-
ఇద్దరితో ప్రేమాయణం.. రెండో ప్రియుడంటే ఎంతో ఇష్టం.. అతడి కోసం..
దొడ్డబళ్లాపురం: దారితప్పిన మహిళ ప్రవర్తన ఎన్ని అనర్థాలకు దారితీస్తుందో ఈ సంఘటన చక్కటి ఉదాహరణ. ఒకరితో పెట్టుకున్న అక్రమ సంబంధం.. మరో అక్రమ సంబంధం కలిగిన వ్యక్తికి తెలుస్తుందనే భయంతో మహిళ ప్రియుడితో కలిసి మరో ప్రియుడిని దారుణంగా హత్య చేసిన సంఘటన నెలమంగల తాలూకాలో కలకలం సృష్టించింది. వివరాల ప్రకారం.. జూలై నెల 2న తుమకూరు జయనగర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసులో నెలమంగల పోలీసులు లక్ష్మి, వెంకటేశ్ అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. పట్టుబడ్డ నిందితులు ఇద్దరూ దొడ్డలింగప్ప అనే వ్యక్తిని తుమకూరులో హత్య చేసి నెలమంగల తాలూకా కళలుఘట్ట బ్రిడ్జి వద్ద శవాన్ని పారవేసి పరారయ్యారు. అందరిదీ రాయచూరు నిందితులు లక్ష్మి, వెంకటేశ్, హతుడు దొడ్డలింగప్ప అందరూ రాయచూరుకు చెందినవారే. వీరంతా తుమకూరు వద్ద ఉన్న గోశాలలో పనిచేసేవారు. లక్ష్మి మొదటి భర్త మృతి చెందగా, రెండవ భర్త విడాకులు ఇచ్చాడు. దీంతో లక్ష్మి.. దొడ్డలింగప్ప, వెంకటేశ్ అనే ఇద్దరితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అయితే దొడ్డలింగప్పతో అక్రమ సంబంధం గురించి వెంకటేశ్కు తెలుసు. కానీ, వెంకటేశ్తో అక్రమ సంబంధం ఉన్న సంగతి దొడ్డలింగప్పకు తెలీదు. దొడ్డలింగప్పకు లక్ష్మి రూ.30 వేలు డబ్బులు ఇవ్వాల్సి ఉంది. వెంకటేశ్తో ఉన్న సంబంధం తెలిస్తే గొడవ చేస్తాడని భావించిన లక్ష్మి జులై 2న అతడ్ని ఇంటికి పిలిపించి మద్యం తాగించి తలపై బండరాయితో బాది హత్య చేసింది. ఇందుకు వెంకటేశ్ సహకరించాడు. శవాన్ని తీసుకువచ్చి నెలమంగల వద్ద బ్రిడ్జి కింద పారవేసి వెళ్లిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
భద్రాద్రిలో దారుణం: ప్రేమ పేరుతో ట్రాప్ చేసి.. గర్భవతి అయ్యాక..
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువకుడు.. యువతిని ట్రాప్ చేశాడు. అతడి మాటలు నమ్మిన సదరు యువతి.. శారీరకంగా దగ్గర కావడంతో గర్భం దాల్చింది. అతడి వల్ల చివరకు ప్రాణాలు విడిచింది. దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. వివరాల ప్రకారం.. ములకలపల్లి మండలం వీకే రామవరం గ్రామానికి చెందిన యువతితో పుసుగుడెంకు చెందిన భూక్యా నందుకు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో వారి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో, ఆమెను పెళ్లి చేసుకుంటానని నందు ట్రాప్ చేశాడు. ప్రేమ పేరిట ఆమెను శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఈ నేపథ్యంలో బాధితురాలు గర్భం దాల్చింది. 5 నెలల గర్భవతి కావడంతో అబార్షన్ కావడానికి మాత్రలు ఇచ్చాడు. కానీ, ఆమెకు అబార్షన్ కాకపోవడంతో ఆసుపత్రికి వెళ్లాడు. ఈ క్రమంలో బాధితురాలు, నందు, మరో మహిళ కలిసి.. భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వచ్చి తన భార్యకు తీవ్ర రక్తస్రావం అవుతుందని చెప్పి అడ్మిట్ చేశాడు. కాగా, వైద్యులు చికిత్స అందిస్తున్న సమయంలో ఆమెకు ఫిట్స్ రావడంతో పరిస్థితి విషమంగా మారింది. దీంతో, నందుతోపాటు ఆసుపత్రికి వచ్చిన అమ్మాయి అక్కడి నుంచి పారిపోయారు. ఈ క్రమంలో ఆరోగ్యం విషమించడంతో బాధితురాలు మృతిచెందింది. దీంతో వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు.. ఆమె తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పారు. దీంతో వారు కన్నీటిపర్యంతమయ్యారు. తన బిడ్డను నందు బలితీసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, బాధితుల ఫిర్యాదు మేరకు యువకుడిపై కేసు నమోదు చేసి గాలిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఇది కూడా చదవండి: ఫేస్బుక్లో పరిచయం.. ఆ తర్వాత పెళ్లి.. ఇంతలోనే.. -
10 రోజుల్లో పెళ్లి.. అంతలోనే హత్య
ఖమ్మం అర్బన్: కాపురంలో విభేదాలతో ఆ భార్యాభర్తలు విడిపోయారు. ఆ తర్వాత భార్యకు మరో యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. సదరు యువకుడితో పలుమార్లు గొడవ పడిన మహిళ భర్త.. ఇద్దరూ ఏకాంతంగా కలుసుకోవడాన్ని జీర్ణించుకోలేక దాడికి తెగబడ్డాడు. విచక్షణారహితంగా కత్తితో యువకుడిని పొడిచాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ యువకుడు మృతిచెందాడు. ఖమ్మం జిల్లా కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, హత్య చేసిన వ్యక్తి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. ఖమ్మం అల్లీపురానికి చెందిన సంపంగి వీరబాబుకు వైరా మండలానికి చెందిన మహిళకు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక బాబు, పాప ఉన్నారు. భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో సదరు మహిళ ఖమ్మం శివారు గోపాలపురం సమీపాన ఇల్లు అద్దెకు తీసుకుని పిల్లలతో నాలుగేళ్లుగా ఉంటోంది. పోలీస్ కేసులు కూడా నమోదు.. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఆస్పత్రిలో ఔట్ సోర్సింగ్పై పనిచేస్తున్న అల్లీపురానికి చెందిన నల్లగట్ల నవీన్తో ఆమెకు వివాహేతర సం బంధం ఏర్పడింది. ఈ విషయం వీరబాబుకు తెలియడంతో నవీన్తో పలుమార్లు గొడవ పడ్డాడు. ఇరువురు పోలీసు కేసులు కూడా పెట్టుకున్నారు. అయినా నవీన్, తన భార్య సన్నిహితంగా ఉండడాన్ని వీరబాబు తట్టుకోలేకపోయాడు. ఇంతలోనే నవీన్కు నిశ్చితార్థం జరగగా, వచ్చే నెల 9న పెళ్లి నిర్ణయించారు. కాగా, సదరు మహిళ ఇంటికి ఆదివారం రాత్రి నవీన్ వెళ్లాడని తెలుస్తోంది. అక్కడకు వీరబాబు వెళ్లి నవీన్పై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో నవీన్ పేగులు బయటకు వచ్చాయి. దాడిని అడ్డుకోబోయిన మహిళకు సైతం గాయాలయ్యాయి. నవీన్ను ఆమె ఆటో లో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా చేర్పించుకోకపోవడంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించింది. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున నవీన్ మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని నగర ఏసీపీ ఆంజనేయులు, ఖమ్మం అర్బన్ సీఐ రామకృష్ణ పరిశీలించి విచారణ మొదలుపెట్టారు. అయితే, పెళ్లి కార్డు ఇచ్చేందుకే మహిళ ఇంటికి వెళ్లిన నవీన్పై వీరబాబు దాడి చేసి హత్యకు పాల్పడ్డాడని మృతుడి తండ్రి శ్రీను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరబాబు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇది కూడా చదవండి: ప్రియుడు, మేనత్తతో కలిసి భర్తను చంపిన భార్య -
విషాదం: చెట్టుకు ఉరి వేసుకుని ప్రేమ జంట ఆత్మహత్య
నిజామాబాద్: జిల్లాలోని చందూర్ మండలం లక్ష్మాపూర్లో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి సమీపంలోని అడవి ప్రాంతంలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. అడవిలోని ఓ చెట్టుకు ఉరివేసుకుని ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలనానికి చేరుకొని పరిశీలిసుస్తున్నారు. మృతి చెందిన వారిని మోస్రా మండలం తిమ్మాపూర్కి చెందిన మోహన్, లక్ష్మిగా పోలీసులు గుర్తించారు. వారం రోజుల క్రితమే వీరు ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. వారం నుంచి చెట్టుకు మృతదేహాలు వేలాడుతున్నట్లు తెలుస్తోంది. చదవండి: మంచాన పడ్డ భార్యను చూసేందుకు బైక్పై; 20 మీటర్లు ఎగిరి చెట్టు కొమ్మకు -
ప్రేయసి ఇంట్లో భోజనం: కొద్ది సేపటికే వాంతులతో ప్రియుడి మృతి
టీ.నగర్: ప్రేమికురాలి ఇంటిలో భోజనం చేసిన యువకుడు మంగళవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ నెల 17వ తేదీన వివాహం జరగాల్సి ఉండగా ఈ దారుణం జరిగింది. కేరళ రాష్ట్రం, ఇడుక్కి జిల్లా, మూనారు ప్రాంతానికి చెందిన నిషాంత్ (30). ఇతను చెన్నైలోని ప్రైవేటు సంస్థలో పని చేస్తూ వచ్చా డు. చెన్నై పళ్లికరనైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో పని చేస్తున్న అరియలూరు జిల్లా, గంగైకొండచోళపురం ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమించాడు. వీరి ప్రేమకు ఇరు కుటుంబాల తల్లిదండ్రులు సమ్మతం తెలిపారు. దీంతో ఈ నెల 17వ తేదీన వివాహం జరిపేందుకు నిశ్చయించారు. ఇదిలావుండగా కరోనా రెండో వైరస్ కారణంగా నిషాంత్ పని చేస్తున్న కార్యాలయానికి సెలవు ప్రకటించారు. దీంతో చెన్నై నుంచి వివాహం నిశ్చయించబడిన వధువు ఇంటికి మంగళవారం నిషాంత్ చేరుకున్నాడు. అక్కడ అతనికి చేపల పులుసుతో భోజనం వడ్డించారు. దీన్ని తిన్న నిషాంత్ కొద్ది సేపటికే వాంతులు చేసుకోవడం ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే అతడు మృతి చెందాడు. నిషాంత్ తండ్రి ఫిర్యాదు మేరకు మీన్సురుట్టి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: కరోనా సాయం కోసం ప్రత్యేక వాట్సాప్ గ్రూప్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement