-
లై‘సెన్సు’ తప్పనిసరి.. చాలామంది ఎల్ఎల్ఆర్ వద్దే ఆగిపోతున్నారు
సాక్షి,కర్నూలు: ప్రతి ఒక్కరికి దైనందిన జీవితంలో వాహనం ఒక భాగం అయిపోయింది. పని ఎటువంటిదైనా ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టాలంటే వారి ఆర్థిక స్థోమత బట్టి ఏదో ఒక వాహనం చేతిలో ఉండాల్సిందే. కరోనా మహమ్మారి అధిక శాతం మంది జీవన శైలిలో గణనీయమైన మార్పులు తీసుకొచ్చింది. దీంతో జనాలు గమ్యస్థానాలు చేరుకునేందుకు ప్రజా రవాణాలైన ఆటోలు, బస్సులు ఎక్కేందుకు పెద్దగా ఆసక్తి కనబర్చడంలేదు. ఎవరికి వారు ఉన్నంతలో సొంత వాహనాలు సమకూర్చుకుంటున్నారు. వాహనం నడిపే ప్రతిఒక్కరూ తప్పనిసరిగా లైసెన్స్ కలిగిఉండాలి. శాశ్వత లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం చట్టరీత్యా నేరం. ముందుగా ఎల్ఎల్ఆర్ తీసుకోవాలి ముందుగా లెర్నింగ్ లైసెన్స్ రిజిస్ట్రేషన్(ఎల్ఎల్ఆర్) తీసుకోవాలి. తరువాత రవాణా శాఖ కార్యాలయంలో శాశ్వత లైసెన్స్ ఇస్తారు. ఎల్ఎల్ఆర్ కోసం ముందుగా కామన్ సర్వీసు కేంద్రాలు, వార్డు, సచివాలయాల్లో స్లాట్ బుక్ చేస్తారు. కుదిరిన తేదికి స్లాట్ బుక్ చేసుకుని రవాణా శాఖ కార్యాలయానికి వెళ్తే పరీక్ష నిర్వహిస్తారు. అందులో పాసైన వారికి లెర్నింగ్ లైసెన్స్ ఇస్తారు. ఇది 6 నెలల పాటు అమల్లో ఉంటుంది. ఇది తీసుకున్న నెల రోజుల తరువాత శాశ్వత లైసెన్స్ పొందేందుకు అనుమతి వస్తుంది. కానీ అధిక శాతం మంది ఎల్ఎల్ఆర్తోనే సరిపెట్టుకుంటున్నారు. ప్రతి ఏడాది ఎల్ఎల్ఆర్ పొందినవారిలో కనీసం 10 వేల మందికి పైగా శాశ్వత లైసెన్స్ తీసుకోవడం లేదు. లైసెన్స్ లేకుండా వాహనం నడిపి రవాణా శాఖ అధికారులు, పోలీసులకు పట్టుబడితే వేల రూపాయలు అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. గతంతో పోలిస్తే జరిమానాలు పెరిగాయి. కావున ఎల్ఎల్ఆర్ తీసుకున్న వారు కచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని ఆర్టీఏ అధికారులు సూచిస్తున్నారు. కరోనాకు ముందు జిల్లాలో ప్రతి రోజూ ఎల్ఎల్ఆర్లు 250, శాశ్విత లైసెన్స్లు 250, స్లాట్ బుక్కింగ్కు అనుమతించే వారు. కర్ఫ్యూ నిబంధనలు సడలించిన నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ రెండు నెలల విరామం తరువాత సేవలు పునఃప్రారంభమయ్యాయి. చలానాలు... ఎల్ఎల్ఆర్ కోసం ద్విచక్ర వాహన చోదకులు రూ. 260, ద్విచక్ర వాహనంతో పాటు కారు లైసెన్స్ కావాలనుకునే వారు రూ.420 చలానా చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవాలి. ఎల్ఎల్ఆర్ పాసైన తర్వాత శాశ్వత లైసెన్స్ కోసం కూడా స్లాట్ బుక్ చేసుకోవాలి. ద్విచక్ర వాహనం కోసమైతే రూ.960, ద్విచక్ర వాహనంతోపాటు కారు అయితే రూ.1260 చలానా చెల్లించాలి. పట్టుబడితే భారీగా అపరాధ రుసుం లైసెన్స్ లేకుండా వాహనం నడిపి పట్టుబడితే భారీగా అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. జిల్లాలో సుమారు 1.30 లక్షల రవాణ వాహనాలున్నాయి. వీటి పర్యవేక్షణకు కర్నూలులో ఉప రవాణా శాఖ కార్యాలయం, ఆదోని, నంద్యాలలో ప్రాంతీయ రవాణా కార్యాలయాలు, డోన్, ఆత్మకూరు ప్రాంతాల్లో మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాలున్నాయి. అక్కడ ఎల్ఎల్ఆర్, శాశ్విత లైసెన్స్లు పొందవచ్చు. – రాజ్గోపాల్, ఎంవీఐ -
ట్రాఫిక్ రూల్స్ పాటించకుంటే కేసులే..
సాక్షి, సిటీబ్యూరో: రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. పెలియన్ రైడర్కు హెల్మెట్ లేకున్నా, వాహనాలకు సైడ్ మిర్రర్లు లేకున్నా ఈ–చలాన్లు జారీ చేస్తున్న వీరు.. ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలకు ఆస్కారం ఉన్న లెర్నింగ్ లైసెన్స్(ఎల్ఎల్) వ్యక్తులపై దృష్టి సారించారు. ఎల్ఎల్ చేతికి వచ్చిన వెంటనే శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ అన్నట్లుగా ఊహించుకుంటూ సరిగా డ్రైవింగ్ రాకుండానే రోడ్లెక్కి ప్రమాదాలకు కారణం అవుతున్నట్లుగా సైబరాబాద్ పోలీసుల అధ్యయనంతో తేలింది. వీరు చాలా వరకు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడంతో మోటారు వెహికల్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నారు. ఇలా మూడు రోజులుగా ఇప్పటి వరకు 18 కేసులు నమోదు చేశారు. ప్రత్యేక డ్రైవ్ చేపట్టాం.. ప్రతిరోజూ వీరిపై నిఘా ఉంచి వారి ఎల్ఎల్ తీసుకొని నిబంధన ప్రకారం రద్దు కోసం ఆర్టీఏ అధికారులకు పంపిస్తాం. ‘లెర్నింగ్ లైసెన్స్ ఉన్న వ్యక్తి డ్రైవింగ్ చేస్తున్నప్పుడూ అతడితో డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వ్యక్తి ఉండాలనే నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. వాహనం ముందు, వెనక భాగంలో ఎల్ అనే ప్లేట్ను కూడా పెట్టుకోవడం లేదు. కొంతమంది ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ కూడా వాడటం లేదు. నేర్చుకుందామని రోడ్లపైకి వచ్చి నిర్లక్ష్యంగా నడుపుతున్నారు. ఇలా వివిధ ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తూ ప్రమాదాలకు కారణం అవుతున్నారు. అందుకే లెర్నింగ్ లైసెన్స్ వ్యక్తులపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాం. – విజయ్కుమార్, సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ -
గడువు దాటిన ఎల్ఎల్ఆర్లు ఎలా?
సాక్షి, సిటీబ్యూరో: లెర్నింగ్ లైసెన్స్ (ఎల్ఎల్ఆర్) తీసుకోవాలనుకుంటున్నారా? అయితే కనీసం నెల రోజులు ఎదురు చూడాల్సిందే! కొత్తగా డ్రైవింగ్ నేర్చుకొనేందుకు అనుమతినిచ్చే ఎల్ఎల్ఆర్ కోసం నగరంలో డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. కోవిడ్ నిబంధనలదృష్ట్యా పౌరసేవలపై రవాణాశాఖ ఆన్లైన్ స్లాట్లను గణనీయంగా తగ్గించింది. దీంతో వాహన వినియోగదారులు తమకు కావాల్సిన సేవలను పొందేందుకు నెలల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. గతంలో ఒకట్రెండు రోజుల్లోనే స్లాట్లు లభించేవి. డిమాండ్కు అనుగుణంగా అందుబాటులో ఉండడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా పౌరసేవలను వినియోగించుకున్నారు. కానీ కోవిడ్ కట్టడికి విధించిన పరిమితుల దృష్ట్యా పడిగాపులు కాయాల్సి వస్తోంది. లెర్నింగ్ లైసెన్సు పొందిన వినియోగదారులు 6 నెలల్లో శాశ్వత డ్రైవింగ్ లైసెన్సు తీసుకోవాలి. స్లాట్ల కొరత కారణంగా ఎంతోమంది ఆ అవకాశాన్ని కోల్పోతున్నారు. గడువు ముగిసిన లెర్నింగ్ లైసెన్సులు పొడిగించుకోవడం కూడా సాధ్యం కాకపోవడంతో పలువురు తమకు ఉన్న అర్హతను కోల్పోవాల్సివస్తోంది. వాహనాల రిజిస్ట్రేషన్లు, గడువు ముగిసిన పర్మనెంట్ లైసెన్సుల రెన్యూవల్ కోసం కూడా ఆన్లైన్లో భారీ ఎత్తున క్యూలో ఉండాల్సి వస్తోంది. ఆర్టీఏ కార్యకలాపాలు మొదలైనప్పటికీ స్లాట్లు పెంచకపోవడం వల్లే డిమాండ్ పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. భారీగా స్లాట్ల కుదింపు.. ఖైరతాబాద్ కేంద్ర కార్యాలయంలో సాధారణంగా రోజుకు 300 ఎల్ఎల్ఆర్ స్లాట్లు అందుబాటులో ఉంటాయి. వినియోగదారులు సైతం ఇంచుమించు అదేస్థాయిలో ఉంటారు. 150 నుంచి 180 కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ల కోసంస్లాట్లు ఉంటాయి. కానీ.. కోవిడ్ నిబంధనలను దృష్టిలో ఉంచుకొని భారీగా తగ్గించారు. ఎల్ఎల్ఆర్ స్లాట్లు కేవలం 25 నుంచి 30కే పరిమితం చేశారు. దీంతో ఈ కార్యాలయం పరిధిలో లెర్నింగ్ లైసెన్సు కోసం స్లాట్ నమోదు చేసుకోవాలంటే నెల రోజులు ఆగాల్సి వస్తోంది. ఒక్క ఖైరతాబాద్లోనే కాకుండా ఉప్పల్, ఇబ్రహీంపట్నం, అత్తాపూర్, సికింద్రాబాద్, మెహిదీపట్నం, మేడ్చల్.. ఇలా అన్ని ఆర్టీఏ కేంద్రాల్లో స్లాట్ల కుదింపుతో లెర్నింగ్ లైసెన్సుల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్యలో రోజు రోజుకూ పెరుగుతోంది. వాహనాల రిజిస్ట్రేషన్లు, శాశ్వత డ్రైవింగ్ లైసెన్సుల రెన్యూవల్ కూడా 50 స్లాట్లకే పరిమితం చేశారు. నాగోల్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్లో సాధారణంగా రోజుకు 350 నుంచి 400 మందికి పరీక్షలు నిర్వహించి లైసెన్సులకు అర్హతను ధ్రువీకరిస్తారు. కానీ.. ఇప్పుడు అక్కడ సైతం 50 స్లాట్లకే పరిమితం చేశారు. నాగోల్తో పాటు కొండాపూర్ తదితర డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గడువు దాటిన ఎల్ఎల్ఆర్లు ఎలా? లెర్నింగ్ లైసెన్సులకు 6 నెలల పరిమితి ఉంటుంది. ఉదాహరణకు గతేడాది నవంబర్లో లెర్నింగ్ లైసెన్సు తీసుకున్నవారు ఈ ఏడాది ఏప్రిల్లో పర్మనెంట్ లైసెన్స్ పరీక్షలకు హాజరుకావాలి. గత డిసెంబర్లో లెర్నింగ్ లైసెన్స్ తీసుకున్నవారు మే నెలలో శాశ్వత లైసెన్స్ పరీక్షలకు హాజరు కావాలి. స్లాట్లు లభించకపోవడంతో వందలాది మంది తమ లెర్నింగ్ లైసెన్సు అర్హతను కూడా కోల్పోవాల్సివస్తోంది. మరోవైపు కాలపరిమితి దాటిన లెర్నింగ్ లైసెన్సుల గడువు పొడిగించాలన్నా స్లాట్లు లభించకపోవడం సమస్యగానే పరిణమించింది. -
నేటి నుంచి ఎల్ఎల్ఆర్ మేళా !
రవాణాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు నేటి నుంచి 23వ తేదీ వరకు మళ్లీ ఎల్ఎల్ఆర్ మేళాలు నిర్వహించనున్నారు. రోజుకు రెండు గ్రామాల చొప్పున 15 గ్రామాల్లో లెర్నింగ్ లైసెన్సులు జారీ చేస్తారు. స్పాట్లో స్లాట్ బుక్ చేసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని డీటీసీ మీరాప్రసాద్ చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విజయవాడ: రవాణాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు సోమవారం నుంచి ఈనెల 23 వరకు ఎల్ఎల్ఆర్ మేళాలు నిర్వహించనున్నారు. రోజుకు రెండు గ్రామాల చొప్పున 15 గ్రామాల్లో లెర్నింగ్ లైసెన్స్లు జారీ చేసేందుకు మేళాలు నిర్వహిస్తున్నట్లు కృష్ణాజిల్లా డెప్యూటీ ట్రాన్స్పోర్టు కమిషనర్ ఇ.మీరాప్రసాద్ తెలిపారు. స్పాట్లో ఎల్ఎల్ఆర్ స్లాట్లు బుక్ చేసేందుకు రవాణా శాఖ ద్వారా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ఈ అవకాశాన్ని గ్రామీణ ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. మేళాలు నిర్వహించే గ్రామాలు.. ♦ 17న పెనమలూరు మండలం యనమలకుదురు, విజయవాడలోని రామకృష్ణాపురం, 18న కంకిపాడు మండలం తెన్నేరు, మంతెన, 19న జి.కొండూరు మండలం కవులూరు, 20న గన్నవరం, పెనమలూరు, 21న జి.కొండూరు మండలం వెలగలేరు, విజయవాడ రూరల్ మండలం నున్న, 22న గణపవరం, పెనమలూరు మండలం గోసాల, 23న విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి, జి.కొండూరు మండలం వెల్లటూరులో ఎల్ఎల్ఆర్ మేళాలు నిర్వహిస్తారు. అర్హతలు ఇవి.. ♦ 18 ఏళ్లు వయస్సు పూర్తయిన సర్టిఫికెట్ ఉండాలి. ♦ ఆధార్ కార్డు జత చేయాలి. ♦ ఒక పాస్పోస్టు సైజు పోర్టు అవసరం. ♦ 50ఏళ్లు, ఆపైబడిన వయస్సు ఉన్న వారు ఫారం 1ఏతో మెడికల్ సర్టిఫికెట్ జతచేయాలి. ♦ బైక్, కారులో ఒక దానికి రూ. 260లు, రెండింటికి కలిపి రూ. 410లు ఎల్ఎల్ఆర్ ఫీజు చెల్లించాలి. -
ఎల్ఎల్ఆర్ గాలం!
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ నేతలు అందివచ్చే ప్రతి అవకాశాన్నీ వినియోగించుకుంటున్నారు. నాలుగు ఓట్లు రాలుతాయంటే ఎవరినైనా భయపెడుతున్నారు. ఏ పనైనా చేస్తామంటున్నారు. ఇటీవల కాలంలో ఆర్టీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎల్ఎల్ఆర్ మేళాలు కూడా అలాంటివే. మధ్యతరగతి యువతకు ఎల్ఎల్ఆర్ పేరుతో గాలం వేసి తమవైపు తిప్పుకునేందుకు నేతలు సిద్ధమయ్యారు. అందుకే ఎల్ఎల్ఆర్ మేళా కాస్త ఎన్నికల మేళాలను తలపిస్తున్నాయి. అనంతపురం సెంట్రల్: జిల్లాలో అధికారపార్టీ ప్రజాప్రతినిధులు ఆర్టీఏ అధికారులను ఎన్నికల పావులుగా వాడుకుంటున్నారా? లెసెన్స్ పేరుతో ఓట్ల రాజకీయానికి తెరలేపారా? మధ్య తరగతి యువతను లక్ష్యం చేసుకుని ప్రణాళిక సిద్ధం చేశారు? ఇటీవల నిర్వహిస్తున్న ఎల్ఎల్ఆర్ మేళాలను చూస్తే అవన్నీ నిజమేననిపిస్తోంది. కరువుకు చిరునామాగా మారిన జిల్లాలో ఉపాధి అవకాశాలు లేక ఎక్కువ మంది యువత మోటారు ఫీల్డ్ వైపు ఆసక్తి చూపుతున్నారు. అందులో భాగంగానే ఆటో, ట్యాక్సీ, కారు డ్రైవర్లుగా ఉపాధి పొందుతున్నారు. రోడ్డు నిబంధనల ప్రకారం వీరందరికీ లైసెన్స్ కావాలి. మరోవైపు ఇటీవల ద్విచక్రవాహనాల సంఖ్య పెరగడం.. పోలీసుల తనిఖీలు ముమ్మరం కావడంతో లైసెన్స్ల ప్రాధాన్యం పెరిగింది. దీన్ని అందిపుచ్చుకున్న అధికారపార్టీ నేతలు తమ నియోజకవర్గాల్లో ఎల్ఎల్ఆర్ మేళాలు నిర్వహించాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. మేళాలో అన్నీ తామై వ్యవహరించి యువత ఓట్లకు గాలం వేస్తున్నారు. రోజుకు ఆర్టీఏ కార్యాలయంలో 60 మందికి మాత్రమే ఎల్ఎల్ఆర్ టెస్ట్ నిర్వహించే ఆర్టీఏ అధికారులు కూడా ఎమ్మెల్యేల వద్ద మెప్పు పొందేందుకు మేళాలు నిర్వహిస్తూ వందల మందికి లెర్నింగ్ లైసెన్స్లు ఇచ్చేస్తున్నారు. నిబంధనలకు భయపడి... ప్రస్తుతం డ్రైవింగ్ లైసెన్స్ పొందడం సామాన్యులకు గగనంగా మారుతోంది. నేరుగా ఆర్టీఏ కార్యాలయానికి వెళ్తే సవాలక్ష నిబంధనలు చెబుతున్నారు. అన్నీ దాటుకుని ఎల్ఎల్ఆర్ టెస్ట్కు వెళ్లినా అక్కడ పాసవుతామన్న నమ్మకం లేదు. దీన్ని అవకాశంగా తీసుకున్న అధికారపార్టీ నేతలు తమ ఆధ్వర్యంలో ఎల్ఎల్ఆర్ మేళాలు నిర్వహిస్తున్నారు. ఇలా గత నెలలో తాడిపత్రిలో 6 రోజులు ఎల్ఎల్ఆర్ మేళా నిర్వహించి 3,400 మందికి, ఉరవకొండలో ఏకంగా 20 రోజులు నిర్వహించి 10 వేల మంది, ధర్మవరంలో 12 రోజుల పాటు మేళా నిర్వహించి 4వేల మందికి లెర్నింగ్ లైసెన్స్లు మంజూరు చేయించారు. ఇవన్నీ ఆర్టీఏ అధికారులు స్వతహాగా చేసినవి కావు. రాజకీయ ప్రయోజనాలకోసమే.. ఆర్టీఏ అధికారులు ఆయా నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న ఎల్ఎల్ఆర్ మేళాలో అధికారపార్టీ చోటా నాయకులు హల్చల్ చేస్తున్నారు. తమ నేత చెప్పారు కాబట్టే మేళా ఏర్పాటు చేశారనీ, ఆయన చెప్పినట్లు వింటే లైసెన్స్లు కూడా ఇప్పిస్తామంటూ అక్కడకొచ్చిన యువతకు చెబుతున్నారు. పరోక్షంగా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. ఆర్టీఏ అధికారుల వింత వైఖరి ఆన్లైన్లో బుక్ చేసుకుంటే నెలన్నర తర్వాత స్లాట్ బుక్ అవుతోంది. అది కూడా రోజుకు పరిమిత సంఖ్యలో ఎల్ఎల్ఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలో అయితే రోజుకు 60 మందికి మాత్రమే అధికారులు అవకాశం కల్పిస్తున్నారు. ఫలితంగా వాహనదారుడు దరఖాస్తు చేసుకున్న నెలన్నర, రెండు నెలలకు అవకాశం వస్తోంది. ఆ సమయంలో అధికారులు ఫెయిల్ చేస్తే మరో రెండు నెలలు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ నేతలు ఏర్పాటు చేస్తున్న మేళాలకు పరుగులు తీస్తున్నారు. అక్కడైతే ఇదే ఆర్టీఏ అధికారులు రోజులు వందల సంఖ్యలో లెర్నింగ్ లైసెన్స్లు మంజూరు చేస్తున్నారు. నేరుగా కార్యాలయానికి వెళ్తే మాత్రం చుక్కలు చూపుతున్నారు. అందువల్లే ఈ మేళాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. అందుకే నేతలంతా ఒకటికి రెండు సార్లు తమ నియోజకవర్గాల్లో ఎల్ఎల్ఆర్ మేళాలు నిర్వహించాలని ఆర్టీఏ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. డిమాండ్ ఉన్న చోట నిర్వహిస్తున్నాం అందరికీ డ్రైవింగ్ లైసెన్స్లు ఉండాలనే ఉద్దేశంతోనే మేళాలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. ప్రజాప్రతినిధులు అడిగచోట్ల కూడా మేళాలు నిర్వహిస్తున్నాం. ఇందులో రాజకీయాలకు తావు లేదు. ప్రజల నుంచే వ్యక్తిగతంగా చలానా మొత్తాలను స్వీకరిస్తున్నాం. ప్రభుత్వ భవనాల్లోనే నిర్వహిస్తున్నాం. – సుందర్వద్దీ, ఉపరవాణా కమిషనర్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement