-
ఇడుపులపాయలో వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం
-
పరిష్కార సూచిక... డీఆర్సీ వేదిక
సాక్షి, కాకినాడ : చాలా కాలం తరువాత జిల్లాలో కీలకమైన సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి విధానపరంగా తీసుకున్న మౌలిక నిర్ణయాలకు డీఆర్సీ వేదికైంది. గత టీడీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనా కాలంలో ఒక్కసారి కూడా జిల్లా సమీక్షా మండలి సమావేశం నిర్వహించకుండా ప్రజా సమస్యలను గాలికొదిలేసిన నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అధికారంలోకి వచ్చి మూడు నెలలు తిరగకుండానే తొలి డీఆర్సీని నిర్వహించడం విపక్ష సభ్యుల ప్రశంసలు అందుకుంది. ఉప ముఖ్యమంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) అధ్యక్షతన కాకినాడ జెడ్పీ సమావేశ మందిరంలో గురువారం జరిగిన ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్చంద్రబోస్, మంత్రులు పినిపే విశ్వరూప్, కురసాల కన్నబాబు, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరిస్తూ అధికార, ప్రతిపక్ష సభ్యులు తీసుకువచ్చిన సమస్యలకు మంత్రులు సమాధానమిచ్చారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన డీఆర్సీ సుదీర్ఘంగా తొమ్మిది గంటలపాటు సాయంత్రం 6.30 గంటల వరకు జరగడం ఒక రికార్డే. శాఖల సమీక్ష అంటే మొక్కుబడిగా నిర్వహించే గత టీడీపీ సర్కార్ సంస్కృతికి భిన్నంగా ప్రజాప్రతినిధులు తీసుకువచ్చిన ప్రతి అంశంపై లోతుగా చర్చించి నిర్దేశిత గడువులోగా పరిష్కార మార్గాన్ని కూడా మంత్రులు సూచించడంతో విపక్షం నోరెత్తలేని పరిస్థితి కనిపించింది. తొలిసారి ఎన్నికైన ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ ప్రాంత సమస్యలపై డీఆర్సీలో గళం వినిపించేందుకు పోటీపడ్డారు. విపక్షాలకు అవకాశం ఇస్తూ... సమస్యలపై చర్చలో పాల్గొనే అవకాశాన్ని కోరినంత సేపు విపక్ష టీడీపీ సభ్యులకు కూడా ఇవ్వడం ద్వారా తమది పూర్తి పారదర్శక ప్రభుత్వమనే విషయాన్ని మంత్రులు నొక్కి చెప్పారు. పది శాఖలను అజెండాలోకి తీసుకువచ్చారు. శుక్రవారం ఎలాగూ వైద్య ఆరోగ్యశాఖపై రోజంతా సమీక్ష ఉండటంతో ఆ శాఖ సమీక్షను డీఆర్సీ నుంచి మినహాయిస్తున్నట్టు జిల్లా ఇన్చార్జి మంత్రి నాని ముందుగానే సభ్యుల దృష్టికి తీసుకు వచ్చారు. మిగిలిన వ్యవసాయం, నీటిపారుదల, విద్యుత్, విద్య, గృహనిర్మాణం, సాంఘిక సంక్షేమం, జిల్లా గ్రామీణాభివృద్ధి, మైనింగ్, గ్రామీణ మంచినీటి సరఫరా, పౌర సరఫరాలు తదితర శాఖలపై లోతైన సమీక్ష నిర్వహించారు. వరదల కారణంగా జరిగిన పంట నష్టంపై ఎకరాకు రూ.25 వేలు డిమాండ్ చేస్తున్న చంద్రబాబు తీరును మంత్రి కన్నబాబు తూర్పారబట్టారు. రూ.2469 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ ఎగ్గొట్టిన బాబు ఇప్పుడు ఇలా మాట్లాడటాన్ని మంత్రి నిలదీశారు. పంటలు ఆలస్యం కావడంతో ముందస్తు రబీపై ఆలోచన చేయాలనే అంశాన్ని చర్చించారు. స్థానిక రైతులు సంతృప్తి చెందాకనే కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు చేయాలని వ్యవసాయశాఖా మంత్రి కన్నబాబు సూచనతో రైతులకు ఎంతగానో మేలు జరగనుంది. టీడీపీ ప్రభుత్వంలో ఇసుక దోపిడీపై అవగాహన కలిగిన మంత్రి సుభాష్చంద్ర బోస్ వేమగిరిలో నిల్వ ఉన్న 16 వేల క్యూబిక్ మీటర్ల ఇసుకపై చర్చ సందర్భంగా జిల్లా కలెక్టర్ మురళీధర్రెడ్డికి విష్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆ ఇసుక విశాఖలో నేవీకని చెప్పి అనుమతి కోసం తన వద్దకే కొందరు రావడం, తాను తిరస్కరించిన విషయాలను ఎక్కడా దాచుకోకుండా సమావేశం దృష్టిలో పెట్టడం విశేషం. ఐదేళ్లలో ఒక్కసారి కూడా డీఆర్సీకి పిలవలేదని ఎమ్మెల్సీ సోము వీర్రాజు సమావేశం దృష్టికి తీసుకువచ్చినప్పుడు డీఆర్సీనే నిర్వహించలేదని టీడీపీ ఎమ్మెల్యే జోగేశ్వరరావు గత సర్కార్ వైఫల్యాన్ని ఒప్పుకున్నారు. అందుకే ఐదేళ్లు మీ ప్రభుత్వంలో దుర్మార్గమైన పాలన సాగించారని, మూడు నెలలు తిరగకుండానే వైఎస్సార్సీపీ డీఆర్సీ నిర్వహిస్తోందని సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి పినిపే విశ్వరూప్ టీడీపీ ఎమ్మెల్యేలకు చురక అంటించారు. కమీషన్ల కోసం పర్యావరణ అనుమతి లేకున్నా లెక్క చేయకుండా రూ.2,600 కోట్లతో చంద్రబాబు చేపట్టిన పురుషోత్తపట్నం పథకంపై సమావేశంలో వాడివేడి చర్చ జరిగింది. ఈ ప్రాజెక్టులో చంద్రబాబు తీరుపై అధికారపక్షం దాడిని కనీసంగా టీడీపీ సభ్యులు నిలువరించలేక చేతులెత్తేయక తప్పింది కాదు. మీలా కాదండీ... మండలి డిప్యుటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం వైఎస్సార్ రైతు భరోసా పథకంలో ఇచ్చే రూ.12,500 రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుందా అని ప్రభుత్వాన్ని తప్పు పట్టే ప్రయత్నం చేశారు. వాస్తవాలే చెబుతాం, మీలా కేంద్ర నిధులతో నడిచే 27 పథకాలకు చంద్రబాబు పేర్లు పెట్టుకోలేదంటూ మంత్రులు నాని, కన్నబాబు, విశ్వరూప్లు దీటుగా బదులిచ్చారు. తమ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఏ పథకానికి ని«ధులు ఇస్తే వాటికి మాత్రమే రైతుల గుండె చప్పుడైన మహానేత వైఎస్ పేరు పెట్టిన విషయాన్ని తెలియచేయడం ద్వారా విపక్ష టీడీపీ నేతల మాటలకు ముకుతాడు వేశారు. ఆళ్ల నాని తొలిసారి మంత్రి అయినప్పటికీ ఇంత పెద్ద జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా జిల్లా సమీక్షా మండలి సమావేశాన్ని సమయస్ఫూర్తితో నిర్వహించారు. నానితో కలిసి జిల్లా మంత్రులు, ప్రభుత్వ విప్ హోదాలో తొలిసారి తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా డీఆర్సీని సమన్వయంతో ముందుకు నడిపించి ప్రతిపక్ష సభ్యుల విమర్శలను దీటుగా తిప్పికొట్టి ప్రభుత్వ ప్రాధాన్యతా అంశాలను వివరించారు. పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం ద్వారా డీఆర్సీ సమావేశ లక్ష్యం నెరవేరినట్టయ్యింది. ప్రధానంగా ఎత్తిపోతల పథకాలు, శివారు భూములకు సాగునీరు, డ్రైన్లు ఆధునికీకరణ వంటి అంశాలపై నీటిపారుదలశాఖా మంత్రితో ప్రత్యేక సమావేశం నిర్వహించేందుకు నిర్ణయించారు. కాలువల క్లోజర్ పనులు చేయాలంటే ఇప్పుడు ముందస్తు రబీకి వెళ్లడమే మేలనే అభిప్రాయం వచ్చింది. హాస్టళ్ల నిర్వహణపై గత టీడీపీ సర్కార్కు, వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసాన్ని మంత్రి విశ్వరూప్ గణాంకాలతో వివరించడంతో అప్పటి వరకూ హాస్టళ్లపై విమర్శలు చేసిన విపక్షానికి నోటమాట రాలేదు. ఇసుక విధానం వెలువడే వరకూ జిల్లాలో సీజ్ చేసిన ఇసుకను స్థానిక ప్రభుత్వ అవసరాలకే వినియోగించాలని, దొంగ పర్మిట్లతో ఇతర ప్రాంతాలకు తరలించే మాఫియాను నిరోధించాలని అధికార, విపక్ష పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఈ మేరకు జిల్లా కలెక్టర్ మురళీథర్రెడ్డికి డీఆర్సీ వేదికగా పలు సూచనలు చేశారు. -
చంద్రబాబు పాలనలో స్వేచ్ఛకు చోటు లేదు
సాక్షి, బేస్తవారిపేట (ప్రకాశం) : చంద్రబాబు పాలనలో మాదిగలు కనీసం మీటింగ్ పెట్టుకునే స్వేచ్ఛకూడా లేకుండా పోయిందని ఎమ్మార్పీస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. మంగళవారం స్థానిక ఎబీఎం కాంపౌండ్ ఆవరణలో విశ్వరూప సమాయత్త సభలో పాల్గొన్నారు. సంక్షేమ పథకాలు, కార్పోరేషన్ పదవులు ఒక వర్గానికే ఇచ్చి సామాజిక న్యాయం పాటించలేదన్నారు. ఎస్సీ వర్గీకరణ చేసి పెద్ద మాదిగనవుతానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి మోసం చేశాడన్నారు. కనీసం అమరావతిలో మాదిగల కురుక్షేత్ర సభను పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వలేదని, మాదిగల మరో విశ్వరూప మహాసభకు అనుమతులు ఇవ్వలేదన్నారు. రెండు,మూడు రోజుల్లో ఎన్నికల కోడ్ వస్తుందని, ఎన్నికల కమిషన్ నుంచి అనుమతులు తీసుకుని మన సత్తా చాటుదామన్నారు. మన హక్కుల సాధనకై కలిసికట్టుగా మన సత్తాచాటాల్సిన అవసరం ఉందని, ప్రతి ఒక్కరు విశ్వరూప సభకు తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య, జిల్లా ఇన్చార్జ్ సూరెపోగు శ్యామ్, రాష్ట్ర నాయకులు పానుగంటి సాలెమ్రాజు, పులిగుజ్జు ప్రాంక్లీన్, బొడిచర్ల రాజు, మండల అధ్యక్షుడు బూదాల ఆనంద్, నాయకులు కుంపటి సురేష్, గుర్రం ఆనంద్, గోన గురవయ్య, ఆళ్లగడ్డ వాసు, కొండెపోగు పోలయ్య, గోన శరత్, తిరుపతి శాంతమ్మ, కొండెపోగు ప్రసన్న, జయరాజ్ పాల్గొన్నారు. -
ఏడు నెలలుగా ఎండమావే..!
‘నామినేటెడ్’ పోస్టుల కోసం టీఆర్ఎస్ నేతల ఎదురుచూపులు ఏడు నెలలైనా ముహూర్తం కుదరడం లేదా అంటూ అసంతృప్తి రేపటి టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలోనైనా చర్చిస్తారా..? సాక్షి, హైదరాబాద్: ‘ పద్నాలుగేళ్లు ప్రత్యేక రాష్ర్టం కోసం పోరాడాం... తెలంగాణ సాధించుకున్నాం.. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాం.. ఒక నామినేటెడ్ పదవితోనైనా ఉద్యమ అలసటను మర్చిపోదాం అనుకున్నాం.. ఏడు నెలలుగా ఎదురుచూసినా పదవి ఎండమావిగానే మారింది... మరోవైపు పార్టీతో కానీ, తెలంగాణ ఉద్యమంతో కానీ సంబంధం లేనివారికి పదవులు దక్కాయి.. మరి నామినేటెడ్ పదవులు పొందేందుకు పార్టీ ఉద్యమకారుల్లో ఒక్కరూ లేరా..’ అంటూ గులాబీ శ్రేణులు అసంతృప్తితో రగిలిపోతున్నాయి. పదవుల పందేరంపై టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు స్పష్టత ఇవ్వకుండా ఇవాళా, రేపు అంటూ వాయిదా వేయడం వీరిని అసహనానికి గురిచేస్తోంది. పదవుల భర్తీ వ్యవహారం పూర్తిగా సీఎం చేతిలోనే ఉండడంతో ఆయనను నేరుగా ఎలా కలవాలో తెలియక పార్టీ ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు ఆయా జిల్లాల్లో మంత్రులపై ఒత్తిడి పెంచుతున్నారు. సంక్రాంతి పండుగ దాకా మంచిరోజులు లేవంటూ సీఎం చెప్పడంతో అప్పటివరకు ఆగిన నాయకులు పండుగ వెళ్లి పక్షం రోజులయిందంటూ లోలోనే గుసగుసలాడుతున్నారు. పార్టీ బలోపేతం, కార్యకర్తల సేవల వినియోగం తదితర సంస్థాగత అంశాలపై ఈ నెల 3న సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే పార్టీ విస్తృతస్థాయి సమావేశంలోనైనా నామినేటెడ్ పదవుల భర్తీ అంశం చర్చకు రాకపోతుందా అంటూ ఆశగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడుగా నిరంజన్రెడ్డి, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా పిడమర్తి రవికి మాత్రమే ఇప్పటివరకు నామినేటెడ్ పదవులు దక్కాయి. వీరిద్దరూ గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయినవారే. ఇక, రాష్ట్ర సాంస్కృతిక సారథిగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అవకాశం దక్కించుకున్నారు. టీఎస్పీఎస్సీ పదవులు భర్తీ అయినా సభ్యురాలిగా పార్టీకి చెందిన ఒక్కరికే అవకాశం దక్కింది. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో సీఎంను మినహాయించి... 29 మందికి మంత్రులు, పార్లమెంటరీ కార్యదర్శులు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులు లభించాయి. ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరిన మరో ముగ్గురికీ మంత్రి పదవులు దక్కాయి. ఆవిర్భావం నుంచి పార్టీనే నమ్ముకుని, అధినేతను అంటిపెట్టుకుని ఉన్నవారికి ఇంకా ఎలాంటి న్యాయం జరగలేదు. తమనూ ఏదో ఒక పదవి వరిస్తుందంటూ ఆశపడుతూ వస్తున్న వారిలో రానురాను నిస్తేజం ఆవహిస్తోంది. రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్లు, జిల్లా స్థాయి కార్పొరేషన్లు, మార్కెట్ కమిటీల పాలక మండళ్లు, దేవాలయాల ధర్మకర్తల మండళ్లు భర్తీ కావాల్సి ఉంది. మహిళా కమిషన్, హుడా, కుడా, శాప్, గ్రంథాలయ సంస్థ, ఆర్టీసీ, కొత్తగా ప్రకటించిన వాటర్గ్రిడ్ కార్పొరేషన్, టీఎస్ఐఐసీ, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ వంటి ఎన్నో సంస్థల పదవులు భర్తీ చేస్తే చాలామందికి అవకాశాలు దక్కుతాయి. కానీ, పార్టీ నాయకత్వం దీనిని అంత సీరియస్గా ఆలోచిస్తున్నట్లు లేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ‘ మొదటి నుంచీ పార్టీని నమ్ముకున్న వారికి కచ్చితంగా న్యాయం జరుగుతుంది. సీఎం కేసీఆర్ తప్పక గుర్తింపు ఇస్తారన్న నమ్మకం ఉంది. ఇప్పటికిప్పుడు 30 పదవులను భర్తీ చేస్తే చాలు. కొంత ఒత్తిడి త గ్గిపోతుంది. రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన నేతలు 15 మంది దాకా ఉంటారు. కనీసం వీరికి పదవులు లభించినా, మిగతా వారిలో కొంత భరోసా ఏర్పడుతుంది..’ అని పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా గులాబీ నేతలు లోలోన ఉడికి పోతున్నా, చేసేదేమీలేక ఓపికతో నామినేటెడ్ పదవుల భర్తీ కోసం ఎదురు చూస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- తాతా.. నీకు టాటా..
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
Advertisement