-
అసైన్డ్ భూములను ఏం చేద్దాం?
అన్యాక్రాంతమైన భూములపై సర్కారు తర్జనభర్జన - రాష్ట్రంలో 98 వేల ఎకరాలు పరాధీనం - పరిశీలనలో గుర్తించిన టాస్క్ఫోర్స్ కమిటీ - క్రమబద్ధీకరించాలన్న దిశగా ప్రభుత్వ యోచన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అసైన్డ్ భూముల అన్యాక్రాంతంపై ప్రభుత్వం దృష్టి సారించింది. అయితే వాటిని చట్టం ప్రకారం తిరిగి స్వాధీనం చేసుకోవాలా లేక చట్టాలను సవరించి పొజిషన్లో ఉన్నవారికే క్రమబద్ధీకరించాలా అని తర్జనభర్జన పడుతోంది. 98 వేల ఎకరాలు పరాధీనం రాష్ట్రంలో ఇప్పటివరకు అసైన్ చేసిన భూముల్లో సుమారు 98 వేల ఎకరాల మేర పరాధీనమైనట్టు తేలింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 22 లక్షల ఎకరాలకు పైగా భూములను పేదలకు అసైన్ చేశారు. కానీ అందులో 14.28 లక్షల ఎకరాలను మాత్రమే పంపిణీ చేశారు. ఈ 14 లక్షల పైచిలుకు ఎకరాల్లో 98 వేల ఎకరాలకుపైగా అన్యాక్రాంతమయ్యాయని.. ఒకరికి అసైన్ చేస్తే ఇతరులెవరో అనుభవిస్తున్నారని వెల్లడైంది. సీనియర్ ఐఏఎస్ అధికారి ఎస్.కె.సిన్హా నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ కమిటీ.. జిల్లా కలెక్టర్ల నుంచి సమాచారం తీసుకుని ప్రభుత్వానికి నివేదించినట్టు తెలుస్తోంది. పలు ఇబ్బందులు కూడా..! పీవోటీ చట్టం ప్రకారం అసైన్డ్ భూమి అన్యాక్రాంతమైతే దానిని ప్రభుత్వం బేషరతుగా స్వాధీనం చేసుకోవచ్చు. అయితే ఇందులో కొన్ని సమస్యలు ఉన్నాయని రెవెన్యూ వర్గాలు పేర్కొంటున్నాయి. రిజిస్ట్రేషన్ పత్రాలు సహా పక్కా సాక్ష్యాలు లేకుండా ఆ భూములను స్వాధీనం చేసుకోవడం కుదరదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంటే అసైన్ భూమిలో ఎవరున్నా.. ఆ భూమి ఎవరి పేరు మీద రిజిస్టరై ఉంది, ఆ వ్యక్తి అనుభవంలో ఉన్నాడా? అనే దానిపై రెవెన్యూ యంత్రాం గం సాక్ష్యాలను సేకరించాల్సి ఉంటుంది. కానీ అలా చేస్తే జాప్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలోని 77 వేల ఎకరాల్లో పీవోటీ ఉల్లంఘనలు కనిపిస్తుంటే ఇప్పటివరకు 4,135 కేసులు నమోదు చేసి.. 3,705 ఎకరాలను స్వాధీనం చేసుకోగలిగారు. క్రమబద్ధీకరిస్తే భారీగా ఆదాయం ఈ అంశంలో ప్రభుత్వం వద్దకు మరో ప్రతిపాదన వచ్చింది. ఎలాగూ ప్రభుత్వ భూములక్రమబద్ధీకరణ ఎప్పటి నుంచో కొనసాగుతున్నందునా ... అసైన్డ్ భూములనూ క్రమబద్ధీకరించాలని, తద్వారా ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం వస్తుందని సూచనలు అందాయి. దీనికి ప్రభుత్వం అంగీకరిస్తే.. పీవోటీ చట్టాన్ని సవరించాల్సి ఉంటుంది. ఇక క్రమబద్ధీకరిస్తే.. మార్కెట్ విలువలో ఎంత శాతం వరకు రుసుము కింద తీసుకోవాలనే దానిపైనా చర్చలు జరుగుతున్నాయి. అన్యాక్రాంతమైన భూమి ఉన్న ప్రాంతాన్ని బట్టి ఈ రుసుములో మార్పులు చేయాలని... ఎన్నేళ్లుగా ఆ భూమి అనుభవిస్తున్నారు, ఆ భూమిలో ఏం చేస్తున్నారన్న అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని.. భారీ జరిమానాతో క్రమబద్ధీకరించుకునే అవకాశం ఇవ్వవచ్చని రెవెన్యూ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇంకా తేలలేదు. వేల కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతమైన అసైన్డ్ భూముల విలువ వేల కోట్ల రూపాయలు ఉంటుందని అం చనా. రంగారెడ్డి జిల్లాలో వేల ఎకరాలకుపైగా ఇతరుల చేతుల్లో ఉన్నట్లు టాస్క్ఫోర్స్ నివేది కలో తేలింది. ఈ జిల్లాలో ఇప్పటివరకు 87,064 వేల ఎకరాల మేర అసైన్ చేయగా.. 9,885 ఎకరాల్లో మాత్రమే అసలైన పట్టాదారులు ఉన్నారు. మిగతా 77,179 ఎకరాల్లో పీవోటీ చట్టం ఉల్లంఘనలు ఉన్నట్లు అంచనా. ఇందులో కనీసం 20 వేలకుపైగా ఎకరాల్లో ఇతరులు పాగా వేశారని చెబుతున్నారు. ముఖ్యంగా సరూర్నగర్, బాలాపూర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, షాద్నగర్, చేవెళ్ల, శంషాబాద్, ఇబ్రహీంపట్నం, కుత్బుల్లాపూర్, ఉప్పల్, మేడ్చల్ లాంటి డిమాండ్ ఉన్న చోట్ల పెద్ద ఎత్తున ఈ భూములు చేతులు మారినట్టు అధికారులు గుర్తించారు. అన్యాక్రాంతమైన భూములు 98 వేల ఎకరాలు పీవోటీ చట్టం ఉల్లంఘన 77 వేల ఎకరాలు పీవోటీ ఉల్లంఘనులపై నమోదైన కేసులు 4,135 స్వాధీనం చేసుకున్నవి 3,705 ఎకరాలు -
రెవెన్యూలో గాడి తప్పిన పాలన
⇒ భూపరిపాలన ప్రధాన కమిషనర్ పోస్టు ఆర్నెల్లుగా ఖాళీ ⇒ ప్రభుత్వ పథకాల అమలుపై సిబ్బందికి దిశానిర్దేశం కరువు ⇒ ఏళ్లు గడుస్తున్నా ముగియని క్రమబద్ధీకరణ ప్రక్రియ సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ శాఖలో పాలన గాడి తప్పింది. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు యంత్రాంగానికి దిశానిర్దేశం చేయాల్సిన పెద్దదిక్కు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. రెవెన్యూ విభాగంలోనే ఎంతో కీలకమైన భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) పోస్టు గత ఆరు నెలలుగా ఖాళీగానే దర్శనమిస్తోంది. ప్రభుత్వం.. గత రెండున్నరేళ్లుగా ఈ పోస్టు భర్తీ పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. దీంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడేనన్న చందంగా తయారైంది. దీంతో రెండేళ్ల కిత్రం ప్రభుత్వం ప్రారంభించిన భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియ (జీవో 59) కథ నేటికీ కంచికి చేరలేదు. మరోవైపు లక్షల సంఖ్యలో వచ్చిన సాదా బైనామాల క్రమబద్ధీకరణ దరఖాస్తులకు మోక్షం కలగడం లేదు.కంచికి చేరని క్రమబద్ధీకరణ కథ అన్యాక్రాంతమైన ప్రభుత్వ స్థలాల్లో నివాసముంటున్న వారికి ఆయా భూములను క్రమబద్ధీకరిచేందుకు 2014 డిసెంబరులో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అల్పాదాయ వర్గాలకు 125 గజాలలోపు స్థలాలను ఉచిత కేటగిరీలో, ఉన్నత వర్గాలకు చెల్లింపు కేటగిరీలో ఆయా స్థలాలను క్రమబద్ధీకరించాలని ఉత్తర్వులలో పేర్కొంది. ఈ ప్రక్రియ అంతటినీ మూడు నెలల్లోగా పూర్తి చేయాల్సి ఉండగా, రెండేళ్లు దాటినా చెల్లింపు కేటగిరీ దరఖాస్తులకు పూర్తిగా మోక్షం కలగలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పలుమార్లు గడువును పొడిగించినా, క్రమబద్ధీకరణ ప్రక్రియ కోసం ఏర్పాటు చేసిన ఆన్లైన్ వ్యవస్థ సరిగా పనిచేయక క్షేత్రస్థాయి సిబ్బంది నానా అవస్థలు పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20 వేల దరఖాస్తులు ఇంకా పెండింగ్లో ఉన్నాయని, పెద్దనోట్ల రద్దు ప్రభావంతో దరఖాస్తు దారులు సకాలంలో సొమ్ము చెల్లించలేకపోయారని పలు జిల్లాల కలెక్టర్లు చెబుతున్నారు. మరో ఆరు నెలల పాటు గడువు పెంచాలని కొందరు జిల్లా కలెక్టర్లు నెలరోజుల క్రితమే ప్రభుత్వానికి లేఖ రాసినా ఉన్నతాధికారుల నుంచి స్పందన లేదు. మరోవైపు తాము పూర్తిస్థాయిలో సొమ్ము చెల్లించినప్పటికీ, తమ స్థలాలను క్రమబద్ధీకరణ చేయకపోవడం పట్ల దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. సాదాబైనామాలకూ కలగని మోక్షం గ్రామీణ ప్రాంతాల్లో పేద రైతులు తెల్లకాగితాలపై రాసుకున్న భూముల క్రయ విక్రయాలను (సాదా బైనామా) కూడా క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం 2016 జూన్లో ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 11.16 లక్షల దరఖాస్తులు అందగా.. ఇప్పటివరకు క్రమబద్ధీకరణకు ఆదేశాలిచ్చింది మాత్రం 34 వేల మంది రైతులకే కావడం గమనార్హం. మొత్తం దరఖాస్తుల్లో 2.93 లక్షల దరఖాస్తులను వివిధ కారణాలతో అధికారులు తిరస్కరించినప్పటికీ, ఇంకా ఆరున్నర లక్షలమంది దరఖాస్తు దారులకు సాదా బైనామాలను ప్రభుత్వం ఎప్పుడు క్రమబద్ధీకరిస్తుందో అర్ధంకాని పరిస్థితి నెలకొంది. మరోవైపు హైదరాబాద్, వరంగల్ నగరాల పరిధిలోని కొన్ని మండలాలలో సాదా బైనామాల క్రమబద్ధీకరణను తొలుత నిషేధించిన ప్రభుత్వం, ఆపై నిషేధాన్ని సడలిస్తూ గత డిసెంబరులో జీవో నెంబరు 294 జారీచేసింది. అయితే కొన్ని మండలాల్లో సాదా బైనామాల క్రమబద్ధీకరణపై నిషేధాన్ని ప్రభుత్వం సడలించినా, ఆయా మండలాలలో క్రమబద్ధీకరణకు కొత్తగా దరఖాస్తులను స్వీకరించేందుకు సీసీఎల్ఏ ఆదేశాలు జారీ చేయలేదు. దీంతో దరఖాస్తు చేసుకుందామనుకున్న రైతులు నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. కొత్త జిల్లాల్లో భర్తీ కాని పోస్టులు మరోవైపు కొత్త జిల్లాలతో కొత్తగా 125 మండలాలు, 25 రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఆయా పోస్టులలో పూర్తిస్థాయి తహసీల్దార్లను, ఆర్డీవోలను నియమించలేదు. మరోవైపు భూమి రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసే నిమిత్తం క్షేత్రస్థాయిలో రెవెన్యూ యంత్రాంగం కోసం సీసీఎల్ఏ అధికారులు రూ. 5 కోట్లతో కొనుగోలు చేసిన టాబ్లెట్ పీసీలు, గత రెండు నెలలుగా మూలనపడి పాడవుతున్నాయి. -
సాదాబైనామా ఉంటేనే క్రమబద్ధీకరణ
- దరఖాస్తుల పరిశీలనపై స్పష్టతనిచ్చిన సీసీఎల్ఏ - దరఖాస్తులను 4 కేటగిరీలుగా విభజించాలని ఆదేశాలు - 1,2 కేటగిరీలను వెంటనే పరిశీలించాలని సూచన సాక్షి, హైదరాబాద్: సాదాబైనామా పత్రాలను జతచేసిన దరఖాస్తులను మాత్రమే భూముల క్రమబద్ధీకరణకు పరిగణనలోకి తీసుకోవాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్ఏ) రేమండ్ పీటర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. తెల్లకాగితాలపై రాసుకున్న వ్యవసాయ భూముల కొనుగోలు ఒప్పందాలను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా అధికారుల అంచనాకు మించి 11 లక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. అయితే సాదాబైనామాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల్లో కొన్ని అంశాల్లో స్పష్టత లేకపోవడంతో, పత్రాలు లేకుండా భూమి సాగులో ఉన్నవారు, సాదాబైనామా కాకుండా ఇతర డాక్యుమెంట్లు ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఈ తరహా దరఖాస్తులే అధికంగా ఉండడంతో పరిశీలన లో పాటించాల్సిన నిబంధనల విషయంలో తగిన మార్గదర్శకాలు ఇవ్వాలని తహసీల్దార్లు మొరపెట్టుకున్నారు. ఈ మేరకు సీసీఎల్ఏ తాజాగా సర్క్యులర్ జారీచేశారు. సాదాబైనామా క్రమబద్ధీకరణ ప్రక్రియ కేవలం గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూములకు సంబంధించిన అంశం మాత్రమేనని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, ఎంతోమంది పట్టణ ప్రాంతాల్లో సాదాబైనామాతో కొనుగోలు చేసిన ఇళ్లు, స్థలాలు, ప్రభుత్వ సీలింగ్ భూములను క్రమబద్ధీకరించాలని దరఖాస్తు పెట్టుకున్నట్లు అధికారుల ప్రాథమిక పరిశీలనలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో అలాంటి దరఖాస్తులను పూర్తిగా పక్కన పెట్టాలని సీసీఎల్ఏ సూచించారు. వ్యవసాయ భూముల్లోనూ నాలుగు కేటగిరీలు.. పట్టణ ప్రాంతాలు, ఇళ్లు, స్థలాల సంగతి పక్కనపెడితే, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూములకు సంబంధించిన దరఖాస్తుల్లోనూ బోలెడు సమస్యలు ఉత్పన్నమయ్యాయి. సాదాబైనామా అంటే.. తెల్లకాగితం లేదా మరేదైనా కాగితంపై రాసుకున్న రిజిస్ట్రేషన్ కాని పత్రంగా ఉత్తర్వుల్లో పేర్కొనగా, ఎంతోమంది తప్పుగా అర్థం చేసుకున్నారని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. కొంతమంది సాదాబైనామాలు లేకుండా అన్నదమ్ముల మధ్య జరిగిన ఆస్తి పంపకాలు, పెద్దవాళ్లు పిల్లల పేరిట రాసిన వీలునామాలు.. తదితర పత్రాలు సమర్పించినట్లు వారు తెలిపారు. ఈ నేపథ్యంలోనే గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూములకు సంబంధించి వచ్చిన దరఖాస్తులను కూడా నాలుగు కేటగిరీలుగా విభజించాలని రెవెన్యూ అధికారులకు సీసీఎల్ఏ సూచించారు. యూఎల్సీ స్థలాలను స్వాధీనం చేసుకుంటాం: సీసీఎల్ఏ క్రమబద్ధీకరణకు అవకాశం ఇచ్చినా దరఖాస్తు చేసుకోని వారి నుంచి యూఎల్సీ ఖాళీస్థలాలను స్వాధీనం చేసుకుంటామని భూపరిపాలన ప్రధాన కమిషనర్ రేమండ్ పీటర్ పేర్కొన్నారు. ఈ మేరకు హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చినట్లు ఆయన తెలిపారు. యూఎల్సీ ఖాళీస్థలాల క్రమబద్ధీకరణకు ఈ నెల 25తో గడువు ముగిసిందని, ఇకపై గడువు పొడిగించే ప్రసక్తి లేదని చెప్పారు. ఆ నాలుగు.. ►సాదాబైనామా కలిగి ఉండి, రెవెన్యూ రికార్డుల్లో పేరు నమోదైన రైతే ప్రస్తుతం సాగులో ఉండడం. ►సాదాబైనామా ఉన్న రైతు పేరు రెవెన్యూ రికార్డుల్లో నమోదు కాకున్నా, సాగులో ఉన్నట్లు రుజువు ఉండడం. ►సాదాబైనామా లేకుండా రెవెన్యూ రికార్డుల్లో పేరు నమోదైన రైతు సాగులో ఉండడం. ►సాదాబైనామా లేకుండా రెవెన్యూ రికార్డుల్లో పేరు నమోదు కాకుండా సాగులో ఉన్న రైతు. నాలుగు కేటగిరీల్లో దరఖాస్తులను విభజిం చాక, తొలిదశలో 1,2 కేటగిరీలకు సంబంధించి న దరఖాస్తులను వెంటనే పరిశీలన ప్రారంభిం చాలని సీసీఎల్ఏ అధికారులను ఆదేశించారు. మిగిలిన 3,4 కేటగిరీల కిందకు వచ్చే దరఖాస్తుల క్రమబద్ధీకరణ విషయమై త్వరలోనే మరింత స్పష్టత ఇవ్వనున్నట్లు సీసీఎల్ఏ తెలిపారు. -
క్రమబద్ధీకరణ 15 శాతమే!
♦ భూముల క్రమబద్ధీకరణకు ఆన్లైన్ సమస్యలు ♦ దరఖాస్తుల్లో 15 శాతానికి మించని రిజిస్ట్రేషన్లు ♦ కొంచెం నివాసం, మరికొంత వాణిజ్య ప్రాంతంతో సమస్యలు ♦ అధికారుల మధ్య సమన్వయ లోపమే కారణమని ఆరోపణలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. వివిధ దశల్లో ఆన్లైన్ సమస్యలు చుట్టుముడుతుండడంతో క్షేత్రస్థాయిలో సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. ఏడాది క్రితమే సొమ్ము చెల్లించినా భూములను రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ భూముల్లో నివాసాలేర్పరచుకున్న మధ్య, ఉన్నత వర్గాలకు నిర్దేశిత ధర చెల్లిస్తే ఆయా భూములను క్రమబద్ధీక రించాలని ప్రభుత్వం జీవో 59లో పేర్కొన్న సంగతి తెలిసిందే. 2014 డిసెంబర్లో ఈ జీవో జారీ కాగా, రాష్ట్రవ్యాప్తంగా 28,248 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రభుత్వానికి వచ్చిన దరఖాస్తుల్లో ఇప్పటివరకు అధికారులు క్రమబద్ధీకరించినవి 15 శాతం లోపే కావడం గమనార్హం. చెల్లింపు కేటగిరీలో క్రమబద్ధీకరణ నిమిత్తం భూపరిపాలన అధికారులు కొనుగోలు చేసిన సాఫ్ట్వేర్లో రోజుకోరకమైన సమస్యలు తలెత్తుండడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. సాఫ్ట్వేర్ను అందించిన సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, క్రమబద్ధీకరణ ప్రక్రియను పర్యవేక్షిస్తున్న అధికారుల మధ్య సమన్వయం కొరవడడంతో అంతా గందరగోళంగా తయారైందని క్షేత్రస్థాయిలో రెవెన్యూ సిబ్బంది వాపోతున్నారు. కమర్షియల్తో కిరికిరి..! ప్రభుత్వ భూముల్లో నివాసాలేర్పరచుకున్న వారికి ఆయా భూములను రెసిడెన్షియల్ కేటగిరీ కింద రిజిస్ట్రేషన్ బేసిక్ వాల్యూలో 25శాతం, వాణిజ్య కేటగిరీలోనైతే పూర్తి సొమ్ము చెల్లిస్తే ఆయా భూములను క్రమబద్ధీకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, నగర, పట్టణ ప్రాంతాల్లో ఎంతోమంది ఆర్థికంగా కలసివస్తుందని తమ ఇంటి ఆవరణల్లోనే గదుల(దుకాణాల)ను ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సదరు ఇల్లు వాణిజ్య కేటగిరీనా, రెసిడెన్షియల్ కేటగిరీనా అన్న అంశాన్ని అధికారులు తేల్చుకోలేకపోతున్నారు. కొంత ప్రదేశం నివాస ప్రాంతంగానూ, మరికొంత ప్రదేశం వాణిజ్య ప్రాంతంగానూ చూపేందుకు సాఫ్ట్వేర్లో వెసులుబాటు లేకపోవడంతో పరిస్థితి జఠిలంగా మారింది. ఇటువంటి జాగాలను వాణిజ్య కేటగిరీ కిందనే పరిగణించాలని ఇటీవల సీసీఎల్ఏ స్పష్టం చేయడంతో అంత సొమ్ము తాము చెల్లించలేమంటూ లబ్ధిదారులు చేతులెత్తేస్తున్నారు. కమర్షియల్ కిరికిరి ఇలా ఉంటే.. పూర్తిస్థాయిలో నివాస ప్రాంతాల్లోనూ అధికారుల సమన్వయ లోపం కారణంగా కొన్ని ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్లు జరగడం లేదని అంటున్నారు. అంతేకాక రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా పత్రాల జారీలో పలు సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. రూ.లక్షలు పోసి కొనుగోలు చేస్తున్నా, సరైన విధంగా పత్రాలను ఇవ్వకపోవడం పట్ల లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సబ్ రిజి స్ట్రార్ల పేచీ.. ఇదిలా ఉండగా హైదరాబాద్తో పాటు కొన్ని జిల్లాల్లో జీవో 59 ప్రకారం స్టాంప్ డ్యూటీ మినహాయింపుపై జిల్లా కలెక్టర్ల నుంచి తమకు ఎటువంటి సమాచారం లేదంటూ. రిజిస్ట్రేషన్లు చేసేందుకు సబ్ రిజిస్ట్రార్లు ససేమిరా అంటున్నారు. అలాగే క్షేత్రస్థాయిలో సాఫ్ట్వేర్ సమస్యల పరిష్కారం పట్ల సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అధికారులు శ్రద్ధ చూపడం లేదని, ఫిర్యాదు చేసినా భూపరిపాలన అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమబద్ధీకరణ ప్రక్రియంతా ఒక డిప్యూటీ కలెక్టర్ కేంద్రంగానే నడుస్తుండడం, ఆమెకు వాస్తవ పరిస్థితులపై అవగాహన లేకపోవడంవల్లే మొత్తం ప్రక్రియ అస్తవ్యస్తంగా తయారైందని కొందరు ఆర్డీవోలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నెలాఖరుతో క్రమబద్ధీకరణ ప్రక్రియకు గడువు ముగియనున్నందున ఇప్పటికైనా సీసీఎల్ఏ స్పందించి ఆన్లైన్లో ఏర్పడుతున్న సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని, చిన్నచిన్న దుకాణాలున్న నివాసాలకు కమర్షియల్ కేటగిరీ వర్తింపజేయడంపై పునఃపరిశీలించాలని తహసీల్దార్లు,లబ్ధిదారులు కోరుతున్నారు. -
రిజిస్ట్రేషన్లలో గందరగోళం
సాక్షి, హైదరాబాద్: చెల్లింపు కేటగిరీలో భూముల క్రమబద్ధీకరణ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ గందరగోళంగా మారింది. శాఖల మధ్య సమన్వయం కొరవడింది. రిజిస్ట్రేషన్ల నిమిత్తం అవసరమైన కన్వేయన్స్ డీడ్లను మాన్యువల్గానే జారీ చేయాలని ప్రభుత్వం గత నెల 27న ఆదేశాలు జారీ చేసినా, భూపరిపాలన విభాగం అధికారులు మాత్రం ససేమిరా అంటున్నారు. తాము కొనుగోలు చేసిన సాఫ్ట్వేర్ ద్వారా ఆన్లైన్లో జారీ అయిన కన్వేయన్స్ డీడ్లనే రిజిస్ట్రేషన్లకు వినియోగించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను, తహసీల్దార్లను సీసీఎల్ఏ తాజాగా ఆదేశించినట్లు తెలిసింది. ఒకే అంశంపై సర్కారు ఒకరకంగా, సీసీఎల్ఏ మరో విధంగా ఆదేశాలివ్వడంతో ఏ ఆదేశాలను అమలు చేయాలో పాలుపోక జిల్లా కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లు తల పట్టుకుంటున్నారు. కన్వేయన్స్ డీడ్లోని వివరాలను అవసరమైనట్లు మార్పు చేసేందుకు సీసీఎల్ఏ అవకాశం ఇవ్వకపోవడంతో ఆన్లైన్ ప్రక్రియ ద్వారా మరింత జాప్యం జరుగుతోందని వాపోతున్నారు. జీవో 59 కింద కన్వీయన్స్ డీడ్లను రిజిస్ట్రేషన్ చేసే విషయమై తమ శాఖ ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన నిబంధనలు ఏవీ అందలేదని సబ్ రిజిస్ట్రార్లు చెబుతున్నారు. కబ్జా అయిన ప్రభుత్వస్థలాలను తిరిగి స్వాధీనం చేసుకోలేని పరిస్థితుల్లో ఆయా స్థలాలను క్రమబద్ధీకరించాలని 2014 డిసెంబరులోనే సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాదిన్నర కిందే చెల్లింపు కేటగిరీ కింద 50వేల దరఖాస్తులు సర్కారుకు వచ్చినా నేటికీ ఒక్క దరఖాస్తుకు మోక్షం కలిగించలేదంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోం ఓటింగ్ పరిశీలన
నిప్పుతో చెలగాటమా!
మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
‘రాహుల్ పేరు చెబితే ఓట్లు పడవు’
కాంగ్రెస్తోనే అన్నివర్గాలకు సముచిత న్యాయం
హామీలు నెరవేర్చడంలో రేవంత్ విఫలం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తాం..
మూడోసారి మోదీ సర్కారే..
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement