-
Welcome to Paradise: స్వాగతం.. సుస్వాగతం
రచయిత్రిగా కూడా మంచి మార్కులు కొట్టేసింది నటి ట్వింకిల్ ఖన్నా.‘మిసెస్ ఫన్నీబోన్స్: ‘పైజామాస్ ఆర్ ఫర్ గివింగ్’ ‘ది లెజెండ్ ఆఫ్ లక్ష్మీప్రసాద్’ పుస్తకాలతో పాఠకులను అలరించింది. తాజాగా తన కొత్త పుస్తకం ‘వెల్కమ్ టూ ప్యారడైజ్’ను ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించింది. ట్వింకిల్ ఖన్నా లండన్లో ఫిక్షన్ రైటింగ్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన తరువాత వస్తున్న పుస్తకం ఇది. ‘ఈ పుస్తకంలోని క్యారెక్టర్లు గత అయిదు సంవత్సరాలుగా నా మనసులో తిరుగుతున్నాయి. నాకు మాత్రమే పరిచయమైన ఈ క్యారెక్టర్లు ఇప్పుడు మీకు కూడా పరిచయం కాబోతున్నాయి’ అంటూ రాసింది ఖన్నా. మానవ సంబంధాలు, ఎడబాట్లు, అనుబంధాలు, ఆప్యాయతలను ఆధారంగా చేసుకొని రాసిన ఈ పుస్తకం వచ్చే నెలలో విడుదల కానుంది. సామాన్య పాఠకుల నుంచి బాలీవుడ్ సెలబ్రిటీల వరకు సోషల్ మీడియాలో ఈ పుస్తకంపై కామెంట్స్ పెడుతున్నారు. -
జనాదరణ పథకాలకు ఆర్బీఐ డబ్బు
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ డిప్యూటీ గవర్నర్ విరాల్ వి. ఆచార్య తన పుస్తకం కొత్త ఎడిషన్ ‘ముందు మాట’గా రాసిన కొన్ని అంశాలు తాజాగా ఆసక్తికరంగా మారాయి. ‘‘ 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు 2018లో ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్ నుంచి జనాదరణ పథకాల వ్యయాలకు రూ. 2 నుంచి 3 లక్షల కోట్లను పొందాలని కేంద్ర ప్రభుత్వంలోకి కొందరు చేసిన ప్లాన్ (రైడ్)ను సెంట్రల్ బ్యాంక్ ప్రతిఘటించింది. ఇది స్పష్టంగా ప్రభుత్వం– ఆర్బీఐ మధ్య విభేదాలకు దారితీసింది. సెంట్రల్ బ్యాంక్కు సంబంధిత ఆదేశాలు జారీ చేయడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టంలోని ఎన్నడూ ఉపయోగించని సెక్షన్ 7ను అమలు చేయాలని ఆలోచించే స్థాయికి పరిస్థితి వెళ్లింది’’ అని రాసిన అంశాలు ఆసక్తికరంగా మారాయి.‘క్వెస్ట్ ఫర్ రీస్టోరింగ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇన్ ఇండియా’ శీర్షికతో ప్రజల ముందు ఉంచిన తన పుస్తకం తాజా ఎడిషన్ ముందు మాటలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘కేంద్ర ఆర్థిక లోటు భర్తీకి బ్యాక్డోర్ మానిటైజేషన్’’ అని ఆయన ఈ వ్యవహారాన్ని అభివరి్ణంచడం గమనార్హం. 2017 జనవరి 20వ తేదీ నుంచి 2019 జూన్ వరకూ దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు విరాల్ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా బాధ్యతలు నిర్వహించారు. అప్పట్లో ఆయన డిప్యూటీ గవర్నర్గా మానిటరీ పాలసీ, ఫైనాన్షియల్ మార్కెట్లు, ఫైనాన్షియల్ స్థిరత్వం–రిసెర్చ్ విభాగం ఇన్చార్జ్గా వ్యవహరించారు. ఆరు నెలల ముందుగానే ఆయన అప్పట్లో రాజీనామా చేశారు. విరాల్ రాసిన అంశాల్లో కొన్ని... ► ఆర్బీఐ ప్రతి సంవత్సరం తన లాభంలో కొంత భాగాన్ని ప్రభుత్వానికి అందజేస్తుంది. 2016 డిమోనిటైజేషన్కు ముందు మూడేళ్లలో ప్రభుత్వానికి రికార్డు లాభాలను బదిలీ చేసింది. ► నోట్ల రద్దు సంవత్సరంలో కరెన్సీ ముద్రణకు అయ్యే ఖర్చును కేంద్రానికి చేసిన బదిలీల నుంచి మినహాయించింది. ఫలితంగా 2019 ఎన్నికలకు ముందు ప్రభుత్వ నిధుల అవసరాలు మరింత పెరిగాయి. ఈ మొత్తాలను ఆర్బీఐ నుంచి పొందాలని బ్యూరోక్రాట్లు కొందరు ప్రయతి్నంచారు. ► స్వల్పకాలిక ప్రజాకర్షక వ్యయాల కోసం సెంట్రల్ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్పై దాడి చేసే ప్రణాళికలను పదేపదే ప్రతిపాదించినప్పుడు.. సహేతుకమైన సంస్థలతో కూడిన ప్రజాస్వామ్యయుతంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్ను కలిగి ఉన్న దేశంలోని ఏ ప్రభుత్వమైనా బలీయమైన ప్రతిఘటనను ఎదుర్కొనకుండా ముందుకు సాగలేదు. ఇలాంటి సందర్భాలే ఒక సహేతుక వ్యవస్థ ఏర్పాటుకు దారితీస్తాయి. ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్ల నుండి ప్రభుత్వానికి భవిష్యత్తులో బదిలీల కోసం సహేతుకమైన ఫ్రేమ్వర్క్ను రూపొందించడానికి మాజీ గవర్నర్ బిమల్ జలాన్ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు కావడం ఇలాంటిదే. ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్ నుంచి భారీ నిధులు పొందాలని భావించిన వ్యక్తుల్లో పలువురిని ప్రభుత్వం పక్కన బెట్టడం కూడా జరిగింది. 2018లోనే ‘విరాల్’ వెల్లడి.. నిజానికి 2018 అక్టోబర్ 26న ఏడీ ష్రాఫ్ స్మారక ఉపన్యాసం సందర్భంగానే విరాల్ ‘కేంద్రం– ఆర్బీఐ మధ్య విభేదాల విభేదాల అంశాన్ని మొదటిసారి సూచనప్రాయంగా ప్రస్తావించారు. తాజాగా అందుకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడించారు. ‘‘కేంద్ర బ్యాంకు స్వాతం్రత్యాన్ని గౌరవించని ప్రభుత్వాలు తక్షణం లేదా అటు తరువాత ఆర్థిక మార్కెట్ల ఆగ్రహానికి గురవడం ఖాయం. ఆయా పరిణామాలు ఆర్థిక అనిశి్చతికి, రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ దెబ్బతినే ప్రమాదానికి దారితీస్తాయి’’ అని ఆయన అప్పట్లో పేర్కొన్నారు. ఉర్జిత్ పటేల్ రాజీనామా ఇందుకేనా..? తాజా అంశాలను విశ్లేíÙస్తే...సెంట్రల్ బ్యాంక్ గవర్నర్గా 2018 డిసెంబర్లో ఉర్జిత్ పటేల్ రాజీనామాకు.. తాజాగా విరాల్ లేవనెత్తిన అంశానికీ ఏదైనా సంబంధం ఉందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. అప్పట్లో ఉర్జిత్ పటేల్ ‘‘వ్యక్తిగత కారణాలతో’’ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ బాధ్యతలకు రాజీనామా చేశారు. అప్పట్లో కేంద్రం–ఆర్బీఐ మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయన్న వార్తలు గుప్పుమన్నప్పటికీ దీనికి స్పష్టమైన కారణాలు తెలియలేదు. మూడేళ్ల పదవీ కాలం ముగిసేలోగా తన బాధ్యతలను మధ్యలోనే వదిలేసిన గవర్నర్గా పనిచేసిన అరుదైన సందర్భం ఆయనది. -
సాహితీ ప్రయాణం వెనక కథ
నా మొదటి కథ 1970 ఆగస్టులో చందమామ మాసపత్రికలో ప్రచురించారు. దాని పేరు ఉపాయశీలి. 2020 ఆగస్టుకి నా మొదటి కథ ప్రచురించబడి యాభై ఏళ్ళు నిండాయి. ఈ సందర్భంగా నా సాహితీ ప్రయాణం గురించి వివరించిన పుస్తకమే నవల వెనక కథ. ఇందులో నేను రాసిన 106 నవలల కథలు పరిచయం చేస్తూ, ప్రతీ నవలకి నాకు క్రియేటివ్ ఫ్లాష్, అంటే ఆ ఆలోచన ఎలా వచ్చింది? దాన్ని ఎలా డెవలప్ చేసుకున్నాను? ఎంత కాలానికి అది నవలగా రాశాను? ఏ పత్రికలో సీరియలైజ్ అయింది, లేక డైరెక్ట్ నవలా? సినిమా లేదా టీవీ సీరియల్ లేదా వెబ్ సిరీస్గా తీస్తే ఆ అనుభవాలు, అమ్మకాలు, కోర్టు కేసులు మొదలైన వివరాలన్నీ ఇందులో ఇచ్చాను. అలాగే ప్రతి నవలకి వేసిన తెలుగు, కన్నడ కవర్ పేజీల బొమ్మలని కూడా చూడొచ్చు. పాఠకులకి ఇవి పాత జ్ఞాపకాలను ఇస్తాయి. ‘ముక్తాయింపు’లో రచయితగా నా గురించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలను రాశాను. ‘అనుబంధం’ అనే రెండో భాగంలో 1960లో నేను చదివిన మొదటి నవల నుంచి 2020 దాకా– ఈ అరవై ఏళ్లలో తెలుగు నవలకి పాఠకులిచ్చిన ఆదరణ, అమ్మకాల వివరాలని ‘లేచి పడ్డ తెలుగు నవల’ అనే పెద్ద వ్యాసంలో పాఠకులు విహంగవీక్షణం చేయొచ్చు. ఇంకా ఇందులో 1972 నుంచి నేటి దాకా నేను వివిధ పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలు, నా ప్రచురణకర్తల మీద పెన్ స్కెచ్లు, (నా సంపాదకులతో నా అనుభవాల గురించి ‘జరిగిన కథ’ అనే పుస్తకంలో రాశాను) నేను రాసిన దిన వార పక్ష మాస పత్రికల జాబితా, సినిమాల పేర్లు, విడుదల వివరాలు, టీవీ సీరియల్స్ వివరాలు, నేను రాసిన వందకు పైగా నవలేతర పుస్తకాల క్లుప్త పరిచయం, వాటి కవర్ పేజీలు, స్రవంతి వారపత్రిక ఎడిటర్గా నా అనుభవాలు, తమాషా స్టాటిస్టిక్స్, చివరగా మే 2020లో ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ మిస్టరీ మేగజైన్కి పంపిన ఓ ఇంగ్లిష్ క్రైమ్ కథని చదవొచ్చు . 760 పేజీల ఈ హార్డ్బౌండ్ పుస్తకం, తెలుగు నవలా పాఠకులకి, సాహిత్య అభిమానులకు చాలా కొత్త విషయాలను తెలియజేస్తుంది. ఈ యాభై ఏళ్లలో నేను చేసిన రచనా వ్యాసంగాన్ని నవల వెనక కథలో పరిపూర్ణంగా ఆవిష్కరించే ప్రయత్నం చేశాను. సెప్టెంబర్ 2020 దాకా రోజూ మరే పని పెట్టుకోకుండా, రోజుకి ఎనిమిది నుంచి పది గంటలు రాస్తూ, ప్రూఫ్ రీడింగ్ చేస్తూ, గడిపాను. మర్చిపోయినవి కొందరు మిత్రులకి ఫోన్ చేసి తెలుసుకున్నాను. ఈ వారమే పుస్తకం విడుదల అవుతోంది. -మల్లాది వెంకట కృష్ణమూర్తి నవల వెనక కథ రచన: మల్లాది వెంకట కృష్ణమూర్తి; పేజీలు: 760; వెల: 600; ప్రతులకు: గోదావరి ప్రచురణలు, ఫోన్: 9553084268 -
జీవరసాయనం
మిడ్వెస్టర్న్ అమెరికాలోని ఒక యూనివర్సిటీలో బయోకెమిస్ట్రీలో పోస్ట్గ్రాడ్యుయేషన్ చేస్తున్న వాలెస్ ఆ విభాగంలోకి మూడు దశాబ్దాల వ్యవధి తరువాత చేర్చుకోబడ్డ తొలి నల్లజాతీయుడు. అతను తప్ప సహవిద్యార్థులందరూ తెల్లవారే. ఆ వేసవికాలపు ఆఖరి వారాంతంలో అతను చేస్తున్న ప్రయోగాలలోని సూక్ష్మక్రిములను ఎవరో నాశనం చేసినట్టు గమనించిన వాలెస్, దాన్ని పక్కనబెట్టి మిత్రులని కలవడానికి బయలుదేరడంతో మొదలయ్యే ఈ కాలేజ్ క్యాంపస్ నవల, అటుతర్వాత మూడురోజులపాటు ల్యాబ్ లోపలా, బయటా సాగి ముగుస్తుంది. స్వతహాగా నల్లజాతీయుడు, పైగా లైంగికంగా గే అయిన వాలెస్ పట్ల మిత్రులు ప్రవర్తించే తీరు భిన్నంగా ఉంటుంది. ఆ తెల్ల స్నేహితుల్లోనూ గేలు చాలామందే ఉన్నా అదెవరికీ అభ్యంతరకరంగా ఉండకపోవడం వాలెస్ గమనిస్తాడు. స్నేహాలు పైకి మామూలుగానే ఉన్నట్టనిపించినా దాని అడుగున అదృశ్యంగా ఉండే ఆధిపత్యపు భావనలు వాలెస్కి తెలుస్తూనే ఉంటాయి. వాళ్ల మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు వాలెసే తీసుకోవాలి. ఆ స్నేహాలు ఎంత పలచగా ఉంటాయంటే, అంతకుమునుపే కొన్నివారాల క్రితం వాలెస్ తండ్రి మరణించాడన్న విషయం తెలుసుకున్న మిత్రులు అంత్యక్రియలకి వాలెస్ వెళ్లలేదన్న వాస్తవాన్ని గుర్తిస్తారే తప్ప, చిన్నతనంలోనే వాలెస్ మీద జరిగిన లైంగిక దాడులని చూస్తూకూడా ఆ తండ్రి మిన్నకుండిపోయాడన్న విషయాన్ని తెలుసుకునే ఆసక్తి వారికుండదు. ఆ వారాంతంలోనే మిల్లర్ అనే శ్వేతజాతీయుడి ప్రేమలో పడిన వాలెస్ తరువాతి రెండుమూడు రోజులపాటు క్లిష్టమైన మానసిక సంక్షోభాలకి గురవుతాడు. మిల్లర్ ప్రేమలో కూడా విడమరిచి వివరించడానికి వీలుకాని గందరగోళాంశాలు కనిపించడం అసలే అంతర్ముఖుడైన వాలెస్ని మరింత ఆత్మావలోకనంలోకి తోసేస్తుంది. రెండుమూడు రోజులపాటు స్నేహితులతో గడిపిన క్షణాలూ, వారి స్పందనలూ, మిల్లర్తో సన్నిహితంగా గడిపిన సన్నివేశాలూ వాలెస్ని తన జీవితాన్ని పునస్సమీక్షించుకోమంటాయి. భవిష్యత్తేమిటో నిర్ణయించుకోమంటాయి. నిజమైన జీవితం అంటే ఏమిటో బలమైన ఎరుకని ఏర్పరచుకోవాల్సిన అవసరాన్ని వాలెస్ గుర్తిస్తుండగా నవల ఓపెన్–ఎండెడ్గానే ముగుస్తుంది. సమాజం తనని స్వీకరించకపోవడం తన ఒంటరితనానికి కారణమనీ, తను కోరుకున్నదేదీ తనని కోరుకోలేదనీ అనుకుంటూ వస్తున్న వాలెస్, సమాజాన్ని తానూ అంగీకరించాలనే సానుకూలాంశంతో నవల ముగియడం– అది ఆశావహమైన ముగింపే కావొచ్చన్న సూచననిస్తుంది. ‘జ్ఞాపకాలనేవి వాస్తవాలతో నిమిత్తం లేని గతకాలపు విషాదాల ఉరామరికమైన తూకమే’ అయివుండవచ్చు. అయినప్పటికీ గతాన్ని విస్మరించి ముందుకు సాగడమే అవసరం; ఎందుకంటే, గతానికేమీ భవిష్యత్తు అక్కర్లేదు! సమాజం తన హోమోఫోబియా(స్వలింగ సంపర్కాల పట్ల విముఖత)ని పరోక్షంగా ఏదో రూపంలో చూపిస్తుంటుంది. వాలెస్ జీవితం ఒక సంక్లిష్టమైన చిత్రం. అతని ప్రయోగాన్ని నాశనం చేసిన సహవిద్యార్థిని జాతివివక్ష గురించి చెప్పితీరాల్సివచ్చిన సందర్భంలో అంతా విన్న ప్రొఫెసర్ అతన్ని స్త్రీద్వేషి అని ప్రత్యారోపణ చేస్తుంది. వివక్షని తమదైన పద్ధతిలో విశ్లేషించి అసలది వివక్షే కాదన్న తీర్పూ ఇచ్చి దాన్నే బలంగా నమ్మడం శ్వేతసమాజపు సహజలక్షణం. జాతి, మతం, కులం, జెండర్, లైంగికత, శరీరవర్ణం లాంటి విశేషాలన్నీ వివిధ పరిమాణాలలో కలగలిపి, ఇరుకైన ఒక ఇంటర్సెక్షనల్ అస్తిత్వాన్ని సమాజం మనిషికి అంటగట్టి, దానిమీదే తేరుకోలేని దాడి చేస్తుంది. బుకర్ ప్రైజ్, 2020 షార్ట్లిస్ట్లోని ఈ మూడవ నవల రచయిత బ్రాండన్ టేలర్ తొలినవల. కథాంశం కొత్తది కాకపోయినా, లైంగికతాంశపు దృష్టికోణం నుంచి సమస్యని చూపడం రియల్ లైఫ్ ముఖ్యాంశం కాగా, స్వయంగా నల్లజాతీయుడైన రచయిత వల్ల నవలకి సాధికారత లభించినట్టయింది. వాలెస్ ఆంతరంగికత మీదనే ఎక్కువగా నడిచే కథ కొన్నిచోట్ల అవసరాన్ని మించి విస్తరిస్తూంటుంది. పాత్ర భావోద్వేగాలని ఆయా భాగాల్లో వేరుచేసుకుని జాగ్రత్తగా గమనించవలసి వస్తుంది. అనుభవాల నుంచి చేసే సూత్రీకరణలు ఆకట్టుకుంటూనే, కొన్నిభాగాల్లోని ప్రేమలూ, విరహాలూ, కోపతాపాలూ, ఈసునసూయలూ సగటు శృంగార ప్రేమకథని చదువుతున్న భ్రాంతిని కలగజేస్తాయి. అయినప్పటికీ, ఇది ప్రస్తుత సందర్భాలలోని అసమంజసతలని సున్నితంగా విమర్శించిన వాణి. - ఎ.వి.రమణమూర్తి నవల: రియల్ లైఫ్ రచన: బ్రాండన్ టేలర్ ప్రచురణ: రివర్హెడ్ బుక్స్; 2020 -
వనాలతో సహజీవనాలు
‘‘ఊళ్లో ఇప్పుడేమీ లేదు. ఇళ్ల మేడలమీద పూలమొక్కలూ, కూరగాయపాదులూ, వాటిమధ్య బాటలూ లేవు. సోలార్ గ్రిడ్స్, నీళ్లట్యాంకులూ, సెల్టవర్లూ, వాటిచుట్టూ వేసిన ముళ్లకంచెలతో నిండిపోయాయవన్నీ. ఒక బిల్డింగ్ నుంచి మరో బిల్డింగ్కి వెళ్లే మనుషులు తప్ప బయట మరెవ్వరూ కనిపించరు. వాళ్లుండే ఇంటికి కొంతదూరంలో ఒక చెట్టూ, దాన్నెవరూ ముట్టుకోకుండా బలమైన కంచె ఉండేవి. ప్రతి వసంతానికీ ఆ చెట్టుకు పువ్వులు పూసేవి. అందమైన పూవులను చూడటానికి ఎక్కడెక్కడినుంచో జనాలు వచ్చేవారు. చెట్టు ఆకులను రాల్చినప్పుడు గాలికి ఎగిరే ఆకులను ఏరుకోవటానికి అంతా పోటీ పడేవారు. ఊరిలో మిగిలిన పది చెట్లలో అదొకటి. ఆ చెట్టుకు దగ్గర్లో ఇల్లుండటం వాళ్లు చేసుకున్న అదృష్టం.’’ వాతావరణ కాలుష్యంతో కనుమరుగవుతున్న పచ్చదనానికీ, జాగ్రత్త వహించకపోతే జరగబోయే పరిణామాలకూ సాక్ష్యంగా నిలుస్తుందీ ఊరు ‘ద న్యూ విల్డర్నెస్’ నవలలో. ఎందరో ప్రముఖ రచయితల సరసన పోటీలో నిలబడి బుకర్ ప్రైజ్ 2020కి షార్ట్లిస్ట్ అయిన ఆరింటిలో డయాన్ కుక్ తొలినవలే చోటుచేసుకోవటం ఆ నవలకు దక్కిన గౌరవం. ప్రకృతితో మనిషి సహజీవనం అనే పరిశోధన కోసం మిగిలివున్న ఏకైక అడవి ‘విల్డర్నెస్ స్టేట్’లోకి ఇరవైమందిని పంపిస్తారు పరిశోధకులు. పరిశోధన ముగిసేవరకూ కఠినమైన నియమాలను పాటిస్తూ, నిర్ణీత ప్రదేశాల్లోని కేంద్రాలలో తమ అనుభవాలను పొందుపరుస్తూ, ఆరోగ్యపరీక్షలు చేయించుకుంటూ అడవిమనుషులలాగా జీవించాలి వారంతా. నగరంలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూన్న అయిదేళ్ల ఆగ్నెస్కు కాలుష్యం నుంచి గాలిమార్పు అవసరమని డాక్టర్లు చెప్పటంతో పరిశోధనలో భాగస్తులై కూతురుతో అడవికి చేరుకుంటారు గ్లెన్, అతని భార్య బియాట్రిస్. అడవిలో ఆగ్నెస్కి ఆరోగ్యం, తల్లితో అనుబంధం మెరుగవుతాయి కానీ, పదీపదకొండేళ్ల వయసొచ్చేటప్పటికి ఇద్దరి మధ్యా కొత్తగా వికర్షణల విస్ఫోటనాలు మొదలవుతాయి. తల్లి మరణవార్త విన్న బియాట్రిస్ తమకి ఒక్కమాటైనా చెప్పకుండా నగరానికి వెళ్లిపోవడం నచ్చదు ఆగ్నెస్కి. తిరిగివచ్చిన బియాట్రిస్ తమ బృందంలో కొత్తవారు చేరటం, గ్లెన్ అనారోగ్యం పాలై ఉన్నప్పటికీ అతన్నెవరూ పట్టించుకోకపోవటం గమనిస్తుంది. అనారోగ్యంతో గ్లెన్ మరణించగా కార్ల్, బియాట్రిస్లు బృందాన్ని నడిపిస్తారు. అడవిలో కనిపించిన ఆడమ్ అనే వ్యక్తి అధికారుల కళ్లుగప్పి రహస్యంగా అడవిలోకి చొరబడ్డాననీ, తనలాగా చాలామంది అక్కడున్నారనీ చెప్తాడు. అధికారులు పరిశోధన ముగిసిందనీ, రహస్యంగా అడవిలోకి చొరబడ్డవారిని పట్టుకోడానికి సహకరిస్తే ప్రైవేట్లాండ్స్కి తీసుకెళ్తామనీ, కాదంటే అందరినీ నగరానికి పంపే ఏర్పాట్లు చేస్తామనీ అంటారు. నగరానికి తిరిగి వెళ్లటంకంటే, ప్రైవేట్లాండ్స్లో జీవితం బావుంటుందన్న ఆశతో బియాట్రిస్తో సహా ఎక్కువమంది దానికే మొగ్గు చూపుతారు. ప్రైవేట్లాండ్స్ మీద నమ్మకం లేని ఆగ్నెస్ తల్లితో విభేదించి ఒంటరిగా అడవిలోకి పారిపోతుంది కానీ, కొంతకాలానికి అధికారులకు దొరికిపోతుంది. ఇప్పుడీ ఆఖరి అడవిలో సైతం జరుగుతున్న నిర్మాణాల పర్యావరణ హింసని ఆగ్నెస్ గమనిస్తుంది. పర్యావరణంపట్ల మానవుడి నిర్లక్ష్యంతో కలుగుతున్న విపత్తులను స్పృశిస్తూ డిస్టోపియన్ లక్షణాలను సంతరించుకున్న నవల, తల్లీకూతుళ్ల మధ్య సంచలించే బాంధవ్యం కథావస్తువుగా శాఖలువారుతుంది. కూతురికోసం నాగరిక జీవనాన్ని వదిలి వచ్చిన బియాట్రిస్కి అప్పుడప్పుడూ ఆ బంధాలు తనని ‘హత్తుకోవటంకంటే, కట్టిపడేస్తున్న భావన’ కలగడం తల్లీకూతుళ్ల ప్రేమలో ఇతర వర్ణచ్ఛాయలుంటాయనడానికి సాక్షీభూతం. బహుళ కథకుల ద్వారా భిన్న దృష్టికోణాలు నవలలో పరిచయమవుతాయి. వికసిస్తున్న బుద్ధితో ప్రపంచాన్ని పరిశీలించే ఆగ్నెస్, ప్రతి విషయం పట్లా ముందే ఏర్పరచుకున్న స్థిర దృక్పథం ఉన్న బియాట్రిస్ – ప్రధాన కథకులు. నవలంతా పరుచుకునున్న అడవి వాతావరణం, వర్ణనలు కొంత సాగతీత అనిపించినప్పటికీ– ప్రతీకలూ, ఉపమానాలూ, సారళ్యత, తటస్థత, కథనానికి అందమైన ఆలంబనలు. మానవ సంఘర్షణలతో – ప్రత్యేకించి తల్లీకూతుళ్ల ఆకర్ష వికర్షణలతో – పర్యావరణాన్ని కలిపి చిత్రించటం బావుంది. ‘మరణం జీవించడమంత సహజం’ అనుకుని ముందుకుసాగే పరిస్థితులనూ, మనుషుల్లో నిక్షిప్తమైన నిర్దాక్షిణ్యతనూ చూసినపుడు అడవిలోపలి మనిషి, మనిషిలోపలి అడవి ఒకేసారి కనిపిస్తాయి. మనుషులు ఎక్కడున్నా వారి ఘర్షణలు, నైజాలూ మాత్రం అవే– ప్రకృతితో నిమిత్తం లేకుండా! నవల: ద న్యూ విల్డర్నెస్ రచన: డయాన్ కుక్ ప్రచురణ: హార్పర్; 2020 - పద్మప్రియ
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడం లేదు
ఎంపీ ప్రజ్వల్ను అరెస్ట్ చేయాలి
మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి
రేప్ కేసు నిందితుడిపై పోలీసు కాల్పులు
అడవి వద్దు.. ఊరే ముద్దు
జలాసనం
● అరటి తోటలో పెద్ద పులి
కరెంటు షాక్తో రైతు మృతి
అమ్మవారికి గాజుల శోభ
తప్పక చదవండి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
Advertisement