-
ఈ టోపీ ఉంటే దోమలు దగ్గరికి కూడా రావు!
ఇక్కడ ఫొటోలో టోపీ మీద వాలిన తూనీగ కనిపిస్తోంది కదూ! అచ్చంగా తూనీగలాగానే కనిపిస్తున్నా, ఇది తూనీగ కాదు. తూనీగ ఆకారంలో రూపొందించిన పెండెంట్. ముమ్మూర్తులా తూనీగలనే పోలి ఉండే ఇలాంటి పెండెంట్లను జపానీస్ కంపెనీ ‘మికి లోకోస్’ ఇటీవల మార్కెట్లోకి తెచ్చింది. పీవీసీ మెటీరియల్తో తయారు చేసిన ఈ తూనీగ పెండెంట్లు జపాన్లోని ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. అంతేకాదు, ఈ తూనీగ పెండెంట్లతో మరో లాభం కూడా ఉంది. అదేంటంటారా? ఈ పెండెంట్లను వేసుకున్న వారికి దోమల బెడద తప్పుతోందట! వీటిని చూస్తేనే చాలు, దోమలు పరారవుతున్నట్లు జనాలు గుర్తించడంతో, వీటికి మరింతగా గిరాకీ పెరిగింది. (క్లిక్: ఈ ఇల్లుకు కరెంటు అక్కర్లేదు.. ఎందుకంటే..) -
కాఫీ పొడితో ఇలా చేస్తే దోమలు పరార్..!
దోమ కాటు వల్ల చాలా మంది అనేక అనారోగ్య సమస్యలకు గురవుతుంటారు. అసలే ఇది వర్షాకాలం. ఈ సీజన్లో మురికిగా ఉన్న ప్రదేశాల్లో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. కొన్ని రకాల దోమల కాటుS వల్ల ప్రాణాంతక వ్యాధులైన డెంగ్యూ, మలేరియా వచ్చే ప్రమాదం అధికంగా ఉంది. దోమల బెడద నుంచి విముక్తి పొందడానికి అనేక రకాల మందులు, రసాయనాలు నేడు మార్కెట్లో అందుబాటులో ఉన్నప్పటికీ, అవి ఆశించిన ఫలితాలను ఇవ్వలేక పోతున్నాయి. అంతే కాకుండా ఈ రసాయనాలు మన ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతాయి. అందువల్ల కొన్ని చిట్కాల ద్వారా దోమలను తరిమి కొట్టేయవచ్చు సులువుగా... ఇంట్లోని దోమలను తరిమికొట్టడంలో కాఫీ పొడి చాలా సమర్థంగా పని చేస్తుంది. ఇందుకోసం ముందుగా ఒక బౌల్లో నిప్పులు తీసుకుని.. అందులో ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల కాఫీ పౌడర్ను కొంచెం కొంచెంగా వేస్తే పొగ వస్తుంది. ఆ పొగ ఇల్లు మొత్తం వ్యాపించేలా చేయాలి. దాంతో ఇంట్లో దోమలు ఎక్కడున్నా బయటకు పారిపోతాయి. ఎందుకంటే, కాఫీ పొడి వాసన దోమలకు పడదు. ఒక్క దోమలనేæకాదు... ఇంకా ఏవైనా కీటకాలు ఉన్నా కూడా ఈ వాసనకు పరార్ అవుతాయి. నిన్న మొన్నటి వరకు పెద్దవాళ్లు సాయంత్రం వేళల్లోనూ, తలంటి పోసుకున్న తర్వాత కురులను ఆరబెట్టుకోవడం కోసమూ సాంబ్రాణి ధూపం వేయడం మనకు తెలిసిందే. నిప్పుల మీద వెల్లుల్లి పొట్టు వేసినా... ఎండబెట్టిన వేపాకులు వేసినా కూడా ఆ వాసనకు దోమలతోపాటు ఇతర కీటకాలు కూడా పారిపోతాయి. తులసి మొక్క.. ప్రతి భారతీయుని ఇంట్లో తులసి మొక్క ఉంటుంది. ఈ తులసి మొక్క ద్వారా ఎన్నో రకాల ప్రయోజనాలున్నాయి. ఇది దోమల లార్వా, ఇతర కీటకాలను చంపడానికి చాలా సహాయపడుతుంది. తులసి వాసన కీటకాలు, దోమలను దరి చేరనివ్వకుండా చేస్తుంది. గుల్ మెహందీ మొక్క.. గుల్ మెహందీని మనం రోజ్మేరీ అని కూడా పిలుస్తారు. ఈ మొక్క దోమలు, ఇతర కీటకాలను దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఈ మొక్క పువ్వులు చాలా ఘాటైన వాసన కలిగి ఉంటాయి కాబట్టి దోమలను, కీటకాలను దూరంగా ఉంచేందుకు సహాయపడుతుంది. పుదీనా.. వేసవిలో ఇంట్లో తయారు చేసే దాదాపు ప్రతి వస్తువులో పుదీనాను వాడతారు. పుదీనాలోంచి వచ్చే వాసన కీటకాలను, దోమలను తరిమికొట్టడానికి పనిచేస్తుంది కాబట్టి ఇంటి పెరటిలో లేదా కనీసం కుండీలలో అయినా పుదీనాను పెంచుకోవడం మంచిది. వాటినుంచి వచ్చే వాసన మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తుంది. బంతి మొక్క.. బంతి పువ్వును ప్రతి శుభకార్యంలో అలంకరణకు వాడతారు. దీనిని ఇంగ్లీష్లో మేరిగోల్డ్ అంటారు. దీనిని వివిధ దేశాలలో వివిధ రకాలుగా పిలుస్తారు. ఈ మొక్క ఆకులు, పువ్వుల నుంచి వెలువడే వాసన ఈగలు, దోమలు, ఇతర కీటకాలను దూరం చేస్తుంది. నిమ్మ గడ్డి మొక్క.. నిమ్మ గడ్డి మొక్క గురించి చాలా మందికి తెలుసు. ఈ మొక్క ఘాటైన వాసనతో ఉంటుంది. దీనిని పెంచుకోవడం వల్ల ఇంటి నుంచి దోమలను తరిమికొట్టడానికి సహాయపడుతుంది. అసలు దోమలు చేరకుండా ఉండాలంటే ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో చెత్త డబ్బాలో ఉన్న చెత్తను క్రమం తప్పకుండా పారేస్తుండాలి. తులసి, బంతి, లావెండర్.. వంటి మొక్కలను ఇంటి చుట్టూ కుండీల్లో పెంచుకోవాలి. ఈ మొక్కలు ఉంటే దోమలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. ఇక వేప నూనె, కొబ్బరి నూనె కలిపి.. రోజూ సాయంత్రం శరీరానికి రాసుకోవాలి. దాంతో ఆయా నూనెల వాసనకు దోమలు దగ్గరకు రాకుండా ఉంటాయి. -
తెల్లదోమ నియంత్రణకు జాతీయ స్థాయి పరిశోధనలు అవసరం
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా కొబ్బరి, ఆయిల్పామ్, మామిడి, అరటి, బొప్పాయి, సీతాఫలం, కోకో పంటలను దెబ్బతీస్తున్న సర్పలాకార తెల్లదోమ (రుగోస్ స్పైరల్లింగ్ వైట్ఫ్లై) నియంత్రణకు విస్తృత పరిశోధనలు నిర్వహించేలా బాధిత రాష్ట్రాలతో కలిసి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాజెక్టు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఏపీ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి స్పష్టం చేశారు. తెల్లదోమ ప్రభావంతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్న తమిళనాడు రాష్ట్రంలో తీసుకుంటున్న నియంత్రణ చర్యలను పరిశీలించేందుకు నాగిరెడ్డి నేతృత్వంలోని బృందం కోయంబత్తూరులోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఆ రాష్ట్ర శాస్త్రవేత్తలతో బుధవారం భేటీ అయింది. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ.. తెల్లదోమ ప్రభావంతో మన రాష్ట్రంలో 2019–20లో 21,966 హెక్టార్లు, 2020–21లో 35,875 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కొబ్బరి, ఆయిల్పామ్, నెల్లూరు జిల్లాలో అరటిపై ఈ దోమ ఎక్కువగా ఆశించినట్టు గుర్తించామన్నారు. ఇది జూన్, జూలై, ఆగస్టు నెలల్లో తగ్గిపోతున్నప్పటికీ.. తిరిగి సెప్టెంబర్లో మొదలై డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. ఈ విషయాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా విస్తృత పరిశోధనలు చేయాలని ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ను ఆదేశించారన్నారు. ఉద్యాన వర్సిటీ అభివృద్ధి చేసిన జీవ నియంత్రణ చర్యల వల్ల 20 శాతానికి మించి నియంత్రించలేకపోతున్నారన్నారు. బయో కంట్రోలింగ్, ఆముదం రాసిన ఎల్లోపాడ్స్ ఎక్కువగా సిఫార్సు చేస్తున్నామని, పురుగుల మందులను అజాడిరక్టిన్తో కలిపి వాడొద్దని సూచిస్తున్నారని చెప్పారు. పెద్దఎత్తున బదనికలను సరఫరా చేయాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక పథకాన్ని ప్రకటించి ఆర్థిక చేయూత ఇవ్వాల్సిన అవసరం ఉందని నాగిరెడ్డి స్పష్టం చేశారు. -
ఇక మస్కిటోలు.. మస్కా ‘కుట్ట’లేవు!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ నగరవాసుల్ని దోమలు ఎడాపెడా కుట్టి పారేశాయి. డెంగీ కేసులు పెరిగిపోయాయి. దీంతో ఏకంగా హైకోర్టు జోక్యం చేసుకుని రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు సహా పలువురిని తన ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. దోమల నివారణ చర్యలు తీసుకోకుంటే చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అధికారులు చర్యలకు దిగారు. ఏ ప్రాంతంలో డెంగీ కారక దోమలు ఎక్కువున్నాయో గుర్తించేందుకు ప్రయోగాత్మకంగా ‘మస్కీట్’అనే ఉపకరణాలను శేరిలింగంపల్లి జోన్ మినహా మిగతా ఐదు జోన్లలోని ఐదు ప్రాంతాల్లో అమర్చారు. వీటి ద్వారా వెల్లడయ్యే లెక్కలతో ఆయా ప్రాంతాల్లోని దోమల రకాల్ని గుర్తిస్తారు.ఆపై నివారణ చర్యలు చేపడతారు. ‘మస్కీట్’లు ఎక్కడెక్కడ? సికింద్రాబాద్ జోన్– బేగంపేట కూకట్పల్లి జోన్– బోరబండ ఎల్బీనగర్ జోన్– నాచారం చార్మినార్ జోన్– మలక్పేట ఖైరతాబాద్ జోన్– జీహెచ్ఎంసీప్రధాన కార్యాలయం 902: గ్రేటర్లో సెపె్టంబర్ 5 – అక్టోబర్ 30 మధ్య ప్రభుత్వాస్పత్రుల్లో నమోదైన డెంగీ కేసులు 1,415: ప్రైవేట్ ఆస్పత్రుల్లోధ్రువీకరించిన డెంగీ అనుమానిత కేసులు బేగంపేటలో దోమల బెడద ఎక్కువ.. మస్కీట్ ఉపకరణాల్లోకి చేరిన దోమలను లెక్కించడం ద్వారా డెంగీని వ్యాపించే దోమలు బేగంపేట, నాచారం ప్రాంతాల్లో ఎక్కువున్నట్టు గుర్తించారు. బోరబండ, మలక్పేట తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. డెంగీ, చికున్గున్యా కు కారణమైన ఈడిస్ ఈజిప్టి, ఈడిస్ అల్బోపిక్టస్ తెగలకు చెందిన దోమలు, మలేరియా కారకాలైన అనాఫిలిస్ సబ్పిక్టస్, అనాఫిలిస్ క్యూలిసిఫేసీస్ కూడా బేగంపేట లోనే ఎక్కువ. మెదడువాపు, బోదకాలు వ్యాధులకు కారణమైన క్యూలెక్స్ క్వింక్లకు సైతం బేగంపేటనే అడ్డా.. తరువాత స్థానంలో బోరబండ ఉంది. ఖైరతాబాద్ జోన్ పరిధిలోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం పరిసరాల్లో మాత్రం అన్ని రకాల దోమలూ స్వల్ప సంఖ్యలోనే ఉన్నాయి. ఐదుచోట్ల లెక్కలతో అంచనా కష్టం వివిధ రకాల దోమలు సికింద్రాబాద్ జోన్ పరిధిలోనే ‘మస్కీట్’కు ఎక్కువగా చిక్కాయి. ఇంత పెద్ద మహానగరంలో ఐదు ప్రాంతాల్లోని లెక్కల ఆధారంగా దోమల రకాలను అంచనా వేయడం కష్టమని జీహెచ్ఎంసీ చీఫ్ ఎంటమాలజిస్ట్ డాక్టర్ రాంబాబు తెలిపారు. దాదాపు వంద ప్రాంతాల్లో ఇటువంటివి ఏర్పాటైతే ఏ వ్యాధికారక దోమలు ఎక్కువున్నాయో స్పష్టత వస్తుందన్నారు. ప్రస్తుతం ఉపకరణాలు బిగించిన ప్రాంతాల్లో ఏ రకం దోమలు ఎక్కువున్నాయో గుర్తించి, నివారణ చర్యలు తీసుకుంటామన్నారు. నెల పాటు అధ్యయనం తరువాత ‘మస్కీట్’లెక్కలపై స్పష్టత వస్తుందన్నారు. ‘మస్కీట్’ఇలా పని చేస్తుంది.. మస్కీట్ ఉపకరణాల్లో లిక్విడ్, సెన్సర్లతో పాటు ఉండే ప్రత్యేక వాసనలు వదులుతారు. వీటికి దోమలు ఆకర్షితమై ఉపకరణాల్లోకి చేరతాయి. మస్కీట్కు అనుసంధానించిన కంప్యూటర్ డ్యాష్బోర్డు ఆధారంగా ఇలా చేరిన దోమల్లో రకానివెన్నో విశ్లేషిస్తారు. ఆయా ప్రాంతాల్లో ఏయే వేళల్లో దోమల తీవ్రత ఎక్కువ ఉంటుందో కూడా అంచనా వేయవచ్చు. ఒక్కో మస్కీట్ ఉపకరణానికి జీహెచ్ఎంసీ రూ.70 వేల చొప్పున వెచ్చించింది. ఈ యంత్రాలం వినియోగం ద్వారా మొదట ఆయా ప్రాంతాల్లోని దోమల రకాలను గుర్తిస్తారు. తద్వారా ఆయా దోమకారక వ్యాధుల నివారణకు చర్యలు తీసుకుంటారు. -
దోమల నివారణకు డ్రోన్ టెక్నాలజీ
సాక్షి, హైద్రాబాద్ : నగరంలో ఆధునాతన టెక్నాలజీ ఉపయోగించి చెరువులు, నాలాల సుందరీకరణ పనులు చేపడుతున్నామని మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. శుక్రవారం మియాపూర్ గుర్నాధం చెరువులో దోమల నివారణకు డ్రోన్ టెక్నాలజీతో యాంటీ లార్వా మందు పిచికారీ పనులను జీహెచ్ఎంసీ చేపట్టింది. ఈ కార్యక్రమానికి మేయర్తోపాటు ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్లు మేక రమేష్, నాగేందర్ యాదవ్ పాల్గొన్నారు. మేయర్ మాట్లాడుతూ సిబ్బందికి వీలుకాని చోట డ్రోన్లతో మందుల పిచికారీ, గుర్రపు డెక్క తొలగింపునకు చర్యలు తీసుకుంటున్నామని, రానున్న రోజుల్లో నగరమంతా ఇదే టెక్నాలజీ ఉపయోగిస్తామని తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పక్కాగా పరిశీలన..
జనజాతర సభ సైడ్లైట్స్
కాంగ్రెస్కు అండగా ఉండాలి..
తలసేమియాపై అవగాహన
కాంగ్రెస్కు ఓటేస్తే దండగ
పకడ్బందీగా ఈవీఎంల కమిషనింగ్
నాణ్యమైన విద్యుత్ తీగలు వినియోగించాలి
‘వంశీని గెలిపిస్తే జిల్లా పేరు మారుస్తారు’
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement