చెప్తారు. రూ.3500 కట్టి సిల్వర్ స్కీమ్లో చేరితే యువతులతో చాటింగ్ చేసే అవకాశం, రూ.5500 కట్టి గోల్డ్లో చేరితో చాటింగ్తో పాటు ఫోన్కాల్స్, రూ.10,500 కట్టి ప్లాటినం స్కీములో సభ్యుడిగా మారితే ఆయా యువతుల్ని కలిసే అవకాశం కూడా ఉంటుందని ఎర వేస్తున్నారు. ఈ మొత్తాలు కట్టడానికి సిద్ధమైన వారికి బ్యాంకు ఖాతాల వివరాలు ఇచ్చి డబ్బు డిపాజిట్ చేయించుకుంటున్నారు. ఆపై టార్గెట్ చేసిన వ్యక్తి నుంచి ఫోన్ నెంబర్, ఈ–మెయిల్ ఐడీ, ఫొటో, చిరునామా అందించాలని కోరి...అలా చేస్తే మీరు నివసించే ప్రాంతానికి సమీపంలో ఉండే యువతి ఫోన్ నెంబర్లు ఇస్తామంటూ చెప్తున్నారు. స్కీముల్లో చేరి, డబ్బుకట్టి, కోరిన వివరాలు పంపిన వారికి కొన్ని ఫోన్ నెంబర్లు సైతం పంపిస్తున్నారు. వాస్తవానికి ఇవి తమ కాల్సెంటర్లో పని చేసే టెలీకాలర్ల వద్దే ఉంటాయి. ‘కస్టమర్లు’ ఫోన్/చాటింగ్ చేసినప్పుడు మాత్రం తమ వద్ద ఉన్న డేటా బేస్ ఆధారంగా వారు ఎక్కడి నుంచి చేస్తున్నారో తెలుసుకుంటారు. దీని ఆధారంగా తాము ఆ సమీపంలో ఉంటామని చెప్పి నమ్మించి మాట్లాడటం, చాటింగ్ చేయడం చేస్తూ పూర్తిగా బుట్టలో పడేస్తున్నారు. ఆపై మళ్లీ సంప్రదించే టెలీకాలర్లు ఈసారి తాము ఇన్కమ్, ఎంజాయ్ పేర్లతో రెండు గ్రూపులు ఏర్పాటు చేశామని చెప్తున్నారు. నిర్ణీత మొత్తం చెల్లించి వీటిలో చేరవచ్చని... ఇన్కమ్లో చేరితో అవతలి వ్యక్తుల్ని కలిసి అవకాశం ఉన్నప్పుడు వారి నుంచి డబ్బు సైతం తీసుకోవచ్చని, అలా వచ్చిన మొత్తంలో 20 శాతం తాము తీసుకుని 80 శాతం ఇస్తామని చెప్తున్నారు. ఎంజాయ్ గ్రూప్లో కేవలం ఎంజాయ్మెంట్ మాత్రమే ఉంటుందని నమ్మబలుకుతున్నారు. ఇదంతా అయ్యాక ఆ కాల్సెంటర్ నిర్వాహకులు అసలు కథ మొదలు పెడుతున్నారు. వీరే కస్టమర్ల వివరాలను వివిధ రకాలైన డేటింగ్ వెబ్సైట్స్లోకి అప్లోడ్ చేస్తున్నారు. ఇలా చేసిన తర్వాత కాల్సెంటర్ నుంచే తాము పోలీసులమని కస్టమర్లకు ఫోన్ చేస్తున్నారు. ఫలానా సైట్లో మీ పేరు రిజిస్టరై ఉందని, అది నేరం కావడంతో కేసు నమోదు చేశామని చెప్తున్నారు. అరెస్టు కాకుండా ఉండాలంటే డబ్బు చెల్లించాలంటూ రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. తమ బలహీనత బయటపడి పరువు పోతుందనే ఉద్దేశంతో అనేక మంది బాధితులు తాము మోసపోయామన్న విషయాన్నీ బయటకు చెప్పుకోవట్లేదు. ఈ పంథాలో సోమ అండ్ గ్యాంగ్ నగరానికి చెందిన ఒకరి నుంచి రూ.1.2 లక్షలు, మరొకరి నుంచి రూ.12 వేలు కాజేశారు. వీరి ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ ఠాణాలో కేసులు నమోదయ్యాయి. దారుణంగా మోసాలు చేస్తున్న ఈ నేరగాళ్లను పట్టుకోవడానికి నిర్ణయించుకున్న అదనపు డీసీపీ కేసీఎస్ రఘువీర్ ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. ఇన్స్పెక్టర్లు ఎన్.మోహన్రావు, గంగాధర్లతో కూడిన బృందం కోల్కతా వెళ్లి కాల్సెంటర్పై దాడి చేసింది. సోమ, అర్నబ్సూర్, ఇమ్రాన్లను అరెస్టు చేసింది. టెలీకాలర్స్గా పని చేస్తున్న మరో 16 మందికి నోటీసులు జారీ చేసింది. ఈ కాల్సెంటర్ టర్నోవర్ నెలకు రూ.50 లక్షల వరకు ఉందని, ఇలాంటి సెంటర్లు అక్కడ అనేకం ఉన్నాయని పోలీసులు చెప్తున్నారు. బాధితుల నుంచి డబ్బు డిపాజిట్ చేయించడానికి వీరు వినియోగిస్తున్న బ్యాంకు ఖాతాలు వేరే వారి పేర్లతో, బోగస్ వివరాలతో ఉంటున్నాయని చెప్తున్నారు. అరెస్టు చేసిన ముగ్గురు నిందితుల్నీ కోల్కతాలోకి కోర్టులో హాజరుపరిచిన సైబర్ క్రైమ్ పోలీసులు పీటీ వారెంట్పై సిటీకి తీసుకువచ్చి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. -
డేటింగ్ పేరుతో ‘డ్యాష్’
సాక్షి,సిటీబ్యూరో: సైబర్ నేరగాళ్లు నగర యువకుడికి డేటింగ్ పేరుతో ‘డ్యాష్’ ఇచ్చారు... ఓ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవడంతో యువతితో ఫోన్ చేయించి ఎర వేశారు... వివిధ దఫాల్లో మొత్తం రూ.4.08 లక్షలు కాజేశారు. చివరకు మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు సోమవారం ఫిర్యాదు చేయడంతో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బోయిన్పల్లికి చెందిన అభిషేక్ ఉద్యోగం కోసం ఆన్లైన్లో అనేక వెబ్సైట్లను పరిశీలిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే అతడి కన్ను డ్యాషీడేటింగ్.ఇన్ వెబ్సైట్పై పడింది. ఆ సైట్లోకి ప్రవే«శించిన అతను తన పేరు రిజిస్టర్ చేసుకున్నాడు. ఆ తర్వాత అతడి సెల్కు ఓ మహిళ కాల్ చేసి తన పేరు పూనంగా పరిచయం చేసుకుంది. వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకున్నందున రూ.1000 తమ ఖాతాలో డిపాజిట్ చేస్తే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుందని, ఆపై డేటింగ్కు అవకాశాలు వస్తాయని చెప్పింది. దీంతో అభిషేక్ ఆమె చెప్పిన ఖాతాలో డబ్బు డిపాజిట్ చేశాడు. ఆపై మరోసారి కాల్ చేసిన పూనం రూ. 20,800 డిపాజిట్ చేయాలని కోరడంతో అలానే చేశాడు. ఇలా పలుమార్లు ఆమె నుంచి ఫోన్లు కావడంతో అభిషేక్ డబ్బు డిపాజిట్ చేసుకుంటూ పోయాడు. ఇలా వివిధ దఫాలుగా మొత్తం రూ.4,08,798 వివిధ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేశాడు. ఇంత మొత్తం చెల్లించినా డేటింగ్ కోసం వెబ్సైట్ నిర్వాహకుల నుంచి ఎలాంటి సమాచారం అందకపోవడంతో అనుమానించిన అభిషేక్ వారిని సంప్రదించడానికి ప్రయత్నించాడు. పూనం కాల్ చేసిన సెల్ఫోన్లు అన్నీ స్విచ్ఛాఫ్లో ఉండటంతో మోసపోయినట్లు గుర్తించాడు. నగర సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు అభిషేక్ డబ్బు డిపాజిట్ చేసిన బ్యాంకు ఖాతాల వివరాల సహా వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ‘ఎమ్మెల్సీ’ కేసు దర్యాప్తు ముమ్మరం... క్రెడిట్ కార్డు అప్డేట్ చేయాలంటూ బీజేపీ ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్రావు నుంచి రూ.58 వేలు కాజేసిన కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎమ్మెల్సీ రాంచందర్రావుకు గత నెల 31న ఓ వ్యక్తి ఫోన్ చేసి తన పేరు రవిగా పరిచయం చేసుకుని తాను ఆర్బీఎల్ బ్యాంకు ఎగ్జిక్యూటివ్నని, మీ క్రెడిట్ కార్డు గడువు కొద్దిరోజుల్లో ముగుస్తుందని అప్డేట్ చేసుకోవాలంటూ సూచించాడు. అతని మాటలు నమ్మిన ఎమ్మెల్సీ తన క్రెడిట్ కార్డులకు సంబంధించిన కార్డు నెంబర్లు, వాటి గడువు తేది, సీవీవీ నెంబర్లు చెప్పేశారు. మరుసటి రోజు వివిధ బ్యాంకు ఖాతాల నుంచి రూ.58 వేలు డ్రా అయినట్లు సమాచారం అందడంతో తాను మోసపోయినని గుర్తించిన ఆయన ఫిర్యాదు చేయడంతో సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ ఠాణాలో కేసు నమోదైంది. నిందితుడు వినియోగించిన సెల్ఫోన్ నెంబర్తో పాటు ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
IPL 2024: సీఎస్కేను చిత్తు చేసిన పంజాబ్.. ఘనమైన రికార్డు
గోల్డ్ స్పాట్ కుటుంబం.. గోల్మాల్ ‘గీతం’
మళ్లీ జగన్ రావాలి
చంద్రబాబుపై నమ్మకం లేకే ఉమ్మడి మేనిఫెస్టోకు బీజేపీ నో
జేబీ పౌడర్తో అండాశయ క్యాన్సర్.. పరిష్కారానికి రూ.54వేలకోట్లు
నడుస్తున్న రైలులో భార్యకు ట్రిపుల్ తలాక్!
శ్రీదేవి మొదటి లగ్జరీ ఇల్లు.. రెంట్కు ఇస్తారట!
ఒకప్పుడు మోదీ ఫాలోవర్.. ఇప్పుడు వారణాసిలో పోటీ
అరుదైన గుండె సమస్య.. 23 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ క్రికెటర్
చంద్రబాబు మేనిఫెస్టోపై పోసాని అదిరిపోయే సెటైర్లు..
తప్పక చదవండి
- ఒకప్పుడు మోదీ ఫాలోవర్.. ఇప్పుడు వారణాసిలో పోటీ
- అరుదైన గుండె సమస్య.. 23 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ క్రికెటర్
- ‘ఆప్’- కాంగ్రెస్ ఆశలకు బీఎస్పీ గండి కొట్టనుందా?
- ఉద్యోగాల కోతలు.. ఏకంగా హెచ్ఆర్ హెడ్ ఔట్!
- జయహో జోయా
- రాష్ట్రంలో పోలింగ్ సమయం పెంపు
- ‘కింగ్స్’ పోరులో పంజాబ్దే గెలుపు
- చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
Advertisement