-
నగరంలో స్వచ్ఛ భారత్
కలెక్టర్ జి.కిషన్ పిలుపుమేరకు శుక్రవారం నగరంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు, ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు చెత్తాచెదారాన్ని తొలగించి, రోడ్లను శుభ్రం చేశారు. కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పీజీ కళా శాల, మహిళా పీజీ కళాశాలలో విద్యార్థులు స్వచ్ఛ భారత్ నిర్వహించారు. పీజీ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ అశోక్కుమార్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి రాజు, వీవీఎస్.శర్మ, రాజేందర్, సత్యనారాయణ, కె.యాకయ్య, ఇ.రమేష్, రమాదేవి, సరిత, శేషు పాల్గొన్నారు. మహిళా పీజీ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ తిరుమలాదేవి, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ శ్రీదేవి పాల్గొన్నారు. కేడీసీ ఆధ్వర్యంలో జేఎన్ఎస్లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఆర్.మార్తమ్మ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఆర్. శ్రావణ్కుమార్, విక్టర్, సురేశ్బాబు, కె.సత్యనారాయణ, రజనీలత, కె.సోమిరెడ్డి, జె. స్వామి, నర్సింహామూర్తి, విష్ణుచరణ్, హిమబిందు పాల్గొన్నారు. హన్మకొండలోని ప్రభుత్వ వృత్తి విద్యా కళాశాల విద్యార్థులు హన్మకొండ, కుమార్పల్లి, అశోక థియేటర్ పరిసరాల్లో స్వచ్ఛ భారత్ నిర్వహించారు. డీవీఈఓ ఎ.పరాంకుశం, ప్రిన్సిపాల్ వి.లక్ష్మారెడ్డి, అధ్యాపకులు జయపాల్రెడ్డి, శ్రీదేవి, రాజేంద్రప్రసాద్, రవి, తిరుపతి, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ సురేష్లాల్, ప్రోగ్రాం ఆఫీసర్ ఆర్.ప్రవీణ్కుమార్, ఎం సమ్మయ్య పాల్గొన్నారు. హన్మకొండలోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో సెక్రటరీ లూత్మేరి, విద్యార్థినులు, ఎస్ఎస్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఆర్ఐఓ మలహల్రావు, శానిటరీ ఇన్స్పెక్టర్ 46వ డివిజన్లో చెత్తాచెదారాన్ని తొలగించారు. టీచర్స్ కాలనీలో.. సుబేదారి : నగరంలోని టీచర్స్కాలనీ పేజ్-1లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రగతిమిత్ర కాలనీ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు వల్లంపట్ల నాగేశ్వర్రావు, ఇమ్మడి పుల్లయ్య ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ పార్కులో చెత్తాచెదారాన్ని తొలగించారు. కార్యక్రమంలో ప్రగతిమిత్ర గౌరవ అధ్యక్షుడు డోలి రాజలింగం, నాయకులు రాంరెడ్డి, వెంకటేశ్వర్లు, రామస్వామి, రఘుపతిరెడ్డి, శ్రీనివాస్, భూపాల్కర్ణ, జనార్దన్ పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో.. కాజీపేట : పట్టణ శివారులోని సోమిడి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో స్వచ్ఛ భారత్ నిర్వహిం చారు. ఈ సందర్భంగా హెచ్ఎం వెంకటేశ్వర్లు విద్యార్థులతో స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ చేశారు. పాఠశాల ఆవరణలో ఉన్న పిచ్చిమొక్కలు, గడ్డి, చెత్తాచెదారాన్ని తొలగించారు. విద్యాకమిటీ చైర్మన్ కొంరయ్య, ఉపాధ్యాయులు నరేందర్, పి.రాజిరెడ్డి, రాజేంద్రప్రసాద్, రాజేశ్వర్రావు, గోపిచంద్, ఆర్.లక్ష్మణ్సుధాకర్,రాజు, జయరాజ్ పాల్గొన్నారు. కాజీపేట బాలి కల ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు కె.పుష్పాంజలి, టి.జ్ఞానేశ్వర్, దర్గాకాజీపేట ప్రభు త్వ ఉన్నత పాఠశాలలో హెచ్ఎం సుందరాచార్యులు ఆధ్వర్యంలో విద్యార్థులు శ్రమదానం చేశారు. కేయూ జంక్షన్లో.. నయీంనగర్ : హన్మకొండ కేయూ జంక్షన్లోని ఎస్వీఎస్ జూనియర్ కళాశాల విద్యార్థినులు కళాశాల పరిసర ప్రాంతాల్లో చెత్తాచెదారాన్ని తొలగించి శుభ్రం చేశారు. కార్యక్రమంలో కళాశాల వైస్ చైర్పర్సన్ డాక్టర్ ఎర్రబెల్లి సువర్ణ, కళాశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా సరస్వతి నగర్లో జరిగిన కార్యక్రమంలో కార్పొరేషన్ ఏఈ కీర్తి, నోడల్ ఆఫీసర్ శంకర్రెడ్డి, జవాన్లు కవిత, దామోదర్, కాలనీ కమిటీ నాయకులు ప్రభాకర్రెడ్డి, యాదిరెడ్డి, నేతాజీ పాల్గొన్నారు. 48వ డివిజన్లో జరిగిన కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి ఎం.శివాజీ, మాజీ కార్పొరేటర్ స్వామిచరణ్, ఎస్ఆర్ కళాశాల విద్యార్థినులు పాల్గొన్నారు. హంటర్రోడ్డులో.. హన్మకొండ చౌరస్తా : హంటర్రోడ్డులోని సీవీ రామన్ జూనియర్ కళాశాలల ఆధ్వర్యంలో బాలసముద్రం, హంటర్రోడ్డు, అడ్వకేట్స్కాలనీలో స్వచ్ఛ భారత్ నిర్వహించారు. కళాశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది చెత్తాచెదారాన్ని తొల గించి, రోడ్డను ఊడ్చారు. కళాశాలల చైర్మన్ పి.కోటేశ్వర్రావు, డెరైక్టర్ పి.పూర్ణానందరావు, ప్రిన్సిపాల్ తీగల శ్రీధర్, అధ్యాపకులు శోభన్బాబు, రాజేంద్రప్రసాద్, సంపత్, అన్వర్, కె.సత్యనారాయణరెడ్డి, రాజు, ఇందు, అక్షిత, సంధ్య పాల్గొన్నారు. సిద్ధార్థనగర్లో.. నిట్ క్యాంపస్ : సిద్ధార్థనగర్లో కాలనీ వెల్ఫేర్ సొసై టీ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రోడ్లను ఊడ్చి చెత్తను తొల గించారు. కార్యక్రమంలో కాలనీ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు వాసుదేవరెడ్డి, కార్యదర్శి వినయ్భూషణ్, కాలనీ వాసులు బుచ్చం రావు, రాంచందర్, మహేందర్రెడ్డి, రమాకాంత్రెడ్డి, జలంధర్, జోజిరెడ్డి, జీవరత్నం పాల్గొన్నారు. -
ఓయూ మార్గదర్శకాలే ప్రామాణికం
కేయూలో పీహెచ్డీ ప్రవేశాలపై నివేదిక ఇచ్చిన కమిటీ ఆమోదించిన ఇన్చార్జ్ వీసీ వికాస్రాజ్ వారం రోజుల్లో ఇంటర్వ్యూల తేదీల ఖరారు కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఆర్ట్స్, సోషల్ సైన్స్, సైన్స్, లా, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ తదితర విభాగాల్లో పీహెచ్డీ ప్రవేశాల ప్రక్రియ ఓ కొలిక్కి వస్తోంది. ఉస్మానియా యూనివర్సిటీ మార్గదర్శకాలకనుగుణంగానే ఇక్కడ కూడా పీహెచ్డీలో ప్రవేశాలు కల్పించాలని యూనివర్సిటీ నియమించిన కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు కమిటీ నివేదికను కేయూ ఇన్చార్జ్ వీసీ వికాస్రాజ్ ఆమోదించారు. దీంతో ఎంతో కాలంగా పీహెచ్డీలో ప్రవేశాల కోసం నిరీక్షిస్తున్న అభ్యర్థులకు ఉపశమనం కలిగినట్లయింది. పీహెచ్డీ ప్రవేశపరీక్ష జరిగాక ఫలితాలు వెల్లడించడంలోనూ జాప్యం చేసిన అధికారులు ఇంటర్వ్యూలు నిర్వహించడంలో కూడా అదే వైఖరి అవలంబించారు. పీహెచ్డీలో ప్రవేశాలు కల్పించే విషయంలో ప్రస్తుత మార్గదర్శకాలను అవలంబిస్తే ప్రవేశపరీక్షలో ప్రతిభ చూపిన వారికి సీట్లు దక్కే అవకాశం లేదు. దీంతో ఓయూ మార్గదర్శకాలను అవలంబించాలని పలువురు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్పందించిన కేయూ అధికారులు బయోటెక్నాలజీ విభాగం ప్రొఫెసర్ ఎస్.సదానందం చైర్మన్గా, ప్రొఫెసర్ ఎంవీ.రంగారావు కన్వీనర్గా ఓ కమిటీని నియమించారు. ఈ కమిటీ సభ్యులు పలు దఫాలుగా సమావేశమై వివిధ యూనివర్సిటీల్లో పీహెచ్డీ ప్రవేశాలకు పాటిస్తున్న నిబంధనలను పరిశీలించడమే కాకుండా ఓయూ మార్గదర్శకాలను ఇక్కడ అనుసరించాలని పేర్కొంటూ నివేదిక సమర్పించారు. ఈ నివేదికను కేయూ ఇన్చార్జ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎంఏ.సింగరాచార్య.. ఇన్చార్జ్ వికాస్రాజ్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన అప్రూవల్ చేశారు. దీంతో త్వరలోనే కమిటీ బాధ్యులు సమావేశమై పీహెచ్డీ ప్రవేశాలకు తేదీలను నిర్ణయించే అవకాశముంది. రెండు కేటగిరీలుగా ప్రవేశాలు కేయూ పీహెచ్డీ సీట్ల భర్తీని రెండు కేటగిరీలుగా విభజించనున్నారు. కేటగిరీ-1లో సీఎస్ఐఆర్, జేఆర్ఎఫ్, ఐసీఎస్ఎస్ఆర్, ఐసీహెచ్ఆర్, ఆర్జీఎన్ఎఫ్ ఫెల్లోషిప్ అభ్యర్థులకు ప్రవేశాలు కల్పిస్తారు. రెండో కేటగిరీలో పీహెచ్డీ ప్రవేశపరీక్ష రాసిన, నెట్, ఎంఫిల్, స్లెట్ అభ్యర్థులందరికీ విభాగాల వారీగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. అభ్యర్థుల్లో నెట్ ఉన్న వారికి 20 మార్కులు, ఎంఫిల్కు 15 మార్కులు, స్లెట్కు 12 మార్కులు, ఎంట్రెన్స్కు 12 మార్కులు, పీజీలో డిస్టింక్షన్ కలిగి ఉంటే 10మార్కులు, ఇంటర్వ్యూకు 10మార్కులు, రీసెర్చ్ ప్రపోజల్స్కు ఐదు మార్కులు కేటాయించారు. ఆయా అభ్యర్థులకు నెట్ ఉంటే 20, స్లెట్ ఉండి ఎంఫిల్ ఉంటే ఎంఫిల్కు 15మార్కులే కేటాయిస్తారు. ఇలా ఆయా కేటగిరీలో కేటాయించిన మార్కులన్నింటిలో 50 మార్కులనే ప్రామాణికంగా తీసుకోవడంతో పాటు ఇంటర్వ్యూ ల ఆధారంగా మార్కులు కేటాయిస్తారు. మొత్తం 50 మార్కుల్లో ఎక్కువ మార్కులు వచ్చిన వారిలో రోస్టర్ రిజర్వేషన్ల ప్రాతిపదికన పీహెచ్డీలో ప్రవేశాలు కల్పిస్తారు. అయితే, పీహెచ్డీ నోటిఫికేషన్ ఇచ్చిన సమయం నాటి సీట్లు భర్తీ చేయాలా, ప్రస్తుతం ఉన్న ఖాళీలను పరిగణనలోకి తీసుకోవాలా అనేది అధికారులు త్వరలోనే నిర్ణయిస్తారు. అనంతరం పీహెచ్డీ ఇంటర్వ్యూల తేదీలు ఖరారు చేస్తారు. ఫార్మసీ విభాగంలో పూర్తి కొన్నినెలల క్రితం పీహెచ్డీ ప్రవేశపరీక్ష ఫలితాలను కేయూ అధికారులు వెల్లడించగా.. అప్పటి ఫార్మసీ డీన్ అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. 43మంది అభ్యర్థులకు ఇటీవల పీహెచ్డీలో ప్రవేశాలు కల్పిం చారు. ఇందులో జీ ప్యాట్ అర్హత కలిగిన వారికే చోటు దక్కగా, ఎంట్రెన్స్ రాసిన వారు కొందరే ఉన్నారు. తొలుత 29 పీహెచ్డీ సీట్లు ఉండగా, ఇంటర్వ్యూలు నిర్వహించాక రెండు నెలలకు అడ్మిషన్ల సమయంలో 43 మం దికి ప్రవేశాలు కల్పించారు. ఇందులో ఇద్దరు ప్రొఫెసర్లకు ఎనిమిది మంది కంటే ఎక్కువగా అభ్యర్థులను కేటాయించారని సమాచారం.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్..
10న జిల్లాకు ప్రియాంక గాంధీ రాక
కాంగ్రెస్తోనే కుల వృత్తులకు మహర్దశ
అంతటా యజ్ఞ సహిత యోగా నిర్వహించాలి
ముగిసిన హోం ఓటింగ్
జిల్లా రద్దు అంశంపై ఫోకస్..
మల్లారంలో నేరడిగొండవాసి హత్య
ఎల్లారెడ్డి డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్కు నోటీసులు?
హైదరాబాద్పై కుట్ర
తప్పక చదవండి
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
Advertisement