-
నేరెళ్ల మాజీ ఎమ్మెల్యే సాంబయ్య కన్నుమూత
కరీంనగర్: నేరెళ్ల మాజీ ఎమ్మెల్యే ఉప్పరి సాంబయ్య కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం కరీంనగర్ కశ్మీర్గడ్డలో ఉన్న నివాసంలో ఆయన తుది శ్వాస విడిచారు. సాంబయ్య 1985లో జనతా దళ్ నుంచి నేరెళ్ల నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించి సంచలనం సృష్టించారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఆయన మృతికి మాజీ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ నివాళులర్పించారు. ఆయన కుమారుడు ఉప్పరి రవి కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. ఈ సందర్భంగా పొన్నం ఆయనతో ఉన్న జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. తాను కాంగ్రెస్ పార్టీ విద్యార్థి నాయకుడిగా ఉన్న సమయంలో ఉప్పరి సాంబయ్య ఎమ్మెల్యేగా ఉన్నారని, విద్యార్థుల పలు సమస్యలను చెబితే వెంటనే స్పందించారని గుర్తుచేసుకున్నారు. సాంబయ్య విలువలతో కూడిన రాజకీయాలు చేశారని చెప్పారు. ఆయన మృతికి డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ సంతాపం తెలిపారు. -
వైద్యానికి డబ్బుల్లేక మాజీ ఎమ్మెల్యే కొడుకు మృతి
సాక్షి, కోనరావుపేట (వేములవాడ): సర్పంచ్ అయితేనే లక్షలు సంపాదించుకునే రోజులివి. ఎమ్మెల్యే అయితే తరాలు కూర్చొని తిన్నా.. తరగని ఆస్తి కూడబెట్టుకునే కాలమిది. అలాకాకుండా ప్రజాసేవే పరమావధిగా సాదాసీదా జీవనం సాగించిన ఓ మాజీ ఎమ్మెల్యే కొడుకు అనారోగ్యంతో మంచాన పడి.. చేతిలో చిల్లిగవ్వలేక.. వైద్యం అందక బుధవారం మృతిచెందాడు. చిన్నపాటి రేకులషెడ్డులో ఉంటూ ఆ కుటుంబం కాలం వెళ్లదీస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేట గ్రామానికి చెందిన కర్రెల్ల నర్సయ్య స్వాతంత్య్ర సమరయోధుడు. 1957–62 మధ్య అప్పటి నేరెళ్ల నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రజాసేవకే అంకితమై ఎలాంటి ఆస్తులు సంపాదించలేదు. 15 ఏళ్ల కింద నర్సయ్య కన్నుమూయగా, ఆయన కుటుంబం కడుపేదరికంలో బతుకుతోంది. నర్సయ్య కొడుకు ఆనందం (48) గ్రామంలోనే సుతారిగా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కడుపులో కణతులున్నాయని వైద్యులు చెప్పడంతో రూ.3 లక్షలు అప్పుచేసి ఆపరేషన్ చేయించుకున్నాడు. అయినా ఆరోగ్యం కుదుట పడలేదు. మరో రూ.లక్ష అవసరం కాగా, డబ్బుల్లేక వైద్యం చేయించుకోలేదు. బుధవారం ఇంట్లోనే కన్నుమూశాడు. ఆయనకు భార్య అనిత, కొడుకులు లెనిన్, మధు ఉన్నారు. -
మీ టైమ్ దగ్గర పడింది
సాక్షి, హైదరాబాద్ : ‘‘ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి కాలం దగ్గర పడింది. అందుకే వికృత చేష్టలకు పాల్పడుతోంది’’అంటూ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ బహుజన సమాజం సహించే స్థితిలో లేదన్నారు. నేరెళ్లలో దళిత, గిరిజన, బీసీలను ఇసుక లారీల కింద తొక్కించి, వారి కుటుంబాలను చిత్రహింసలు పెట్టి ఏడాదవుతున్నా బాధితులకు న్యాయం చేయలేదని మండిపడ్డారు. ‘‘ఇది తెలంగాణ దళిత సమాజాన్నంతటినీ వేధించినట్టే. ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకుంటుంది’’అని చెప్పారు. నేరెళ్ల ఘటనకు, ఖమ్మంలో మిర్చి రైతులకు సంకెళ్లు వేసిన ఘటనకు నిరసనగా ఈ నెలాఖర్లో, లేదా ఆగస్టు తొలి వారంలో సిరిసిల్లలో ‘దళిత గిరిజన ఆత్మగౌరవ సభ’నిర్వహిస్తామని వెల్లడించారు. సభకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీని ఆహ్వానిస్తామన్నారు. కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ నేత కె.కె.మహేందర్రెడ్డిలతో కలిసి నేరెళ్ల బాధితులు గురువారం గాంధీభవన్కు వచ్చి ఉత్తమ్తో గోడు వెళ్లబోసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఘటన జరిగి ఏడాదైనా బాధితులకు న్యాయం చేయలేదని ఆక్షేపించారు. ‘‘వారిపై కేసులే ఉపసంహరించుకోలేదు. ఏడాది గడుస్తున్నా చార్జిషీట్లూ వేయలేదు. దళితులు, గిరిజనులు, బీసీలను టార్గెట్ చేసి చిత్రహింసల పాలు చేశారు. ఇసుక మాఫియా ద్వారా వేల కోట్లు దోచుకోవడమే లక్ష్యంగా కేసీఆర్ కుటుంబం పనిచేస్తోంది. నేరెళ్ల ఘటన తర్వాత కూడా చాలామంది ఇసుక లారీలకు బలయ్యారు. కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ తీరు మాత్రం ఎందరు చనిపోయినా పర్లేదు గానీ తమ ధనదాహం ఆగొద్దనేలా వ్యవహరిస్తున్నారు. టీఆర్ఎస్ నేతలు రాష్ట్రవ్యాప్తంగా రాబందుల్లా జనం మీద పడి దోచుకుంటున్నారు. పోలీస్స్టేషన్లలో బట్టలిప్పించి, చెప్పలేని చోట కరెంట్ షాక్లిప్పించి కొట్టడం తెలంగాణ సమాజం తలదించుకునే ఘటన. దీనికి బాధ్యుడైన ఎస్పీ విశ్వజిత్పై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టాలన్న పిటిషన్ ఇప్పటికీ పెండింగ్లోనే ఉంది. కేటీఆర్ చెప్పబట్టే ఇవన్నీ జరిగాయి. లేదంటే ఇంతటి దారుణానికి పాల్పడిన పోలీసులపై చర్యలెందుకు తీసుకోలేదు?’’అని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబ నిజ స్వరూపాన్ని నేరెళ్ల బాధితుల రూపంలోనయినా తెలంగాణ సమాజం గుర్తించాలన్నారు. దీన్ని కాంగ్రెస్ సీరియస్గా తీసుకుంటుందని, విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తుందని చెప్పారు. ప్రభుత్వం న్యాయం చేయకుంటే మెడలు వంచేలా కార్యాచరణ ఉంటుందని వెల్లడించారు. నేరెళ్ల బాధితులు కూడా మీడియాతో మాట్లాడారు. పోలీసుల చిత్రహింసలను వివరిస్తూ బోరున విలపించారు. బకెట్లో కరెంట్ పెట్టి మూత్రం పోయించారు ఒక్క లారీ యజమాని మీదా, డ్రైవర్ మీదా కేసులు పెట్టట్లేదు. మమ్మల్ని మాత్రం చిత్రహింసలు పెట్టారు. నిద్రపోకుండా కొట్టారు. బకెట్లో కరెంటు పెట్టి మూత్రం పోయించారు. ఇది చేయించింది కేటీఆరే. బయటకు చెపితే ఆడోళ్లను వ్యభిచారం కేసుల్లో పెడతామని, మగోళ్లను గంజాయి కేసుల్లో ఇరికిస్తామని ఎస్పీ బెదిరించాడు. కేటీఆర్ ఇసుక నింపిస్తడు, హరీశ్ పంపిస్తడు, కేసీఆర్ అమ్మిస్తడు. – బాణయ్య, బాధితుడు కటింగ్ ప్లేయర్తో కండ గుంజి కరెంటు పెట్టిర్రు 2017 జూన్ 4 రాత్రి 11 గంటలకు తీసుకెళ్లి పొద్దున నమాజ్ టైం దాకా కొట్టిర్రు. నా చెవులకు, కాళ్లకు కరెంటు పెట్టిర్రు. కటింగ్ ప్లేయర్తో కండ గుంజి కరెంటు పెట్టిర్రు. ఇప్పటికీ చెవులు వినపడవు. నడుములు పనిచేయవు. మాట సరిగా రాదు. నాలుగు రోజులు కొట్టారు. మా కుటుంబాలకు పనికిరాకుండా పోయినం – గంధం గోపాల్, బాధితుడు పోలీసు కావాలనుకున్న... కానీ కాను డిగ్రీ పూర్తి చేశాను. ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేరవుతున్నా. ఆ రాత్రి వచ్చి పోలీసులు తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టారు. కొత్తగా పెళ్లయిందన్నా, కరెంటు పెట్టొద్దని కాళ్లు మొక్కినా వదల్లేదు. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే ఇష్టం లేదు. మాకు న్యాయం జరిగే దాకా పోరాడుతం – హరీశ్, బాధితుడు -
నేరెళ్ల దళితులపై దాడి రాజ్యహింసే
♦ టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో నేతలు ♦ ఇసుక మాఫియాను అరికట్టాలని డిమాండ్ ♦ రైతులను టీఆర్ఎస్ ప్రభుత్వం బిచ్చగాళ్లు చేసిందని విమర్శ సాక్షి, హైదరాబాద్: సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో దళితులపై పోలీసుల దాడి రాజ్యహింసేనని టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం అభివర్ణిం చింది. థర్డ్ డిగ్రీ జరిపిన పోలీసులపై చర్యలు తీసుకునేవరకు, బాధితులకు న్యాయం జరిగేవరకూ కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉంటుందని పార్టీ నేతలు స్పష్టం చేశారు. ఇసుక మాఫియాను అరికట్టి, దళితులకు న్యాయం కోసం పోరాడుతామన్నారు.ఆది వారం గాంధీభవన్లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి అధ్యక్షతన విస్తృతస్థాయి సమావేశం జరిగింది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి రామచంద్ర కుంతియా హాజరయ్యారు. సమావేశంలో చేసిన తీర్మానా లను టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి, దాసోజు శ్రవణ్, అద్దంకి దయాకర్ మీడియా కు వివరించారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీపై గుజరాత్లో దాడిని సమా వేశం ఖండించినట్లు వారు తెలిపారు. ఉత్తర ప్రదేశ్లో వారంలో 60మంది చిన్నపిల్లలు చనిపోవడం అక్కడి బీజేపీ ప్రభుత్వ పని తీరుకు నిదర్శనమని విమర్శించారు. రీడిజైన్ పేరుతో టీఆర్ఎస్ లూఠీ నీళ్ళు, నిధులు, నియామకాల నినాదాన్ని టీఆర్ఎస్ నీరుగార్చిందని మల్లు రవి, దాసోజు శ్రవణ్ విమర్శించారు. టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేయకున్నా సభ్యులు, చైర్మన్ జీతాలను 3 రెట్లు పెంచుకు న్నారన్నారు. రైతును రాజు చేస్తామన్న ప్రభుత్వం వారిని బిచ్చగాళ్లు చేసిందన్నారు. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో ప్రభుత్వం భారీగా లూఠీకి పాల్పడుతోందని శ్రవణ్ ఆరోపించారు. రైతులకు రుణాలివ్వాలని, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం తీర్మానించినట్లు పేర్కొన్నారు. కర్ణాటక నుంచి తెలంగాణకు నీటి విడుదలకు పార్టీ పరంగా కృషి చేస్తామన్నారు. రాష్ట్ర పార్టీకి సాంస్కృతిక విభాగం పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని సమావేశంలో నిర్ణయించామని మల్లు రవి, శ్రవణ్ తెలిపారు. బూత్, గ్రామ, మండల, డివిజన్,జిల్లా స్థాయి, అనుంబంధ విభాగాల కమిటీలను సెప్టెంబర్ నెలాఖరులోగా భర్తీ చేయాలని సూచించామన్నారు. రాష్ట్ర కాంగ్రెస్కి సాంస్కృతిక విభాగం ఏర్పాటు చేస్తామన్నారు. పార్టీలో రీసెర్చ్ అండ్ ఎనాలసిస్ కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రాహుల్ సందేశ్ యాత్రలు నిర్వహిస్తామని, గడపగడపకూ కాంగ్రెస్ పార్టీ నినాదంతో ముందుకెళ్తామ న్నారు. 2019లో కాంగ్రెస్ పార్టీని అధికారం లోకి తీసుకురావడానికి సమావేశంలో దిశా నిర్దేశం జరిగిందన్నారు. ఇన్చార్జి కార్యదర్శి సతీశ్ జార్కోలి, సీఎల్పీ నేతలు కె.జానారెడ్డి, షబ్బీర్ అలీ, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, పార్టీ నేతలు, మాజీ మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు, జిల్లా పార్టీల అధ్యక్షులు పాల్గొన్నారు. -
నేరెళ్ల ఘటనలో తొలివేటు..
► సీసీఎస్ ఎస్సై రవీందర్ సస్పెండ్ ఆదినుంచీ వివాదాస్పదుడే.. ► ఇల్లంతకుంట నుంచి నేరెళ్ల ఘటన వరకు.. నేరెళ్ల దళితులపై పోలీసుల ‘థర్డ్డిగ్రీ’ ప్రయోగం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం కాగా.. బాధ్యుడైన సీసీఎస్ ఎస్సై బి.రవీందర్ను సస్పెండ్ చేశారు. ఈ మేరకు వరంగల్ రేంజ్ ఐజీ నాగిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఆవిర్భావం తర్వాత శాంతి భద్రతల పరిరక్షణలో జిల్లా పోలీసుల పనితీరు ప్రశంసనీయంగా ఉండగా.. నేరెళ్ల ఘటనతో అప్రతిష్టపాలైంది. సీసీఎస్ ఎస్సై రవీందర్ తీరు ఆది నుంచి వివాదాస్పదంగానే ఉంది. సిరిసిల్ల: ఇల్లంతకుంటలో ఎస్సైగా పనిచేసిన సమయంలోనే రవీందర్ వివాదాస్పదుడిగా మారాడు. ఓ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ దొరికిపోయాడు. దీంతో అక్కడి మహిళలు ఫిర్యాదు మేరకు అప్పటి డీఎస్పీ దామెర నర్సయ్య విచారణ జరిపి ఎస్పీకి నివేదిక ఇచ్చారు. దీంతో రవీందర్ ను లా అండ్ ఆర్డర్ నుంచి తప్పించి కరీంనగర్ ఎస్పీ కార్యాలయానికి సరెండర్ చేశారు. చొప్పదండిలో పనిచేస్తున్న సమయంలో న్యాయంకోసం ఠాణాకు వచ్చే మహిళల సెల్నంబర్లు తీసుకుని రహస్యంగా ఫోన్ చేసి వేధించేవాడని అపవాదు ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఆవిర్భావంతో రవీందర్ను జిల్లాకు కేటాయించారు. జిల్లా పోలీస్ బాస్తో సఖ్యతగా ఉండడంతో టాస్క్ఫోర్స్ టీంకు పర్యవేక్షకుడిగా నియమించారు. కొద్దిరోజుల క్రితం నకిలీ బంగారం విక్రయించేవారిని పట్టుకునేందుకు కర్ణాటక రాష్ట్రం వెళ్లి.. అక్కడ పోలీసులమని చెప్ప కుండానే.. మిస్ఫైర్ చేశాడు. ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. పోలీస్ బాస్ అండతో ఉత్సాహంగా పనిచేసిన రవీందర్ నేరెళ్ల ఘటనలో అత్యుత్సాహం ప్రదర్శించి.. పోలీస్మార్క్ను చూపెట్టాడు. అది ఆయన మెడకు చుట్టుకుంది. ప్రభుత్వానికి తలనొప్పి..: నేరెళ్ల ఘటనలో సిరిసిల్ల పోలీసుల తీరు ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. జూలై 2న తంగళ్లపల్లి మండలం నేరెళ్లలో ఇసుక లారీ ఢీకొని భూమయ్య మరణించిన నాటినుంచి మంత్రి కేటీఆర్ వేములవాడకు గోప్యంగా వచ్చి వెళ్లేంతవరకూ సిరిసిల్ల ప్రాంతంలో పోలీసుల తీరు చర్చకు తెరలేపింది. సీఎం కేసీఆర్ సహా హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, మంత్రి కేటీఆర్ నేరెళ్ల ఘటనను సమర్థించే ప్రయత్నం చేశారు. సమస్య జాతీయస్థాయికి వెళ్లే ప్రమాదం సమీపించడంతో సర్కారు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ఎస్సై రవీందర్పై తొలివేటు వేశారు.
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
సిరాజ్ మియా సూపర్ యార్కర్.. బ్యాటర్కు ఫ్యూజ్లు ఔట్! వీడియో
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
Advertisement