-
లైసెన్స్కు అప్లై చేసిన బన్నీ.. అందుకోసమేనా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్లో సందడి చేశారు, ఖైరతాబాద్లోని ఆర్టీఏ ఆఫీసుకు వచ్చారు. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే బన్నీ అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేయడం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఇతర దేశాల్లో రోడ్ ట్రిప్ వెళ్లేవారు తప్పనిసరిగా ఈ లైసెన్స్ తీసుకుంటారు. కానీ అల్లు అర్జున్ ఎందుకు తీసుకుంటున్నారన్న దానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. విదేశాల్లో పుష్ప-2 షూటింగ్ కోసమే లైసెన్స్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో జపాన్లో పుష్ప-2 షూటింగ్ జరగనుందని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అందుకోసమే దరఖాస్తు చేసి ఉండవచ్చని అభిమానులు భావిస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం పుష్ప-2 షూటింగ్ షెడ్యూల్ నంద్యాల జిల్లాలోని యాగంటి క్షేత్రంలో జరుగుతోంది. అక్కడ ఆలయంలో రష్మిక మందన్నాపై ముఖ్యమైన సీన్స్ తెరకెక్కించారు. దీనికి సంబంధించిన ఫోటోలను రష్మిక ఇన్స్టాలో పంచుకున్నారు. సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బన్నీ లైసెన్స్ అప్లై చేయడం చూస్తే త్వరలోనే విదేశాల్లో షూటింగ్కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. ఇప్పటికే పుష్ప-2 సినిమాను ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు సుకుమార్ ప్రకటించారు. ఈ మూవీ వాయిదా పడే ఛాన్స్ లేదని గతంలోనే చెప్పారు. -
పవన్ కల్యాణ్ కొత్త వాహనాల రిజిస్ట్రేషన్.. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్..
సాక్షి, హైదరాబాద్: సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ గురువారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. కొత్తగా కొనుగోలు చేసిన ఆరు వాహనాలను ఆయన రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వాటిలో ఒకటి బెంజ్, మరో రెండు స్కార్పియో కార్లు ఉ న్నాయి. టయోటా వైల్ఫైర్ వాహనంతో పాటు ఒక జీప్ ర్యాంగ్లర్, ఒక టాటా యోధ ట్రాన్స్పోర్టు వాహనం పవన్కల్యాణ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అలాగే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ తీసుకున్నారు. ఉపరవాణా కమిషనర్ పాపారావు, ఖైరతాబాద్ ప్రాంతీయ రవాణా అధికారి రాంచందర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. చదవండి: (కైకాల సత్యనారాయణ మృతి.. తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం) -
ఆర్టీఏ ఆన్లైన్ బిడ్డింగ్లో గందరగోళం
► ఇటీవల నగరంలోని ఓ ఆర్టీఏ కేంద్రం పరిధిలో కూకట్పల్లి ప్రాంతానికి చెందిన ఓ వాహనదారు తనకు నచ్చిన నంబర్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మధ్యాహ్నం వేలం నిర్వహించే సమయానికి మొబైల్ ఫోన్కు ఎలాంటి సమాచారం అందకపోవడంతో పోటీలో పాల్గొనలేకపోయారు. దీంతో నచ్చిన నంబర్ను కోల్పోయారు. ► బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన మరో వాహనదారుకు సైతం ఇలాంటి అనుభవమే ఎదురైంది. ప్రధానంగా ‘9999’, ‘9’, ‘1111’, ‘6666’, ‘1234’ వంటి నంబర్లకు ఎంతో డిమాండ్ ఉంటుంది. గతంలో ఆల్నైన్స్ కోసం ఖైరతాబాద్ ఆర్టీఏ పరిధిలో ఏకంగా రూ.10 లక్షల వరకు వేలంలో పోటీపడి సొంతం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. సినీ రంగానికి చెందిన ప్రముఖులు, రియల్ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ పార్టీలకు చెందిన నేతలు నచ్చిన నంబర్లను సొంతం చేసుకొనేందుకు పెద్ద మొత్తంలోనే చెల్లించేందుకు సిద్ధపడతారు. కానీ ఆన్లైన్ బిడ్డింగ్లో పోటీ తగ్గుముఖం పట్టినట్లు వాహనదారులు ఆరోపిస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: ఆర్టీఏ ప్రత్యేక నంబర్లపై నిర్వహించే ఆన్లైన్ బిడ్డింగ్పై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. బిడ్డింగ్లో ప్రదర్శించే నంబర్ల కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ పోటీలో పాల్గొనలేకపోతున్నట్లు వాహనదారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొన్ని నంబర్లపై ఎలాంటి పోటీలు కూడా నిర్వహించడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వాహనదారులు తమకిష్టమైన నంబర్ల కోసం రూ.లక్షలు వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ ఆన్లైన్లో సరైన సమాచారం లేకపోవడంతో ఇందులో పాల్గొనలేకపోతున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: మెట్రో రైల్ ప్రయాణికులకు గుడ్ న్యూస్) అప్పుడలా.. ► మూడేళ్ల క్రితం అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో ప్రత్యేక నంబర్లకు ప్రత్యక్షంగా వేలం నిర్వహించేవారు. వాహనదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించి మధ్యాహ్నం 3 గంటలకు పోటీ నిర్వహించేవారు. ఈ పోటీలో వాహనదారులంతా స్వయంగా పాల్గొనేందుకు అవకాశం ఉండడంతో ఏ వాహనదారు ఎంత మొత్తానికి బిడ్డింగ్లో పాల్గొని నంబర్ను సొంతం చేసుకున్నాడనేది స్పష్టంగా తెలిసిపోయేది. (చదవండి: అ‘ధర’హో.. గజం రూ.1.01 లక్షలు) ► మరోవైపు నంబర్ల బిడ్డింగ్ నిర్వహణలో పారదర్శకత కోసం అధికారులు సైతం ఎలాంటి దాపరికానికి తావు లేకుండా బహిరంగంగా వేలం నిర్వహించేవారు. దీంతో ప్రత్యేక నంబర్లపైనే రవాణా శాఖకు ఏటా కోట్లాది రూపాయల ఆదాయం లభించింది. నంబర్ల సీరిస్లో ‘9’ అంకెతో మొదలయ్యే ఖైరతాబాద్ ఆర్టీఏలో ప్రతి ప్రత్యేక నంబర్కు భారీ డిమాండ్ ఉంటుంది. రూ.30 వేల ఫీజు ఉన్న నంబర్లకు పోటీలో రూ.5 లక్షలు డిమాండ్ ఉండేది. సింగిల్ నైన్, ఆల్నైన్స్ కోసం ప్రతి సిరీస్లో కనీసం 10 మంది వాహనదారులు పోటీపడేవారు. (చదవండి: ఐఐటీ హైదరాబాద్.. నియామకాల్లో జోరు) ఇప్పుడిలా.. ► ప్రత్యేక నంబర్లపై నిర్వహించే బిడ్డింగ్ను మూడేళ్ల క్రితం ఆన్లైన్లోకి మార్చారు. మొదట హైదరాబాద్ ఆర్టీఏలో అమలు చేసి ఆ తర్వాత రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు విస్తరించారు. వాహనదారులు ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండాపోయింది. ► సాంకేతిక వైఫల్యాల కారణంగా వాహనదారులకు సకాలంలో సరైన సమాచారం లభించడం లేదు. దీంతో ఎక్కువ మంది పోటీలో పాల్గొనలేకపోతున్నారు. దీనిపై కొంతమంది వాహనదారులు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. -
డ్రైవింగ్ నేర్చుకునేవారికి సిమ్యులేటర్ శిక్షణ
సాక్షి, సిటీబ్యూరో: డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా... అయితే మొదట సిమ్యులేటర్స్పైన తప్పనిసరిగా శిక్షణ పొందాల్సిందే. రోడ్డుపై వాహనాన్ని నడిపేందుకు ముందు సిమ్యులేటర్ ద్వారా డ్రైవింగ్ మెళకువలను తెలుసుకోవాల్సిందే. ఇందుకోసం రవాణాశాఖ స్వయంగా సిమ్యులేటర్ శిక్షణకు శ్రీకారం చుట్టింది. లెర్నింగ్ లైసె న్సు పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులను సిమ్యులేటర్ శిక్షణకు ప్రోత్సహించేందుకు ఖైరతాబాద్లోని రవాణా శాఖ ప్రధాన కార్యాలయంలో సిమ్యులేటర్లను ఏర్పాటు చేశారు. మరో వారం రోజుల్లో దీనిని వినియోగదారులకు అందుబాటులోకి తేనున్నట్లు సంయుక్త రవాణా కమిషనర్ రమేష్ తెలిపారు. అనంతరం దశల వారీగా అన్ని ఆర్టీఏ కార్యాలయాలకు విస్తరించాలని భావిస్తున్నామన్నారు. మరోవైపు నామమాత్రపు శిక్షణ ఇస్తూ వినియోగదారుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తున్న డ్రైవింగ్ స్కూళ్లకు అడ్డుకట్టవేయడంపై రవాణాశాఖ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ప్రతి డ్రైవింగ్ స్కూల్లో సిమ్యులేటర్ శిక్షణ తప్పనిసరి చేయనున్నారు. తద్వారా ప్రాథమిక దశలోనే వాహనదారులకు రహదారి భద్రత, ట్రాఫిక్ నిబంధనలపైన అవగాహన ఏర్పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. రోడ్డుపైన వాహనాన్ని నడపడం కంటే ముందే డ్రైవింగ్ లో మెళకువలను నేర్పించడం వల్ల రెట్టింపు ప్రయోజనం ఉంటుందని తెలిపారు. ఇందుకోసం ప్రతి డ్రైవింగ్ స్కూల్ సిమ్యులేటర్ను ఏర్పాటు చేసుకునేలా చర్యలు చేపట్టనున్నట్లు జేటీసీ రమేష్ పేర్కొన్నారు. డొల్ల శిక్షణకు చెల్లు... ప్రస్తుతం నగరంలో వందలకొద్దీ డ్రైవింగ్ స్కూళ్లు ఉన్నాయి. ఇందులో 80 శాతానికి పైగా మొక్కుబడి అవగాహన కల్పిస్తూ వినియోగదారుల నుంచి రూ.వేలల్లో దండుకుంటున్నాయి. ఆయా స్కూళ్లలో శిక్షణ పొందిన వారు రోడ్డుపైకి వచ్చిన తరువాత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ రద్దీలో గందరగోళానికి గురవుతుండటంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని స్కూళ్లు ఎలాంటి శిక్షణ ఇవ్వకుండా కేవలం డ్రైవింగ్ లైసెన్సులు ఇప్పించేందుకే పరిమితమయ్యాయి. ఈ మేరకు ఆర్టీఏ అధికారులతో ఒప్పందం చేసుకొని దళారీ పాత్రను పోషిస్తున్నాయి. మొత్తంగా ఎలాంటి శాస్త్రీయత లేకుండా, నాణ్యమైన పద్ధతులు లేకుండా లభిస్తోన్న శిక్షణ స్థానంలో సిమ్యులేటర్లు శాస్త్రీయమైన పద్ధతులకు దోహదం చేస్తుందని అధికారులు భావిస్తున్నారు. సిమ్యులేటర్లతో ప్రయోజనాలు... ⇒ డ్రైవింగ్ పట్ల భయం తొలగిపోతుంది. ట్రాఫిక్ రద్దీ, వాహనాల రొద వంటి పరిస్థితుల్లో గందరగోళం లేకుండా వాహనం నడిపే అవగాహన ఏర్పడుతుంది. ⇒ క్లచ్, గేర్,ఎస్కలేటర్, స్టీరింగ్, ఇండికేటర్, హెడ్లైట్, వైపర్లను ఎలా వినియోగించాలో, ఏ సమయంలో ఏం చేయాలనేది నేర్చుకోవచ్చు. ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా రోడ్డుపైన ఏ ట్రాక్లో వాహనం నడపాలనే అంశం తెలుస్తుంది. ట్రాఫిక్ రద్దీ తీవ్రతకు అనుగుణంగా ట్రాక్లలో మార్పులు చోటు చేసుకుంటాయి. ⇒ కుడి, ఎడమ ఇండికేటర్స్ ఎలా విని యోగించాలో తెలుసుకోవచ్చు. ‘యు’ టర్న్ తీసుకొనేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు తెలుస్తాయి. ⇒ ఘాట్రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో వాహనం నడిపేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలపైన సిమ్యులేటర్లు అవగాహన కల్పిస్తాయి. వర్షాకాలం, మంచుకురిసే సమయాల్లో హెడ్లైట్లను తప్పనిసరిగా వేయాలి. వైపర్ల కండీషన్ ముఖ్యం. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలను పాటించకపోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. సిమ్యులేటర్ శిక్షణ డ్రైవింగ్తో ముడిపడిన ప్రతి అంశంపైన అవగాహన కల్పిస్తుంది. ⇒ సిగ్నల్ పడిన సమయంలో ఎంత దూరంలో వాహనం నిలపాలి. పార్కింగ్ సమయంలో ఎలాంటి మెళకువలు పాటించాలి వంటి అన్ని అంశాలపైన యానిమేషన్ చిత్రాల ద్వారా అవగాహన కల్పిస్తారు. ⇒ వివిధ రకాల రోడ్లు, సైన్బోర్డులు, జాగ్రత్తలు, హెచ్చరికల సూచీకలపైన అవగాహన కలుగుతుంది. ⇒ ప్రమాదాలు జరిగినప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు తెలుస్తాయి. మూడు గంటలు – ఆరు క్లాసులు సిమ్యులేటర్లో మొత్తం 6 క్లాసులు ఉంటాయి. దశలవారీగా 3 గంటల సమయంలో ఈ శిక్షణ ఇస్తాం. ఈ శిక్షణ తరువాత వినియోగదారుడికి డ్రైవింగ్ పైన భయం పూర్తిగా తొలగిపోతుంది. అన్ని విషయాలపైన స్పష్టమైన అవగాహన కలుగుతుంది. ఆ తరువాత రోడ్డుపైన ఎలాంటి గందరగోళం లేకుండా తాపీగా నేర్చుకోగలుగుతాడు. ఖైరతాబాద్ ఆర్టీఏలో మరో వారం లో ఈ శిక్షణ ప్రారంభం కానుంది. – మగ్బుల్ ఫలక్, సిమ్యులేటర్ శిక్షకులు రోడ్డు భద్రతపై అవగాహన పెరుగుతుంది సిమ్యులేటర్ ద్వారా శిక్షణ పొందేవారికి అనేక అంశాలపైన కచ్చితమైన అవగాహన కలుగుతుంది. ముఖ్యంగా రోడ్డు భద్రతా నిబంధనలు తెలుస్తాయి. వాతావరణం, ట్రాఫిక్ రద్దీలో వచ్చే మార్పులకు అనుగుణంగా వాహనం నడిపే తీరు, వేగనియంత్రణ, వివిధ రకాల విడిభాగాలను వినియోగించే పద్ధతిని ముందుగానే తెలుసుకొని ఆ తరువాత వాహనం స్టీరింగ్ పట్టుకోవడం వల్ల డ్రైవింగ్ పైన అపోహలు, ఆందోళన తొలగిపోతాయి. అన్ని డ్రైవింగ్ స్కూళ్లు సిమ్యులేటర్లను ఏర్పాటు చేయాలి. – రమేష్, జేటీసీ -
వేగమే తొలి శత్రువు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. ముఖ్యంగా జాతీయ, రాష్ట్ర పరిధిలో ఉన్న రహదార్లపై రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పెరుగుతున్న వాహనాలకు అనుగుణంగా రోడ్డు విస్తరణలు జరుగుతున్నా.. మితిమీరిన వేగం ప్రమాదాలకు ముఖ్యకారణం అవుతోంది. తర్వాతి స్థానాల్లో డ్రంకెన్ డ్రైవ్, నిర్లక్ష్యంగా ఉండటం గమనార్హం. మనదేశంలో ఉన్న పరిస్థితుల ఆధారంగా ఏ వాహనానికైనా గరిష్ట వేగ పరిమితి 80 కి.మీ. మాత్రమే. కానీ ఇక్కడ కార్లు, ఇతర వాహనాలు 120 కిలోమీటర్లు దాటి కూడా వెళుతున్నాయి. రోడ్డు రవాణా, హైవే శాఖ 2016 నివేదిక ప్రకారం ఏటా దేశవ్యాప్తంగా 4,80,652 ప్రమాదాలు జరుగుతుండగా 1.5 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మితిమీరిన వేగం కారణంగానే 68 శాతం ప్రమా దాలు జరగడం గమనార్హం. తెలంగాణలో దాదాపు 5 వేలకు పైగా మరణాలు జరిగాయి. కాగితాల్లోనే రోడ్ సేఫ్టీ కమిటీ! రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్ సేఫ్టీ కమిటీని ఏర్పాటు చేయాలని ఏడాది కింద ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో మెడికల్, రవాణా, పోలీసు, ఆర్ అండ్ బీ అధికారులు భాగస్వామ్యం కావాలి. అయితే ఇదింకా తుదిరూపు దాల్చలేదు. దీనికి ఎవరు నేతృత్వం వహించాలన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. నిరంతర నిఘా అవసరం మితిమీరిన వేగం, డ్రంకెన్ డ్రైవ్, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనల నియంత్రణకు రహదారులపై నిరంతర డ్రైవ్లు చేపట్టాలి. కెమెరాలతో పర్యవేక్షణ అవసరం. ట్రాఫిక్ ఉల్లంఘనలకు భారీగా జరిమానాలు విధించాలి. – పాండురంగ్ నాయక్, జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్,ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
రోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు
పొట్ట తగ్గాలంటే.. జిమ్కే వెళ్లాలా? ఏంటి?
రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
ఎన్నికల బరిలోకి 'జస్వీర్ సింగ్ గర్హి'.. అక్కడ నుంచే పోటీ
చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్
Viral Video: స్కూల్కు ఆలస్యంగా వచ్చిందని.. టీచర్పై ప్రిన్సిపాల్ దాడి
రెండేళ్లుగా గప్చుప్.. ఊహించని వార్త చెప్పిన సింగర్
పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- పొట్ట తగ్గాలంటే.. జిమ్కే వెళ్లాలా? ఏంటి?
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement