-
రోజుకు రూ.95 లక్షల నుంచి రూ. కోటి వరకు నష్టం
కందనూలు (నాగర్కర్నూల్): గతేడాది అక్టోబర్ 5 నుంచి నవంబర్ 25 వరకు 51 రోజుల పాటు ఆర్టీసీ సమ్మె.. కరోనాను కట్టడి చేసేందుకు గత నెల 23 నుంచి లాక్డౌన్ అమలుచేయటంతో బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆర్టీసీ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయింది. లాక్డౌన్ నేపథ్యంలో ఆదాయం రాకున్నా కార్మికులు, సిబ్బందికి మార్చి వేతనం చెల్లించింది. అద్దె బస్సులను నడిపే డ్రైవర్లకు మాత్రం బస్సులు నడవడం లేదనే సాకుతో ఆయా యాజమాన్యాలు వేతనాలు ఇవ్వలేదు. నిలిచిన బస్సులు.. మహబూబ్నగర్ రీజియన్ పరిధిలోని తొమ్మిది డిపోల్లో 880 బస్సులు ఉన్నాయి. డ్రైవర్లు, కండక్టర్లు తదితర సిబ్బంది మొత్తం 4,200 మంది పని చేస్తున్నారు. బస్సులు రోజు 3.50 లక్షల కిలోమీటర్లు తిరగగా, 10.8 లక్షల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేసివి. ప్రస్తుతం లాక్డౌన్ కొనసాగుతుండటంతో బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. రీజియన్ వ్యాప్తంగా రోజుకు రూ.95 లక్షల నుంచి రూ. 1.50 కోట్ల వరకు నష్టం వస్తోందని అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన 18 రోజుల్లో సుమారు రూ.19.80 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా. అత్యవసర సేవలకు 6 బస్సులు.. రీజియన్ వ్యాప్తంగా అత్యవసర సేవల కోసం ఆరు బస్సులను అధికారులు నడుపుతున్నారు. హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రితో పాటు ఇతర ముఖ్యమైన ఆస్పత్రులకు వైద్యసిబ్బందిని తరలించేందుకు వీటిని వినియోగిస్తున్నారు. వెలవెలబోతున్న బస్టాండ్లు.. నిత్యం ప్రయాణికులు, బస్సులతో రద్దీగా ఉండే ఉ మ్మడి జిల్లాలోని బస్టాండ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. దినసరి కూలీల పరిస్థితి దుర్భరం.. ప్రజా రవాణా నిలిచిపోవటంతో వీటినే నమ్ముకొని జీవిస్తున్న దినసరి కూలీలు, చిరు వ్యాపారుల పరిస్థితి దయనీయంగా మారింది. ఉపాధి దొరకక ప్రభుత్వాలు అందించే సాయం కోసం ఎదురుచూసే పరిస్థితి నెలకొంది. స్వచ్ఛంద సంస్థలు, వివిధ పార్టీల ప్రతినిధులు నిత్యావసర సరుకులు ఉచితంగా అందిస్తుండటం తాత్కలిక ఊరటనిస్తోంది. లాక్డౌన్ ఎత్తేస్తేనే.. గతేడాది సుదీర్ఘ సమ్మె.. తర్వాత లాక్డౌన్ ఆరీ్టసీని కోలుకోలేని దెబ్బతీశాయి. ఇప్పటికే రూ.కోట్ల నష్టాల్లో ఉంది. లాక్డౌన్తో పరిస్థితి మరింత దిగజారింది. లాక్డౌన్ ఎత్తేస్తేనే కొంతైన కోలుకునే అవకాశం ఉంది. – సూర్యనారాయణ, డివిజనల్ మేనేజర్, నాగర్కర్నూల్ బస్సులు లేక వెలవెలబోతున్న నాగర్కర్నూల్ బస్టాండ్ -
ఏంచేసి బతకాలి..?
కళ్లెదుటే ఎండుతున్న పంటలు పెద్దేముల్: కష్టపడి సాగుచేసిన పంటలు కళ్లెదుటే మాడిపొతున్నాయి. మూడు నెలల నుంచి బొట్టు వర్షం లేదు. వ్యవసాయ బోరు బావుల వద్ద వేసిన వరి పంటలు నీరందక మాడిపోతున్నాయి. కంది, పత్తి పంటలు వాడుపట్టాయి. పెట్టిన పెట్టుబడులు ఎలా తీర్చాలంటూ రైతులు లబోదిబోమంటున్నారు. పెద్దేముల్ మండలంలోని 33 రెవెన్యూ గ్రామాల్లో రైతులు 10వేల ఎకరాలకు పైగా కంది. పత్తి, వరి పంటలు సాగుచేశారు. ఖరీఫ్లో విత్తనాలు విత్తిన నాటి నుండి వరుణుడు కరుణించలేదు. ప్రస్తుతం మండలంలో వరి, పత్తి, కంది పంటలు పూర్తిగా పాడయ్యాయి. ఇప్పటికే చాలామంది రైతులు పనులు లేక వలసబాట పట్టారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
విజృంభిస్తున్న ఎండలు
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
పోలింగ్కు సర్వం సిద్ధం
రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు
ప్రజ్వల్పై కఠిన చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
Advertisement