-
రాయల్ కరీబియన్ ‘పర్ల్’.. స్పెషల్ ఏంటంటే?
పైనున్న ఫొటోపై తీరికగా ఓ లుక్కేయండి! ఏంటబ్బా ఇది అని ముక్కున వేలేసుకుంటున్నారా? ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కైనెటిక్ కళా శిల్పమట. అంటే ఏమిటి అనేనా మీ డౌట్! అక్కడికే వస్తున్నాం. కైనెటిక్ అంటే కదిలేది అని అర్థం! కళా శిల్పం అంటే ఏమిటో మీకు తెలుసు. రెండింటినీ కలిపేయండి. ఇప్పటికీ అర్థం కాలేదా? అయితే మీకు వివరంగా చెప్పాల్సిందే. చదివేయండి!. ‘రాయల్ కరీబియన్’ సంస్థ సిద్ధం చేసిన సరికొత్త క్రూయిజ్ షిప్లో ఓ భాగమీ నిర్మాణం. పేరు ‘పర్ల్’. పేరులో ఉన్నట్లే ముత్యం ఆకారంలోనే గుండ్రంగా కనిపిస్తోంది. దాదాపు 45 అడుగుల ఎత్తు, 53 అడుగుల వ్యాసమూ ఉంటుంది ఈ ‘పర్ల్’. మధ్యలో ఉన్న మెట్లను చూశారా? రెండు అంతస్తులను కలిపే ఈ మెట్లకు రెండు వైపులా పలకలు ఉన్నాయి చూశారా? అక్కడుంది అసలు విశేషమంతా! నిత్యం కదులుతూ అందమైన ఆకృతులను సృష్టిస్తూంటాయి ఈ పలకలు. అంతేనా అని పెదవి విరిచేయొద్దు. ఇంకా ఉంది.. పలకలన్నీ ఫెబినాకీ సిరీస్ (1, 1, 2, 3, 5, 8.. ప్రతీ అంకె ముందున్న రెండు అంకెల మొత్తం) ప్రకారం అమర్చడం ఒక విశేషం. రెండో విశేషం.. ఎక్కడో కరేబియన్ సముద్ర ప్రాంతంలో గాలి వేగం, అలల కదలికలకు తగ్గట్టుగా ఈ పలకలు కూడా కదులుతూంటాయి. దూరంగా పుట్టిన అల తాలూకూ ప్రశాంతత.. తీరాన్ని తాకే సమయంలో ఉండే ఉధృతి అన్నీ ఈ కదలికల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తాయన్నమాట. నాలుగేళ్లపాటు కష్టపడి దీన్ని తయారు చేశామని, ‘పర్ల్’లోని మొత్తం మూడు వేల పలకలను లీనియర్ ఆక్చుయేటర్తో అనుసంధానించి అన్ని దిక్కులకూ కదిలేలా చేశామని బ్రేక్ఫాస్ట్ ప్రతినిధి ఒకరు తెలిపారు. కరీబియన్ సముద్ర ప్రాంతపు వాతావరణ సమాచారం ఆధారంగా పలకల కదలికలను నియంత్రించేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. పలకల కదలికలకు తగ్గట్టుగా లైటింగ్ కూడా మారుతూంటుందని వివరించారు. ‘పర్ల్’ ఎలా ఉంటుందో ఒక్కసారి చూడాలని అనిపిస్తోందా? అయితే కింది వీడియో మీ కోసమే! -
ఎలక్ట్రిక్ ఆటోపరికరాల తయారీకి కొత్త కంపెనీ
ముంబై: ఎలక్ట్రిక్ ఆటోమొబైల్ పరికరాల తయారీ కోసం కొత్తగా అనుబంధ సంస్థను ఏర్పాటు చేసినట్లు కైనెటిక్ ఇంజినీరింగ్ వెల్లడించింది. కైనెటిక్ వాట్స్ అండ్ వోల్ట్స్ పేరుతో 2022లో దీన్ని నెలకొల్పినట్లు తెలిపింది. ఇది మోటార్లు, కంట్రోలర్లు, బ్యాటరీలు మొదలైనవి తయారు చేస్తుందని పేర్కొంది. కొత్త కంపెనీలో మాతృ సంస్థకు 92 శాతం, ప్రమోటర్లయిన ఫిరోదియా కుటుంబానికి మిగతా 8 శాతం వాటాలు ఉంటాయి వ్యూహాత్మక/ఆర్థిక భాగస్వామికి 25 శాతం వరకు వాటాను విక్రయించేందుకు కూడా కంపెనీ సిద్ధంగా ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కేఈఎల్, కైనెటిక్ కమ్యూనికేషన్స్ కింద ఉన్న తమ ప్రస్తుత ఈవీ (ఎలక్ట్రిక్ వాహనాలు) వ్యాపారాన్ని కొత్త సంస్థలో విలీనం చేయనున్నట్లు కైనెటిక్ ఇంజినీరింగ్ ఎండీ అజింక్యా ఫిరోదియా తెలిపారు. తాము ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల కోసం గేర్బాక్సులు, ఛాసిస్లను తయారు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. దేశీయంగా 700 పైచిలుకు సంస్థలు ద్విచక్ర ఈవీలను ఉత్పత్తి చేస్తున్న నేపథ్యంలో తమకు భారీగా వ్యాపార అవకాశాలు ఉన్నాయని ఆయన ఫిరోదియా చెప్పారు. -
ఫామ్లోనే లేడు.. పాఠ్య పుస్తకాల్లోకి మాత్రం ఎక్కాడు
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం ప్రస్తుత తరంలో టాప్ క్రికెటర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. అయితే కొంతకాలంగా బాబర్ ఆజం నిరాశజనక ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. ఇటీవలే ముగిసిన ఆసియా కప్లో కెప్టెన్ హోదాలో జట్టును ఫైనల్ చేర్చినప్పటికి.. బ్యాటింగ్లో ఘోర ప్రదర్శన చేశాడు. ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు చేయని బాబర్ ఆజం.. ఆరు మ్యాచ్లు కలిపి 68 పరుగులు మాత్రమే చేశాడు. ఆరు ఇన్నింగ్స్ల్లో వరుసగా 10,9 14, 0,30, 5 పరుగులు ఉన్నాయి. ఇందులో ఒక గోల్డెన్ డక్ ఉండడం విశేషం. అయితే ఆట ఎలా ఉన్నా బాబర్ ఆజం షాట్స్ మంచి టెక్నిక్తో కూడుకొని ఉంటాయి. ముఖ్యంగా బాబర్ ఆజం కవర్ డ్రైవ్ షాట్ చూడముచ్చటగా ఉంటుంది. అందుకే అతని కవర్డ్రైవ్ షాట్ క్రికెట్కు మాత్రమే పరిమితం కాలేదు. తాజాగా తన దేశంలోని పాఠ్య పుస్తకాల్లో బాబర్ ఆజం పేరు దర్శనమిచ్చింది. అవునండీ.. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. బాబర్ ఆజం కవర్ డ్రైవ్ గురించి 9వ తరగతి ఫిజిక్స్ సిలబస్లో ఒక ప్రశ్న తయారు చేశారు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ''బాబర్ ఆజం తన బ్యాట్ ద్వారా బంతికి 150 జౌల్స్తో కైనటిక్ ఎనర్జీ అందించడం ద్వారా కవర్ డ్రైవ్ను కొట్టాడు. (ఎ) బంతి ద్రవ్యరాశి 120 గ్రా అయితే బంతి ఏ వేగంతో బౌండరీకి వెళుతుంది? (బి) 450గ్రా ద్రవ్యరాశి కలిగిన ఫుట్బాల్ను ఈ వేగంతో తరలించడానికి ఫుట్బాల్ క్రీడాకారుడు ఎంత కైనటిక్ ఎనర్జీ అందించాలి?" అంటూ ఒక ప్రశ్న వచ్చింది. దీనిపై అభిమానులు మాత్రం కాస్త భిన్నంగా స్పందించారు. ''ఫామ్లోనే లేడు.. అయినా పాఠ్య పుస్తకాల్లోకి ఎక్కాడు.. దీనికి అతను అర్హుడేనా'' అంటూ కామెంట్ చేశారు. Babar Azam's cover drive related question in 9th grade physics syllabus (federal board) (via Reddit) pic.twitter.com/I2Tc9HldsG — Shiraz Hassan (@ShirazHassan) September 13, 2022 చదవండి: స్మృతి మందాన మెరుపులు.. ఇంగ్లండ్పై ఘన విజయం -
మౌలికానికి గతి ‘శక్తి’
న్యూఢిల్లీ: మెరుగైన ప్రణాళికల రచన, అమలు, పర్యవేక్షణ ద్వారా ఆధునిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి పీఎం గతి శక్తి కొత్త దిశను నిర్దేశించగలదని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ప్రాజెక్టుల అమల్లో జాప్యాలను, అధిక వ్యయాలను తగ్గించేందుకు దోహదపడగలదని ఆయన తెలిపారు. ప్రభుత్వంతో జట్టు కట్టాలని, పెట్టుబడులు పెట్టడం ద్వారా దేశ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని ’గతి శక్తి’పై ఏర్పాటైన సమావేశంలో పాల్గొన్న సందర్భంగా కార్పొరేట్లకు సూచించారు. దేనికదే అన్న ధోరణిలో పనిచేసే వివిధ విభాగాలను సమన్వయం చేసేందుకు, సమగ్రమైన ప్రణాళికలతో ప్రాజెక్టులను అమలు చేయడంలో ఉపయోగపడేందుకు ఉద్దేశించిన పీఎం గతి శక్తి – జాతీయ మాస్టర్ ప్లాన్ను గతేడాది ప్రకటించారు. ‘ఇన్ఫ్రా ప్లానింగ్, అమలు, పర్యవేక్షణకు ఇక నుంచి పీఎం గతి శక్తితో కొత్త దిశ లభిస్తుంది. దీనితో ప్రాజెక్టుల అమల్లో జాప్యం జరగడం, ఫలితంగా వ్యయాలు పెరిగిపోవడం మొదలైనవి తగ్గుతాయి‘ అని ప్రధాని పేర్కొన్నారు. సిసలైన పీపీపీ విధానం.. ఇన్ఫ్రా ప్రణాళికల రచన నుంచి అభివృద్ధి చేసి, వినియోగంలోకి తెచ్చే దశ దాకా మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) విధానం సిసలైన రీతిలో అమలయ్యేలా చూసేందుకు గతి శక్తి తోడ్పడుతుందని ప్రధాని చెప్పారు. భారత ఎకానమీ మరింత పటిష్టంగా మారేందుకు, అసంఖ్యాకంగా కొత్త ఉపాధి అవకాశాల కల్పనకు ఇన్ఫ్రా ఆధారిత అభివృద్ధి విధానం దోహదపడగలదని ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్టులను పూర్తి చేయడానికి సంబంధించి సాంప్రదాయ విధానాల్లో .. వివిధ భాగస్వాముల మధ్య సమన్వయం ఉండటం లేదని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ‘వివిధ విభాగాల వద్ద సమాచారం స్పష్టంగా లేకపోవడం ఇందుకు కారణం. పీఎం గతి శక్తితో ఇకనుంచి అందరూ పూర్తి సమాచారంతో తమ తమ ప్రణాళికలను రూపొందించుకోవడం వీలవుతుంది. దేశ వనరులను గరిష్ట స్థాయిలో సమర్థంగా వినియోగించుకోవడానికి సాధ్యపడుతుంది‘ అని ఆయన చెప్పారు. గతి శక్తి కార్యక్రమ ప్రాధాన్యత గురించి ప్రస్తావిస్తూ.. 2013–14లో ప్రభుత్వ ప్రత్యక్ష పెట్టుబడుల వ్యయాలు రూ. 2.50 లక్షల కోట్లుగా ఉండగా.. 2022–23లో ఇది రూ. 7.5 లక్షల కోట్లకు చేరిందని ప్రధాని వివరించారు. ‘సమాఖ్య విధానంలోని సహకార స్ఫూర్తిని మరింత పటిష్టంగా అమలు చేసే దిశగా, ఈ ఏడాది బడ్జెట్లో రాష్ట్రాలకు రూ. 1 లక్ష కోట్ల మేర తోడ్పాటు అందించేందుకు కేంద్రం కేటాయింపులు జరిపింది. బహువిధమైన ఇన్ఫ్రా, ఇతర ప్రయోజనకరమైన అసెట్స్పై రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ నిధులను ఉపయోగించుకోవచ్చు‘ అని ప్రధాని పేర్కొన్నారు. పుష్కలంగా డేటా.. గతి శక్తి – నేషనల్ మాస్టర్ ప్లాన్లో ప్రస్తుత, ప్రతిపాదిత మౌలిక ప్రాజెక్టులతో పాటు అటవీ భూములు, పారిశ్రామిక స్థలాలు మొదలైన వాటన్నింటికి సంబంధించి 400 పైగా రకాల డేటా అందుబాటులో ఉందని మోదీ చెప్పారు. మాస్టర్ ప్లాన్ కీలక వివరాలన్నీ ఒకే చోట సింగిల్ ప్లాట్ఫామ్లో లభ్యమవుతాయని పేర్కొన్నారు. ప్రణాళికల రచన కోసం ప్రైవేట్ రంగం వీటన్నింటినీ మరింత విస్తృతంగా ఉపయోగించుకోవచ్చని ఆయన తెలిపారు. కాగా, ప్రైవేట్, ప్రభుత్వ పెట్టుబడుల రాకకు గతి శక్తి తోడ్పడగలదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ చెప్పారు. దీనితో ఆర్థిక వ్యవస్థకు పలు ప్రయోజనాలు చేకూరగలవని ఆయన పేర్కొన్నారు. -
మార్కెట్లోకి కైనెటిక్-ఐమా ఈవీ టూ-వీలర్స్
ముంబై: ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఉన్న పుణే కంపెనీ కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ, పవర్ సొల్యూషన్స్ తాజాగా చైనా దిగ్గజం ఐమా టెక్నాలజీ గ్రూప్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఇరు సంస్థలు కలిసి భారత మార్కెట్ కోసం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల రూపకల్పన, అభివృద్ధి చేస్తాయి. ఈ ప్రాజెక్ట్కు రూ.80-100 కోట్లు పెట్టుబడి చేయనున్నట్టు కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ, పవర్ సొల్యూషన్స్ ఫౌండర్, సీఈవో సులజ్జా ఫిరోదియా మోత్వానీ తెలిపారు. ‘కైనెటిక్-ఐమా భాగస్వామ్యంలో ఏడాదిలో మూడు మోడళ్లను పరిచయం చేయనున్నాం. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సామర్థ్యం పెంపు, ఉత్పత్తుల అభివృద్ధి, విస్తరణకు వచ్చే అయిదేళ్లలో రూ.500 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించాం. దేశంలో ఈ–టూ వీలర్స్ 2–3 శాతమే విస్తరించాయి. వచ్చే 10 ఏళ్లలో ఇది 30 శాతానికి చేరుతుంది. కైనెటిక్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు మంచి డిమాండ్ ఉంది. నెలకు 5,000 యూనిట్ల దాకా విక్రయిస్తున్నాం’ అని తెలిపారు. (చదవండి: ఈపీఎఫ్ఓ చందాదారులకు శుభవార్త.. ఇక సులభంగానే!)
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
నేనే కోచ్ అయివుంటే.. అతడికి జట్టులో నో ఛాన్స్: సెహ్వాగ్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- బీజేపీ ఏం చేసిన పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
Advertisement