-
బాబు మార్కు దందా.. బినామీలకే సంపద
రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అమరావతి అమరావతి రాజధాని నిర్మాణాన్నిచేపడతానని 2024 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన చంద్రబాబు.. సంపద సృష్టించి, సంక్షేమ పథకాలను అమలు చేస్తానని బీరాలు పలికారు. కానీ.. అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకే చంద్రబాబు లెక్క ప్రకారం రూ.లక్ష కోట్లు అవసరం. జాప్యం జరిగితే ఆ వ్యయం మరింత అధికం కావచ్చు. రాష్ట్ర బడ్జెట్ను పరిగణనలోకి తీసుకుంటే మౌలిక సదుపాయాల కల్పనకే 20 ఏళ్లు పడుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. మిగతా ప్రాంతాల ప్రజల నోట్లో మట్టి కొట్టి, అమరావతిలో మౌలిక సదుపాయాలకు ఆ స్థాయిలో నిధులు ఖర్చు చేసినా రాష్ట్రానికి సంపద పెరగదు.చంద్రబాబు, బినామీలు, వందిమాగధుల భూముల ధరలే పెరుగుతాయి. వాటిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుని రూ.లక్షల కోట్లు కొల్లగొట్టాలన్నదే చంద్రబాబు ఎత్తుగడ. సాక్షి, అమరావతి : నోరు తెరిస్తే చాలు సంపద సృష్టిస్తానని బీరాలు పలుకుతున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు.. అది తన బినామీల కోసమేనని ఎన్నికల ప్రచారంలో పరోక్షంగా చాటిచెబుతున్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు అమరావతిలో భూముల ధరలు అమాంతం పెరిగితే.. ఇప్పుడు పడిపోయాయని గుంటూరులో బుధవారం నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేయడమే అందుకు నిదర్శనం.అమరావతి ఔటర్ రింగ్ రోడ్డును 185 కి.మీల పొడవున నిర్మించడానికి ప్రణాళిక రచించానని చెబుతూ రాజధాని నిర్మాణం కొనసాగి ఉంటే ఈపాటికి ప్రపంచ స్థాయి నగరం కళ్ల ముందుకు వచ్చేదని గ్రాఫిక్స్ కథలు వల్లె వేశారు. సీఎం జగన్ తన కలలను వమ్ము చేశారని.. అధికారంలోకి రాగానే అమరాతి నిర్మాణం చేపట్టడమే తన సంకల్పమని పునరుద్ఘాటించారు. అంటే.. ప్రభుత్వ ఖజానా నుంచి రూ.లక్ష కోట్లను వెదజల్లి అమరావతిలో మౌలిక సదుపాయాలను కల్పించి ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా తాను, తన బినామీలు, వందిమాగధులు కాజేసిన భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి రూ.లక్షల కోట్లు కొల్లగొట్టడానికి కట్టుబడి ఉన్నట్లుగా చంద్రబాబు తేటతెల్లం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో హైటెక్ సిటీ ముసుగులో మురళీమోహన్ వంటి బినామీలతో కలిసి కాజేసిన భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి రూ.వేలాది కోట్లు నొక్కేసిన తరహాలోనే ఇప్పుడూ అమరావతి పేరుతో రూ.లక్షల కోట్లు కొల్లగొట్టేందుకు స్కెచ్ వేశారు. రహాలోనే ఇప్పుడూ అమరావతి పేరుతో రూ.లక్షల కోట్లు కొల్లగొట్టేందుకు స్కెచ్ వేశారు. అంతర్జాతీయ కుంభకోణం రాజధాని లేకుండా విభజించి రాష్ట్రాన్ని కేంద్రం సంక్షోభంలోకి నెట్టిందని.. దాన్ని అవకాశంగా మల్చుకుని అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నిర్మిస్తామని 2014 ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు ప్రకటించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నిర్మాణం మాటేమోగానీ ఆ ముసుగులో అంతర్జాతీయ కుంభకోణానికి పాల్పడ్డారు. 2014 జూన్ 8న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు.. ఓత్ ఆఫ్ సీక్రసీకి తుట్లూ పొడిచి, రాజధాని ఏర్పాటు చేసే ప్రాంతంపై బినామీలు, వందిమాగధులకు లీకులు ఇచ్చారు. ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా రైతుల నుంచి తక్కువ ధరలకే తన గ్యాంగ్ ద్వారా భారీ ఎత్తున భూములు కాజేశాక రాజధానిని ప్రకటించారు.ఆ ప్రాంతానికి కనీసం రహదారి సౌకర్యం కల్పించకుండానే.. భూముల ధరలు పెంచడం కోసం తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణం చేపట్టి కమీషన్లు దండుకున్నారు. స్విస్ ఛాలెంజ్ విధానానికి తూట్లు పొడుస్తూ 1691 ఎకరాల్లో రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు నిర్మాణ పనులను సింగపూర్ ప్రైవేటు సంస్థల కన్సార్షియంకు కట్టబెట్టి.. ఆ ప్రాజెక్టుకు ప్రభుత్వ ఖజానా నుంచి రూ.5,500 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అంగీకరించారు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి రూ.లక్ష కోట్లు కాజేయడానికి స్కెచ్ వేశారు.మూడు రాజధానులతో సమగ్రాభివృద్ధి భూ సమీకరణలో రైతులు ఇచ్చిన 33 వేల ఎకరాలు, అటవీ భూములు సహా మొత్తం 50 వేల ఎకరాల్లో రాజధాని నిర్మాణాన్ని చేపట్టాలని గత టీడీపీ సర్కార్ నిర్ణయించింది. నల్లరేగడి భూములతో కూడిన ఆ ప్రాంతంలో రహదారులు, డ్రైనేజీలు, విద్యుత్ సౌకర్యం వంటి కనీస మౌలిక సదుపాయాలను కల్పించి, అభివృద్ధి చేయడానికి ఎకరాకు రూ.2 కోట్లు వ్యయం అవుతుందని అప్పటి సీఎం చంద్రబాబు ప్రకటించారు. అంటే అమరావతిలో కేవలం కనీస మౌలిక సదుపాయాల కల్పనకే రూ.లక్ష కోట్లు అవసరం.కానీ.. రాష్ట్ర బడ్జెట్ నుంచి ఆ మేరకు కేటాయింపులు చేయడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో నిపుణుల కమిటీ సూచనల మేరకు రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నంను పరిపాలన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇదే అంశాన్ని 2024 ఎన్నికల మేనిఫెస్టోలోనూ సీఎం జగన్ పొందుపరిచారు. -
Bheemili: భీమిలి భూములపై కన్నేసిన గంటా శ్రీనివాసరావు
సాక్షి, విశాఖపట్నం : భీమిలి భయపడుతోంది.. 2014 నుంచి ఐదేళ్ల పాటు వారి చెరలో చిక్కుకున్న భూమాత మళ్లీ.. చిగురుటాకులా వణికిపోతోంది. భూచోళ్లు అంతా కలిసి వస్తున్నారని సంకేతాలతో జనం గుండెలు అదురుతున్నాయి. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్న చందాన అక్రమార్కులు అధికారం అండ ఉన్న బంధువులు కుమ్మక్కై కనిపించిన జాగాలన్నీ కబ్జా చేసిన ఘనులకు సూత్రధారిగా నిలిచిన గంటా శ్రీనివాసరావు కన్ను ఇప్పుడు భీమిలిలో మిగిలిన భూములపైనా పడింది. అందుకే పట్టుబట్టి మరీ భీమిలి టికెట్ సాధించి ఇప్పుడు భూ కబ్జారాయుళ్లనంతా పోగేసుకుంటున్నారు. ఒకప్పుడు దేశంలోనే రెండోదిగా, ఉమ్మడి ఏపీలో మొట్టమొదటి పురాతన మున్సిపాలిటీగా పేరు సొంతం చేసుకున్న ప్రశాంత భీమిలికి 2014–19 కాలంలో కొత్త పేరుని తీసుకొచ్చారు గంటా అండ్ కో. కాదేదీ కబ్జాకనర్హం అన్నట్లుగా వ్యవహరిస్తూ, భీమిలికి ఉన్న మంచి పేరుని కాస్తా చెరిపేసి.. భూకబ్జాల భీమిలిగా మార్చేసి.. నియోజకవర్గ పరువుని బంగాళాఖాతంలో కలిపేశారు. 2014 నుంచి ఐదేళ్ల పాటు భీమిలి నియోజకవర్గంలో పాగా వేసిన గంటా ఆక్రమించిన భూముల లెక్క రూ.1500 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. సహజంగా ఈ లెక్కలు చూస్తే ఎవరికైనా నిజమైనా... అనిపిస్తుంది.. కానీ ఆయన అల్లుడుతో పాటు బినామీలు, టీడీపీ తోడేళ్లు ఐదేళ్ల పాటు ఇదే పనిలో ఉండి వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములు మింగేశారనేది ఆ ప్రాంతంలో ఎవరిని కదిపినా బయటకు వచ్చే వాస్తవం. వాటిలో కొన్ని మచ్చుకు పరిశీలిద్దాం.. సీలింగ్ భూముల కథ ఇదీ.. నిరుపేదలకు పంచిపెట్టాల్సిన సీలింగ్ భూములను చుట్టేసేలా గంటా అండతో అతని అల్లుడు, బినామీలు కలిసి భూదందా చేశారు. ఆనందపురం మండలం వేములవలస గ్రామానికి చెందిన కోరాడ వెంకటస్వామినాయుడు 1973 ల్యాండ్ సీలింగ్ చట్టం ప్రకారం తమ కుటుంబం పేరిట ఉన్న 45.59ఎకరాల మిగులు భూములను ప్రభుత్వానికి అప్పగించేందుకు అంగీకారం తెలిపారు. 1975వ సంవత్సరంలో ఆయన ఇచ్చిన భూ వివరాలను పరిశీలించిన ల్యాండ్ సీలింగ్ అథారిటీ ఆ భూముల అప్పగింతపై ట్రిబ్యునల్ తీర్పు (ఎల్సీసీ 230బై75) ఇచ్చింది. ఈ మేరకు విశాఖ రూరల్ మండలం మధురవాడలో సర్వే నంబర్ 262/4, 263/æ2, 276/1, 278, 276/2, 277/2, 329, 262/3, 277/1కి సంబంధించి 28.84ఎకరాలు, ఆనందపురం మండలం పెద్దిపాలెం గ్రామంలో 1.66ఎకరాలు, ఆనందపురం గ్రామంలో 6.81ఎకరాలు, వెల్లంకి గ్రామంలో 8.28ఎకరాల భూముల వివరాలను ప్రభుత్వానికి అప్పగించారు. ఇక్కడ వరకు అంతా సాఫీగానే జరిగినా కోరాడ వెంకటస్వామినాయుడు మృతి తర్వాత అసలు కథ మొదలైంది. ఆయన కుటుంబీకుల్లో కొందరు ప్రభుత్వానికి ఇచ్చేసిన భూములను సైతం అడ్డగోలుగా విక్రయించేశారు. మధురవాడ పంచాయతీ పరిధిలో ఇచ్చిన 28.84ఎకరాల భూమిని కోరాడ వారసులు కృష్ణా కో–ఆపరేటివ్ సొసైటీకి విక్రయించారు. ఈ వ్యవహారంపై అప్పటి చినగదిలి ఎమ్మార్వో ఉన్నతాధికారులను ఫిర్యాదు చేశారు. దీంతో సదరు కోరాడ వారసులు హైకోర్టులో పిటిషన్ వేశారు. తమ కుటుంబ అవసరాల నిమిత్తం ఆ భూములను విక్రయించేశామని, అందుకు బదులుగా తమకు ఆనందపురం మండలం వేములవలస పంచాయతీ బంటుపల్లి వారి కల్లాలు గ్రామంలో ఉన్న 28.80ఎకరాల (సర్వే నంబర్లు 39/1, 39/2) భూమిని అప్పజెబుతామని కోర్టును అభ్యరి్థంచారు. ఈమేరకు కోర్టు అంగీకరించి ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వులను వెంటనే అమలుచేసి ఆ భూమిని స్వా«దీనం చేసుకోవాల్సిన రెవెన్యూ అధికారులు తాత్సారం చేశారు. దీంతో ఆ వారసులు మరోసారి ఆ భూముల్లో కొన్ని ఎకరాలను 2006లో విక్రయించేశారు. సర్వే నంబర్ 39/1, 39/5ఏలో 11.8ఎకరాల భూమిని విక్రయించేశారు. అదేవిధంగా వెల్లంకి గ్రామంలో ప్రభుత్వానికి ఇచ్చేసిన 1.14ఎకరాల భూమిని తిరిగి గారిపేట వాస్తవ్యుడు కోరాడ అప్పలస్వామి, రాములకు విక్రయించేశారు. దీనిపై రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేయగా, ఆ భూమికి బదులు సర్వే నంబర్ 263/2, 264/16లోని 1.14 ఎకరాలు అప్పగించారు. మళ్లీ 263/æ2 లోని 0.34ఎకరాల భూమిని అమ్మేశారు. మొత్తంగా 30 ఎకరాల పంపిణీకి సంబంధించిన పక్కా వివరాలు లేకున్నా కోరాడ కుటుంబీకులు మాత్రం ఇప్పటికే తాము 34.45ఎకరాల భూమిని అప్పటి ప్రభుత్వానికి అప్పగించామని లెక్క కట్టేశారు. ఇంకా తాము 11.14ఎకరాల భూమి మాత్రమే ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉందని తేల్చేశారు. ఆ 11.14ఎకరాల భూపంపిణీకీ ఇంకో మతలబు పెట్టారు. గతంలో తాము ఆనందపురం గ్రామంలో అప్పజెప్పిన 4.15ఎకరాలు రెండుపంటలు పండే భూమి అని పేర్కొన్నారు. పంటలు పండే భూమి, మిగులు భూముల నిష్పత్తి 1:2 ప్రకారం.. 11.14 ఎకరాల్లో 4.15 ఎకరాలను మినహాయించాలని ప్రతిపాదించారు. ఈ లెక్కన తాము కేవలం 6.63ఎకరాల భూమి మాత్రమే ఇవ్వాల్సి ఉంటుందని, ఆ భూమి కూడా నర్సీపట్నం పరిసరాల్లోని భూములను ఇస్తామని ప్రతిపాదించారు. ఈ లెక్కన కల్లాలు గ్రామంలోని 11.14ఎకరాల భూమిని తమకు మినహాయించాలని ప్రభుత్వానికి నివేదిస్తూ జిల్లాకోర్టులో కేసు వేశారు. అల్లుడు రంగప్రవేశంతో.. కోర్టు విచారణ పూర్తికాకున్నా ఈలోగా గంటా అల్లుడు రంగంలోకి దిగారు. కోరాడ వారసులకు, అల్లుడికి మధ్య టీడీపీ నాయకులు కోరాడ నాగభూషణం, గాడు వెంకటప్పడు, ఇతర నేతలు మధ్యవర్తిత్వం నెరిపారు. అధికారికంగా పేర్కొంటున్న 11.14ఎకరాలతో సహా తొక్కిపెట్టిన 30ఎకరాలపైగా భూమికి సంబంధించి ఒక్క గజం కూడా ఎవ్వరికీ పంపిణీ చేయకుండా వీళ్లే పంచేసుకునేందుకు ప్రణాళిక రూపొందించారు. అంతే కాదు.. గంటా భీమిలి ఎమ్మెల్యేగా.. మంత్రిగా నియోజకవర్గానికి ఏమీ వెలగబెట్టకపోయినా.. అడ్డగోలు సంపాదనకు మాత్రం తెరతీశారు. అనుచరగణంతో కలిసి భూ దందాలతో రెచ్చిపోయారు. ప్రభుత్వ భూములను సైతం బ్యాంకుల్లో కుదువ పెట్టి రూ.కోట్ల రుణాలు పొందినట్లు కూడా వార్తలు వినిపించాయి. ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే.. వెలుగులోకి రాని భూబాగోతాలెన్నో.. మళ్లీ.. అదే గ్యాంగ్తో హల్ చల్.! భీమిలిలో గంటా గ్యాంగ్ చేసిన అక్రమాలు, ఆక్రమణలు, కబ్జాలతో ప్రజలంతా విసిగిపోయారు. ప్రశాంతంగా ఉండే ప్రాంతాన్ని భూ కబ్జాల కేంద్రంగా మార్చిన గంటాకి 2019 ఎన్నికల్లో బుద్ధి చెబుతామని ప్రజలంతా డిసైడైపోయారు. విషయం తెలుసుకున్న గంటా.. నియోజకవర్గం నుంచి పారిపోయి ఉత్తరం పంచన చేరారు. ఆయన అనుచరగణం.. చెట్టుకొకరు.. పుట్టకొకరుగా వేరైపోయారు. ఐదేళ్లు గడిచిన తర్వాత ప్రజలు అంతా మర్చిపోయి ఉంటారని భావించిన గంటా.. తిరిగి భీమిలికి చేరుకున్నారు. వచ్చిందే తడవుగా.. తన కబ్జాల అనుచరగణాన్ని చేరదీసుకుంటున్నారు. టీడీపీలో సస్పెండ్కు గురైన కబ్జా గ్యాంగ్పై సస్పెన్షన్ను ఎత్తివేసేస్తూ.. మళ్లీ చక్రం తిప్పేందుకు సిద్ధం చేసుకుంటున్నారు. గాడు వెంకటప్పడు, కోరాడ నాగభూషణరావు తదితర బ్యాచ్ను పోగేసుకుంటున్నారు. గంటా బాబా.. అరడజను దొంగల మాదిరిగా.. దొంగల ముఠా అంతా ఒక చోట చేరుతుండటంపై భీమిలి ప్రజలు మళ్లీ అభద్రతా భావానికి గురవుతున్నారు. ఇంక ఆక్రమించేందుకు ఏమున్నాయని వాపోతున్నారు. అయినా డబ్బులు ఎరవేసి, భయపెట్టి.. బెదిరించి.. ఎలాగైనా గెలవాలని భావిస్తున్న గంటా.. గెలిస్తే భీమిలిలో ఉన్న కొద్ది పాటి భూములను సైతం తన గ్యాంగ్తో కలిసి కాజేయ్యాలన్న కుట్రతో నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఇలాంటి వ్యక్తికి మరోసారి అందలం ఇస్తే.. భీమిలిని సర్వనాశనం చేస్తారని నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారు. -
శరణ్ చౌదరి ఎవరో తెలియదు: ఎర్రబెల్లి దయాకర్రావు
సాక్షి, హైదరాబాద్: తనపై శరణ్ చౌదరి ఆరోపణలు చేశారని తన దృష్టికి వచ్చిందని.. ఆయన ఎవరో తెలియదని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ, శరణ్ చౌదరి బీజేపీలో ఉన్నాడని తెలిసింది. శరణ్ చౌదరి భూకబ్జాలకు పాల్పడ్డాడని బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసిందని ఎర్రబెల్లి అన్నారు. ‘‘దొంగ డాక్యుమెంట్లు సృష్టించి శరణ్ చౌదరి భూకబ్జాలకు పాల్పడ్డారు. ఎన్.ఆర్.ఐ.విజయ్కు, శరణ్ చౌదరి రెండు కోట్లు బాకీ వున్నారు శరణ్ చౌదరిపై చాలా కేసులు వున్నాయి. శరణ్ చౌదరి డబ్బులు ఇవ్వాల్సిన విజయ్ ఎవరో నాకు పరిచయం లేదు. శరణ్ చౌదరి, అతని భార్య పాస్ పోర్టులను పోలీసులు సీజ్ చేశారు. నేను 40 ఏళ్లుగా రాజకీయాల్లో వున్నా.. ఎక్కడా భూకబ్జాలకు పాల్పడలేదు’’ అని ఎర్రబెల్లి దయాకర్రావు చెప్పారు. బంజారాహిల్స్ పీఎస్ లో శరణ్ చౌదరి పై అనేక కేసులు ఉన్నాయి. ఈ వ్యవహారంలో నన్నెందుకు లాగుతున్నారో అర్దం కావడం లేదు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు నాకు సంబంధం లేదు. ప్రణీత్ రావు ఎవరో కూడా తెలియదు. ప్రణీత్ రావు వాళ్ల బంధువులు మా ఊర్లో ఉంటారని తెలిసింది. రాజకీయ కుట్రలో భాగంగానే ఇలాంటి వ్యవహారాలు చేస్తున్నారు. నేను ప్రస్తుతం పార్టీ మారే ఉద్దేశ్యం లేదు. నేను పార్టీ మారను. పార్టీ మారాలని నాపై పై నుంచి ఒత్తిడులు వస్తున్నాయి’’ అని దయాకర్రావు తెలిపారు. ‘‘శరణ్ చౌదరి డబ్బులు ఇవ్వాల్సిన విజయ్ నాకు బంధువు అని అసత్య ప్రచారం చేస్తున్నారు. నేను అనేక కేసులు ఎదుర్కొన్నాను. గతంలో ఓబుళాపురం అక్రమ మైనింగ్, బాబ్లీ ప్రాజెక్టు విషయంలో ప్రజల కోసం జైలుకు వెళ్లాను’’ అని ఎర్రబెల్లి పేర్కొన్నారు. -
కబ్జా కోరులు టీడీపీ నేతలే!
(కేజీ రాఘవేంద్రారెడ్డి, సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం): కుక్కకి చెప్పు రుచి తెలుసు కానీ.. చెరకు తీపి తెలుస్తుందా? టీడీపీ నేతలూ అంతే. టీడీపీ నాయకులకు విశాఖ నగరంలో భూములను మేయడం తెలుసు కానీ, అదే విశాఖ నగరాన్ని రాజధానిగా ప్రపంచ పటంలో నిలిపితే రాష్ట్రానికి ఒనగూరే ప్రయోజనాలు తెలియవు. పైపెచ్చు.. విశాఖ భూముల్ని కొల్లగొట్టిన టీడీపీ నాయకులే... భూములు ఆక్రమించడానికే వైఎస్సార్సీపీ విశాఖను రాజధాని అంటోందంటూ గొంతు చించుకుంటున్నారు. అచ్చం దొంగే.. దొంగా.. దొంగా.. అని అరిచినట్టుగా. ఆర్థిక రాజధానిగా వెలుగొందుతున్న విశాఖ నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎన్నో ఏళ్లుగా వేల కోట్ల రూపాయల భూముల్ని చెరపట్టారు టీడీపీ నేతలు. గయాలు, పోరంబోకు, గోర్జి, వాగులు, కాలువలు, గెడ్డలు, ఇనాం, జిరాయితీ, గ్రామకంఠాలు, చెరువులు.. ఇలా ఏ భూమి కనిపిస్తే దానిని చెరబట్టారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ టీడీపీ రాబందుల ఆటలు సాగలేదు సరికదా... వారి చెర నుంచి వందలాది ఎకరాలను విడిపించింది. ఇలా టీడీపీ కబ్జాదారుల కోరలు పీకడమే రామోజీ కడుపు మంటకు కారణం. టీడీపీలోని భూ కబ్జాదారులను వెనకేసుకొచ్చేందుకు ఈనాడు పత్రికలో ప్రభుత్వంపై నిందలు వేస్తూ ఓ పెద్ద కథే వేశారు. విషపు రాతలతో విశాఖ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారు. వాస్తవానికి వైఎస్ జగన్ ప్రభుత్వం రాగానే విశాఖ నగరం, చుట్టుపక్కల మండలాల్లో ఆక్రమణలకు గురైన విలువైన ప్రభుత్వ భూముల సంరక్షణపై దృష్టి సారించింది. ప్రత్యేక దర్యాప్తు బృందాలతో క్షుణ్ణంగా పరిశీలన జరుపుతోంది. ఇప్పటివరకు 270 ప్రాంతాల్లో రూ.2,600 కోట్లు విలువైన 430.81 ఎకరాల భూముల్ని స్వాధీనం చేసుకుంది. వీటి విలువ బహిరంగ మార్కెట్లో ఏకంగా రూ.5 వేల కోట్లకు పైగానే ఉంటుందని అధికారుల అంచనా. మాజీ ఎంపీ ఎంవీవీఎస్ కబ్జా పర్వం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి రుషికొండ ప్రాంతంలో 42.51 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. గీతం యూనివర్సిటీకి సమీపంలోని ఈ స్థలంలో 2 ఎకరాల్లో కళాశాల భవనం, మిగిలిన స్థలానికి కాంపౌండ్ వాల్ నిర్మించారు. రూ.500 కోట్లు విలువ చేసే ఈ ప్రభుత్వ భూమిని దశాబ్దాల పాటు కబ్జా చేసినప్పటికీ, టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆ కాంపౌండ్ వాల్ను తొలగించి కబ్జాలో ఉన్న 40.51 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. అక్రమాల ‘పల్లా’.. ఆక్రమణల పర్వం అధికారాన్ని అడ్డం పెట్టుకొని టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఆయన బంధుగణం దోచుకున్న భూముల బాగోతాన్ని కూకటివేళ్లతో సహా పెకిలించింది వైఎస్ జగన్ ప్రభుత్వం. నగర శివారు ప్రాంతాల్లోని ఆ భూముల్లో వెలిసిన అక్రమ నిర్మాణాల్ని తొలగించింది. రూ.669 కోట్ల విలువైన 38.45 ఎకరాల ఆక్రమిత భూముల్ని స్వాధీనం చేసుకుంది. జగ్గరాజుపేటలో 1.26 ఎకరాలు వాగు స్థలం, తుంగ్లాంలో 0.92 ఎకరాల పోరంబోకు రాస్తా, 6.15 ఎకరాల యూఎల్సీ ల్యాండ్, 1.85 ఎకరాల పోరంబోకు చెరువు, 21.67 ఎకరాల పోరంబోకు చెరువు, 0.70 ఎకరాల ఈనాం భూములు, 0.80 ఎకరాల పోరంబోకు బంద, 2.04 ఎకరాల గయాలు భూములు, 1.50 ఎకరాల పోరంబోకు రాస్తా, 0.24 ఎకరాల పోరంబోకు భూములను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కూర్మన్నపాలెంలో 1.35 ఎకరాల పోరంబోకు భూమిలోని ఆక్రమణలను కూడా తొలగించారు. ‘భూ’చోడు గంటా అంటూ అయ్యన్న ఫిర్యాదు.! టీడీపీ హయాంలో విశాఖలో భారీ భూకుంభకోణమే జరిగింది. దీనిని అధికారులే బహిర్గతం చేయడంతో చంద్రబాబు ప్రభుత్వం ఉలిక్కిపడింది. సిట్ పేరుతో హడావుడి చేసింది. ఈ కుంభకోణంలో తమ పార్టీ నాయకులే ఉన్నారంటూ ఆధారాలతో సహా సిట్ బృందానికి టీడీపీ సీనియర్ నేత, అప్పట్లో మంత్రిగా ఉన్న చింతకాయల అయ్యన్న పాత్రుడు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ భూముల పత్రాల్ని ట్యాంపరింగ్ చేసి ఇండియన్ బ్యాంకులో రుణాలు తీసుకునేందుకు అక్రమాలకు పాల్పడ్డారంటూ బహిరంగంగానే ఆరోపించారు. ఇదంతా గంటా శ్రీనివాసరావు నిర్వాకమేనంటూ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. గంటాపై స్వయంగా తమ మంత్రే అయిన అయ్యన్న ఫిర్యాదు చేసినా, టీడీపీ ప్రభుత్వం బుట్ట దాఖలు చేసింది. దసపల్లాపై ఇదేమి దందా! దసపల్లా భూములపై ఈనాడు సిగ్గూ ఎగ్గూ లేని రాతలు రాసింది. ఈ భూములపై సర్వోన్నత న్యాయ స్థానం కూడా తీర్పు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం చేయగలిగేది ఏముంటుంది? అసలు ఈ భూముల వ్యవహారం కోర్టులో ఉండగానే, సీఎంగా ఉండి, ఆ భూములను సొంత పార్టీకే కేటాయించేసుకుని పార్టీ కార్యాలయాన్ని నిర్మించేసుకున్నదే చంద్రబాబు. దిగువ కోర్టులు, హైకోర్టు కూడా ఆ భూములు ప్రైవేటు వ్యక్తులవేనని తీర్పునిచ్చాయి. మునుపటి ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో అప్పీలు చేశాయి. సుప్రీంకోర్టు కూడా ఆ అప్పీలును, ఆ తర్వాత వేసిన రివ్యూ పిటిషన్ను, చిట్ట చివరి అస్త్రం ‘క్యూరేటివ్’ పిటిషన్’ను కూడా కొట్టేసింది. ఆ తీర్పు ప్రకారం నడవటం తప్ప ప్రభుత్వం చేయగలిగిందేమీ లేదని ఏజీ వేణుగోపాల్ కూడా చంద్రబాబు ప్రభుత్వానికే చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా ఇప్పటిదాకా తీర్పును అమలు చేయలేదు. అందుకు కోర్టు ధిక్కారం కింద ఇద్దరు అధికారులకు జైలు శిక్ష కూడా పడింది. సర్వోన్నత న్యాయస్థానం వరకు తీర్పులు అనుకూలంగా ఉన్నాయి కనకే భూ యజమానులు డెవలపర్లతో ఒప్పందం చేసుకున్నారు. ఎవరికెంత శాతమన్నది ఇరుపక్షాల ఇష్టం. డెవలపర్లతో ఒప్పందం చేసుకున్న భూ యజమానుల్లో రామోజీ కుమారుడి వియ్యంకుడూ ఉన్నారు. ఒకవేళ తక్కువ వాటా వచ్చిందని భావిస్తే మీ వియ్యంకుడైనా ఒప్పందం ఎలా చేసుకుంటారు? రామోజీకి అలవాటైన అబద్ధం కూర్మన్నపాలెంలో 15 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలోని నిర్మాణాల్లో భూ యజమానులకు 0.96 శాతం వాటా.. అంటే 14,400 చదరపు అడుగులే ఇస్తున్నారని మరో అబద్ధాన్ని ఈనాడు కుమ్మరించింది. ఇది కేవలం గొట్టిపల్లి శోభారాణి, ఇతరులకు ఇచ్చిన వాటానే. ఈ భూమిపై వివాదం ఉన్న డాక్ లేబర్ బోర్డు ఉద్యోగులకు 160 మందికి 1,000 చదరపు అడుగుల ఫ్లాట్ చొప్పున మొత్తం 1,60,000 చదరపు అడుగులు, కొప్పిశెట్టి శ్రీనివాస్కు మరో 30 వేల చదరపు అడుగులు ఇవ్వాలని ఒప్పందం ఉంది. మొత్తం కలిపి 2,04,400 చదరపు అడుగులు. కూర్మన్నపాలెం భూమిని అభివృద్ధి చేసి పరిష్కరించాలని డాక్ లేబర్ బోర్డు ఉద్యోగులు 2012లో కోరారని, అప్పటి నుంచి మొదలై 2017లో అందరితో మాట్లాడి ఒప్పందం కుదిరిందని డెవలపర్, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చెప్పారు. ఆ పార్టీలకు 2 లక్షల చదరపు అడుగుల నిర్మాణాలతోపాటు దాదాపు రూ.10 కోట్ల నగదు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరిందని వెల్లడించారు. ఇదంతా పూర్తిగా ప్రైవేటు వ్యవహారమని, ఎక్కడాప్రభుత్వానికి సంబంధం లేదని ఆయన స్పష్టంచేశారు. ఏ ప్రతిఫలంతో జీవో ఇచ్చారు.? రుషికొండ వద్ద రేడియంట్ భూముల విషయంలో గత టీడీపీ ప్రభుత్వమే జీవో జారీ చేసిందని ఈనాడే స్పష్టంగా పేర్కొంది. ఏ ప్రతిఫలంతో ఆ జారీ చేశారు? బాబు హయాంలో జరిగితే ప్రైవేటు వ్యవహారం, ఈ ప్రభుత్వంలో జరిగితే కబ్జాలా? ఇదేమి వాదన? టీడీపీ నేతల నుంచి స్వాధీనం చేసుకున్న కబ్జా భూములు ► ఆనందపురం–శొంఠ్యాం సమీపంలో మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా బంధువు, జనసేన నాయకుడు పరుచూరి భాస్కరరావు సహా పలువురు టీడీపీ నేతలు టైటిల్ డీడ్ నం.1180లో ఆక్రమించుకున్న రూ.256 కోట్లు విలువ చేసే 64 ఎకరాల భూముల్ని 2020 నవంబర్లో స్వాధీనం చేసుకున్నారు. ► టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఆనందపురం మండలం భీమన్నదొరపాలెంలో సర్వే నం.156లో 60 ఎకరాల భూమిని ఆక్రమించుకోగా.. 2020 డిసెంబర్లో రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ భూముల మార్కెట్ విలువ రూ.300 కోట్లు ఉంటుందని అంచనా. ► టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆక్రమించిన రుషికొండ బీచ్రోడ్డులో సర్వే నం.21లోని సుమారు రూ.3 కోట్లు విలువ చేసే 6 సెంట్ల ప్రభుత్వ స్థలాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ► టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఆయన బంధువర్గం పేరుతో గాజువాక నియోజకవర్గంలోని మూడు గ్రామాల పరిధిలో ఆక్రమించుకున్న సుమారు రూ.669.26 కోట్లు విలువైన 38.45 ఎకరాల్ని 2021లో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ► సీతమ్మధారలోని రేసపువానిపాలెం సర్వే నంబర్ 7లో సుమారు రూ.3 కోట్లు విలువైన 212 చదరపు గజాల ప్రభుత్వ స్థలాన్ని టీడీపీ సీనియర్ నేత సబ్బం హరి కబ్జా చేసి ప్రహరీ, రెస్ట్ రూమ్లు నిర్మించేసినట్లు గుర్తించిన జీవీఎంసీ అధికారులు వాటిని 2020 అక్టోబర్ 3న తొలగించారు. ► టీడీపీ హయాంలో ఆనందపురంలో సర్వే నంబర్ 122, 123లోని రూ.15 కోట్లు విలువ చేసే 2.5 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్లే గ్రౌండ్గా మార్చి దర్జాగా కబ్జా చేసిన విశ్వనాథ∙విద్యా సంస్థల నుంచి 2021 నవంబర్లో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రామోజీ గ‘లీజు’లు నీతులు చెప్పేటందుకే.. పాటించడానికి కాదన్నది రామోజీరావు ప్రధాన సిద్ధాంతం. కుటుంబ సభ్యుల్ని కూడా మోసం చేసే వ్యక్తిగా, వ్యవస్థల్ని మేనేజ్ చేసే పెద్దమనిషిగా, బంధువులను సైతం కోర్టుల చుట్టూ తిప్పించి వాళ్ల భూములను కారుచౌకగా కొట్టేసే వ్యాపారిగా ప్రసిద్ధుడు. విశాఖ స్థలాన్నీ అలానే కొట్టేయాలని చూసి భంగపడ్డారు. ఆ కథ ఇదీ..1974లో విశాఖ సీతమ్మధారలో 2.78 ఎకరాల భూమిని, 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన 10 భవనాలను నెలకు రూ.3 వేలు అద్దె చొప్పున 33 ఏళ్లకు మంతెన ఆదిత్యవర్మ నుంచి రామోజీరావు లీజుకు తీసుకున్నారు. లీజు గడువు ముగిసినా ఖాళీ చెయ్యకపోగా, కోర్టులో కేసు వేశారు. 1985లో ఈ స్థలానికి ఉత్తరం వైపున కొంత స్థలాన్ని రోడ్డు విస్తరణకు ప్రభుత్వానికి అప్పగించినందుకు ప్రతిగా వెనక ఉన్న స్థలాన్ని కేటాయించాలని రామోజీ లేఖ రాయగా, ప్రభుత్వం 1986లో ఆయన కోరిన స్థలాన్ని కేటాయించింది. దాన్ని రామోజీ తన కుమారుడి పేరిట రిజిస్టర్ చేయించుకున్నారు. స్థలం తనది కాకపోయినా, ప్రభుత్వానికి అప్పగించడం, దానికి ప్రతిగా మరో స్థలాన్ని పొందడం పక్కా మోసమే. ఇదే విషయాన్ని పేర్కొంటూ రామోజీపై స్థల యజమాని ఆదిత్యవర్మ క్రిమినల్ కేసు వేశారు. దీని నుంచి తప్పించుకునేందుకు ఏకంగా విశాఖపట్నం జోనల్ డెవలప్మెంట్ ప్లాన్ని రామోజీరావు ఫోర్జరీ చేశారు. మొత్తం వివరాల్ని పరిశీలించిన న్యాయస్థానం.. ఫోర్జరీకి ప్రాథమిక ఆధారాలున్నాయని, రామోజీపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. కుట్ర, ఫోర్జరీ, మోసపూరిత చర్యలకు గాను ఐపీసీ 120బి, 193, 196, 471, 465, 466 సెక్షన్ల కింద కేసు నమోదయింది. కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని ఖాళీ చేసేందుకు ఇష్టపడని రామోజీరావు హైకోర్టులో స్టే తెచ్చుకున్నారు. మరోవైపు అద్దె సక్రమంగా చెల్లించకపోవడంతో వర్మ విశాఖలోని రెంట్ కంట్రోల్ కోర్టు (ఆర్సీసీ)ని ఆశ్రయించారు. నెలలో భవనాన్ని ఖాళీ చేయాలని కోర్టు రామోజీరావును ఆదేశించింది. ఈ వ్యవహారం హైకోర్టు వరకు నడిచింది. అప్పటి స్థలం విలువపై 5 శాతం అద్దెను ప్రతినెలా చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. రామోజీరావు స్థల యజమాని వర్మకు రూ.17 లక్షల చొప్పున ప్రతినెలా 10వ తేదీ లోపు అద్దె చెల్లించాలని, అద్దె బకాయిలు రూ. 2.57 కోట్లు ఇవ్వాలని ఆదేశించింది. ఈ తీర్పుపై స్టే విధించాలన్న రామోజీరావు వినతిని సుప్రీంకోర్టు కూడా తిరస్కరించింది. 2014 ఫిబ్రవరి 10లోగా అద్దెతోపాటు బకాయిలు రామోజీరావు చెల్లించాల్సి ఉందని స్పష్టం చేసింది. ఎక్కడా తన పప్పులు ఉడకకపోవడంతో చివరికి ఆ స్థలాన్ని యజమాని వర్మకు అప్పగించారు రామోజీ. -
ఐపీఎస్ నవీన్కుమార్ కొడుకుపై కేసు
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: మాజీ ఐఏఎస్ అధికారి భన్వర్లాల్ ఇంటిని కబ్జా చేయడానికి ఐపీఎస్ అధికారి నవీన్కుమార్ నకిలీ పత్రాలతో ప్రయతి్నంచిన కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న నవీన్కుమార్ భట్ కుమారుడు సాహిత్పై కూడా జూబ్లీహిల్స్ ఠాణాలో కేసు నమోదైంది. దర్యాప్తు అధికారులు శుక్రవారం సాహిత్కు నోటీసులు జారీ చేశారు. మరోపక్క భన్వర్లాల్ భార్య మణిలాల్ ఫిర్యాదుతో హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో నమోదైన కేసు విచాణకు నవీన్కుమార్ శుక్రవారం గైర్హాజరయ్యారు. దీంతో ఈ అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లాలని పోలీసులు నిర్ణయించారు. భన్వర్లాల్కు జూబ్లీహిల్స్ ప్రశాసన్నగర్లో సొంత ఇల్లు ఉంది. ఆయన పదవీ విరమణ చేయకముందే ఇంటిని నవీన్కుమార్ సోదరుడు సాంబశివరావు అద్దెకు తీసుకున్నారు. 2019లో భన్వర్లాల్ పదవీ విరమణ చేయడంతో తమ ఇల్లు ఖాళీ చేసి అప్పగించాల్సిందిగా సాంబశివరావును కోరగా, ఆయన స్పందించలేదు. ఆ ఇంట్లో ఐపీఎస్ అధికారి నవీన్కుమార్ కూడా ఎలాంటి రెంటల్ అగ్రిమెంట్ లేకుండా ఉన్నారు. నాటకీయ పరిణామాల నేపథ్యంలో వీరిద్దరితో పాటు సాంశివరావు భార్య రూపా డింపుల్ నకిలీ పత్రాలు సృష్టించి, భన్వర్లాల్తో పాటు ఆయన భార్య మణిలాల్ సంతకాలు ఫోర్జరీ చేసి ఇంటిని కబ్జా చేయాలని చూశారు. మణిలాల్ ఫిర్యాదు మేరకు గతేడాది నవంబర్ 17న సీసీఎస్ పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు. గత నెల 22న సాంబశివరావు దంపతులను అరెస్టు చేశారు. నవీన్కుమార్కు గత నెల 27న నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో నవీన్కుమార్ ఆ ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోయారు. బౌన్సర్లతో బెదిరింపు.. ఇదిలా ఉండగా.. జూబ్లీహిల్స్ రోడ్డు నం.72లోని ప్రశాసన్నగర్లో ఉన్న తమ ఇంట్లోకి వెళ్లేందుకు భన్వర్లాల్ సన్నాహాలు చేసుకుంటున్నారు. అందులో భాగంగా ఆయన భార్య మణిలాల్ గురువారం సాయంత్రం అక్కడకు వెళ్లి కొన్ని మరమ్మతులు చేయించేందుకు ప్రయత్నించారు. అప్పటికే ఆ ఇంటి వద్ద ఉన్న సాహిత్ ఇద్దరు బౌన్సర్లతో కలసి బీభత్సం సృష్టించారు. మణిలాల్ ఉండగానే ఇంటి లోపలి నుంచి గడియ పెట్టడంతో పాటు అతి సమీపం నుంచి బెదిరిస్తూ మాట్లాడారు. చాలాసేపు నిర్బంధించినంత పని చేశారు. దీంతో తీవ్ర భయభ్రాంతులకు గురైన ఆమె జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా సాహిత్ భట్ తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం అతడిని అదుపులోకి తీసుకుని నోటీసులు జారీ చేశారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement