-
ఆధునిక యుద్ధ ట్యాంకులను పరీక్షించిన ఓడీఎఫ్
కొండాపూర్(సంగారెడ్డి): సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలోని మల్కాపూర్ చెరువులో శనివారం రెండు యుద్ధ ట్యాంకుల ట్రయల్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓడీఎఫ్ పరిశ్రమ అధికారులు మాట్లాడుతూ దేశంలో ఇలాంటి ట్యాం కులను చెన్నై, మెదక్లోని ఓడీఎఫ్లో మాత్రమే తయారు చేస్తారన్నారు. ఒక్కో ట్యాంక్లో పది మంది కూర్చునేందుకు వీలుంటుందని తెలిపారు. ఈ యుద్ధ ట్యాంక్కు కేవలం పగలు మాత్రమే కాకుండా రాత్రి వేళల్లోనూ ప్రయాణించే సామర్థ్యం ఉంటుందని, నీటితో పాటు బురద, నేలపై దూసుకుపోతుందని పేర్కొన్నారు. శత్రువులపై దాడి చేసే సమయంలో పెద్దపెద్ద సరస్సులను దాటేందుకు అనువుగా ఈ యుద్ధ ట్యాంకులను తయారు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కంట్రోలర్ బ్రిగేడియర్ నేవిబుట్ట, జాయింట్ కంట్రోలర్ శరవణన్, డిప్యూటీ కంట్రోలర్ బాలషణ్ముగం తదితరులు పాల్గొన్నారు. -
ఏడు రక్షణ సంస్థలు జాతికి అంకితం?
కంది(సంగారెడ్డి): రక్షణరంగ ఉత్పత్తులకు సంబంధించి కొత్తగా ఏర్పాటు చేసిన ఏడు కార్పొరేషన్లను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం లాంఛనంగా ప్రారంభించారు. రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, రక్షణరంగ ప్రముఖుల సమక్షంలో వీటిని జాతికి అంకితం చేశారు. ఢిల్లీలోని డీఆర్డీఓ భవన్లో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని సంగారెడ్డి జిల్లా ఎద్దుమైలారం ఆయుధ కర్మాగారంలో జనరల్ మేనేజర్ అలోక్ ప్రసాద్ ఇతర అధికారులు లైవ్ ద్వారా వీక్షించారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్, డిఫెన్స్ ప్రొడక్షన్, డిఫెన్స్ మినిస్ట్రీ కింద దేశ వ్యాప్తంగా ఉన్న 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలతో ఈ కొత్త సంస్థలు ఏర్పడ్డాయి. ఈ సంస్థలు సాయుధ దళాలకు సంబంధించి వివిధ రకాల ఉత్పత్తులను సరఫరా చేయనున్నాయి. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ (ఎద్దు మైలారం)గ్రోత్ అండ్ గ్లోరీ అనే అశంపై వీడియోను ప్రదర్శించారు. అనంతరం ఎద్దుమైలారం యూనిట్ జనరల్ మేనేజర్ అలోక్ ప్రసాద్, ఏజీఎం శివకుమార్ మాట్లాడుతూ రక్షణ రంగంలో ఏడు కొత్త సంస్థలు రావడం హర్షించదగ్గ విషయం అన్నారు. కార్పొరేషన్ల ఏర్పాటుతో కార్మికులు, ఉద్యోగుల భవిష్యత్తుకు ఎలాంటి ప్రమాదం ఉండదన్నారు. మరింత పట్టుదలతో పనిచేసి కొత్తరకం ఉత్పత్తులను తయారు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. -
ఓడీఎఫ్ లక్ష్యం నెరవేరిందా?
దేశంలోని గ్రామీణ ప్రాంతాలు బహిరంగ మల విసర్జన రహిత(ఓడీఎఫ్)మయ్యాయని బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆయన చెబుతున్న లెక్కల ప్రకారం దేశంలో గత అయిదేళ్లలో 60 కోట్లమంది ప్రజలకు 11 కోట్ల మరుగుదొడ్లను నిర్మించారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ వివరాలనుబట్టి పశ్చిమబెంగాల్లోని 52 మున్సిపాలిటీలు మినహా దేశమంతా ఓడీఎఫ్ సాధించినట్టే. తొలిసారిగా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక మోదీ స్వాతంత్య్ర దినో త్సవం రోజున ఎర్రకోట బురుజులపై నుంచి ప్రసంగిస్తూ ‘స్వచ్ఛ భారత్’ బృహత్తర కార్యక్రమానికి అంకురార్పణ చేశారు. 2019లో జరగబోయే మహాత్మా గాంధీ 150వ జయంతి నాటికి ఓడీఎఫ్ సాధించాలని అప్పట్లో మోదీ లక్ష్య నిర్దేశం చేశారు. దీనిపై ఆనాటినుంచీ అన్ని మాధ్యమాల్లో, అన్ని భాషల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. మోదీ తానే స్వయంగా ప్రతి సందర్భంలోనూ దాని గురించి ప్రస్తావిస్తూ వచ్చారు. అందువల్ల చెప్పుకోదగ్గ ఫలితం కూడా కనబడిందనడంలో సందేహం లేదు. అయితే అది ఓడీఎఫ్ ప్రకటించేంత స్థాయిలో ఉందా అన్న విషయంలోనే అందరికీ సంశయం. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో రెండు ప్రధానాంశాలున్నాయి. అందులో మరుగుదొడ్ల నిర్మాణం ఒకటైతే, ప్రజానీకం ప్రవర్తలో మార్పు తీసుకురావడం రెండోది. మరుగుదొడ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం భారీయెత్తున నిధులు వ్యయం చేసింది. అయితే ఈ కార్యక్రమంలో ప్రధాన లోపం ఏమంటే, ఇంటి యజమానులు ముందుగా తమకు తాము మరుగుదొడ్లు నిర్మించుకోవాలి. వాటిని తనిఖీ చేసి అవి సక్రమంగా ఉన్నాయని సంతృప్తి చెందాక యజమానులకు పంచాయతీలు ఆ నిర్మాణానికైన ఖర్చు చెల్లిస్తాయి. ఒక మరుగుదొడ్డి కోసం కనీసం రూ. 15,000 అవసరమవుతాయి. అంత సొమ్ము సొంతంగా పోగేసుకుని నిర్మించుకోవడం ఎంతమందికి సాధ్యమవుతుంది? ఏమై తేనేం రిజిస్టరైన ప్రతి ఇంటి ఆవరణలోనూ ఇప్పుడు మరు గుదొడ్డి సదుపాయం ఉందని కేంద్రం అంటున్నది. అది జరిగిందనే అనుకుందాం. మరి ప్రజానీకం ప్రవర్తనలో మార్పు సంగతేమిటి? అసలు అది ప్రవర్తనకు సంబంధించిన సమస్యా లేక ఇతరత్రా సమస్యల పర్యవసానంగా ఏర్పడిందా? మరుగుదొడ్ల లెక్కలన్నీ దేశవ్యాప్తంగా 2012లో గ్రామీణ గృహ నిర్మాణ సంస్థలు, గ్రామీణాభివృద్ధి విభాగం పంచాయతీలతో కలిసి సంయుక్తంగా జరిపిన సర్వే ద్వారా వెల్లడైనవే. ఇప్పుడు దాని ప్రాతిపదికనే ఓడీఎఫ్ ప్రకటించారు. అప్పట్లోనే ఎన్నో విమర్శలొచ్చిన ఆ గణాంకాల ప్రాతిపదికగా అంతా సవ్యంగానే ఉన్నదని చెప్పడం సరైందేనా? మన దేశంలో బహిరంగ మల విసర్జన ఏనాటినుంచో ఒక ప్రధాన సమస్యగా ఉంది. మోదీకి ముందు పనిచేసిన ప్రధానులెవరూ దీన్నంతగా పట్టించుకోలేదుగానీ, ఇది తీవ్ర అనారోగ్య సమస్య లకు దారితీస్తోంది. ముఖ్యంగా మహిళలకు చెప్పనలవికాని సమస్యల్ని సృష్టిస్తోంది. పరిశుభ్రత భావన లేకపోవడం వల్లనే జనంలో ఈ అలవాటు పెరిగిందని చెప్పడం పూర్తిగా అవాస్త వమవుతుంది. వారు గత్యంతరం లేక, సిగ్గు విడిచి ఈ అలవాటు కొనసాగించవలసి వస్తున్నది. మరుగుదొడ్లు నిర్మించుకున్నా వాటి నిర్వహణకు అవసరమైన నీరు, ఫ్లష్అవుట్ సదుపాయం వగైరాలు సరిగా లేకపోతే ఆ మరుగుదొడ్లను ఉపయోగించుకోవడం సాధ్యం కాదు. అలాంటి లోపాలు ఉత్తరప్రదేశ్, ఒడిశా, బిహార్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో ఎన్నోచోట బయటపడ్డాయి. ఆ మరుగుదొడ్లు నిష్ప్రయోజనంగా పడి ఉండటంతో అనేకచోట్ల వాటిని చిన్న సైజు గోడౌన్లుగా వినియోగించుకుంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో మురికివాడలు అధికం. దుర్భర దారిద్య్రంలో మగ్గుతూ రోజుకూలీపై ఆధారపడేవారు, చిన్న చిన్న పనులతో పొట్టపోసుకునేవారు అనేకమంది వాటిల్లో బతకవలసి వస్తోంది. అలాంటిచోట ఎవరికివారు మరుగుదొడ్లు ఎలాగూ ఏర్పాటు చేసుకోలేరు. కనీసం అందరూ వినియోగించుకోవడానికి నిర్మించిన సామాజిక మరుగుదొడ్లు సైతం సరైన నీటి సదుపాయం లేక అంతంతమాత్రంగా నడుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులున్నప్పుడు జనం బయటకు పోక తప్పడం లేదు. రాజస్తాన్, బిహార్ వంటిచోట్ల మరుగుదొడ్లు నిర్మిం చుకోకపోతే ఇతరత్రా సౌకర్యాలను ఆపేస్తామని ఒత్తిళ్లు తీసుకురావడం వంటివి చోటు చేసుకున్నాయి. కొన్నిచోట్ల బహిరంగ మలవిసర్జనకు పోతున్నవారిని గేలిచేయడం, అవమా నించడం, బెదిరించడం వంటివి జరిగాయి. రాజస్తాన్లోని ఒక గ్రామంలో కేవలం 19శాతం ఇళ్లకు మాత్రమే మరుగుదొడ్లు ఉన్నాయని ఆగ్రహించి ఆ గ్రామానికి విద్యుత్ సదు పాయాన్ని నిలిపేశారు. మొన్నీమధ్య మధ్యప్రదేశ్లో నిరుపేద దళిత కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు బహిరంగ మల విసర్జన చేస్తున్నారని ఆగ్రహించి వారిని కొట్టి చంపిన ఉదంతం బయటికొచ్చింది. ఆ పిల్లల తండ్రి పక్కా ఇల్లు కోసం చేసిన దరఖాస్తును కావాలని పంచాయతీలో కొందరు బుట్టదాఖలు చేశారు. ఆ ఇల్లు దక్కితే తనకు కూడా మరుగుదొడ్డి ఉండేదని, తన పిల్లలు ప్రాణాలు కోల్పోయేవారు కాదని అతడు ఆవేదనపడుతున్నాడు. చిత్రమేమంటే ఆ గ్రామం కూడా ఓడీఎఫ్ జాబితాలో ఉంది. ఇలా సమస్య తీరకపోయినా జాబితాల్లోకెక్కిన గ్రామాలు మరెన్ని ఉన్నాయో? స్వచ్ఛభారత్ కార్యక్రమం నిస్సందేహంగా బృహత్తరమైనది. దాన్ని విజయవంతంగా అమలు చేయగలిగితే ప్రజారోగ్యానికి అదెంతో మేలు చేస్తుంది. ఐక్యరాజ్యసమితి 2030నాటికి ప్రపంచ దేశాలన్నీ సాధించాలంటున్న సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో పారిశుద్ధ్యం కూడా ఉంది. అందుకోసం కేంద్రప్రభుత్వం పెట్టిన శ్రద్ధ కూడా మెచ్చదగిందే. అయితే దాని అమలుకు ఎదురవుతున్న సమస్యలేమిటో తెలుసుకుని ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించుకుంటూ పోతే వేరుగా ఉండేది. ఇప్పుడైనా ఇలాంటి లోటుపాట్లను గుర్తించి, మరుగుదొడ్ల నిర్వహణ ఎలా ఉంటున్నదో తెలుసుకుని సరిచేస్తే స్వచ్ఛభారత్ అనుకున్న స్థాయిలో విజయం సాధించడానికి వీలవుతుంది. -
ఆరుబయట మలవిసర్జనకు రూ.1000 కట్టాల్సిందే..
సాక్షి, నిర్మల్: రెంటికి ఆరుబయటకు వెళుతున్నారా..! ఆగండి.. మీ ఇంట్లో ఉన్న మరుగుదొడ్డిని వినియోగించు కోండి.. ఒకవేళ లేకుంటే వెంటనే నిర్మించుకోండి.. లేదంటే ఫైన్ కట్టక తప్పదు. ఇక నుంచి ఆరుబయట మలవిసర్జన చేస్తే రూ.1000 జరిమానా విధించాలని ప్రభు త్వం ఆదేశించింది. ఇది ఒక్కటే కాదు.. మ నం పద్ధతి మార్చుకోకుంటే మరెన్నో ఫైన్లు కట్టక తప్పదు మరి. ఇప్పటి దాకా మనం ఇష్టం వచ్చినట్లు వ్యవహరించినా ఎవరు ఏమీ అనేవారు కాదు. ఒక వేళ ఎవరైన ఏంటీ మీరు అలా చేస్తున్నారని ప్రశ్నిస్తే.. మంచిది.. బాగా సలహా ఇస్తున్నారు... నీకెందుకులే అనే వాళ్లం. ఇక ముందు పారి శుధ్యం విషయంలో, ఆరుబయట మల విసర్జన, చెట్ల పెంపకం, ప్లాస్టిక్ వినియోగం విషయంలలో అధికారులు కఠినంగా వ్యవహరించనున్నారు. మరుగుదొడ్లను వినియోగించకుంటే రూ.1000 జరిమానా.. చిట్యాల్ గ్రామంలో ఏర్పాటు చేసిన జరిమానా బోర్డు ఆరుబయట మల, మూత్ర విసర్జనలతో పరిసరాలు ఆపరిశుభ్రంగా మారడంతో పాటు కలుషిత వాతావరణం ఏర్పడేది. దీంతో వ్యాధులు ప్రబలేవి. దీనిని నివారించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. బహిరంగ మలవిసర్జన నిర్మూలన కోసం ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తూ మరుగుదొడ్ల నిర్మాణానికి ఆర్థిక సాయాన్ని అందజేస్తోంది. ఒక్కో మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.12వేలు అందజేస్తోంది. దీంతో చాలా గ్రామాల్లో, పట్టణాల్లో ఇప్పటికే మరుగుదొడ్లు నిర్మించుకున్నారు. అయితే కట్టుకున్న వారిలో చాలా మంది వాటిని వినియోగించడం లేదు. మరుగుదొడ్లు వినియోగించుకోవాలని చాలా సార్లు విన్నవించారు. బహిరంగ మల విసర్జన అరికట్టేందుకు, కట్టుకున్న మరుగుదొ డ్లు వాడుకునేలా ప్రజలకు అవగాహన సైతం కల్పించారు. అయితే ప్రజల్లో ఆశించిన మార్పు రావడం లేదు. ఇంకా అలవాటు ప్రకా రం మల విసర్జనకు ఆరుబయటకే వెళుతున్నారు. దీంతో అట్టి చర్యలకు పాల్పడిన వారికి జరిమానా విధించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. బహిరంగ మలవిసర్జన వెళ్లిన వారిని గుర్తించి, జరిమానాలు విధించాలని పంచాయతీ కా ర్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి వారికి రూ. 1000 జరిమానా విధించనున్నారు. చెత్త వేస్తే రూ. 500 కట్టాల్సిందే... పారిశుధ్యం మెరుగుదల కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారంతో పాటు చర్యలు చేపట్టింది. పట్టణాల్లో తడి, పొడి చెత్త సేకరణకు ప్రాధాన్యత ఇస్తూ ఇంటింటికీ బుట్టల పంపిణీ చేపట్టింది. వాహనాల ద్వారా ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరించి డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారు. అలాగే గ్రామాల్లోనూ చెత్త సేకరణను తోపుడు బండ్లు(పుష్ కాట్స్) ద్వారా చేపడుతున్నారు. ఇలా సేకరించిన చెత్త, చెదారాన్ని గ్రామాల్లోని డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారు. ఇలా చెత్త సేకరణతో రోడ్లపై చెత్తను వేయడం అధికంగా తగ్గింది. కానీ పట్టణాల్లో, గ్రామాల్లో కొందరు ని ర్లక్ష్యంతో ఇంకా ఆరుబయట రోడ్లపై చెత్తను వే స్తున్నారు. ఇలా నిర్లక్ష్యంతో ఇక ముందు ఇలా చెత్తను రోడ్లపై వేస్తే రూ. 500 ఫైన్ చెల్లించక తప్పదు. ఇప్పటికే నిర్మల్ మున్సిపల్ పరిధిలో నలుగురికి జరిమానా విధించారు. అలాగే పలు గ్రామాల్లోనూ దీనిని అమలు చేస్తున్నారు. చెత్త ను ఎక్కడ పడితే అక్కడ వేస్తే తప్పని సరిగా రూ. 500 జరిమానా విధించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించింది. కాగా ఈ జరిమానాను రూ.500నుంచిరూ.వెయ్యి వరకు విధించవచ్చు. మొక్కలను మేసినా.. ప్లాస్టిక్ వేసినా.. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు సంరక్షించేందుకు చర్యలు చేపట్టారు. ఒక వేళ నాటిన మొక్కలో 85 శాతం బతికించాలి. మొక్కలు బతకకపోతే సంబంధిత అధికారులు, పాలకులపై చర్యలు తీసుకోనుంది. దీంతో అధికారులు, పాలకులు సైతం మొక్కల సంరక్షణకు కఠినంగానే వ్యవహరించనున్నారు. పశువులు, గొర్రెలు మొక్కలను మేసినా.. పాడు చేసినా.. మొక్కకు రూ.500 చొప్పున జరిమానా విధించనున్నారు. అలాగే వినియోగించిన ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు, నీటి ప్యాకెట్లు వంటి వాటిని బహిరంగ ప్రదేశాల్లో పారవేస్తే పాలక వర్గం జరిమానా విధించనున్నారు. ఇప్పటికే మంచిర్యాల జిల్లాలోని దండెపల్లిలో ఓ వైన్స్ పక్కన ఇష్టారీతిన ప్లాస్టిక్ గ్లాసులు పడేసి ఉండటంతో ఆగ్రహించిన అక్కడి కలెక్టర్ రూ. 30వేలు జరిమానా విధించాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించడంతో పాటు అమలు చేశారు. ఇదే తరహాలో జిల్లాలోనూ ప్లాస్టిక్ వినియోగదారులపై కఠినంగా వ్యవహరించనున్నారు. ఇక మనలో మార్పు రాకపోతే జరిమానాలు కట్టక తప్పదు. -
ఓడీఎఫ్ కార్పొరేటీకరణను అడ్డుకుంటాం
సాక్షి, సంగారెడ్డి : దేశ రక్షణ రంగంలో ఎంతో కీలకమైన ఆయుధ కర్మాగారాల (ఓడీఎఫ్)లను కార్పొరేటీకరించడాన్ని అడ్డుకుని ఉద్యోగులకు అండగా నిలుస్తామని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి హామీ ఇచ్చారు. ఓడీఎఫ్లను కార్పొరేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించడాన్ని నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి రూరల్ మండల పరిధిలోని ఎద్దుమైలారం ఆయుధ కర్మాగారం(ఓడీఎఫ్) వద్ద ఉద్యోగులు కుటుంబ సభ్యులతో కలిసి ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ దేశ చరిత్రలో ఇంతవరకు ఎవరూ తీసుకొని తప్పుడు నిర్ణయాలను కేంద్రం తీసుకొని ఓడీఎఫ్ను ప్రైవేటీకరించేందుకు పూనుకోవడం దారుణమన్నారు. 1984లో మెదక్ జిల్లా ప్రజలకు ఉపాధి కల్పన కోసం దివంగత ప్రధాని ఇందిరాగాంధీ ఓడీఎఫ్ను స్థాపించారన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఓడీఎఫ్లను కార్పొరేటీకరించేందుకు ప్రయత్నించడాన్ని చూసి ఇందిరాగాంధీ ఆత్మ క్షోభిస్తుందని తెలిపారు. దేశ రక్షణలో కీలకంగా ఉంటూ సైనికులకు అవసరమైన ఆయుధాలను తయారు చేసే ఓడీఎఫ్లను ప్రైవేటీకరించేందుకు ప్రయత్నించడం మంచిది కాదన్నారు. ప్రభుత్వపరంగా ఉన్న సంస్థలను ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేసేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సలహాలు, సూచనలతో పార్లమెంట్లో ఓడీఎఫ్ల కార్పొరేటీరణను అడ్డుకుంటామని తెలిపారు. ఓడీఎఫ్లను రక్షించుకుందాం: ఉద్యోగుల జేఏసీ రాత్రింబవళ్లు కష్టపడి సైన్యానికి అవసరమైన పరికరాలను అందించిన ఆయుధ కర్మాగారాలను కార్పొరేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకొని ఓడీఎఫ్లను రక్షించుకుందామని ఓడీఎఫ్ ఉద్యోగుల జేఏసీ నాయకులు తెలిపారు. ధర్నాలో జేఏసీ నాయకులు ఈశ్వర్ ప్రసాద్, జనార్దన్రెడ్డి, సుదర్శన్, నరేందర్ కుమార్లు మాట్లాడుతూ గతంలో రూ. 45 వేల కోట్ల లాభంతో ఉన్న ఓడీఎఫ్లు ప్రస్తుతం రూ.5 వేల కోట్లకు పడిపోయాయన్నారు. ప్రస్తుతం జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉందన్నారు. దేశ మొత్తంలో ఉన్న 41 ఓడీఎఫ్లను రక్షించుకునేందుకు «ధర్నాలు చేపడుతున్నట్లు తెలిపారు. రక్షణ రంగాన్ని పటిష్టం చేయడంలో కీలకంగా ఉన్న ఓడీఎఫ్లను కార్పొరేట్ సంస్థలైన అంబానీ, అదాని, టాటా, బిర్లాలకు అప్పజెప్పేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఈ ఓడీఎఫ్ల పరిధిలో 60 వేల ఎకరాలు ఉన్న భూమిని ప్రైవేట్ సంస్థలకు తాకట్టు పెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ హయాంలో ఉన్న అప్పటి రక్షణశాఖ మంత్రి ఏకే ఆంటోనీ ఓడీఎఫ్లను ప్రైవేటీకరించబోమని రాత పూర్వకంగా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం ఆర్డినెస్ ఫ్యాక్టరీలను కార్పొరేటీకరించి ఉద్యోగులను ఇబ్బందులు పెట్టే కార్యక్రమానికి పూనుకుందని ఆరోపించారు. ప్రభుత్వం నిర్ణయాలను అడ్డుకునేందుకు ఉద్యోగులందరూ ఐక్యంగా ఉండి ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ఎంపీపీ అధ్యక్షురాలు సరళ పుల్లారెడ్డితో పాటు సీఐటీయూ జిల్లా నాయకులు సాయిలు, రాజయ్య, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల వేళ కలకలం.. బీజేపీ మంత్రిని చంపేస్తామని బెదిరింపులు!
సంజయ్లీలా భన్సాలీ 'హీరామండి' వెబ్ సిరీస్ ఎలా ఉంది..?
నాడు మోదీకి వంట వండిన దీపక్.. ఇప్పుడేం చేస్తున్నారు?
కాన్వాయ్ స్లో చేసి అంబులెన్స్కు దారిచ్చిన సీఎం జగన్ (ఫొటోలు)
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
ఎల్లో శారీలో హీరామండి హీరోయిన్ సంజీదా షేక్ లుక్స్.. ఫోటోలు
ఇంటింటి ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి (ఫొటోలు)
జగన్ పాటకే భయపడ్డారు!
‘ప్రియాంక గాంధీ కాంగ్రెస్కు రెబల్గా మారనుంది’
భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్ పాండ్యా
- తాతా.. నీకు టాటా..
- రోహిత్ వేముల ఆత్మహత్య కేసు మళ్లీ దర్యాప్తు చేస్తాం
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
Advertisement