-
ఖాతాదారులకు అలెర్ట్ : బ్యాంక్ ఆఫ్ బరోడాలో స్కాం కలకలం!
ప్రభుత్వ బ్యాంకింగ్ రంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా’(bob)లో స్కాం కలకలం రేపింది. పలు బ్రాంచీలలో పనిచేస్తున్న ఉద్యోగులే కస్టమర్ల బ్యాంక్ అకౌంట్లకు సంబంధం లేని మొబైల్ నంబర్లతో లింక్ చేసి, వాటి సాయంతో బ్యాంక్ ఆఫ్ బరోడా మొబైల్ యాప్ ‘బాబ్ వరల్డ్’ లో లాగిన్ అయ్యారు. అనంతరం, ఆర్ధిక నేరాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఈ ఏడాది జులైలో అంతర్జాతీయ మీడియా సంస్థ అల్ జజీరా పలు నివేదికల్ని వెలుగులోకి తెచ్చింది. తాజాగా, జరిపిన బ్యాంక్ ఇంట్రర్నల్ ఆడిట్లో కుంభకోణం జరిగింది నిజమేనని తేలింది. ఆర్బీఐ సైతం చర్యలకు ఉపక్రమించింది. అసలేం జరిగింది? బ్యాంక్ ఆఫ్ బరోడా మొబైల్ యాప్ ఇతర బ్యాంకింగ్ యాప్ల మాదిరిగానే, కస్టమర్లకు లోన్ సదుపాయం, సేవింగ్స్, పెట్టుబడులు, పేమెంట్స్, బస్, హోటళ్ల బుకింగ్ వంటి వివిధ డిజిటల్ బ్యాంకింగ్ సేవల్ని అందిస్తుంది. దీన్ని ఆసరగా చేసుకుని బ్యాంక్ ఉద్యోగులే తిన్నింటి వాసాలు లెక్కబెట్టారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టిన బ్యాంక్ ఉద్యోగులు నివేదిక ప్రకారం, బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగులే కస్టమర్లకు తెలియకుండా ఫోన్ నెంబర్లు లేని అకౌంట్లను గుర్తించారు. కస్టమర్ల ఫోన్ నెంబర్ల స్థానంలో బ్యాంక్ ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు, భద్రతా సిబ్బందితో పాటు వివిధ విభాగాల్లో పని చేస్తున్న ఉద్యోగుల నెంబర్లను జత చేశారు. దీంతో బ్యాంక్ అసలైన ఖాతాదారులకు తెలియకుండా వారి మొబైల్ యాప్స్లలో లాగిన్ అయ్యారు. అకౌంట్లలో ఉన్న నిధుల్ని కాజేశారు. ఈ వ్యవహారంలో కస్టమర్లు భారీ ఎత్తున నష్టపోయారంటూ వెలుగులోకి వచ్చిన నివేదికల్ని బ్యాంక్ ఆఫ్ బరోడా ఖండించింది. ఆ తర్వాత వరుస ఫిర్యాదులతో ఆర్బీఐ సైతం అప్రమత్తమైంది. బీవోబీలో అంతర్గత విచారణ చేపట్టడంతో తీగ లాగడంతో డొంకంతా కదలడంతో స్కాం జరిగినట్లు తేలింది. ఉద్యోగుల సస్పెండ్ ఈ స్కామ్లో సంబంధం ఉన్న 60 మంది ఉద్యోగులకు సస్పెన్షన్ విధించింది. దీంట్లో గుజరాత్ వడోదరా, భోపాల్, బరోడా, రాజస్థాన్ నుంచి విధులు నిర్వహిస్తున్న 11 మంది అసిస్టెంట్ జనరల్ మేనేజర్లు ఉన్నారు. వీరందరిని ఆర్బీఐ సస్పెండ్ చేసింది. పూర్తిస్థాయిలో నిజాలు వెలుగులోకి వస్తే వారి శాశ్వతంగా విధుల నుంచి తొలగించే అవకాశం ఉందని సమాచారం. రంగంలోకి ఆర్బీఐ బ్యాంక్ ఉద్యోగులు చేసిన మోసంతో ఆర్బీఐ యాప్లోని లోపాల్ని సరిదిద్దుతుంది. కొత్త కస్టమర్లు యాప్లో లాగిన్ అవ్వకుండా నిషేధించింది. యాప్లోని సమస్యల్ని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంది. ఆ తర్వాతనే కొత్తగా బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లు నెట్ బ్యాంక్లో లాగిన్ అయ్యే అవకాశం కలగనుంది. చదవండి👉 మెక్రోసాఫ్ట్ శాలరీ లీక్, ఏడాది జీతం కోసం..మనమైతే జీవితాంతం కష్టపడాల్సిందే! -
ఎస్బీఐ సేవల్లో అంతరాయం.. సర్వర్ డౌనా? సైబర్ అటాకా?
ప్రముఖ ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ సర్వర్లు డౌన్ అయ్యాయి. దీంతో బ్యాంక్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. గత కొన్ని రోజులుగా బ్యాంకుల్లో లావాదేవీలు జరక్క ఇబ్బంది పడుతున్న ఖాతాదారులకు సోమవారం రోజు (3-4-2023) సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్, యూపీఐ పేమెంట్స్, యోనో యాప్ పనిచేయకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంక్ల్లో తాము చేయాల్సిన లావాదేవీలు ఆగిపోయాయని వెంటనే సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ ఖాతాదారులు ట్విటర్లో అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సమస్య మార్చి 31 నుంచి కొనసాగుతున్నట్లు తెలిపారు. ఈరోజు 4వ రోజు. మార్చి 31 నుంచి ఎస్బీఐ బ్యాంక్ సైట్/ యాప్స్ పనిచేయడం లేదు. డౌన్ అయ్యాయి. సైబర్ అటాక్ జరిగిందా? లేదంటే బ్యాంకుల్లో సాధారణంగా జరిగే సర్వర్ సమస్యలా? అనే దానిపై సమాధానం చెప్పాలని, లేదంటే వినియోగదారులు పెద్ద మొత్తంలో నష్టపోవాల్సి వస్తుందని ట్వీట్లలో పేర్కొంటున్నారు. మరోవైపు ఎస్బీఐ సర్వర్ల పనితీరుపై ప్రపంచ వ్యాప్తంగా సేవల్లో తలెత్తే అంతరాయాల్ని వెలుగులోకి తెచ్చే డౌన్ డిటెక్టర్ ఇండియా సంస్థ స్పందించింది. ఈ రోజు ఉదయం 9.19 గంటల నుంచి ఎస్బీఐ సేవల్లో లోపాలు తలెత్తినట్లు తమకు ఫిర్యాదులు అందాయని తెలిపింది. Second working day of the new financial year and the SBI website is down. @TheOfficialSBI @RBI pic.twitter.com/mpRVH5ESBb — Gaurav Dutta (@dgaurav7) April 3, 2023 I hope @TheOfficialSBI you have money and we are just facing a technical glitch from last 10 days. "NET BANKING IS NOT WORKING"#SBIDOWN — Harsh Patel (@hiharsh07) April 3, 2023 I hope @TheOfficialSBI you have money and we are just facing a technical glitch from last 10 days. "NET BANKING IS NOT WORKING"#SBIDOWN — Harsh Patel (@hiharsh07) April 3, 2023 -
ఎస్బీఐ:'హాయ్' చెప్పండి..వాట్సాప్లో బ్యాంక్ సేవల్ని పొందండి!
SBI Whatsapp Banking Services: ప్రముఖ ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఖాతాదారులు బ్యాంక్కు వచ్చే అవసరం లేకుండా కొన్ని సర్వీసుల్ని వాట్సాప్ ద్వారా అందించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం కస్టమర్లు యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం, ఏటీఎం సెంటర్కు వెళ్లే అవసరం కూడా లేదని ఎస్బీఐ ఛైర్మన్ దినేష్ ఖారా తెలిపారు. యువర్ బ్యాంక్ ఈజ్ నౌ ఆన్ వాట్సాప్. బ్యాంక్ బ్యాలెన్స్, మినిస్టేట్మెంట్ వాట్సాప్లో పొందండి అంటూ ఎస్బీఐ ట్వీట్ చేసింది. అంతేకాదు వాట్సాప్లో ఎస్బీఐ సేవలు పొందాలనుకుంటే కస్టమర్లు ఇంగ్లీష్లో 'హాయ్' అని టైప్ చేసి 9022690226 నెంబర్కు మెసేజ్ చేయాలని తెలిపింది. Your bank is now on WhatsApp. Get to know your Account Balance and view Mini Statement on the go.#WhatsAppBanking #SBI #WhatsApp #AmritMahotsav #BhimSBIPay pic.twitter.com/5lVlK68GoP — State Bank of India (@TheOfficialSBI) July 19, 2022 వాట్సాప్లో ఎస్బీఐ సేవలు స్టెప్1: ముందుగా మీరు ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్కు యాడ్ చేసిన ఫోన్ నెంబర్కు ఎస్బీఐ సేవలు వాట్సాప్లో పొందాలంటే.. అందుకు మీరు కొన్ని పద్దతుల్ని అనుసరించాల్సి ఉంటుంది. ముందుగా బ్యాంక్లో మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 917208933148కు WAREG(కేపిటల్ లెటర్స్) అని టైప్ చేసి అకౌంట్ నెంబర్ ఎస్ఎంఎస్ చేయండి. స్టెప్ 2: మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత 919022690226 నంబర్పై 'హాయ్' SBI అని టైప్ చేయండి లేదా "ప్రియమైన కస్టమర్, మీరు ఎస్బీఐ వాట్సాప్ బ్యాంకింగ్ సేవల కోసం విజయవంతంగా నమోదు చేసుకున్నారు" అని వాట్సాప్లో మీకు వచ్చిన మెసేజ్కు రిప్లయి ఇవ్వండి. స్టెప్ 3: మీరు వాట్సాప్ పైన పేర్కొన్న నెంబర్కు రిప్లయి ఇస్తే ఇలా మెసేజ్ వస్తుంది. ప్రియమైన వినియోగదారులారా,ఎస్బీఐ వాట్సాప్ బ్యాంకింగ్ సేవలకు స్వాగతం! 1. బ్యాంక్ బ్యాలెన్స్ 2. మినీ స్టేట్మెంట్ 3. వాట్సాప్ బ్యాంకింగ్ నుండి డిఈ-రిజిస్టర్ చేసుకోండి స్టెప్ 4: మీ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి లేదా మీ చివరి ఐదు ట్రాన్సాక్షన్లకు సంబంధించిన స్టేట్మెంట్(మినీ) పొందడానికి 1 లేదా 2 ఆప్షన్ను సెలక్ట్ చేసుకోవాలి. మీరు ఎస్బీఐ వాట్సాప్ బ్యాంకింగ్ నుండి డిఈ-రిజిస్టర్ చేయాలనుకుంటే..మీరు 3 ఆప్షన్ను సెలక్ట్ చేసుకోవచ్చు. స్టెప్5: మీరు పైన పేర్కొన్నట్లుగా సెలక్ట్ చేసుకుంటే బ్యాంక్ బ్యాలెన్స్ లేదా మినీ స్టేట్మెంట్ పొందవచ్చు. మిగిలిన సంబంధ వివరాలు కావాలనుకుంటే టైప్ చేసి అడగొచ్చు. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్కు సైతం ఎస్బీఐ ఈ వాట్సాప్ సేవల్ని తన క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు అందిస్తుంది. వాట్సాప్ కనెక్ట్ పేరుతో క్రెడిట్ కార్డ్ కస్టమర్లు అకౌంట్ డీటెయిల్స్,రివార్డ్ పాయింట్లు, బ్యాలెన్స్, కార్డ్ చెల్లింపులతో పాటు పలు సేవలు అందుబాటులో ఉన్నాయి. -
ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త!
దేశీయ ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ తన ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. త్వరలో వాట్సాప్ ద్వారా బ్యాంకింగ్ సేవల్ని అందుబాటులో తెస్తున్నట్లు ప్రకటించింది. తద్వారా ఎస్బీఐ బ్యాంకింగ్ సేవల్ని మరింత సులభతరం కానున్నాయి. జులై1న జరిగిన వర్చువల్ మీటింగ్లో ఎస్బీఐ ఛైర్మన్ శుక్రవారం దినేష్ ఖారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన.. ఎస్బీఐ పలు కొత్త సేవల్ని అందుబాటులోకి తేనున్నట్లు వెల్లడించారు. వాటిలో ముఖ్యంగా వాట్సాప్లో ఎస్బీఐ బ్యాంకింగ్ సేవలు ఉంటాయని అన్నారు. అయితే అవి ఎలాంటి సేవలనే అంశంపై స్పందించలేదు. ఇప్పటికే ఎస్బీఐ వాట్సాప్ బ్యాంకింగ్ సేవలు ఎస్బీఐ ఇప్పటికే క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు అందిస్తుంది.అకౌంట్ సమరి, రివార్డ్ పాయింట్స్, అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్, కార్డ్ పేమెంట్స్ వంటి వివరాల్ని వాట్సాప్లో పొందవచ్చు. ఒకవేళ మీరూ ఆ సేవల్ని వినియోగించుకోవాలంటే "కేపిటల్ లెటర్స్తో ఇంగ్లీష్లో(OPTIN) ఓపీటీఐఎన్ అని టైప్ చేసి 9004022022 నెంబర్కు మెసేజ్ చేయోచ్చు. లేదంటే 08080945040 మిస్డ్ కాల్ ఇచ్చి సైనప్ అవ్వచ్చు. వాట్సాప్ ద్వారా క్రెడిట్ కార్డ్కు సంబంధించి బ్యాంకింగ్ సేవల్ని వినియోగించుకోవచ్చు." -
ఐటీఆర్ దాఖలుతో పని పూర్తయినట్టు కాదు
ఆదాయపుపన్ను రిటర్నుల దాఖలు గడువు డిసెంబర్ 31 తో ముగిసింది. జూలైతోనే ముగిసిన గడువును.. కరోనా అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ చివరి వరకు పొడిగించింది. దీంతో చాలా మంది డిసెంబర్లో రిటర్నులు దాఖలు చేశారు. రిటర్నులు దాఖలుతో బాధ్యత ముగిసిందని అనుకోవద్దు. ఆ తర్వాత తమ వైపు నుంచి దృష్టి పెట్టాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. చివరి నిమిషంలో వేయడం వల్ల అందులో తప్పులు దొర్లి ఉంటే వెంటనే రివైజ్డ్ రిటర్నులు వేసుకోవాలి. ఈ వెరిఫై చేస్తేనే వేసిన రిటర్నులు చెల్లుబాటు అవుతాయి. ఇలాంటి ముఖ్యమైన అంశాల గురించి వివరించే కథనమే ఇది.. ఈ ఫైలింగ్ పోర్టల్పై ఐటీఆర్ దాఖలు చేయడం ప్రాథమికంగా చేయాల్సిన పని. తర్వాత ఆ రిటర్నులను ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఎందుకంటే అవి మీరే దాఖలు చేశారనడానికి నిదర్శనం ఏమిటి? అందుకనే ధ్రువీకరణ ప్రక్రియ. దాంతో ఆ రిటర్నుల్లో పేర్కొన్న సమాచారానికి మీరు బాధ్యత వహిస్తున్నట్టు అవుతుంది. గతేడాది కొత్త ఈ ఫైలింగ్ పోర్టల్ తీసుకురావడం తెలిసిందే. ఎన్నో సాంకేతిక సమస్యలు వెక్కిరించడంతో పన్ను చెల్లింపుదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. డిసెంబర్ చివరి వారంలో హడావుడిగా రిటర్నులు వేసిన వారు కూడా ఉన్నారు. కనుక ఒకసారి రిటర్నులు ధ్రువీకరించినదీ, లేనిదీ చూసుకోవాలి. వెరిఫికేషన్ చేయని రిటర్నులు చెల్లవు. రిటర్నులు సమర్పించిన తేదీ నుంచి 120 రోజుల్లోపు ధ్రువీకరించేందుకు సమయం ఉంటుంది. అక్నాలెడ్జ్మెంట్ పత్రం లేదా ఫామ్–5 పత్రంపై (ఆదాయపన్ను శాఖ నుంచి డౌన్లోడ్ చేసుకుని) సంతకం చేసి ఆ కాపీని పోస్ట్ ద్వారా ఆదాయపన్ను శాఖ, బెంగళూరు కార్యాలయానికి పంపించాలి. కొరియర్ ద్వారా పంపకూడదు. భౌతికంగా చేసే ధ్రువీకరణ ఇది... ఇలా కాకుండా ఆన్లైన్లో ఈ వెరిఫై చేసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్ నుంచి లేదంటే ఆధార్ ఓటీపీ ద్వారా, బ్యాంకు లేదా డీమ్యాట్ ఖాతా నంబర్ సాయంతోనూ వెరిఫై చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. వీటిల్లో మీకు నచ్చిన ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. అప్పుడు యూజర్ మొబైల్కు వన్టైమ్ పాస్వర్డ్ వస్తుంది. ఈ కోడ్ లేదా ఓటీపిని ఈఫైలింగ్ పోర్టల్పై ఎంటర్ చేసి, సబ్మిట్ కొట్టడంతో ఈ వెరిఫికేషన్ పూర్తవుతుంది. వెరిఫై చేసినట్టు సమాచారం కూడా వస్తుంది. ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎంలను ఉపయోగించుకుని ఓటీపీ జనరేట్ చేసుకోవడం ద్వారా ఈవెరిఫై చేయవచ్చు. సదరు బ్యాంకులో ఖాతా ఉండి, ఖాతాకు పాన్ నంబర్ అనుసంధానించి ఉంటే సరిపోతుంది. సెక్షన్ 44ఏబీ కింద ఖాతాలను ఆడిట్ చేయాల్సి అవసరం ఉన్న వారు తప్పనిసరిగా రిటర్నులు దాఖలు చేసిన వెంటనే.. తమ డిజిటల్ సిగ్నేచర్ను ఉపయోగించి ధ్రువీకరించాల్సి ఉంటుంది. పన్ను రిటర్నులు వేసిన 120 రోజులకీ వెరిఫై చేయకపోతే ముందు ఈఫైలింగ్ పోర్టల్లో లాగిన్ అయ్యి సరైన కారణాన్ని తెలియజేస్తూ జరిగిన ఆలస్యానికి క్షమాపణ తెలియజేయాలి. మీ అభ్యర్థనను ఆదాయపన్ను శాఖ మన్నిస్తే.. అప్పుడు రిటర్నులు ఈ వెరిఫై చేసుకునేందుకు అవకాశం తిరిగి లభిస్తుంది. లేదంటే మీ రిటర్నులను దాఖలు చేయనట్టుగా ఐటీ శాఖ భావిస్తుంది. అప్పుడు సకాలంలో రిటర్నులు వేయనందుకు చట్టప్రకారం అన్ని చర్యలకు బాధ్యత వహించాలి. ఆలస్యపు ఫీజు, చెల్లించాల్సిన పన్ను ఉంటే ఆ మొ త్తంపై నిర్ణీత గడువు తేదీ నుంచి వడ్డీ చెల్లించాలి. రిటర్నుల్లో తప్పులను గుర్తిస్తే..? ఐటీఆర్ దాఖలు చేశారు. ధ్రువీకరించడం కూడా ముగిసింది. కానీ ఆదాయం, మినహాయింపులను పేర్కొనడం మర్చిపోయారనుకోండి. అప్పుడు సవరించిన రిటర్నులు దాఖలు చేసుకునేందుకు అవకాశం ఉంది. అది కూడా రిటర్నులను ఆదాయపన్ను శాఖ ప్రాసెస్ చేయక ముందే చేసుకోవాలి. ఇందుకు ప్రత్యేకంగా వేరొక ఫామ్ ఉండదు. ఈ ఫైలింగ్ పోర్టల్పై ఒరిజినల్, రివైజ్డ్ అనే ఆప్షన్లు ఉంటాయి. ‘రివైజ్డ్ రిటర్న్’ ఆప్షన్ ఎంపిక చేసుకుని, ముందు దాఖలు చేసిన మాదిరే మొదటి నుంచి ప్రక్రియ అనుసరించాలి. ఒరిజినల్ ఐటీఆర్ ఈ ఫైలింగ్ దాఖలు చేసిన తేదీ, అక్నాలెడ్జ్మెంట్ నంబర్ను ఇవ్వాల్సి ఉంటుంది. సంబంధిత అసెస్మెంట్ సంవత్సరం ముగియడానికి మూడు నెలల ముందుగానే రివైజ్డ్ రిటర్నుల ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. 2020–21 సంవత్సరానికి 2021–22 అసెస్మెంట్ సంవత్సరం అవుతుంది. కనుక 2021 డిసెంబర్ 31ని గడువుగా అర్థం చేసుకోవాలి. ఆలోపే ఐటీఆర్ అసెస్మెంట్ను ఆదాయపన్ను శాఖ పూర్తి చేస్తే గడువు ముగిసినట్టుగా అర్థం చేసుకోవాలి. ఈ రెండింటిలో ఏది ముందు అయితే అదే అమలవుతుంది. 2021–22 అసెస్మెంట్ సంవత్సరానికి సవరించిన రిటర్నుల దాఖలు గడువును ఆదాయపన్ను శాఖ 2022 మార్చి 31 వరకు పొడిగించిన విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఈ గడువులతో సంబంధం లేకుండా.. మీరు దాఖలు చేసిన రిటర్నులను ఐటీ శాఖ ప్రాసెస్ చేసి సెక్షన్ 143(1) కింద ఇంటిమేషన్ మెయిల్ పంపినట్టయితే గడువు ముగిసిపోయినట్టుగానే పరిగణించాలి. దాంతో రిటర్నులను సవరించుకోలేరు. సాధారణంగా రిటర్నులు దాఖలు చేసి, వెరిఫై చేసిన తర్వాత.. 10–30 రోజుల్లోపే ఆదాయపుపన్ను శాఖ ప్రాసెస్ చేసేస్తుంది. అందుకని రిటర్నులు దాఖలు చేసిన వారు ఆ తర్వాత వారం వ్యవధిలోపే మరొక్క సారి అన్నింటినీ క్షుణంగా సరిచూసుకోవడం మంచిది. రివైజ్డ్ రిటర్నులు వేసుకునేందుకు, ఆలస్యంగా రిటర్నులు దాఖలు చేసుకునేందుకు సాధారణంగా డిసెంబర్ 31 గడువుగా ఉంటుంది. కనుక ఆలస్యంగా రిటర్నులు వేసే వారికి రివైజ్ చేసుకునేందుకు తగినంత వ్యవధి ఉండకపోవచ్చు. ఆదాయపన్ను శాఖ ప్రాసెస్ చేయక ముందు ఎన్ని సార్లు అయినా రివైజ్డ్ రిటర్నులు ఫైల్ చేసుకోవచ్చు. తాజాగా దాఖలు చేసిన ఐటీఆర్ను ఐటీ శాఖ పరిగణనలోకి తీసుకుంటుంది. అవకాశం ఉంది కదా అని చాలా సార్లు రివైజ్డ్ రిటర్నులు వేశారనుకోండి.. అప్పుడు ఆదాయపన్ను శాఖ సందేహంతో మీ ఐటీఆర్ను స్క్రూటినీ చేయవచ్చు. రిఫండ్ సంగతిదీ.. ఆదాయపుపన్ను రిటర్నులను దాఖలు తర్వాత, ఐటీ శాఖ వాటిని ప్రాసెస్ చేసి 143 (1) ఇంటిమేషన్ ఇవ్వడం పూర్తయి, అందులో ఏ తప్పులూ లేకపోతే రిటర్నుల ప్రక్రియ సంపూర్ణంగా ముగిసినట్టే. చివరిగా ఒకవేళ చెల్లించాల్సిన దానికంటే ఎక్కువ పన్ను చెల్లించి ఉంటే రిఫండ్కు అర్హత ఉంటుంది. రిఫండ్ స్టేటస్ ఏంటన్నది ఐటీ శాఖ ఈ ఫైలింగ్ పోర్టల్లో లాగిన్ అయిన తర్వాత డాష్ బోర్డుపై కనిపిస్తుంది. అదనంగా ఎన్ఎస్డీఎల్ పోర్టల్లోనూ చెక్ చేసుకోవచ్చు. https://tin.tin. nsdl.com/oltas/refund-status.html. ఈ లింక్ను ఓపెన్ చేసి పాన్ వివరాలు ఇవ్వడం ద్వారా తెలుసుకోవచ్చు. ఫేస్లెస్ ప్రాసెసింగ్ వచ్చిన తర్వాత రిఫండ్లు పన్ను చెల్లింపుదారుల బ్యాంకు ఖాతాల్లోకి జమ అవుతున్నాయి. 143(1) ఇంటిమేషన్ వచ్చిన 15 రోజుల్లోపే రిఫండ్ కూడా వచ్చేస్తుంది. పలు కారణాల వల్ల ఆలస్యం అయితే, బ్యాంకు ఖాతా వివరాలు (అకౌంట్ నంబర్/ఐఎఫ్ఎస్ నంబర్ తదితర) సరిగా లేకపోవడం వల్ల పెండింగ్లో ఉంటే అప్పుడు నూతన ఈఫైలింగ్ పోర్టల్కు వెళ్లి సర్వీస్ రిక్వెస్ట్ ఆప్షన్ ద్వారా వివరాలను సరిచేసుకోవచ్చు. రిఫండ్లు ఆలస్యమైనా ఆందోళన చెందక్కర్లేదు. నిర్ణీత గడువు దాటిన తర్వాత నుంచి ఆ మొత్తంపై ప్రతీ నెలా 0.5 శాతం మేర వడ్డీని ఐటీ శాఖ చెల్లిస్తుంది. ఇలా అందుకునే వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుందని మర్చిపోవద్దు. ఈ మొత్తాన్ని సంబంధిత ఆర్థిక సంవత్సరం ఆదాయం కింద రిటర్నుల్లో పేర్కొనాల్సి ఉంటుంది. పన్ను కోసం డిమాండ్ నోటీసు వస్తే? పన్ను రిటర్నుల్లో తప్పులు, పొరపాట్లు చేయవచ్చు. ఆదాయపన్ను శాఖ రిటర్నులను ప్రాసెస్ చేసే సమయంలో అందులోని సమాచారం మధ్య అంతరాలు, పోలికల్లేమిని గుర్తిస్తుంది. ఆ వివరాలను 143(1) ఇంటిమేషన్ నోటీసులో పేర్కొంటుంది. పన్ను చెల్లించాల్సి ఉంటే ఆ మొత్తాన్ని చెల్లించాలని డిమాండ్ చేస్తుంది. ఐటీ శాఖ పేర్కొన్న సమాచారంతో మీరు ఏకీభవిస్తే ఆ మేరకు పన్ను చెల్లించేస్తే సరిపోతుంది. అలా కాకుండా మీరు ఏదైనా మినహాయింపును పేర్కొనడం మర్చిపోయిన కారణంగా ఆ అంతరం తలెత్తి ఉంటే? అప్పుడు రెక్టిఫికేషన్ రిక్వెస్ట్ దాఖలు చేయాలి. ఆదాయపన్ను శాఖ లెక్కలతో ఏకీభవించడం లేదని లేదా రిటర్నుల్లో పొరపాటు చేశానంటూ అందులో పేర్కొనాలి. పన్ను అధికారులు ఆరు నెలల్లోగా స్పందిస్తారు. నాలుగు రకాల రెక్టిఫికేషన్ రిక్వెస్ట్లు ఉన్నాయి. రిటర్నుల్లో సరిపోలని సమాచారం అసలు ఏంటన్న దాని ఆధారంగా వీటిల్లో ఒకటి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేటినుంచి కేయూ డిగ్రీ సెమిస్టర్ల పరీక్షలు
ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
పీఆర్సీ వేతన సవరణ అంశాలపై వివరణ
ఇండియా కూటమిని గెలిపించాలి
వారికి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం..
ఎన్నికలప్పుడే గుర్తొస్తాయి!
ఓటర్లకు అందుబాటులో ‘చాట్బాట్’ యాప్
హజ్ యాత్రికులకు నేడు వ్యాక్సినేషన్
రోడ్డు ప్రమాదంలో పీఎస్ మృతి
అక్రమ మద్యం అమ్ముతున్న ఇద్దరి అరెస్టు
తప్పక చదవండి
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement