-
ఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి జలాసనం
-
నిరూపిస్తే రాజీనామా చేస్తా: కోలగట్ల
సాక్షి, విజయనగరం: మూడు లాంతర్లు చారిత్రాత్మక కట్టడమని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఈ కట్టడం నమోదైందని నిరూపిస్తారా? అని సవాలు విసిరారు. కాగా శిథిలావస్థకు చేరిన మూడు లాంతర్లను గురువారం అధికారుల తొలగించిన విషయం తెలిసిందే. వాటి స్థానంలో ఆధునిక హంగులతో కొత్త కట్టడాన్ని చేపట్టనున్నారు. అందులో భాగంగా ఎమ్మెల్యే వీరభద్ర స్వామి ఆదివారం ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. (‘జూమ్’లో చర్చకు సిద్ధం.. మంత్రి బొత్స సవాల్) ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు లాంతర్ల ఆధునీకరణను మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనాతో ప్రజలు ఇబ్బందిపడితే పట్టించుకోకుండా బంగ్లాకే పరిమితమయ్యారని, ఇప్పుడేమో ఉనికి కోసం రోడ్డెక్కుతున్నారని విమర్శించారు. మోతి మహాల్, పూల్ బాగ్ ప్యాలెస్లను నేలమట్టం చేసినప్పుడు అవి పురాతన కట్టడాలు అని గుర్తు రాలేదా? అని ఎద్దేవా చేశారు. మూడు లాంతర్లు చారిత్రాక కట్టడమంటూ తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. కేవలం రాత్రిపూట ప్రజలకు దారి చూపేందుకు మాత్రమే మూడు లాంతర్లు ఏర్పాటు చేశారని వీరభద్ర స్వామి స్పష్టం చేశారు. (చంద్రబాబు వివరణ ఇవ్వగలరా?: సంచయిత) కాగా చారిత్రక నేపధ్యం కలిగిన విజయనగరంలోని మూడు లాంతర్ల స్థూపాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నట్లు విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎస్ఎస్ వర్మ వెల్లడించారు. నగర సుందరీకరణలో భాగంగానే మూడు లాంతర్ల జంక్షన్ను అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. చారిత్రక నేపథ్యమున్న కట్టడాలను కూల్చుతారన్న ఆరోపణలు అర్థరహితమని పేర్కొన్నారు. నగరంలోని ఆరు ప్రాంతాలను అత్యాధునికీకరించేందుకు చర్య లు చేపట్టామన్నారు. కలెక్టర్ ఆఫీస్ జంక్షన్, మ యూరి జంక్షన్, బాలాజీ జంక్షన్, సింహాచలం మేడ జంక్షన్, మూడు లాంతర్ల జంక్షన్, కొత్తపేట నీళ్ళ ట్యాంక్ జంక్షన్ ప్రాంతాలలో అభివృద్ధి పనులు జరుగుతాయన్నారు. మూడు లాంతర్లను ముగ్గురు మహిళలు చేతబూనేలా స్థూపాన్ని రూపొందించనున్నట్టు వివరించారు. జాతీయ చిహ్నమైన మూడు సింహాల ప్రతిమను కూడా అమర్చుతున్నట్లు చెప్పారు. మూడు లాంతర్ల పై ఉన్న మూడు సింహాల ప్రతిమను ఎంతో పవిత్రంగా తమ కార్యాలయంలో భద్రపరిచినట్టు చెప్పారు. మొత్తం రూ.5 లక్షల నిధులతో ఈ పనులు చేస్తున్నట్లు వెల్లడించారు. -
'ఏపీ ప్రభుత్వానిది పరిపాలనా? వ్యాపారమా?'
విజయనగరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం పరిపాలన చేస్తుందో లేక వ్యాపారం చేస్తుందో అర్థం కావడం లేదని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి విమర్శించారు. గురువారం ఆయన విజయనగరంలో విలేకరులతో మాట్లాడారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చిన ప్రతి అవకాశాన్ని తన వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవడానికే వాడుకుంటున్నాడని ధ్వజమెత్తారు. ఓటుకు కోట్లు కేసు భయంతోనే చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని ఎమ్మెల్సీ కోలగట్ల విమర్శించారు. -
'నేతలను, కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నారు'
విజయనగరం: వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని అన్యాయంగా అరెస్టు చేశారంటూ వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ నేతల నుంచి కార్యకర్తల వరకూ టార్గెట్ చేసి బలహీనపర్చాలనే ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఎయిర్పోర్టు నిర్మాణానికి వ్యతిరేకంగా రైతులు పోరాటం చేస్తున్నారని అన్నారు. అధికారులు మాత్రం పరుగు పేరుతో గ్రామాల్లో ప్రజలను అశాంతి పరుస్తున్నారని విమర్శించారు. ఇదిలా ఉండగా, ఎమ్మెల్యే భూమా అరెస్ట్ ను కురుపాం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి ఖండించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చిరు జల్లులతో ఉపశమనం
మత్స ్య సంపద ౖపైపెకి..
దాబా పైనుంచి పడి యువకుడి దుర్మరణం
నేటినుంచి కేయూ డిగ్రీ సెమిస్టర్ల పరీక్షలు
ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
పీఆర్సీ వేతన సవరణ అంశాలపై వివరణ
ఇండియా కూటమిని గెలిపించాలి
వారికి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం..
ఎన్నికలప్పుడే గుర్తొస్తాయి!
ఓటర్లకు అందుబాటులో ‘చాట్బాట్’ యాప్
తప్పక చదవండి
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement