-
మైనార్టీ స్కాలర్షిప్ల వెబ్సైట్ హ్యాక్!
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వానికి చెందిన మైనార్టీ విద్యార్థుల స్కాలర్షిప్ వెబ్సైట్ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. కాలేజీ యాజమాన్యాలకు తెలియకుండానే వాటి లాగిన్ ఐడీ ద్వారా విచ్చలవిడిగా దరఖాస్తులు చేశారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా లక్షల్లో. ఏటా వచ్చే దరఖాస్తుల కంటే సుమారు 80లక్షలు అదనంగా వచ్చాయి. దీంతో అనుమానం వచ్చిన కేంద్ర మైనార్టీ సంక్షేమ శాఖ రీవెరిఫికేషన్ నిమిత్తం ఆ నకిలీ దరఖాస్తుల గురించి ఆయా రాష్ట్రాలను అప్రమత్తంచేసి వాటిని ఆన్లైన్లో తిప్పి పంపింది. మన రాష్ట్ర ప్రభుత్వం దీనిపై విచారిస్తే అనేక విషయాలు బయటపడ్డాయి. అవి ఏమిటంటే.. ►రాష్ట్రంలోని పలు కాలేజీలు, స్కూళ్లలో పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు చదువుతున్నట్లు ఉపకార వేతనాలకు దరఖాస్తులు చేశారు. ►ఇలా విజయవాడలోని పలు శ్రీ చైతన్య కాలేజీల నుంచి సుమారు వెయ్యి మంది మైనార్టీ విద్యార్థుల పేర్లతో నకిలీ దరఖాస్తులు వెళ్లాయి. ►అలాగే, విజయవాడలోని మరో హైస్కూలు నుంచి 150 మంది మైనార్టీ విద్యార్థుల పేర్లతో దరఖాస్తులు చేశారు. నిజానికి ఈ స్కూలులో మైనార్టీ విద్యార్థులు ఒక్కరు కూడా దరఖాస్తు చేయలేదు. ►ఇలా ఏపీ నుంచి మొత్తం 3లక్షల నకిలీ దరఖాస్తులు వెళ్లాయి. ►ఇవన్నీ ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల అడ్రస్లతో ఏపీలోని కాలేజీలు, స్కూళ్ల నుంచి దరఖాస్తులు చేసినట్లు రికార్డ్ అయింది. దీంతో కాలేజీ యాజమాన్యాలను పిలిపించి వారి స్కూలు నుంచి ఎంతమంది మైనార్టీ విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారనే వివరాలు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు సేకరిస్తున్నారు. వెబ్సైట్ ఓపెన్ చేసి కాలేజీ నుంచి వెళ్లిన అసలైన దరఖాస్తులు మాత్రమే ఉంచి మిగిలిన వాటిని తొలగిస్తున్నారు. అసలు తాము దరఖాస్తే చేయకుండా తమ స్కూలు నుంచి దరఖాస్తు చేసినట్లు వెబ్సైట్లోకి ఎలా వచ్చాయో అర్థంకావడం లేదని యాజమాన్యాలు చెబుతున్నట్లు అధికారులు తెలిపారు. ఎవరెవరికి ఇస్తారంటే.. మైనార్టీ విద్యార్థులు కేంద్ర స్కాలర్షిప్ల కోసం వెబ్సైట్లో నేరుగా కాలేజీల నుంచి దరఖాస్తులు చేసుకుంటారు. మంజూరు కాగానే స్కాలర్షిప్ డబ్బులు నేరుగా విద్యార్థి అకౌంట్కు ఆన్లైన్ ద్వారా జమ అవుతాయి. ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, పారసీలు, జైనులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. రూ.లక్షలోపు ఆదాయం ఉన్న విద్యార్థులకు ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ల కింద 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు రూ.వెయ్యి, 6–10వ తరగతి విద్యార్థులకు రూ.5,000లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అలాగే, పోస్టు మెట్రిక్ స్కాలర్షిప్ల కింద ఇంటర్మీడియెట్ వారికి రూ.6,000లు, అండర్ గ్రాడ్యుయేట్స్కు రూ. 6,000లు నుంచి 12,000ల వరకు ఇస్తారు. వీరికి రూ. 2లక్షల లోపు ఆదాయం ఉండాలి. ప్రొఫెషనల్ కోర్సులు, సాంకేతిక విద్యా కోర్సులు చదువుతున్న వారికి రూ.25 వేల నుంచి రూ.30వేల వరకు ఏటా ఇస్తారు. వీరికి సంవత్సర ఆదాయం రూ.2.5 లక్షలకు మించకుండా ఉండాలి. సైబర్ నేరగాళ్ల పని.. వెబ్సైట్ను హ్యాక్ చేయడం ద్వారా సైబర్ నేరగాళ్లు కాలేజీల లాగిన్ ఐడీలు తెలుసుకుని నకిలీ పేర్లతో దరఖాస్తులు చేసినట్లు అధికారులు భావిస్తున్నారు. అలాగే, కొందరు కాలేజీల యజమానులు కాలేజీ నుంచి విద్యార్థులతో దరఖాస్తులు చేయకుండా ఇంటర్నెట్ సెంటర్ల వారికి అప్పగించి వారికి కాలేజీ లాగిన్ ఐడీ చెప్పడంవల్ల కూడా దుర్వినియోగం చేసి ఉండవచ్చని కేంద్ర ప్రభుత్వం అనుమానిస్తోంది. ఇలాంటి కాలేజీలు, స్కూళ్లను గుర్తించి చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీనిపై సమగ్రమైన దర్యాప్తుకు కేంద్రం ఆదేశించనుంది. -
మైనార్టీలకు స్కాలర్షిప్ గడువు పెంపు
హైదరాబాద్: మైనార్టీ విద్యార్థులు ఉపకార వేతనాలకు దరఖాస్తులు చేసుకునే గడువును పొడిగించినట్లు రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డెరైక్టర్ షఫీయులా తెలిపారు. ప్రీ మెట్రిక్, పోస్టు మెట్రిక్, మెరిట్ కమ్ స్కాలర్షిప్ కోసం అక్టోబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement