-
బంగారు అక్షరాలు పొదిగిన ఆహ్వాన పత్రిక!
మైసూరు : మైసూరు రాజుగా బాధ్యతలు స్వీకరించనున్న యదువీర్ గోపాలరాజ అరసు దత్తత స్వీకార మహోత్సవానికి బంగారంతో అక్షరాలు పొదిగిన ఆహ్వాన పత్రికను సిద్ధం చేశారు. ఒక్కో ఆహ్వాన పత్రికకు 20 వేల రూపాయలకు పైగా ఖర్చు పెట్టినట్లు సమాచారం. ఎంపిక చేసిన బంధువులు, శ్రేయోభిలాషులు, ప్రముఖులకు మాత్రమే ఈ ఆహ్వానం పంపనున్నారు. ఈ నెల 23న ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మైసూరు ప్యాలెస్లో సంప్రదాయ ప్రకారం దత్తత స్వీకార మహోత్సవం నిర్వహించనున్నారు. మైసూరు రాజ వంశీకుడిగా ఒడయార్ సోదరి గాయత్రీ దేవి మనవడు యదువీర్ గోపాలరాజ అరసును ఎంపిక చేసినట్లు శ్రీకంఠదత్త నరసింహరాజ ఒడయార్ సతీమణి రాణి ప్రమోదాదేవి ప్రకటించిన విషయం తెలిసిందే. యదువీర్ ప్రస్తుతం అమెరికాలోని బాస్టన్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రాన్ని అభ్యసిస్తున్నారు. దత్తత స్వీకారానంతరం ఆయన వారం రోజుల పాటు మైసూరులో ఉంటారు. ఆ తరువాత మళ్లీ విద్యాభ్యాసం కోసం వెళ్లిపోతారు. మైసూర్ సంస్థానం చివరి రాజైన శ్రీకంఠదత్త నరసింహరాజ వడయార్ 2013 డిసెంబరులో మరణించారు. ఆయనకు సంతానం లేకపోవడంతో ఆ సంస్థానంలో మరొకరిని నియమించలేదు.ఇప్పుడు రాణి ప్రమోదాదేవి యదువీర్ను దత్తత తీసుకుంటున్నారు.దత్తత స్వీకారం అనంతరం అతని పేరు యదువీర్ కృష్ణదత్త చామరాజ్ వడయార్గా మారుతుంది. వడయార్ వంశస్తులు దాదాపుగా 550 ఏళ్లు (1399 నుంచి 1947) మైసూర్ సంస్థానాన్ని పరిపాలించారు. ఆ ప్రాంతాన్ని ఒకే రాజవంశం అత్యధిక కాలం పరిపాలించడం అదే ప్రథమం. వీరి పరిపాలన ఎంతో సుభిక్షంగా ఉండటంతో ఆ వంశస్తులంటే మైసూర్ ప్రజలకు ఎంతో గౌరవం. ఇప్పటికీ ఆ వంశస్తులను రాజులుగానే భావిస్తారు. 1940 నుంచి 1947 మధ్యకాలంలో మైసూర్ను పాలించిన జయ చమరాజేంద్ర వడయార్కు నరసింహరాజు ఒక్కగానొక్క కుమారడు. నరసింహరాజుకు ఐదుగురు సోదరీ మణులు ఉన్నారు. వారిలో ఒక సోదరి గాయత్రిదేవి మనుమడే ఈ యదువీర్. -
వారసుని ప్రకటన
మైసూర్: రాణి ప్రమోదా దేవి వడయార్ మైసూరు రాజవంశానికి ఈ రోజు నూతన వారసుడిని అధికారికంగా ప్రకటించారు. అంబా విలాస్ ప్యాలెస్లో జరిగిన విలేకరుల సమావేశంలో రాజవంశ వారసునిగా యదువీర్ గోపాలరాజ్ అర్స్ పేరును ఆమె ప్రకటించారు. మైసూర్ సంస్థానం చివరి రాజైన శ్రీకంఠదత్త నరసింహరాజ వడయార్ 2013 డిసెంబరులో మరణించారు.ఆ తరువాత ఆయన స్థానంలో మరొకరిని నియమించలేదు. ఆయనకు సంతానం లేకపోవడంతో ఆ సంస్థానంలో కొనసాగే రాజు ఎవరనే విషయమై చాలా ఊహాగానాలు వినవచ్చాయి. ఈ రోజుతో వాటన్నిటికీ తెర పడింది. యదువీర్ గోపాలరాజ్ అర్స్ నరసింహరాజ వడయార్ సోదరి గాయత్రీ దేవి మనుమడు. త్రిపుర సుందరీదేవి, స్వరూప గోపాలరాజ్ అర్స్ కుమారుడు. యదువీర్ 12వ తరగతి వరకు బెంగళూరులో చదువుకున్నాడు. ఆ తరువాత అతను అమెరికా వెళ్లారు. ప్రస్తుతం బూస్టన్లో బిఏ చదువుతున్నారు. యదువీర్ దత్తత స్వీకార కార్యక్రమం ఈ నెల 23న జరుగుతుంది. దత్తత స్వీకారం అనంతరం అతని పేరు యదువీర్ కృష్ణదత్త చామరాజ్ వడయార్గా మారుతుంది. అయితే పట్టాభిషేక మహోత్సవం ఎప్పుడు నిర్వహించేది ఇంకా ప్రకటించలేదు. వడయార్ వంశస్తులు దాదాపుగా 550 ఏళ్లు (1399 నుంచి 1947) మైసూర్ సంస్థానాన్ని పరిపాలించారు. ఆ ప్రాంతాన్ని ఒకే రాజవంశం అత్యధిక కాలం పరిపాలించడం అదే ప్రథమం. వీరి పరిపాలన ఎంతో సుభిక్షంగా ఉండటంతో ఆ వంశస్తులంటే మైసూర్ ప్రజలకు ఎంతో గౌరవం. ఇప్పటికీ ఆ వంశస్తులను రాజులుగానే భావిస్తారు. 1940 నుంచి 1947 మధ్యకాలంలో మైసూర్ను పాలించిన జయ చమరాజేంద్ర వడయార్కు నరసింహరాజు ఒక్కగానొక్క కుమారడు. నరసింహరాజుకు ఐదుగురు సోదరీ మణులు ఉన్నారు. వారిలో ఒక సోదరి గాయవూతిదేవి మనుమడైన యదువీర్ గోపాలరాజ్ పేరుని నరసింహరాజు భార్య ప్రమోదాదేవి వారసుడిగా ప్రకటించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
క్రేజీ కాంబో.. సూపర్ ఛాన్స్ కొట్టేసిన అనుపమ
ఆ సినిమా నా జీవితాన్నే మార్చేసింది.. బన్నీ ఎమోషనల్ పోస్ట్
మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమే..!
ఇకపై రైలులో చార్ధామ్ యాత్ర!
తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
ఆటా కన్వెన్షన్ 2024: ఆకాశమే హద్దుగా సాగుతున్న నృత్య పోటీలు!
చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు
ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
పేదల పథకాలపై కూటమి కుట్ర..!
బాపట్ల లో టీడీపీ కి భారీ ఎదురుదెబ్బ.. YSRCPలో చేరిన కీలక నేత
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- Modi-CBN: దొందూ దొందే!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
Advertisement