-
7.5 కిలోల కాలేయ కణితి తొలగింపు
హైదరాబాద్: నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) ఆస్పత్రి ప్రపంచంలోనే అరుదైన శస్త్రచికిత్సకు వేదికైంది. ఓ మహిళ కాలేయంలో 7.5 కిలోల బరువు, 45 సెంటీమీటర్ల పొడవున్న భారీ కణితిని వైద్యులు విజయవంతంగా తొలగించారు. కాలేయం నుంచి ఇంతపెద్ద కణితి తొలగించడం ప్రపంచంలో మొదటిసారని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చేసిన ఈ శస్త్రచికిత్స వివరాలను నిమ్స్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగాధిపతి డాక్టర్ బీరప్ప వెల్లడించారు. వరంగల్ జిల్లా ఖానాపేట మండలం బుజరావుపేటకు చెందిన వసంత 2011 నుంచి కడుపునొప్పితో సతమతమవుతోంది. గతంలో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్నా ఫలితం కనిపించలేదు. కణితి రోజురోజుకూ పెరుగుతుండడంతో నడవడం ఆమెకు ఇబ్బందిగా మారింది. వసంత బరువు 54 కిలోలు కాగా కడుపులో ట్యూమర్ ఏడున్నర కిలోలు ఉండడంతో తీవ్రంగా ఇబ్బంది పడింది. సమస్య తీవ్రం కావడంతో నాలుగు రోజుల క్రితం నిమ్స్లో డాక్టర్ బీరప్పను కలిశారు. వైద్యపరీక్షలు నిర్వహించగా కాలేయానికి కణితి ఉన్నట్లు తేలింది. సోమవారం డాక్టర్ బీరప్ప బృందం నాలుగు గంటలు కష్టపడి కణితిని విజయవంతంగా తొలగించింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని, వారం రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు. గతంలో 35 సెంటీమీటర్ల కణితిని వైద్యులు తొలగించారని, ప్రపంచంలోనే మొదటిసారిగా ఇప్పుడు 45 సెంటీమీటర్ల ట్యూమర్ను తొలగించామని డాక్టర్ బీరప్ప పేర్కొన్నారు. ఈ శస్త్రచికిత్సను ప్రైవేట్లో చేయించుకుంటే సుమారు రూ.4 లక్షలు ఖర్చు అయ్యేదని చెప్పారు. -
మళ్లీ మాకే ప్రజల పట్టం
కేసీఆర్ పథకాలతో అడ్రస్ గల్లంతవుతుందని కాంగ్రెస్కు భయం: లక్ష్మారెడ్డి జడ్చర్ల కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్లో చేరిక సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లోనూ ప్రజలు తమ పార్టీకే పట్టం కడతారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అందుకు 75 లక్షలు దాటిన టీఆర్ఎస్ సభ్యత్వమే సజీవ సాక్ష్యమన్నారు. గురువారం హైదరాబాద్లోని మంత్రుల నివాస సముదాయ సమావేశ మందిరంలో మంత్రులు లక్ష్మారెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డిల సమక్షంలో మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ మాజీ జెడ్పీటీసీ సభ్యు లు, ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, పలువురు నేతలు టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో ప్రతి కుటుంబం లబ్ధి పొందు తోందన్నారు. టీఆర్ఎస్ విధానాలు, చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు నచ్చి అనేక మంది తమ పార్టీలో చేరుతున్నారన్నారని, వారిని స్వాగతిస్తున్నామన్నారు. గతంలో జడ్చర్లలో గ్రామాల మధ్య రోడ్లు కూడా లేవని, ఇప్పుడు అన్ని గ్రామాలకు తారు రోడ్లేగాక అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం జరిగి ఆయా గ్రామాలు అభివృద్ధి పథంలో ఉన్నాయని వివరించారు. ఈ అభివృద్ధిని చూసి ఓర్వలేక, తమకిక అధికారం దక్కదనే బెంగతో కాంగ్రెస్ పార్టీ కుయుక్తులు పన్నుతోందని లక్ష్మారెడ్డి విమర్శించారు. రాష్ట్రంలోని 97 లక్షల కుటుంబాల్లో 40 లక్షల కుటుంబాలకు పెన్షన్లు అందిస్తున్న సర్కార్ తెలంగాణ ఒక్కటేనన్నారు. ప్రభుత్వ పనితీరు, కేసీఆర్ దీక్షాదక్షలతో బంగారు తెలంగాణ అవుతుంటే...తమ అడ్రస్ గల్లంతవుతుందన్న భయంతో కాంగ్రెస్ ఆగమాగమవుతోందన్నారు. స్వచ్ఛందంగా టీఆర్ఎస్లోకి వస్తున్న కార్యకర్తలు, నేతలకు మంత్రి పోచారం స్వాగతం పలికారు. కార్యక్రమంలో మంత్రులతోపాటు మహ బూబ్నగర్ పాత జిల్లా అధ్యక్షుడు శివకుమార్, జడ్చర్లకు చెందిన పలువురు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
పాలమూరులో హరీశ్ హల్చల్
ప్రాజెక్టుల ఆకస్మిక తనిఖీ ఉరుకులు, పరుగులు పెట్టిన అధికారులు సాక్షి, నాగర్కర్నూల్: భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్రావు మంగళవారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో హల్చల్ చేశారు. ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ఆయన ప్రాజెక్టులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనుల పురోగతిని పరిశీలించారు. విషయం తెలుసుకున్న అధికారులు ఉరుకు లు పరుగులు పెట్టారు. కనీసం జిల్లా కలెక్టర్కు కూడా సమాచారం ఇవ్వలేదంటే మంత్రి తన పర్యటన గురించి ఎంత గోప్యంగా ఉంచారో ఇట్టే అర్థం అవుతోంది. హరీశ్రావు ముందుగా మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల మొదటి పంపుహౌస్ను సందర్శించారు. మంత్రి లక్ష్మారెడ్డి, ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నిరంజన్రెడ్డి, నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి తదితరులతో కలసి క్రేన్ సాయంతో 300 మీటర్ల కింద ఉన్న పంపింగ్ హౌస్ వద్దకు వెళ్లి పరిశీలించారు. ప్రస్తుతం రెండు పంపులు మాత్రమే పనిచేస్తున్నాయని, మరొ క దానిని ఖరీఫ్లో ప్రారంభించి పూర్తి ఆయ కట్టుకు నీరందిస్తామని చెప్పారు. అలాగే, కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్వహించిన గుడిపల్లి గట్టు, జొన్నలబొగుడ రిజర్వాయర్లను ఆయన పరిశీలించారు. ఇం దుకు సంబంధించి మూడో పంపు ప్రారం భిస్తే ప్రస్తుతం ఉన్న కాలువలు తట్టుకుంటా యా, రిజర్వాయర్లలో ఏ మేరకు నీటిని నిల్వ ఉంచాలన్న విషయాలపై హరీశ్రావు ఇంజనీరింగ్ అధికారులతో చర్చించారు. వచ్చే ఖరీఫ్ నాటికి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పూర్తి ఆయకట్టు అయిన 3లక్షల 50 వేల ఎకరాలకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామని హరీశ్రావు ప్రకటించారు. అనంతరం ఆయన పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. సత్వరం పనులు చేపట్టాలని ఆదేశించారు. పాలమూరు పనులు ఆగవు పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకునేందుకు ఎవరెన్ని కుట్రలు చేసినా పనిచేయవని, అనుకున్న గడువులోగా పూర్తి చేస్తామని మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్కు చెందిన ఓ నాయకుడు ఇదే ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని తెలిసినా ప్రాజెక్టుకు న్యాయపరమైన చిక్కులు తీసుకొస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా నిబంధనలకు విరుద్ధంగా పనిచేయడం లేదని, తాగు, సాగునీటి అవసరాలకు ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ఉపయోగ పడుతుందని పేర్కొన్నారు. -
'నర్సుల డెరైక్టరేట్ను ఏర్పాటు చేస్తాం'
సుల్తాన్బజార్: తెలంగాణలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న వెయ్యి నర్సుల పోస్టులను భర్తీ చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం కోఠిలోని ఐఎంఏ ఆడిటోరియంలో తెలంగాణ రాష్ట్ర నర్సుల అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి లక్ష్మారెడ్డి హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... వైద్య రంగంలో నర్సుల పాత్ర కీలకమైందన్నారు. నర్సుల డెరైక్టరేట్ను ఏర్పాటు చేస్తామని, కాంట్రాక్ట్ నర్సులను పర్మినెంట్ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. నర్సింగ్కు సంబంధించి స్పెషలైజేషన్ కోర్సులను ప్రవేశపెడతామని చెప్పారు. -
నేటి నుంచి ఆరోగ్యశ్రీ బంద్
► సేవలు నిలిపివేయాలని ఆస్పత్రి యూజమాన్యాల నిర్ణయం ► బిల్లులు చెల్లించకపోవడమే కారణం.. ఎంజీఎం : జిల్లా వ్యాప్తంగా ఉన్న 22 నెట్వర్క్ ఆస్పత్రులకు తొమ్మిది నెలలుగా ఆరోగ్య శ్రీ బిల్లులు ప్రభుత్వం నుంచి అందలేదు. దీనికి నిరసనగా సోమవారం నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ఆస్పత్రుల ప్రతినిధులు ప్రవీణ్రెడ్డి, సుధీర్, కరుణాకర్రెడ్డి ప్రకటించారు. పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే సేవలు నిలిపివేస్తామని ఏప్రిల్ 22వ తేదీనే ప్రకటించామని, అరుుతే అదే నెల 18వ తేదీన వైద్యారోగ్య శాఖా మంత్రి లక్ష్మారెడ్డి హామీ మేరకు ఆ నిర్ణయాన్ని ఈ నెల 2వ తేదీకి వాయిదా వేశామని తెలిపారు. మంత్రి హామీ నెరవేరకపోవడంతో సోమవారం నుంచి సేవలు నిలిపివేయూలని నిర్ణరుుంచినట్లు స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే ఇంతకాలం తాము అనేక విధాలుగా ప్రయత్నించామని, అరుునా ప్రభుత్వం స్పందించలేదని ఆరోపించారు. గత్యంతరం లేక ఆస్పత్రులు మూసివేసే పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేసి ప్రత్యక్ష ఆందోళనకు తెరదీశామని తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement