-
‘సాగర్’ నీరు విడుదల
ఖమ్మం అర్బ¯ŒS: వర్షాలు.. వరదల నేపథ్యంలో సాగర్ ప్రధాన కాల్వకు ఎన్నెస్పీ అధికారులు ఆదివారం నీరు విడుదల చేశారు. వివిధ ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ఎన్నెస్పీ దిగువ ప్రాంతాలకు నీరు విడుదల చేయాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. ప్రధాన కాల్వ 40 కిలోమీటర్ వద్ద నల్లగొండ జిల్లా దేవులపల్లి ప్రాజెక్టు నిండింది. ఆ వరదను కూడా పాలేరు చెరువులోకి పంపుతున్నారు. అటు సాగర్ నుంచి కూడా నీరు వస్తోంది. మొత్తం 4,800 క్యూసెక్కుల నీరు పాలేరు ప్రధాన కాల్వకు విడుదల చేస్తున్నారు. పది రోజుల క్రితం వరకు వెలవెలబోయిన ప్రధాన కాల్వ నేడు నీటితో కళకâýæలాడుతోంది. ప్రధాన కాల్వతో పాటు దాని పరిధిలోని బ్రాంచి, మేజర్ కాల్వలకు కూడా అవసరమైన మేరకు నీరు విడుదల చేస్తున్నామని ఎన్నెస్పీ అధికారి ఒకరు తెలిపారు. ఆయకట్టు పరిధిలోని చెరువులను పూర్తిస్థాయి సామర్థ్యం మేరకు నింపుతామన్నారు. సాధ్యమైనంత వరకు 2, 3 డివిజన్లకు నీరు పంపుతున్నామన్నారు. ఓవైపు వర్షాల జోరు.. మరోవైపు సాగర్ నీటితో చెరువులు జలకâýæ సంతరించుకోనున్నాయి. ఈ నీటి విడుదలతో నాట్లు వేసి నీటి కోసం ఎదురుచూస్తున్న ఆయకట్టు రైతులకు ఊరట లభించనుంది. వైరా రిజర్వాయర్కు పూర్తిస్థాయి సామర్థ్యం మేరకు నింపుతామన్నారు. ఇక సాగు, తాగునీటికి ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
'దుమ్ముగూడెం'... ఏదో ఒకటి చేద్దాం!
హైదరాబాద్: రాష్ట్రానికి పెద్దగా ప్రయోజనం లేదని భావిస్తూ రద్దు చేసుకున్న దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ టెయిల్పాండ్ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం కాంట్రాక్టు సంస్థతో నలుగుతున్న వివాదానికి స్వస్తి పలికే దిశగా కసరత్తు చేస్తోంది. ఈ ఒప్పందాల రద్దును సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. కాంట్రాక్టర్ చేసిన పనులు, కోరుతున్న పరిహారం తదితరాలపై అధ్యయనం చేసేందుకు అత్యున్నత స్థాయి కమిటీని నియమించి ఈ వ్యవహారాన్ని కొలిక్కి తేవాలని భావిస్తోంది. దీనిపై ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించి ఆయన సూచన మేరకు ముందుకెళ్లాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది. గోదావరి జలాలను వినియోగించి తెలంగాణ రైతులకు సాగునీరివ్వడానికి ఉద్దేశించిన దుమ్ముగూడెం-టెయిల్పాండ్ ప్రాజెక్టును టీఆర్ఎస్ తొలినుంచీ వ్యతిరేకిస్తోంది. రూ.19వేల కోట్ల అత్యంత భారీ వ్యయంతో పాటు, 1,800ల మెగావాట్ల భారీ విద్యుత్ అవసరం ఉన్న ఈ ప్రాజెక్టుతో తెలంగాణకు ఏమాత్రం ప్రయోజనం లేదని చెబుతోంది. అదీగాక గోదావరి వరద నుంచి 160 టీఎంసీల నీటిని కృష్ణా బేసిన్కు తరలిస్తే మహారాష్ట్ర, కర్ణాటకలు సైతం బేసిన్ నీటిలో వాటా కోరే అవకాశాలుండటం, బేసిన్ దిగువకు వెళ్లే ఈ నీటిని వాడుకునే అవకాశం ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలు ఉండదు కాబట్టి, వారు ఎగువ నుంచి వచ్చే కృష్ణా నీటిలోనే వాటా తీసుకునేందుకు ప్రయత్నిస్తారని, అదే జరిగితే కృష్ణా జలాల్లో తెలంగాణకు కోత పడుతుందనే భావనతో ప్రాజెక్టును నిలిపివేయాలని వాదించింది. కమిటీతో చక్కదిద్దేందుకు: ఈ నేపథ్యంలోనే అధికారంలోకి వచ్చిన వెంటనే టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఒప్పందాల రద్దు పూర్తిగా కాంట్రాక్టర్తో ముడిపడి ఉంది. మొత్తంగా రూ.17201 కోట్లతో ఒప్పందాలు జరగ్గా ఏడాదిన్నర కిందటి వరకు రూ.730కోట్ల మేర పనులు జరిగినట్లు రికార్డులు చెప్తున్నాయి. ఇందులో మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద ప్రభుత్వం రూ.280కోట్ల మేర చెల్లించింది. ప్రాజెక్టును పూర్తిగా పక్కనపెడుతున్న దృష్ట్యా కాంట్రాక్టు సంస్థ ప్రభుత్వం నుంచి పరిహారం కోరుతోంది. అది ఎంతన్నది మాత్రం వెల్లడికాలేదు. సంస్థ కోరుతున్న పరిహారం వందల కోట్ల మేర ఉండటంతో ప్రభుత్వం దీన్ని ఎలా పరిష్కరించుకోవాలనే సందిగ్ధంలో పడింది. ఆరు నెలలుగా ఎటూ తేలకుండా ఉన్న ఈ వ్యవహారాన్ని చక్కపెట్టాలని, ఇటీవల ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే చీఫ్ ఇంజనీర్లు, ఉన్నతాధికారులతో కమిటీని వేసి వివాదాన్ని పరిష్కారించాలనే నిర్ణయానికి వచ్చింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సుప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
IPL 2024 PBKS VS CSK: రుతురాజ్ను వెంటాడుతున్న దరిద్రం
ఉంగరంతో ఆరోగ్యం పదిలం!
తప్పక చదవండి
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement