-
నయన్తో స్నేహం కుదిరింది
తమిళసినిమా: ఒక్కోసారి అనుకోకుండా కొన్ని పనులు జరిగిపోతుంటాయి. అవి వారి జీవితంలో నూతనోత్సాహాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు ఇద్దరు బ్యూటీస్ అలాంటి ఆనందాన్నే అనుభవిస్తున్నారు. వనమగన్ చిత్రంతో కోలీవుడ్కు దిగుమతి అయిన బాలీవుడ్ ముద్దుగుమ్మ సాయేషాసైగల్. ఇక్కడ తొలి చిత్రంతోనే మంచి గుర్తింపును పొందిన సాయేషా అవకాశాలను బాగానే రాబట్టుకుంటోంది. ప్రస్తుతం ప్రభుదేవా దర్శకత్వంలో విశాల్, కార్తీ కలిసి నటిస్తున్న కరుప్పురాజా వెళ్లైరాజా చిత్రంలో నటిస్తోంది. అంతకుముందే తెలుగులో అఖిల్ చిత్రం ద్వారా రంగప్రవేశం చేసింది. ఇలా దక్షిణాదిలో కేరీర్ ఆశాజనకంగా ఉండటంతో ఇక్కడే మకాం పెట్టాలన్న నిర్ణయానికి వచ్చిన సాయేషా హైదరాబాద్లో ఒక ఫ్లాట్ను అద్దెకు తీసుకుందట. ఇక్కడ విశేషం ఏమిటంటే అదే ఫ్లాట్లో ఇంతకుముందు నటి సమంత నివశించిందట. ఆ ఫ్లాట్లో ఉండగా సమంత యమ బిజీగా నటించిందట. దీంతో తాను బిజీ హీరోయిన్ అయిపోతాననే కలలు కంటోందట నటి సాయేషాసైగల్. ఇక నటి నిక్కీగల్రాణి విషయానికి వస్తే కోలీవుడ్లో చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉంది. ఈ అమ్మడు కూడా చెన్నైలో మకాం పెట్టేసింది. స్థానిక ఎగ్మోర్లోని ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ను అద్దెకు తీసుకుంది. అదే అపార్ట్మెంట్లో నిక్కీగల్రాణి ఫ్లాట్కు పైన ఫ్లాట్లో అగ్రనటి నయనతార చాలా కాలంగా నివశిస్తోంది. ఒకే అపార్ట్మెంట్లో మకాం పెట్టడంతో నయనతార, నిక్కీగల్రాణిలు తరచూ ఎదురు పడటంతో ఆ పరిచయం వారిద్దరి మధ్య స్నేహాన్ని పెంచేసిందట. ఈ విషయాన్ని నటి నిక్కీగల్రాణి పట్టరాని ఆనందంతో తన ట్విట్టర్లో పోస్ట్ చేసేసింది. ఇలా యాదృచ్చికంగానే కొన్ని ఆనందభరిత సంఘటనలు జరుగుతాయన్న మాట. -
విజయానందంలో మరగదనాణియం
తమిళ సినిమా: మరగదనాణియం చిత్ర యూనిట్ విజయానందంలో మునిగి పోయింది. యాక్సస్ ఫిలింస్ ఫ్యాక్టరీ పతాకంపై ఢిల్లీబాబు నిర్మించిన చిత్రం మరగదనాణియం. ఆది, నిక్కీగల్రాణి జంటగా నటించిన ఈ చిత్రానికి ద్రార సరవణ్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆనందరాజ్, ముండాసుపట్టి రామ్దాస్ తదితరులు ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రం గత వారంలో తెరపైకి వచ్చి విశేష ప్రేక్షకాదరణ పొందుతోంది. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం చెన్నైలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ను నిర్వహించింది. ఇందులో చిత్ర నిర్మాత ఢిల్లీబాబు మాట్లాడుతూ ఉరుమీన్ తరువాత తన సంస్థ నిర్మించిన తాజా చిత్రం మరగదనాణియం అన్నారు. ఒక కమర్షియల్ హీరోగా ఎదుగుతున్న ఆది ఈ చిత్రంలో నటించడానికి అంగీకరించారేమిటన్న భావన తనకు కలిగిందన్నారు. అదే విధంగా నటి నిక్కీగల్రాణి మగగొంతుతో మాట్లాడే పాత్రలో నటించి మెప్పించారన్నారు. ఇది సాధారణ హీరోహీరోయిన్ల ప్రేమ, ఐటమ్ సాంగ్స్లతో కూడిన చిత్రం కాదని చిత్ర హీరో ఆది అన్నారు. నిజం చెప్పాలంటే తాను లేకపోయినా ఈ చిత్ర విజయం సాధ్యం అవుతుందేమోగాని, ముండాసుపట్టి రామ్దాస్ తదితర పాత్రదారులు లేక పోతే సాధ్యం కాదన్నారు. ఆ పాత్రలకు అంత ప్రాధాన్యత ఇవ్వడం, యూనిట్ మొత్తం నిజమైన శ్రమనే ఈ చిత్ర విజయానికి కారణంగా ఆది పేర్కొన్నారు. ఈ చిత్రం తెలుగులోనూ విజయవంతంగా సాగుతుండడం విశేషం. -
అహ నా పెళ్లంటలా!
విష్ణు విశాల్, నిక్కీ గల్రానీ జంటగా ఎళిల్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘వెల్లైక్కారన్. నిర్మాత పారస్ జైన్ ఈ సినిమాని ‘ప్రేమలీల పెళ్ళి గోల’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ను హైదరాబాద్లో రిలీజ్ చేశారు. పారస్ జైన్ మాట్లాడుతూ– ‘‘వెల్లైక్కారన్’ రీమేక్ హక్కుల కోసం చాలా మంది పోటీ పడ్డా నా మీద నమ్మకంతో హీరో విష్ణు విశాల్ నాకు ఇచ్చారు. రీమేక్ చేస్తే కామెడీ మిస్ అవుతుందని విశాల్ చెప్పడంతో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నాం. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాల్లో జూలై 1న ఈ సినిమా రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘ప్రేమలీల పెళ్ళి గోల’ చిత్రం చూశాం చాలా బాగుంది. జంధ్యాలగారి ‘ఆహæనా పెళ్లంట, కృష్ణారెడ్డిగారి కామెడీ సినిమాల్లా ఉంది’’ అన్నారు నిర్మాత అచ్చారెడ్డి. ‘‘ఈ సినిమా చూసిన ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వడం ఖాయం’’ అని దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి అన్నారు. -
అందం మాత్రమే అర్హత కాదు
నటికి అందం మాత్రమే అర్హత కాదంటున్నారు నటి నిక్కీగల్రాణి. డార్లింగ్ చిత్రంలో కోలీవుడ్లో ఎంటరై ఆ చిత్రంలో దెయ్యంగా సహజ నటనను ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకున్న నిక్కీగల్రాణి ఇప్పుడు తమిళ చిత్ర పరిశ్రమకు డార్లింగ్గా మారిపోయారని చెప్పవచ్చు. ప్రస్తుతం చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ నటించిన కో-2 చిత్రం ఈ నెల 13న విడుదలకు ముస్తాబవుతోంది. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఎన్నికల వాతావరణంతో వేడెక్కిన సమయంలో విడుదల కానుండడం విశేషంగానే భావించాలి. ఈ చిత్రం గురించి కథానాయకి నిక్కీగల్రాణి తన అభిప్రాయాన్ని తెలుపుతూ ఒకే తరహా పాత్రల్లో నటించ రాదని నిర్ణయించుకున్న తనకు కో-2 చిత్రంలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. అందం ఒక్కటే నటికి అర్హత కాదని మంచి ప్రతిభ, శ్రమ కూడా అవసరం అని పేర్కొన్నారు. కో-2లో అలాంటి వైవిధ్యభరిత పాత్రను పోషించాననీ చెప్పారు. ఇందులో తాను పత్రికా విలేకరిగా నటించడం సరికొత్త అనుభవంగా పేర్కొన్నారు. ఈ పాత్ర కోసం నిజ జీవితంలో పత్రికా విలేకరులను చాలా సునిశితంగా పరిశీలించానని చెప్పారు. ముఖ్యంగా వారి వేష భాషలు, ప్రశ్నించే విధానం వంటి అంశాలను దగ్గర నుంచి గమనించాననీ తెలిపారు. ఇప్పటికే మార్కెట్లోకి విడుదలైన చిత్ర పాటలు ఎఫ్ఎం రేడియో, ఐ ట్యూన్స్లలో వరుసగా ప్రసారం అవుతూ మొదటి స్థానంలో కొనసాగడం సంతోషంగా ఉందన్నారు. అంతే కాదు చిత్ర విజయంపై నమ్మకం పెరిగిందనీ పేర్కొన్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో విడుదలవుతున్న ఈ చిత్రం ప్రజల్లో కచ్చితంగా మార్పునకు కారణం అవుతుందన్నారు. ఎన్నికలపై అవగాహన కలిగంచే చిత్రంగా కో-2 ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బాబీసింహా, ప్రకాష్రాజ్, శరవణన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ఇంతకు ముందు కో వంటి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన నిర్మాత ఎల్రెడ్ కుమార్ తన ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెర ట్ పతాకంపై నిర్మించారు. శరత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 13న విడుదలకు ముస్తాబవుతోంది. -
ఈసారి తమిళంలో!
బుల్లితెర ‘చిన్నారి పెళ్లికూతురి’గా ఎంట్రీ ఇచ్చి, కథానాయికగా సినిమాల్లో బిజీ అయిపోయారు అవికా గోర్. తెలుగుతో పాటు హిందీ, కన్నడ భాషల్లో కూడా నటించిన ఆమె తాజాగా తమిళంలో ‘కడవుళ్ ఇరుక్కాన్ కుమారు’ అనే చిత్రం అంగీకరించారు. సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్కుమార్ హీరోగా రూపొంద నున్న ఈ చిత్రంలో నిక్కీ గల్రానీ మరో కథానాయిక.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
Advertisement