-
సూక్ష్మ సేద్యం.. విస్తరణే లక్ష్యం
సాక్షి, అమరావతి: సూక్ష్మసేద్యాన్ని విస్తరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 2022–23లో లక్ష్యానికి మించి తుంపర, బిందు సేద్య పరికరాలు అందించగా.. 2023–24లో రూ.902 కోట్లను వెచ్చించి కనీసం 2.5 లక్షల ఎకరాల్లో విస్తరణకు శ్రీకారం చుట్టింది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా పరికరాల పంపిణీ ప్రారంభించింది. లక్ష్యానికి మించి పంపిణీ సూక్ష్మ సేద్యంలో దేశంలోనే మన రాష్ట్రం నాలుగో స్థానంలో ఉండగా.. టాప్–20 జిల్లాల్లో ఐదు జిల్లాలు మన రాష్ట్రంలోనే ఉన్నాయి. ఇటీవలే నూరు శాతం బోర్ల కింద బిందు, తుంపర పరికరాలు అమర్చిన గ్రామంగా వైఎస్సార్ జిల్లా పులివెందుల మండలం ఈ.కొత్తపల్లి గ్రామానికి జాతీయ పురస్కారం దక్కించుకుంది. రాష్ట్రంలో 12.62 లక్షల మంది రైతులు 35.50 లక్షల ఎకరాల్లో సూక్ష్మ సేద్యం చేస్తుండగా, ఏటా 2.50 లక్షల ఎకరాల చొప్పున మరో 18.65 లక్షల ఎకరాల్లో విస్తరణకు కార్యాచరణ సిద్ధం చేశారు. టీడీపీ ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.936 కోట్ల బకాయిలు చెల్లించడంతో రాష్ట్రంలో సూక్ష్మసేద్యం విస్తరణ వేగం పుంజుకుంది రాష్ట్రంలో 5 ఎకరాల్లోపు రైతులకు 90 శాతం, రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో 5–10 ఎకరాల్లోపు రైతులకు 70 శాతం, ప్రకాశం మినహా కోస్తా జిల్లాల్లో 5–12.5ఎకరాల్లోపు రైతులకు 50 శాతం రాయితీగా ప్రభుత్వం భరిస్తోంది. 2022–23లో 1.87 లక్షల ఎకరాల్లో విస్తరించాలని లక్ష్యం కాగా.. రికార్డు స్థాయిలో 82,289 మంది రైతులకు చెందిన 2.26 లక్షల ఎకరాల్లో విస్తరించారు. వీటికోసం రైతులు తమ వాటాగా రూ.174 కోట్లు చెల్లించగా, ప్రభుత్వం సబ్సిడీ రూపంలో రూ.465 కోట్లు భరించింది. 2023–24లో 2.50 లక్షల ఎకరాల్లో విస్తరణ 2023–24లో రూ.902 కోట్ల అంచనా వ్యయంతో 2.50 లక్షల ఎకరాల్లో విస్తరించాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నారు. అంచనా మొత్తంలో రైతుల వాటా రూ.145 కోట్లు కాగా, సబ్సిడీ రూపంలో రూ.757 కోట్లు ప్రభుత్వం భరించనుంది. ఏప్రిల్ నుంచి ఆర్బీకేల ద్వారా రైతుల రిజిస్ట్రేషన్లకు శ్రీకారం చుట్టి ఇప్పటివరకు 5.07లక్షల ఎకరాల్లో బిందు, తుంపర పరికరాల అమరిక కోసం 1.72 లక్షల మంది రైతులు తమ వివరాలను నమోదు చేసుకున్నారు. అవసరం ఉన్న వారికి అర్హత ఉంటే చాలు ఎలాంటి సిఫార్సులు లేకుండా క్షేత్రస్థాయి పరిశీలనలో అర్హుల ఎంపిక చేపట్టారు. ప్రాథమిక పరిశీలనలో ఇప్పటివరకు 1.55 లక్షల ఎకరాల్లో సర్వే చేయగా.. 1.45 లక్షల ఎకరాల్లో ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు. పండగ వాతావరణంలో పరికరాల పంపిణీ 45,255 ఎకరాల్లో ఏర్పాటు కోసం 16,630 మంది రైతులు తమ వాటా సొమ్మును చెల్లించారు. 10,556 మంది రైతులకు చెందిన 29,070 ఎకరాల్లో అమర్చేందుకు అవసరమైన బిందు, తుంపర పరికరాల పంపిణీకి శనివారం శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ జిల్లా పులివెందులలో రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బిందు, తుంపర పరికరాల వాహనాలకు జెండా ఊపి ప్రారంభించారు. అదేవిధంగా రాయలసీమలోని పలు జిల్లాల్లో స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో పరికరాల పంపిణీ పండుగ వాతావరణంలో ప్రారంభమైంది. -
3 పంటలకు నూరు శాతం సూక్ష్మసేద్యం
- పామాయిల్, పసుపు, చెరకు భూములన్నింటికీ ఇవ్వాలని ఉద్యానశాఖ నిర్ణయం - ఈ ఏడాది రూ. వెయ్యి కోట్లతో 2 లక్షల ఎకరాల్లో పథకం అమలు - అక్రమాలు జరగకుండా దేశంలోనే మొదటిసారిగా జియోఫెన్సింగ్ సాక్షి, హైదరాబాద్: పామాయిల్, పసుపు, చెరకు సాగు చేసే భూములన్నింటినీ సూక్ష్మసేద్యం పరిధిలోకి తీసుకురావాలని తెలంగాణ ఉద్యానశాఖ నిర్ణయించింది. ఈ ఏడాది పెద్ద ఎత్తున సూక్ష్మసేద్యం పథకాన్ని రైతుల వద్దకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం నాబార్డు నుంచి రూ. వెయ్యి కోట్ల రుణం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ సొమ్ముతో ఈ ఏడాది 2 లక్షల ఎకరాలకు సూక్ష్మసేద్యాన్ని అందుబాటులోకి తేవాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. దీనిప్రకారం అన్ని పంటలకు పూర్తిస్థాయిలో సూక్ష్మసేద్యం అందజేయడం అసాధ్యమైనందున తక్కువ విస్తీర్ణంలో సాగులో ఉన్న పంటలపై దృష్టి పెట్టి వాటికి పూర్తిస్థాయిలో సూక్ష్మసేద్యాన్ని ఇవ్వాలని నిర్ణయించింది. అలా ఏటా కొన్ని పంటలను లక్ష్యంగా పెట్టుకొని సూక్ష్మసేద్యాన్ని పూర్తిస్థాయిలో విస్తరించడం ద్వారా అన్ని పంట భూములనూ కవర్ చేయాలని ఉద్యానశాఖ యోచిస్తోంది. అయితే మిగిలిన పంటలు సాగు చేసే రైతులకు సూక్ష్మసేద్యం పరికరాలు ఇవ్వకూడదన్న నిబంధన ఏమీ పెట్టుకోలేదని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పసుపు సాగు చేసే రైతులు అనేకమంది సూక్ష్మసేద్యం కలిగివున్నారు. చెరకు, పామాయిల్ భూములకూ అధికంగా ఇవ్వాల్సి ఉంది. దీనికి సంబంధించి కార్యాచరణ ప్రణాళిక రచించారు. జియోఫెన్సింగ్ ద్వారా వివరాలు నిక్షిప్తం... సూక్ష్మసేద్యం ఏర్పాటు చేసుకునే ఎస్సీ, ఎస్టీలకు నూటికి నూరు శాతం సబ్సిడీ ఇస్తారు. బీసీలు, ఇతర పేదలకు 90 శాతం, ఓసీలకు 80 శాతం సబ్సిడీ ఇస్తారు. దేశంలో ఇంత సబ్సిడీ ఇచ్చే రాష్ట్రం కూడా మనదే కావడం గమనార్హం. ఈసారి ఉద్యానశాఖ సూక్ష్మసేద్యంపైనే దృష్టిసారించనుంది. ఇప్పటి కే సూక్ష్మసేద్యం కోసం 38 వేల మంది రైతులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఆధార్ కార్డు, పాస్బుక్ వివరాలతోపాటు బయోమెట్రిక్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఎట్టి పరిస్థితు ల్లోనూ పథకం దుర్వినియోగం కాదని ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు. సూక్ష్మసేద్యం ఏర్పాటు చేసేందుకు 25 కంపెనీలకు అవకాశం కల్పించారు. వాటిల్లో రైతులు వారికి ఇష్టమైన కంపెనీని ఎంపిక చేసుకోవచ్చు. సూక్ష్మసేద్యం పొందిన రైతు పొలంలో ఆయా పరికరాలను బిగించాక సమయం, తేదీ తెలిపేలా డిజిటల్ ఫొటోలు తీయడంతోపాటు దేశంలోనే తొలిసారిగా భూమిని జియో ఫెన్సింగ్ చేయనున్నారు. దీనివల్ల గూగుల్ మ్యాప్లో సూక్ష్మసేద్యం పొందిన రైతు భూమి, సర్వే నంబర్ సహా పూర్తి వివరాలను చూసుకోవచ్చు. అలాగే అక్రమాలకు అడ్డుకట్ట వేయొచ్చు. ఇందుకోసం ఉద్యానశాఖ వెబ్సైట్ను కూడా సిద్ధం చేసింది. మన రాష్ట్రంలోనే ఈ తరహా విధానం... దేశంలో ఎక్కడా ఇటువంటి పద్ధతిలో సూక్ష్మ సేద్యాన్ని అమర్చలేదని ఉద్యానశాఖ కమిష నర్ ఎల్.వెంకట్రామిరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. అంతేకాదు కంపెనీలు ఇచ్చే సూక్ష్మసేద్యం పైపులను గతంలో కొందరు అమ్ముకునే వారు. అయితే ఈసారి అటువంటి పరిస్థితి తలెత్తకుండా పైపులను నిర్ణీత కొలమానం ప్రకారం కోసి వాటిని బిగిస్తామన్నారు. అలాగే నాస్కామ్ ద్వారా పూర్తిస్థాయిలో తనిఖీలూ ఉంటాయన్నారు. తాము చేపట్టిన ఈ పారదర్శక పద్ధతిని గుర్తించిన కేంద్రం సూక్ష్మసేద్యం అమలు కోసం రూ.300 కోట్లు ప్రత్యేకంగా రాష్ట్రానికి కేటాయిం చిందని వెంకట్రామిరెడ్డి తెలిపారు. -
రూ.వెయ్యి కోట్లతో సూక్ష్మ సేద్యం!
నాబార్డు నుంచి నిధులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే మూడు నెలల్లో రూ.వెయ్యి కోట్లతో సూక్ష్మ సేద్యం పథకాన్ని అమలు చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. తద్వారా దాదాపు 3లక్షల ఎకరాల్లో సూక్ష్మ సేద్యం అందుబాటు లోకి తేవాలని, జూన్ నాటికల్లా ఈ కార్యక్ర మాన్ని పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం నాబార్డు నుంచి రూ.874 కోట్లు మంజూరు కాగా, మిగిలిన సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చనుంది. ప్రభుత్వం సూక్ష్మ సేద్యానికి ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. రైతుల నుంచి కూడా పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. 2015–16 బడ్జెట్లోనూ 1.03లక్షల ఎకరాలకు రూ.308కోట్లు కేటా యించగా.. 2.63 లక్షల ఎకరాల్లో సూక్ష్మ సేద్యం ఏర్పాటు చేయాలని కోరుతూ 1.03 లక్షలమంది రైతులు దరఖాస్తు చేసుకున్నా రు. 2016–17లో 3.37లక్షల ఎకరాల్లో సూక్ష్మ సేద్యం కోసం ప్రభుత్వం రూ.290 కోట్లు కేటాయించింది. అయితే లక్ష్యం చేరు కునేందుకు ఈ సొమ్ము సరిపోదు. దీంతో నాబార్డు నుంచి రూ.874 కోట్లు అప్పు తీసు కుంది. ఆ మొత్తంతో పెండింగ్ దరఖా స్తుల న్నింటినీ పరిశీలించి ఆయా రైతులందరికీ సూక్ష్మసేద్యం పరికరాలు మంజూరు చేస్తారు. ఎస్సీ, ఎస్టీలకు ఉచితం! సూక్ష్మ సేద్యం పరికరాలను ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం ఉచితంగా (100 శాతం సబ్సిడీ తో) అందజేస్తోంది. బీసీలకు, ఇతర సన్న చిన్నకారు రైతులకు ప్రస్తుతం 90శాతం, పెద్ద రైతులకు 80 శాతం సబ్సిడీ ఇస్తున్నారు. ఈ పథకం కోసం కేటాయిస్తున్న నిధుల్లో 16.05 శాతం ఎస్సీ రైతులకు, 9.55 శాతం ఎస్టీ రైతులకు, 64.40 శాతం సన్న చిన్నకారు రైతులకు కేటాయిస్తారు. వర్షాభావ ప్రాంతా ల్లో తక్కువ నీటితో ఎక్కువ పంట సాగు చేసేందుకు.. నీరు వృథా కాకుండా ఉండేం దుకు సూక్ష్మ సేద్యం ఉపకరిస్తుంది. -
3.62 లక్షల ఎకరాల్లో సూక్ష్మసేద్యం
• కేంద్రం నుంచి రూ. 250 కోట్లు వచ్చే అవకాశం • మరోవైపు నాబార్డు నిధులు రూ. 874 కోట్లు.. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండేళ్లలో 3.62 లక్షల ఎకరాలను సూక్ష్మసేద్యం కిందికి తీసుకు రావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ. 250 కోట్లు వచ్చే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. అదిగాకుండా ఇప్పటికే నాబార్డు నుంచి ఉద్యానశాఖకు సూక్ష్మసేద్యం కోసం రూ. 874 కోట్లు మంజూరైన సంగతి విదితమే. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా మరో రూ. 150 కోట్లు ఉంటుంది. వీటితో 2016–17, 2017–18 సంవత్సరాల్లో పెద్దఎత్తున సూక్ష్మసేద్యాన్ని ప్రోత్సహిం చాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే వచ్చే బడ్జెట్లో మాత్రం ప్రభుత్వం ఇందుకోసం ప్రత్యేకంగా నిధులు కేటాయిం చే అవకాశం లేదన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే కేంద్రం నుంచి, నాబార్డు నుంచి నిధులు వస్తున్నందున కేటాయించే అవకా శాలు లేవని అంటున్నారు. వాస్తవంగా సూక్ష్మసేద్యానికి రైతుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. కానీ ఆ మేరకు నిధులు లేకపోవడంతో రైతులు నిరాశకు గురయ్యారు. 2015–16 బడ్జెట్లోనూ 1.03 లక్షల ఎకరాలకు రూ. 308 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. రైతుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. దీంతో 2.63 లక్షల ఎకరాలకు సూక్ష్మసేద్యం కావాలని 1.03 లక్షల మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. లక్ష్యానికి మించి రెండున్నర రెట్లు డిమాండ్ వచ్చింది. దీంతో 1.60 లక్షల ఎకరాలకు చెందిన రైతుల దరఖాస్తులను సర్కారు పెండింగ్లో పెట్టింది. వాటికి కూడా సూక్ష్మసేద్యం అందించాలంటే బడ్జెట్ కేటాయింపులకు తోడు అదనంగా రూ. 337.30 కోట్లు కేటాయించాలి. అప్పుడూ నిధుల సమస్య ఎదురైంది. 2016–17లో 3.37 లక్షల ఎకరాల్లో సూక్ష్మసేద్యం కోసం రూ. 290 కోట్లు కేటాయించింది. అయితే ప్రభుత్వ లక్ష్యం ప్రకారం ఈ సొమ్ము సరిపోదు. ఇది ప్రభుత్వానికి భారంగా మారింది. దీంతో ప్రభుత్వం నాబార్డు నుంచి రుణం తీసుకుంది. ఆ మొత్తంతో పెండింగ్ దరఖాస్తులన్నింటినీ పరిశీలించి ఆయా రైతులందరికీ సూక్ష్మసేద్యం మంజూరు చేస్తారు. -
సూక్ష్మ సేద్యానికి రూ.874 కోట్ల రుణం
వ్యవసాయశాఖ మంత్రి పోచారం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 1.26 లక్షల హెక్టార్లలో సూక్ష్మ సేద్యం చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని, దీనికోసం నాబార్డు నుంచి రూ.874 కోట్ల రుణం మంజూరైందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్సీ వి.గంగాధర్ గౌడ్లతో కలసి ఆయన గురువారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. బిందు, తుంపర సేద్యం కోసం ఈ మొత్తాన్ని వినియోగిస్తామని, రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్గా రూ.126 కోట్లు ఇస్తుందని, లబ్ధిదారుల వాటాగా మరో రూ.92 కోట్లు మొత్తంగా రూ.1,092 కోట్లతో సూక్ష్మ సేద్యాన్ని చేపట్టనున్నామని తెలిపారు. తెలంగాణలో మొత్తం 3.15 లక్షల ఎకరాలకు పైగా డ్రిప్ , స్పింక్లర్ సేద్యం కిందకు రావడం ఓ రికార్డని చెప్పారు. పాలి హౌస్ కింద సబ్సిడీ రుణాలు భారీగా పెంచామని, ఇటీవలే హరియాణా బృందం రాష్ట్రంలో పర్యటించి ఈ పథకాన్ని అభినందించిందని అన్నారు. వెయ్యి మందికి పాలి హౌస్ కింద రుణాలు ఇవ్వడం కూడా ఒక రికార్డని, ఇదంతా సీఎం కేసీఆర్ చొరవ వల్లే సాధ్యమైందన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
Advertisement