-
చవితికి రెండ్రోజుల ముందే మహా గణపతి సిద్ధం
హైదరాబాద్: తొలుత ఒక్క అడుగుతో ప్రారంభమైన ఖైరతాబాద్ మహాగణపతి ఒక్కో అడుగు పెంచుకుంటూ 69వ సంవత్సరం శ్రీ దశమహా విద్యాగణపతిగా ఈ సంవత్సరం 63 అడుగుల ఎత్తులో భక్తులకు దర్శనమిచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ప్రారంభమైన కలర్ పనులు మరో రెండు రోజుల్లో పూర్తవుతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ సంవత్సరం ఖైరతాబాద్ మహాగణపతికి ఇరువైపులా కుడివైపు పంచముఖ లక్ష్మీనారసిహ స్వామి, ఎడమవైపు శ్రీ వీరభద్ర స్వామి విగ్రహాలను ఏర్పాటు చేశారు. చవితికి రెండు రోజుల ముందే మహాగణపతి పూర్తిస్థాయిలో దర్శనమిచ్చేందుకు సిద్ధమవుతారని తెలిపారు. ► అప్పట్లో స్వాతంత్య్ర సమరయోధులైన సంగరి శంకరయ్య బాల గంగాధర్ తిలక్ స్ఫూర్తితో ఎ. భీమయ్య, జి.సుందర్శనం, రాజారాగం, రాజమణిదేవి, ఎస్.సుదర్శన్, ఎస్.వీరభద్రయ్య, గణేష్కుమార్ కలిసి ఈ మహత్ కార్యానికి పూనుకున్నారని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ నేతృత్వంలో విగ్రహ తయారీ పనులు పూర్తియ్యాయని, ఈ నెల 18 వినాయక చవితి నాటికి భక్తులకు సంపూర్ణంగా దర్శనమిచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం ఉత్సవ కమిటి పోలీసు శాఖతో సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు దానం నాగేందర్ పేర్కొన్నారు. ► వినాయక చవితి సందర్భంగా ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డులో నిమజ్జన ఏర్పాట్లను నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్తో కలిసి పరిశీలించారు. పీపుల్స్ ప్లాజా, జలవిహార్ వద్ద వాహనాల పార్కింగ్, బ్రిడ్జి– 2, ఎన్టీఆర్ మార్గ్లో ఖైరతాబాద్ మహాగనపతి నిమజ్జన ప్రాంతాలను పరిశీలించారు. వీరితో ట్రాఫిక్ అడిషినల్ కమిషనర్ సుధీర్ బాబు, విక్రమ్ సింగ్ మాన్, జోనల్ కమిషనర్ వెంకటేష్ దోత్రే, ఈఎస్సీ జియావుద్దీన్, జోనల్ ఎస్ఈ రత్నాకర్, హెచ్ఎండీఏ ఎస్ఈ పరంజ్యోతి, అడిషినల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు. -
హైదరాబాద్ లో ఇండియన్ రేసింగ్ లీగ్ సందడి (ఫొటోలు)
-
మళ్లీ గందరగోళం.. తొలి రోజు ముగిసిన ఇండియన్ రేసింగ్ లీగ్
నగరంలో నిర్వహిస్తున్న ఇండియన్ రేసింగ్ లీగ్ తొలిరోజు ముగిసింది. అయితే తొలిరోజు రేసింగ్లో రెండు ప్రాక్టీస్ సెషన్స్ మాత్రమే జరిగాయి. రేసింగ్ నిర్వహణలో మరోసారి గందరగోళం నెలకొనడంతో నిర్వహకులు ఆదివారమే అన్ని పోటీలు పెట్టే యోచనలో ఉన్నారు. రేసింగ్ సమయంలో రెండు కార్లు రేస్ మద్యలో ఆగడంతో రెండు సార్లు రెడ్ ఫ్లాగ్స్ రావడం గందరగోళానికి దారి తీసింది. గతంలోలాగే మరోసారి రేస్ నిర్వహణలో ఆలస్యం కావడంతో ప్రాక్టీస్ రేస్లతోనే నిర్వాహకులు తొలిరోజును ముగించారు. ఆలస్యం కారణంగా మెయిర్ రేస్-1 జరగలేదు. దీంతో ఆదివారం అసలైన ఇండియన్ రేసింగ్ లీగ్ జరగనుంది. ఇక సాంకేతిక కారణాలతో స్పోర్ట్స్ కార్లు చాలా ఆలస్యంగా ట్రాక్ ఎక్కాయి. అయితే రేసింగ్ చూడడానికి వీక్షకులు పెద్దగా ఆసక్తి కనబరచలేదు. ఆదివారం జరిగే ఇండియన్ రేసింగ్ ఫైనల్పైనే అందరి ఆసక్తి నెలకొంది. -
హైదరాబాద్లో ఇండియన్ రేసింగ్ లీగ్ సందడి
హైదరాబాద్లో మరోసారి కార్ రేసింగ్ సందడి షురూ అయింది. ఎన్టీఆర్ మార్గ్లో ఇండియన్ రేసింగ్ లీగ్ ఫైనల్ రౌండ్ జరుగుతుంది. నెక్లెస్ రోడ్డులోని ఎన్టీఆర్ మార్గ్ వద్ద ఏర్పాటు చేసిన రేసింగ్ ట్రాక్పై కార్లు రయ్.. రయ్మని దూసుకెళ్లాయి. కాగా రేసింగ్లో ఆరు టీమ్స్, 12 కార్లు, 24 మంది డ్రైవర్స్ పాల్గొన్నారు.గంటకు 250-300 కిలోమీటర్ల మెరుపు వేగంతో దూసుకుపోతూ అభిమానులను అలరిస్తున్నాయి. వచ్చే ఫిబ్రవరిలో జరుగనున్న ఫార్ములా–ఈ పోటీలకు సన్నాహకంగా ఈ ట్రయల్స్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నవంబర్లో జరిగిన ప్రమాదం, బ్రేక్డౌన్స్ కారణంగా పోటీలు లేకుండానే ట్రయల్స్కే కార్ రేసింగ్ పరిమితమైంది. కన్ను మూసి తెరిచే లోపు వాయువేగంతో రయ్ మంటూ దూసుకుపోయిన కార్లు సందర్శకులకు కనువిందు చేశాయి. ఈ పోటీల నిర్వహణ కోసం హెచ్ఎండీఏ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ట్రాక్ను మరోసారి క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. పోటీలను వీక్షించేందుకు అనుగుణంగా నెక్లెస్రోడ్డులో గ్యాలరీలను సిద్ధం చేశారు. హైదరాబాద్కు చెందిన బ్లాక్బర్డ్స్ (రేసర్ల టీమ్) ఢిల్లీకి చెందిన స్పీడ్ డిమాన్స్, బెంగళూరుకు చెందిన స్పీడ్స్టర్స్, చెన్నై టీమ్ టర్బోరైడర్స్, గోవా ఏసెస్ బృందాలు ఈ పోటీల్లో నెక్లెస్రోడ్డు స్ట్రీట్ సర్క్యూట్పై దూసుకెళ్లనున్నాయి. మోటర్ స్పోర్ట్స్ అభిమానులను విశేషంగా ఆకట్టుకోనున్న ఈ పోటీల్లో నగరానికి చెందిన రేసర్లు కూడా పాల్గొననున్నారు. స్విస్ ఇండియన్ ప్రొఫెషనల్ పోర్శీ ఫ్యాక్టరీ డ్రైవర్ నీల్ జానీ, ఆస్టన్ మార్టిన్ రేసింగ్ అకాడమీ డ్రైవర్ అఖిల్ రవీంద్రలతోపాటు ఫిమేల్ ఎఫ్–4 రేసింగ్ డ్రైవర్ లోలా లోవిన్ ఫోసీ కూడా పాల్గొననున్నారు. ఈ పోటీలను వీక్షించేందుకు ఈ సారి ప్రేక్షకులు, మోటార్ స్పోర్ట్స్ అభిమానులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు భారతీయ మోటర్స్పోర్ట్స్ కంపెనీ, రేసింగ్ ప్రమోషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఆర్పీపీఎల్)వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ పోటీల్లో మొత్తం 24 మంది విదేశీ, భారతీయ రైడర్లు పాల్గొననున్నారు. -
Hyderabad IRL: కార్ రేసింగ్కు సై
సాక్షి, సిటీబ్యూరో: సాగరతీరం మరోసారి ఉత్కంఠభరితమైన కార్ రేసింగ్కు సన్నద్ధమైంది. గత నెలలో సాంకేతికంగా ఎలాంటి పోటీలు లేకుండానే ముగిసిన రేసింగ్ను ఈ సారి పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. శని, ఆదివారాలు జరుగనున్న ఈ పోటీల కోసం రేసింగ్ కార్లు మరోసారి నగరానికి చేరుకున్నాయి. నెక్లెస్రోడ్డులోని 2.8 కిలోమీటర్ల స్ట్రీట్ సర్క్యూట్లో పరుగులు తీసేందుకు రెడీగా ఉన్నాయి. వచ్చే ఫిబ్రవరిలో జరుగనున్న ఫార్ములా–ఈ పోటీలకు సన్నాహకంగా ఈ ట్రయల్స్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నవంబర్లో జరిగిన ప్రమాదం, బ్రేక్డౌన్స్ కారణంగా పోటీలు లేకుండానే ట్రయల్స్కే కార్ రేసింగ్ పరిమితమైంది. కన్ను మూసి తెరిచే లోపు వాయువేగంతో రయ్ మంటూ దూసుకుపోయిన కార్లు సందర్శకులకు కనువిందు చేశాయి. ఈ పోటీల నిర్వహణ కోసం హెచ్ఎండీఏ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ట్రాక్ను మరోసారి క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. పోటీలను వీక్షించేందుకు అనుగుణంగా నెక్లెస్రోడ్డులో గ్యాలరీలను సిద్ధం చేశారు. 12 రేసింగ్ కార్లు పాల్గొననున్నాయి. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, తదితర నగరాలతో పాటు విదేశాలకు చెందిన రేసర్లు కూడా ఈ పోటీల్లో పాల్గొననున్నారు.రేసర్లు, నిపుణులు, నిర్వహణ యంత్రాంగంతో పాటు, వివిధ విభాగాలకు చెందిన సిబ్బంది నగరానికి చేరుకున్నారు. రేసింగ్ రయ్.... హైదరాబాద్కు చెందిన బ్లాక్బర్డ్స్ (రేసర్ల టీమ్) ఢిల్లీకి చెందిన స్పీడ్ డిమాన్స్, బెంగళూరుకు చెందిన స్పీడ్స్టర్స్, చెన్నై టీమ్ టర్బోరైడర్స్, గోవా ఏసెస్ బృందాలు ఈ పోటీల్లో నెక్లెస్రోడ్డు స్ట్రీట్ సర్క్యూట్పై దూసుకెళ్లనున్నాయి. మోటర్ స్పోర్ట్స్ అభిమానులను విశేషంగా ఆకట్టుకోనున్న ఈ పోటీల్లో నగరానికి చెందిన రేసర్లు కూడా పాల్గొననున్నారు. స్విస్ ఇండియన్ ప్రొఫెషనల్ పోర్శీ ఫ్యాక్టరీ డ్రైవర్ నీల్ జానీ, ఆస్టన్ మార్టిన్ రేసింగ్ అకాడమీ డ్రైవర్ అఖిల్ రవీంద్రలతోపాటు ఫిమేల్ ఎఫ్–4 రేసింగ్ డ్రైవర్ లోలా లోవిన్ ఫోసీ కూడా పాల్గొననున్నారు. ఈ పోటీలను వీక్షించేందుకు ఈ సారి ప్రేక్షకులు, మోటార్ స్పోర్ట్స్ అభిమానులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు భారతీయ మోటర్స్పోర్ట్స్ కంపెనీ, రేసింగ్ ప్రమోషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఆర్పీపీఎల్)వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ పోటీల్లో మొత్తం 24 మంది విదేశీ, భారతీయ రైడర్లు పాల్గొననున్నారు. ట్రాఫిక్ నరకం.. ఇండియన్ రేసింగ్ లీగ్ దృష్ట్యా శుక్రవారం నుంచే నెక్లెస్రోడ్డు మార్గంలో రాకపోకలను నిలిపివేశారు. మింట్ కాపౌండ్ నుంచి ఖైరతాబాద్ మార్గంలో వాహనాలను అనుమతించారు. దీంతో భారీ ఎత్తున వాహనాలు ఈ మార్గంలోకి ప్రవేశించడంతో ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. గంటల తరబడి రోడ్లపైన పడిగాపులు కాయాల్సి రావడంతో వాహనదారులు నరకం చవి చూశారు. ఖైరతాబాద్ నుంచి నెక్లెస్రోడ్డు వెళ్లే వాహనాలను లక్డీకాపూల్ వైపు మళ్లించారు. అటు మహాగణపతి వైపు నుంచి, ఇటు ఖైరతాబాద్ నుంచి వెళ్లే వాహనాలతో ప్రధాన రహదారి స్తంభించింది. లోయర్ట్యాంక్బండ్, తెలుగుతల్లి ఫ్లై ఓవర్, తదితర రూట్లలోనూ గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించింది. మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రూపురేఖలు మారాయి
అగ్రి ల్యాబ్ ఎంతో ప్రయోజనం
● ప్రగతి పథంలో దూసుకుపోతున్న గ్రామాలు ● పరుగులు పెడుతున్న అభివృద్ధి పనులు ● వెల్లివిరుస్తున్న ప్రభుత్వ భవనాలు ● నాడు–నేడుతో సమూలంగా మారిన సర్కారు బడులు ● ఇళ్లు కాదు.. ఊళ్లుగా వెలిసిన జగనన్న కాలనీలు ● అబ్బో..! ఎటు చూసినా నయా మెరుగులే!
మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యం
రేపు, ఎల్లుండి కూడా పోస్టల్ బ్యాలెట్
రోబోటిక్ టెక్నాలజీతో మోకాలి మార్పిడి శస్త్రచికిత్స
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ
అబ్బో.. ఆ యువ నాయకుడితో ఎట్టా ఏగేది?
బూటకాల ‘బాబు’
వైఎస్సార్సీపీ జోష్
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement