-
వేషం మార్చి.. పేరు మార్చి.. జనాన్ని ఏమార్చి! రూ.10 కోట్ల వరకూ..
సాక్షి, పుట్టపర్తి: మహా మాయగాడి బండారం బయట పడింది. ఊరికో పేరు మార్చుకుంటూ చెలామణి అవుతూ అమాయకులను మోసం చేస్తోంది.. ఒక్కడే అని పోలీసుల విచారణలో తేలినట్టు సమాచారం. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కొప్పలకొండకు చెందిన బెస్త చిన్న ఓబులేసు అధిక వడ్డీ ఆశ చూపి ఇప్పటికే పలు చోట్ల జనాలను నిలువునా మోసం చేసిన ఘటనలు వెలుగు చూశాయి. ఒక్కో చోట ఒక్కో పేరుతో చెలామణి అవుతుండటంతో ప్రజలు పసిగట్టలేకపోయారు. రోజుల వ్యవధిలోనే రూ.లక్షకు రూ.వెయ్యి నుంచి రూ.5 వేల వరకు వడ్డీ చెల్లిస్తానని నమ్మబలికి కొన్ని రోజుల పాటు ఠంఛన్గా సొమ్ము చెల్లించేవాడు. ఆ తర్వాత ఉడాయిస్తాడు. ఇప్పటికే నంద్యాల జిల్లా అవుకు, అనంతపురం జిల్లా కణేకల్లు, ఆత్మకూరు పోలీస్ స్టేషన్లలో బాధితులు ఫిర్యాదు చేయగా.. పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు పంపించారు. ఆ తర్వాత బెయిల్పై వచ్చి ఊరు మార్చి.. కొత్త పేరుతో దందా కొనసాగిస్తున్నాడు. గత రెండేళ్లలో ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లాల్లో సుమారు రూ.10 కోట్ల వరకు మోసానికి పాల్పడ్డట్టు తేలింది. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లిలో మనోహర్రెడ్డి పేరుతో రూ.1.7 కోట్లతో పరారయినట్లు బాధితులు ఈ నెల 25న పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడ భాస్కర్రెడ్డిగా.. ఇక్కడ మనోహర్రెడ్డిగా.. గతేడాది మేలో నంద్యాల జిల్లా అవుకులో భాస్కర్రెడ్డిగా పరిచయమయ్యాడు. అక్కడే ఓ షాపు అద్దెకు తీసుకుని వంటనూనె, చక్కెర, సిగరెట్ల వ్యాపారం చేస్తానని నమ్మబలికాడు. స్టాక్ కోసం పెట్టుబడి పెట్టేందుకు డబ్బులు కావాలని, రూ.లక్ష తనకిస్తే రోజుకు రూ.5 వేల చొప్పున వడ్డీ ఇస్తానని నమ్మబలికాడు. దీంతో అధిక వడ్డీకి ఆశపడి చాలామంది అతనికి డబ్బులిచ్చారు. అక్కడ సుమారు రూ.3 కోట్ల వరకూ వసూలు చేసుకుని పరారయ్యాడు. అవుకు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు గాలించి గాలివీడులో పట్టుకుని జైలుకు పంపారు. అవుకు కేసు నుంచి బయటికొచ్చాక శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లికి మకాం మార్చాడు. అక్కడ షేర్ మార్కెట్ వ్యాపారం చేస్తున్నానని నమ్మబలికాడు. అధిక వడ్డీ ఇస్తానని కొన్ని రోజుల పాటు నమ్మించాడు. రూ.లక్షకు రోజుకు రూ.వెయ్యి ఇస్తానని చెప్పాడు. సుమారు రూ.1.7 కోట్లు వసూలయ్యాక పరార్ అవడంతో బాధితులు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. అంతకుముందు అనంతపురం జిల్లా కణేకల్లు.. ఆత్మకూరులో కూడా అధిక వడ్డీ ఆశ చూపి కొందరితో డబ్బులు వసూలు చేసి పరారైనట్టు పోలీసులకు ఫిర్యాదులందాయి. మొదట్లో జులపాలు.. ఆ తర్వాత గుండు రైల్వే కమ్మీలు చోరీ చేసిన కేసులో కూడా బెస్త చిన్న ఓబులేసే నిందితుడిగా ఉన్నాడు. పోలీసులు గాలించి అరెస్టు చేసి జైలుకు పంపినా.. ఆ తర్వాత అనంతపురంలోని నాయక్ అనే ఓ లాయర్ను అడ్డు పెట్టుకుని సులువుగా బయటికొచ్చేస్తున్నాడు. చిన్న ఓబులేసు పేర్లు మార్చుకున్నట్లే వేషం కూడా మార్చేస్తాడు. మొదట్లో జులపాల జుట్టుతో ఖద్దర్ చొక్కా వేసి.. చేతికి ఉంగరాలు, మెడలో బంగారు చైన్లు వేసుకుని దర్జాగా తిరుగుతాడు. డబ్బులున్న వారితో టచ్లోకి వెళ్లి అధిక వడ్డీ ఆశ చూపి లూఠీ చేసి పరారవుతాడు. ఆ తర్వాత విహార యాత్రలకు వెళ్లి అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తాడు. పోలీసులకు పట్టుబడే సమయానికి గుండుతో ఉంటాడు. నిత్యం డ్రెస్ కోడ్, బాడీ లాంగ్వేజ్ మార్చి విందు, వినోదాల్లో మునిగితేలుతుండాడు. విహార యాత్రల్లో ఉండగానే లాయర్లతో టచ్లోకి వెళ్లి.. కేసులకు సంబంధించి లాబీయింగ్ చేస్తాడని సమాచారం. -
సీఎం రమేషూ దీక్షా పురుషుడేనా?
అభిప్రాయం ‘‘అల్లా మెహర్భాన్ రహేతో గధాబి పైల్మాన్ బనేగా’’ (దేవుడి దయ ఉంటే బలహీనుడు కూడా బలవంతుడు అవుతాడు) ఇప్పుడు టీడీపీ అండ, దాన్ని బలపర్చే మీడియా దన్నుతో సీయం రమేష్ నాయుడు రాజకీయ నేతగా ఎదగజూస్తున్నారు. ఒకప్పుడు సారా వ్యాపారంతో డబ్బులు ఆర్జించి ఆపైన సివిల్ కాంట్రాక్టరుగా పెరిగి పెద్దవాడై నేడు రుత్విక్ అనే బడా కాంట్రాక్టు కంపెనీ యజమానిగా ఎదిగిపోయారు. ఎన్టీఆర్ను పదవి నుంచి తప్పించి దాన్ని చంద్రబాబు చేపట్టిన తర్వాత హైదరాబాద్ సచి వాలయంలో, సీఎం పేషీలో రమేష్ నాయుడి హవా అంతాఇంతా కాదు. సెక్యూరిటీ పాసు లేకపోయినా, ముందస్తు అనుమతి లేకపోయినా సిఎం పేషీలోకి ప్రవేశించగల సన్నిహిత సంబంధం రమేష్ది. కానీ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా అయిన తొలి నాళ్ళలో రాయలసీమ ధర్మల్ పవర్ ప్రాజెక్టు మొదటిదశ ఉత్పత్తిని జాతికి అంకితం చేయడానికి, రెండో దశ నిర్మాణం శంకుస్థాపన చేయడానికి కల్లమల్ల వద్ద గల ఆర్టీపీపీకి వైఎస్సార్ వచ్చినప్పుడు జరిగిన మేళా కార్యక్రమాన్ని సీయం రమేష్నాయుడు తన స్వంత ఖర్చులతో అంతా తానై నిర్వహించాడు. ఎంత విచిత్రం. అది వరకు బాబుకు అత్యంత దోíస్తీగా ఉండిన రమేష్ అధికార పదవి అటు నుండి ఇటు మారగానే తన ఆర్థిక అవసరార్ధం వైఎస్సార్తో కలసిపోయారు. థర్మల్ కేంద్రంలో, నీటిపారుదల ప్రాజెక్టులలో కాంట్రాక్టు పదవులూ పొందారు. ఆ అంకం ముగిసి బాబు జమానా మొదలవగానే కోట్లు ఇచ్చి రాజ్యసభ స్థానాన్ని పొందగలిగారు. కానీ కడప జిల్లా ప్రజలు, సీయం రమేష్ను వ్యాపారవేత్త, కాంట్రాక్టరుగానే చూస్తున్నారు తప్ప రాజకీయ నాయకుడిగా చూడ్డం లేదు. ఇందుకు కలత చెందారేమో కానీ అమాంతంగా స్టీల్ ప్లాంట్ నిర్మాణానికై నిరవధిక నిరాహారదీక్షకు పూనుకున్నారు. 2007 జూలై 10న బ్రహ్మణి స్టీల్ ఫ్యాక్టరీకి జమ్మలమడుగు వద్ద శంకుస్థాపన రోజు వైఎస్సార్ సరసన నిలబడి నాడు చిలకపలుకులు పలికిన నాయకులంతా ప్రత్యర్ధి పార్టీలో చేరి పోయి నేడు పరస్పరం కత్తులు దూసుకుంటున్నారు. 2009లో వైఎస్సార్ ప్రమాదవశాత్తు చని పోయారు. తదనంతర పరిస్థితుల్లో ఫ్యాక్టరీ నిర్మాణంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఈ సమయంలోనే కడపజిల్లాలో మొట్ట మొదట ‘‘కడప ఉక్కు రాయలసీమ హక్కు’’ నినాదం పేరుతో 2011లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ మీటింగ్ హాలులో అన్ని రాజకీయ పార్టీలను, ప్రజా సంఘాలను ఆహ్వానించి సదస్సు నిర్వహించడమైంది. ఇదిసీమ అంతటా అభ్యుదయ, ప్రగతి శీల శక్తులకు గొప్ప ప్రేరణ ఇచ్చింది. 2011 నుండి 2018 మే వరకూ ఈ ఉద్యమంలో సీఎం రమేష్ నాయుడు, మంత్రి ఆదినారాయణ రెడ్డి ఎక్కడున్నారో? బాబును ఏ గ్రహæణం ఆవరించిందో? అధికారమత్తులో ప్రజల కోర్కెలను మరచిపోయి ఇపుడు ఎన్నికలు దగ్గరపడేటప్పటికీ పొంతన లేని ప్రకటనలతో, శాపనార్ధా్దలతో ధర్మ పోరాట దీక్షలు చేస్తున్నారట. టీడీపీ వారంతా 2018 మార్చి వరకూ అంటే బీజేపీతో అంటకాగినంత వరకూ కడప స్టీల్ ఫ్యాక్టరీ చెల్లుబాటు కాదని, ఫిజుబిలిటీ లేదని వాదిస్తూ వచ్చారు. ఇపుడు అంతా కట్టగట్టుకొని కడపలో వాలిపోయి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. చిన్న నిప్పురవ్వలా నాడు ఎగిసిన ఉద్యమం నేడు అగ్నిపర్వతంలా తయారైంది. ఇక బ్రద్దలై లావా పొంగి పారుతుందని సీఎం రమేష్ బహిరంగ లేఖ రాశారు. నిజమే.. ప్రజల్లో టీడీపీ, బీజేపీ పట్ల ఉన్న అసంతృప్తి నిరసనల రూపంలో నిన్నటి వరకూ వ్యక్తమవుతూ వచ్చింది. ఇక తీవ్రమైన వ్యతిరేకత రూపంలో పెల్లుబికి ఆ రెండు పార్టీలను 2019 ఎన్నికల్లో చిత్తుగా ఓడిస్తారు. రమేష్ నాయుడి ఆశలు, బాబు అండ్ కో ఆశలు అడియాసలు కాకమానవు. ‘చిత్తశుద్ధిలేని శివపూజలేల’ అని వేమన చెప్పిన మాటలు టీడీపీ నాయకులు ఇకనైనా స్ఫురణకు తెచ్చుకుంటే మంచిది. జి. ఓబులేసు వ్యాసకర్త సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు -
సర్కార్ చదువుతోనే గ్రూప్–1
పుట్టింది ఓ కుగ్రామం.. వారిది సన్నకారు వ్యవసాయ కుటుంబం.. చదివింది ప్రభుత్వ పాఠశాలల్లో.. అయినా ఎంచుకున్న లక్ష్యం మాత్రం ఉన్నతం.. చిన్నతనంలోనే అంబేడ్కర్ ప్రభావం.. అకుంఠిత దీక్ష.. గుండెల నిండా ఆత్మవిశ్వాసం.. ప్రణాళికాబద్ధంగా చదువు.. ఫలితంగా మొదట కేంద్ర ప్రభుత్వంలో ఇన్స్పెక్టర్ స్థాయి ఉద్యోగం.. అనంతరం గ్రూప్–1లో 15వ ర్యాంక్.. ప్రస్తుతం గూడూరు పురపాలక సంఘం కమిషనర్.. ఆయనే ఎద్దుల ఓబులేసు.. చిన్నప్పటి నుంచి క్రమశిక్షణతో అనుకున్న లక్ష్యాన్ని సాధించిన ఆయన గురించి ‘సాక్షి’ కథనం. గూడూరు : ప్రకాశం జిల్లా పామూరు మండలం ఇనిమర్ల గ్రామానికి చెందిన ఎద్దుల నమ్మయ్య, నాంచారమ్మల కుమారుడు ఓబులేశు. చిన్ననాటి నుంచి ఓబులేశు ఎంతో క్రమశిక్షణ గల విద్యార్థిగా గ్రామంలో పేరు తెచ్చుకున్నారు. పుట్టిన గ్రామంలోనే 5వ తరగతి వరకూ చదివి, అనంతరం పామూరులో 8వ తరగతి వరకూ, కనిగిరిలో 10వ తరగతి వరకూ విద్యనభ్యశించారు. ఇంటర్మీడియట్ మార్టూరులోనూ, బీటెక్ ఈసీఈ విజయవాడలోనూ పూర్తి చేశారు. ఈ క్రమంలోనే అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ పూర్తి చేశారు. 2011వ సంవత్సరంలో వచ్చిన గ్రూప్–1 నోటిఫికేషన్కు ప్రిపేర్ అయ్యారు. 2013లో గ్రూప్–1 ఫలితాల్లో ఎంపికయ్యారు. కొన్ని కారణాలతో కొందరు కోర్టును ఆశ్రయించగా అవి రద్దయిపోయాయి. దీంతో మళ్లీ 2016లో గ్రూప్–1 పరీక్ష రాసి 15వ ర్యాంకు సాధించారు. 2017లో జరిగిన ఇంటర్వ్యూలో ఓబులేసు గ్రూప్–1 అధికారిగా ఎంపికయ్యారు. ఈ మేరకు గూడూరు పురపాలక సంఘం కమిషనర్గా జూన్ 4న నియమితులై బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్కారు బడుల్లో చదివినవారే ఎక్కువ శాతం మంది ఐఏఎస్లు, ఐపీఎస్లతోపాటు గ్రూప్–1, గ్రూప్–2 అధికారులుగా ఉన్నారని, తమ గ్రామంలో తనే మొదటి గ్రాడ్యుయేట్నని తెలిపారు. ఉన్నత ప్రమాణాలతో విద్యనందించేందుకు కృషి చేస్తాం గూడూరు పట్టణంలోని మున్సిపల్ పాఠశాలల్లో విద్యను బోధించే ఉపాధ్యాయులంతా కచ్చితంగా ప్రతిభ ఉన్నవారే ఉంటారు. ఆ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించే దిశగా కృషి చేస్తా. లక్ష్యాలను ఎంచుకుని క్రమశిక్షణతో చదివితే కచ్చితంగా ఉన్నత శిఖరాలను అధిరోహించగలరు. – ఓబులేశు, గూడూరు మున్సిపల్ కమిషనర్ -
ఆగని మరణాలు
= వడదెబ్బకు మరో ముగ్గురి మృత్యువాత = అంతకంతకూ పెరుగుతున్న మృతుల సంఖ్య = పెద్ద దిక్కును కోల్పోయి వీధిన పడుతున్న కుటుంబాలు సూర్యుడు భగబట్టినట్లున్నాడు. వడదెబ్బ రూపంలో దెబ్బ మీద దెబ్బ కొడుతున్నాడు. రోజుకు కనీసం ముగ్గురు, నలుగుర్ని చొప్పున బలవుతున్నారు. తాజాగా బుధవారం మరో ముగ్గురు చనిపోయారు. అంతకంతకూ పెరుగుతున్న మృతుల సంఖ్యతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అప్పటి వరకు ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న వారు వడదెబ్బతో అకాల మృత్యువాతపడుతుండడంతో ఆయా కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయి, బజారున పడుతున్నాయి. నల్లమాడ(పుట్టపర్తి): నల్లమాడ మండలం రెడ్డిపల్లిలో బి.ఓబులేసు(58) వడదెబ్బ బారిన పడి మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. మంగళవారం ఉదయం పని నిమిత్తం బయటకు వెళ్లి మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి ఇంటికి చేరుకున్న ఆయన ఒక్కసారిగా అస్వస్థతకు గురై కుప్పకూలిపోయాడన్నారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించగా, కర్నూలుకు తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు సూచించారు. కర్నూలుకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడన్నారు. మృతునికి భార్య రామకృష్ణమ్మ, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ జిల్లా కార్యదర్శి దుద్దుకుంట సుధాకర్రెడ్డి, మండల కన్వీనర్ పొరకల రామాంజనేయులు, స్థానిక సర్పంచ్ సూర్యనారాయణ, గ్రామ కమిటీ అ«ధ్యక్షుడు టీడీ కేశవరెడ్డి, ట్రేడ్ యూనియన్ జిల్లా నాయకుడు నాగప్ప, పట్టణాధ్యక్షుడు షంషీర్ తదితరులు ఓబులేసు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. మారెంపల్లి తండాలో మరొకరు గుమ్మఘట్ట(రాయదుర్గం): గుమ్మఘట్ట మండలం మారెంపల్లి తండాలో లల్యానాయక్(61) వడదెబ్బతో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఖరీఫ్ దగ్గరపడుతుండడంతో పొలంలోని కంపచెట్లను తొలగించేందుకు వెళ్లగా ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురయ్యాడన్నారు. ఆస్పత్రికి తరలించేలోగానే మృతి చెందాడని వివరించారు. విషయం తెలియగానే వైద్యాధికారి రమేశ్ తమ సిబ్బందితో గ్రామానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించారు. వై.టి.చెరువులో ఇంకొకరు గుంతకల్లు రూరల్: మండలంలోని వై.టి.చెరువులో లక్ష్మీదేవి(58) వడదెబ్బకు గురై మంగళవారం రాత్రి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. వంట చెరుకు కోసం అడవికి వెళ్లిన ఆమె వడదెబ్బకు గురైనట్లు వివరించారు. ఒక్కసారిగా వాంతులతో పాటు నీరసపడిపోవడంతో గుంతకల్లులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వివరించారు. -
విషజ్వరంతో బాలుడి మృతి
తాడిపత్రి రూరల్: తాడిపత్రి మండలం ఎర్రగుంటపల్లిలో లక్ష్మీదేవి, తిరుపాలు దంపతులకు చెందిన ఓబులేసు(4) విష జ్వరంతో మంగళవారం రాత్రి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలతిపారు. మూడ్రోజులుగా జ్వరంతో బాధపడుతున్న కుమారుడిని తల్లిదండ్రులు ఆస్పత్రిలో చికిత్స చేయించారు. అయినా కోలుకోలేక మృతి చెందినట్లు వారు కన్నీరుమున్నీరయ్యారు. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు విషజ్వరంతో మృతి చెందడంతో వారు తల్లడిల్లిపోయారు. వారిని ఓదార్చాడం ఎవరివల్లా కాలేదు.
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
సంక్షేమ సిరిమల్లిక
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
Advertisement