-
‘పట్నం’ కాంగ్రెస్లో ముసలం!
రంగారెడ్డి జిల్లా: ఇబ్రహీంపట్నం కాంగ్రెస్లో ముసలం పుట్టింది. ఓ వైపు ఎన్నికల గడువు సమీపిస్తుండగా.. మరో వైపు పార్టీలో అంతర్గత పోరు తార స్థాయికి చేరుకుంది. ఇప్పటికే పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు కాంగ్రెస్ను వీడి అధికార పార్టీలో చేరగా.. తాజాగా మరికొంత మంది అదే బాటలో పయనించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు బీఆర్ఎస్కు గట్టి పోటీ ఇస్తుందని భావించిన కాంగ్రెస్ పార్టీ.. ఉన్నత స్థాయి నేతల తీరుతో అప్రతిష్ట పాలవుతోంది. మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, సీనియర్ నేతలు దండెం రామిరెడ్డి, మర్రి నిరంజన్రెడ్డి నియోజకవర్గంలో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. పార్టీ సంక్షోభ సమయంలో అంతా కలిసి పని చేయాల్సి ఉండగా.. ఎవరికి వారే అనే చందంగా సాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ నాకంటే.. నాకే వస్తుందని ప్రచారం చేసుకుంటూ గ్రూపు రాజకీయాలకు తెరలేపారు. వీరి ప్రవర్తన నచ్చక ఇప్పటికే గ్రామాల్లోని పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు బీఆర్ఎస్లో చేరడం గమనార్హం. తాజాగా తుర్కయాంజాల్, పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీలకు చెందిన పలువురు కౌన్సిలర్లు సైతం పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. నేతల మధ్య కొట్లాట పట్నం నియోజకవర్గానికి 1952 నుంచి 2018 వరకు 16సార్లు ఎన్నికలు జరిగాయి. ఎనిమిది సార్లు కాంగ్రెస్, మూడుసార్లు సీపీఎం, నాలుగుసార్లు టీడీపీ, ఒకసారి బీఆర్ఎస్ గెలుపొందాయి. జిల్లాలో కాంగ్రెస్కు మంచి పట్టున్న నియోజకవర్గాల జాబితాలో ఇది మొదటి స్థానంలో ఉంటుంది. 2018 ఎన్నికల్లో టీడీపీతో పొత్తులో భాగంగా ఈ సీటును సామరంగారెడ్డికి త్యాగం చేయాల్సి వచ్చింది. అప్పటికే కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించి పొత్తులో భాగంగా భంగపడిన మల్రెడ్డి రంగారెడ్డి ఆ తర్వాత బీఎస్పీ నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. అనంతరం జరిగిన సర్పంచ్, మండల, జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులే మెజార్టీ సీట్లు దక్కించుకున్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీకి గట్టిపట్టుంది. అయితే ప్రస్తుతం సీనియర్ నేతల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు ఆ పార్టీకి శాపంగా మారాయి. మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీకి సన్నాహాలు చేసుకుంటుండగా.. మరో వైపు ఎంపీ కోమటిరెడ్డి వర్గంగా చెప్పుకుంటున్న మర్రి నిరంజన్రెడ్డి, గ్రేటర్ పరిధిలోని ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు సన్నిహితుడిగా చెప్పుకొనే దండెం రామిరెడ్డి సైతం ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి సొంత నియోజకవర్గంలోనే పార్టీ నేతల మధ్య సమన్వయం కొరవడటం విశేషం. పార్టీని వీడే యోచన తుర్కయాంజాల్ మున్సిపల్ పరిధిలోని మాజీ ఎంపీపీ, రైతుసేవా సహకార సంఘం బ్యాంకు మాజీ చైర్మన్ రొక్కం భీంరెడ్డి సహా ఎనిమిది మంది కౌన్సిలర్లు, మరో ముగ్గురు కో ఆప్షన్ మెంబర్లు కాంగ్రెస్ను వీడి.. బీఆర్ఎస్లో చేరే యోచ నలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరంతా స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డితో టచ్లో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. భీంరెడ్డి గతంలో టీడీపీలో పని చేశారు. 2018లో టీడీపీ టికెట్ ఆశించారు. ఆ తర్వాత కాంగ్రెస్లో చేరారు. ప్రస్తుతం ఆయనకు ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ మల్రెడ్డి రంగారెడ్డి, భీంరెడ్డికి మధ్య సఖ్యత లేదు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రెండున్నరేళ్లకు చైర్మన్ పీఠాన్ని భీంరెడ్డి కోడలికి ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. కానీ ఇప్పటికీ అది నిలబెట్టుకోలేదు. దీంతో వారంతా పార్టీ మారేందుకు సన్నాహాలు చేస్తున్నారు. భీంరెడ్డి వర్గీయులు పార్టీ వీడకుండా మల్రెడ్డి వర్గీయులు బుజ్జగింపులు.. బేరసారాలకు దిగుతున్నారు. అయినా వారు పట్టు వీడటం లేదు. ఈ నెల 19న మంత్రి కేటీఆర్ సమక్షంలో వీరంతా పార్టీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీలోని పలువురు కాంగ్రెస్ కౌన్సిలర్లు నియోజకవర్గ ఇన్చార్జ్ మల్రెడ్డి సోదరుల నాయకత్వాన్ని విభేదిస్తున్నారు. వీరంతా పక్క బాటపట్టే అవకాశం లేకపోలేదు. -
తహసీల్దార్ హత్యపై రాజకీయ దుమారం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనంపై జిల్లాలో రాజకీయ రగడ మొదలైంది. లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత చల్లబడిన రాజకీయం.. విజయారెడ్డి హత్యోదంతంతో క్రమంగా వేడెక్కుతోంది. తహసీల్దార్ హత్యకు నువ్వంటే.. నువ్వే కారణమని స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఒకరిపై ఒకరు మీడియా వేదికగా ఆరోపించుకుంటున్నారు. ఆది నుంచి వీరు రాజకీయ ప్రత్యర్థులు. ఒకరంటే ఒకరికి పడని వీరిద్దరూ మాటల తూటాలు పేల్చుతూ సవాల్.. ప్రతి సవాల్ విసురుకుంటున్నారు. సోమవారం రైతు కూర సురేష్ తహసీల్దార్ విజయారెడ్డిపై కార్యాలయంలోనే పెట్రోల్ పోసి నిప్పటించడంతో సజీవదహనమైన చేసిన విషయం తెలిసిందే. ఈ అమానుషానికి ప్రధాన కారణమైన భూముల వ్యవహారంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే హస్తం ఉందని మల్రెడ్డి రంగారెడ్డి ఆరోపణల బాంబ్ పేల్చడంతో వివాదం రాజుకుంది. భూముల నిగ్గు తేల్చేందుకు సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన ఆయన... ల్యాండ్ మాఫియాకు ఎమ్మెల్యే నాయకత్వం వహిస్తున్నారని తీవ్రపదజాలంతో విరుచుకుపడటం సర్వత్రా చర్చనీయాంశమయింది. రూ.వేల కోట్లు ఎలా వచ్చాయ్? భూ మాఫియా అంటేనే మల్రెడ్డి రంగారెడ్డి. గత 20 ఏళ్లుగా ఆయనకు ఆస్తులు, భూములు ఎలా వచ్చాయో విచారణ జరిపితే తెలుస్తుంది. వందశాతం భూకబ్జా దారుడు.. ల్యాండ్ గ్రాబర్.. విచారణ జరిపిస్తే మాఫియా ఎవరో బయటపడుతుంది. తహసీల్దార్ మీద ఎవరు ఒత్తిడి తెచ్చారో తేలాలి. విజయారెడ్డి హత్య కేసులో కావాలనే నాపై బురదజల్లుతున్నారు. నేను సాయం చేసే మనిషినే..అన్యాయం చేసే వాడినికాదు. రెండెకరాల మనిషి.. రూ.వేల కోట్లు ఎలా సంపాదించారో అందరికీ తెలుసు. మా ఆస్తులన్నీ మా తాతలు, తండ్రుల కాలం నాటివే. అబ్దుల్లాపూర్మెట్ చుట్టుపక్కల ఉన్న 412 ఎకరాల వివాదాస్పద భూమిపై విచారణ జరిపి తీరాలి. వాస్తవాలేంటో తేలుతాయి. అంబర్పేట ఓఆర్ఆర్ దగ్గర సర్వే నంబర్లు 230 – 233లో ఉన్న 16 ఎకరాల భూమిని మల్రెడ్డి రంగారెడ్డి బంధువులే కబ్జా చేశారు. మెట్రోసిటీ పేరుతో 60 ఎకరాలను కొల్లగొట్టారు. నేను రూ.30 లక్షలు ఎవరి దగ్గరా వసూలు చేయలేదు. తీసుకున్నట్లు ఆయన రుజువు చేయాలి. మూడుసార్లు ఓడిపోయిన వ్యక్తి నాపై ఆరోపణలు చేస్తే స్పందించాలా అనుకున్నా. కానీ శవ రాజకీయాలు చేస్తుంటే తట్టుకోలేక మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. – మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే 40 ఎకరాలు ఎవరబ్బ సొమ్ము? ల్యాండ్ మాఫియాకు నాయకత్వం వహిస్తున్న నాయకుడు ఎమ్మెల్యే కిషన్ రెడ్డి. నయీంతో దోస్తీ చేసిన వ్యక్తి ఆయన. నాకున్న ఆస్తుల వివరాలను నిర్భయంగా, నిర్మొహమాటంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. ఆ వివాదాస్పద భూముల్లో నా బంధువులు అక్రమంగా కొనుగోలు చేస్తే 24 గంటల్లోగా స్వాధీనం చేసుకుని పేదలకు పంచండి. అధికారంలో మీరే ఉన్నారు. సీఎంకు కూడా చెప్పు. నేను పది మందికి మంచి చెప్పేవాడిని. నేను ఎవరితోనూ చెప్పించుకోను. నువ్వు చెబుతున్నట్లుగానే.. ఎప్పుడో మావాళ్లు భూములు కొని ఉంటే ఇన్ని రోజులు ఏం చేశావ్? పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉండి ఎందుకు అడగలేదు? రూ.400 కోట్ల విలువచేసే ప్రభుత్వ భూమిని ఇబ్రహీంపట్నంలో కాజేశావ్. అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ఓఆర్సీ ఇప్పించావ్. దాని పక్కనే ప్రభుత్వ సంస్థలకు భూమిని గతంలో ఇచ్చారు. పోలీస్స్టేషన్, మార్కెట్ కమిటీ, ఆర్టీసీ డిపోలకు దాదాపు 30 ఎకరాలు కేటాయించారు. ఇదిపోగా 40 ఎకరాలు ఎవరబ్బ సొమ్మని బినామీల పేరిట తెచ్చుకున్నావ్? – మల్రెడ్డి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే -
‘వీవీ ప్యాట్’ల లెక్కింపునకు ఆదేశాలివ్వండి
సాక్షి, హైదరాబాద్: ఇటీవల తమ నియోజకవర్గాల పరిధిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని (ఈసీ) ఆదేశించాలని కోరుతూ కాంగ్రెస్ నేతలు పద్మావతిరెడ్డి, అద్దంకి దయాకర్, బీఎస్పీ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఈసీని ఆదేశించింది. ఫిబ్రవరి 7 లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఈసీకి స్పష్టం చేసింది. ఈ కౌంటర్కు 14వ తేదీ లోపు తిరుగు సమాధానం ఇస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషనర్లను ఆదేశించింది. ఫిబ్రవరి 14న తదుపరి విచారణ చేపడతామంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈవీఎంల ద్వారా తమకు వచ్చిన ఓట్లకు, వీవీ ప్యాట్లలో నమోదైన ఓట్లకు తేడా ఉందని, అందువల్ల వీవీ ప్యాట్లలో ఓట్లను లెక్కించేలా ఈసీని ఆదేశించాలని కోరుతూ కోదాడ కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతిరెడ్డి, తుంగతుర్తి కాంగ్రెస్ అభ్యర్థి అద్దంకి దయాకర్లు హైకోర్టులో తాజాగా పిటిషన్లు దాఖలు చేశారు. ఇదే అంశంపై మల్రెడ్డి రంగారెడ్డి గతంలోనే పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. వీవీ ప్యాట్లను లెక్కించలేదు.. పిటిషనర్ల తరఫున తూమ్ శ్రీనివాస్ తదితరులు వాదనలు వినిపిస్తూ.. తుంగతుర్తి నియోజకవర్గంలో 18 ఈవీఎంలు సరిగ్గా పనిచేయలేదని, అందువల్ల వీవీ ప్యాట్ల ఓట్లను లెక్కించాల్సిన అవసరం ఉందన్నారు. ఓటు వేసిన ఫలితం ఈవీఎంలపై కనిపించనప్పుడు, నిబంధనల ప్రకారం ఆ ఈవీఎంలను పక్కన పెట్టేయాల్సి ఉంటుందని తెలిపారు. అన్ని ఈవీఎంల ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక, ఈ పనిచేయని ఈవీఎంల వీవీ ప్యాట్లను లెక్కించాల్సి ఉంటుందని, తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలో అలా జరగలేదన్నారు. వీవీ ప్యాట్ స్లిప్పులు థర్మల్ పేపర్పై ముద్రితమవుతాయని, నిపుణులు చెప్పే దానిని బట్టి వీటిపై ముద్రితమైన వివరాలు 45 రోజుల్లో తుడిచిపెట్టుకుపోతాయన్నారు. ఇలా జరిగితే తాము ఈ వ్యాజ్యాలు దాఖలు చేసి ఎటువంటి ప్రయోజనం ఉండదని నివేదించారు. పిటిషనర్ల వాదనలను ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది అవినాశ్ దేశాయ్ తోసిపుచ్చారు. థర్మల్ ప్రింట్ ఐదేళ్ల వరకు ఉంటుందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఈ వివరాలన్నింటితో కౌంటర్ దాఖలు చేయాలని తెలిపింది. -
మల్రెడ్డి పిటిషన్ వచ్చేనెలకు వాయిదా వేసిన కోర్టు
సాక్షి, హైదరాబాద్ : వీవీ ప్యాలెట్ ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి వేసిన ఎలక్షన్ పిటిషన్ను బుధవారం తెలంగాణ హైకోర్టు విచారించింది. వచ్చే నెల 7 వరకూ ఈ పిటిషన్కు సంబంధించి పూర్తి సమాచారంతో కౌంటర్ దాఖలు చేయాలంటూ.. హై కోర్టు కేంద్ర ఎన్నికల కమిషన్ను ఆదేశించింది. ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ మల్రెడ్డి రంగారెడ్డితో పాటు ఉత్తం పద్మావతి, ధర్మపురి లక్ష్మణ్లు కూడా పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. -
30న పూర్తి సమాచారం సమర్పించండి
సాక్షి, హైదరాబాద్: ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఓట్లకు సంబంధించిన అన్ని వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించేలా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో)ని ఆదేశించాలని కోరుతూ మల్రెడ్డి రంగారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై బుధవారం తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ నెల 30 తేదీన లెక్కింపు వ్యవహారానికి సంబంధించిన పూర్తి సమాచారంతో తమ ముందుకు రావాలని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం నుంచి బీఎస్పీ తరఫున పోటీ చేసి 376 ఓట్ల తేడాతో మల్రెడ్డి రంగారెడ్డి ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఓట్లకు, వీవీ ప్యాట్ స్లిప్పులకు తేడాలున్నాయి.. డిసెంబర్ 11న ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా, ఆ ఓట్ల లెక్కింపులో లోపాలపై తన చీఫ్ ఎన్నికల ఏజెంట్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ రిటర్నింగ్ అధికారికి వినతిపత్రం సమర్పించారని రంగారెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ వినతి పత్రం తీసుకుంటున్నట్లు రిటర్నింగ్ అధికారి ఎటువంటి అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వలేదని ప్రస్తావించారు. పోలింగ్ స్టేషన్ 199, 221ల్లో వీవీ ప్యాట్ స్లిప్పులను, ఈవీఎంలను పోల్చిచూడగా, ఈవీఎంల ప్రకారం టీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డికి 146 ఓట్లు, తనకు 130 ఓట్లు వచ్చాయని, ఇదే సమయంలో వీవీ ప్యాట్లను లెక్కించగా, మంచిరెడ్డికి 139 ఓట్లు, తనకు 129 ఓట్లు వచ్చాయన్నారు. 221 పోలింగ్ కేంద్రంలో కూడా ఈవీఎం ఓట్లకు, వీవీ ప్యాట్ స్లిప్పులకు తేడాలున్నాయని తెలిపారు. వీటిపై అభ్యంతరాలు వ్యక్తం చేసినా పట్టించుకోకుండా రిటర్నింగ్ అధికారి రాత్రి 9 గంటల సమయంలో ఫలితాలను ప్రకటించారని పేర్కొన్నారు. మాక్ పోలింగ్ డేటాను తుడిచేయకుండా వీవీ ప్యాట్లను లెక్కించడం వల్ల సమస్య వచ్చిందని రిటర్నింగ్ అధికారి చెప్పారన్నారు. దీనిపై సీఈవోను కలిసి వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించాలని అభ్యర్థిస్తూ వినతిపత్రం ఇవ్వడం జరిగిందని చెప్పారు. సమాచార హక్కు చట్టం కింద సమాచారం కోరగా, రిటర్నింగ్ అధికారి కార్యాలయం కీలక సమాచారాన్ని తొక్కిపెట్టిందని తెలిపారు. పోలింగ్ పారదర్శకంగా జరిగేందుకు వీవీ ప్యాట్లను తీసుకువచ్చారని, అయితే అధికారులు మాత్రం పారదర్శకంగా వ్యవహరించడం లేదని రంగారెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నారు. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోర్టును అభ్యర్థించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
Advertisement