-
స్కూల్లోనే ప్రేమలో పడ్డా.. కానీ అలా జరగలేదు: చంద్రముఖి నటి
కుంకీ చిత్రంతో కోలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన మాలీవుడ్ నటి లక్ష్మీ మీనన్. ఆ తరువాత వరుసగా అవకాశాలు వరించడంతో బిజీగా మారిపోయింది. అలా పలు హిట్ చిత్రాలలో నటించిన ఈ అమ్మడు ప్లస్–2 పరీక్షలకు ప్రిపేర్ అవ్వాలంటే నటనకు విరామం తీసుకుంది. అదే లక్ష్మీమీనన్ చేసిన పెద్ద పొరపాటు. ఆమె తనకు తానుగా తీసుకున్న విరామం పర్మినెంట్గా మారింది. ఆ తరువాత కొన్ని చిత్రాలలో నటించినా అవి పెద్దగా ఆడలేదు. అలాంటిది గతేడాది చంద్రముఖి–2 చిత్రంలో మెరిసింది. ఆ చిత్రం కూడా తీవ్రంగా నిరాశపరిచింది. కాగా సమీప కాలంలో తమిళ నిర్మాతల మండలి ఇతర సినీ సంఘాలతో కలిసి నిర్వహించిన కలైంజర్- 100 కార్యక్రమంలో నటి లక్ష్మీమీనన్ ఓ పాటకు డాన్స్ చేసింది. అయితే తాజాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన లక్ష్మి మీనన్ ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. మీరు ఎవరినైనా ప్రేమించారా? లేక మిమ్మల్ని ఎవరైనా ప్రేమించారా? అన్న ప్రశ్నకు తన తొలి ప్రేమ అనుభవాన్ని వెల్లడించింది. తనను ఎవరూ ప్రేమించలేదని.. కానీ పాఠశాలలో చదువుతున్న సహ విద్యార్థితో తానే ప్రేమలో పడ్డానని చెప్పింది. అతను నచ్చడంతో నేరుగా అతని వద్దకు వెళ్లి తన ప్రేమ గురించి చెప్పానంది. కొన్ని రోజుల తరువాత అతను అంగీకరించాడని తెలిపింది. అయితే తామిద్దరం తరచూ కలుసుకోవడం, మాట్లాడుకోవడం, ఔటింగ్కు వెళ్లడం వంటివి జరగలేదని చెప్పింది. మేమిద్దరం కేవలం చదువుపైనే దృష్టి సారించి స్నేహితుల్లాగే ఉన్నామని తెలిపింది. ఎప్పుడో ఒకసారి కలిసి మాట్లాడుకునే వారమని చెప్పింది. అయితే పాఠశాల నుంచి ఇంటికి వెళ్లే సమయంలో తరచూ కలుసుకునేవారిమని.. ఫోన్లో మాట్లాడుకునే వాళ్లమని చెప్పుకొచ్చింది. అలా ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండేవాళ్లమని వెల్లడించింది. అయితే పాఠశాల చదువు పూర్తయ్యాక మా మధ్య ప్రేమ కూడా కనిపించకుండా పోయిందని చెప్పింది. ఆ తరువాత ఇద్దరం తమ వృత్తిలో బిజీ అయిపోయామని చెప్పింది. కాగా.. అతను ఇటీవలే పెళ్లి చేసుకున్నట్లు తెలిసిందని చెప్పింది. దీంతో మీరెప్పుడు పెళ్లి చేసుకుంటారు? అన్న ప్రశ్నకు ఇంట్లో వాళ్లు చూసిన వ్యక్తినే చేసుకుంటానని స్పష్టం చేసింది. View this post on Instagram A post shared by 𝐋𝐚𝐤𝐬𝐡𝐦𝐢 𝐌𝐞𝐧𝐨𝐧 (@lakshmimenon967) -
చేసింది కొన్ని సినిమాలే.. భారీ చిత్రంలో ఛాన్స్ కొట్టేసిన ముద్దుగుమ్మ!
మలయాళ బ్యూటీ మహిమా నంబియార్ ఇప్పుడు చాలా ఖుషీగా ఉంది. ఈ మలయాళ బ్యూటీ తన 13 ఏళ్ల కెరీర్లో నటించింది తక్కువ చిత్రాలే అయినా మంచి పేరుని తెచ్చుకుంది. దీనికి కారణం మంచి పాత్రలను ఎంపిక చేసుకోవడమే. మలయాళం, తమిళం భాషల్లో నటిస్తున్న మహిమా నంబియార్ఆమె 2010లో మలయాళం సినిమా కార్యస్థాన్ చిత్రం ద్వారా సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది. ఆ తర్వాత 2012లో సట్టై సినిమాతో కోలీవుడ్కు పరిచయమైంది. (ఇది చదవండి: షారుఖ్పై ఆనంద్ మహీంద్రా ట్వీట్ - మిగిలిన వారికంటే..!) ఆమె నటించిన తొలి చిత్రమే మంచి సక్సెస్ కావడంతో ఆ తర్వాత కుట్రం 23, కొడి వీరన్, మహాముని తదితర చిత్రాల్లో నటించే అవకాశం వరించింది. వీటిలో ఎక్కువ శాతం సక్సెస్ కావడం ఈమె కెరీర్కు ప్లస్ అయ్యింది. కాగా ప్రస్తుతం చంద్రముఖి– 2 లాంటి వంటి భారీ చిత్రంతో తమిళ ప్రేక్షకుల ముందుకు రానుంది. రజనీకాంత్, ప్రభు, నయనతార, జ్యోతిక, వడివేలు ప్రధాన పాత్రలు పోషించిన చంద్రముఖి చిత్రానికి ఇది సీక్వెల్గా తెరకెక్కించారు. ఇందులో రజనీకాంత్ పోషించిన పాత్రలో నృత్య దర్శకుడు రాఘవ లారెన్స్ నటించడం విశేషం. అదే విధంగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ జ్యోతిక పాత్రలో నటించగా.. లక్ష్మి మీనన్, సృష్టి డాంగే, రాధిక శరత్ కుమార్, వడివేలు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వీరితో పాటు మహిమ నంబియార్ ఒక నాయకిగా నటిస్తోంది. పి. వాసు దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకుంది. కాగా ఈ చిత్రంలోని ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. దీని గురించి మహిమా నంబియార్ తన ట్విట్టర్లో చంద్రముఖి– 2 చిత్రంలోని పాట చిత్రీకరణ కోసం జార్జియా వెళుతున్నట్లు పేర్కొంది. ఒక నటిగా లారెన్న్స్ మాస్టర్తో కలిసి డాన్స్ చేయాలన్నది తన చిరకాల కలని అది ఇప్పుడు నెరవేరడం సంతోషంగా ఉందని పేర్కొంది. (ఇది చదవండి: పెళ్లికి సిద్ధమైన హీరోయిన్.. అఫీషియల్గా ప్రకటించిన భామ!) View this post on Instagram A post shared by Mahima Nambiar (@mahima_nambiar) -
ఆ విషయంలో నచ్చకపోతే మొహం మీదే చెప్పేస్తా: అనుపమ
కార్తీకేయ-2 సినిమా హిట్ తర్వాత అనుపమ క్రేజ్ పాన్ఇండియా రేంజ్లో పెరిగిపోయింది. ఈ చిత్రం తర్వాత నిఖిల్తో 18పేజేస్లో కనిపించింది. ఆ తర్వాత బటర్ ఫ్లై అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజతో ఈగల్లో నటిస్తోంది. పాన్ ఇండియా లెవల్లో భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అంతే కాకుండా సిద్ధు జొన్నలగడ్డతో టిల్లు స్క్వేర్లో నటిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కేరళ బ్యూటీ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. భావోద్వేగాలు ప్రదర్శించే విషయంలో మీ ఆలోచనలు ఎలా ఉంటాయని ప్రశ్నించగా తనదైన శైలిలో బదులిచ్చింది. (ఇది చదవండి: రోజుకు రూ.4 లక్షలు.. దారుణంగా మోసపోయా: షకీలా) అనుపమ మాట్లాడుతూ.. 'భావోద్వేగాలు వ్యక్తపరిచే విషయంలో నేను చాలా నిజయితీగా ఉంటా. నాకేదైనా నచ్చకపోతే మొహం మీద చెప్పేస్తా. ఆ విషయాన్ని అక్కడికక్కడే వదిలేస్తా. ఎందుకంటే మన లైఫ్ చాలా చిన్నది. ఇక్కడ కొన్నాళ్లే ఉండేందుకు వచ్చాం.. మళ్లీ వెళ్లిపోతాం. ఆరోజు ఎప్పుడొస్తుందో ఎవరికీ తెలియదు. బతికి ఉన్న కొద్ది రోజులైనా మన ఒత్తిడి దాచుకోవడానికి మన శక్తిని ఎందుకు అనవసరంగా వేస్ట్ చేయాలి . సీసీ టీవీ పుటేజ్ నెల రోజుల తర్వాత ఆటోమెటిక్గా డిలీట్ అయినట్లు.. నా మెదడులోని చెత్తను డిలీట్ చేస్తుంటా.' అంటూ చెప్పుకొచ్చింది. (ఇది చదవండి: 30 ఏళ్ల తర్వాత సీక్వెల్.. సంగీత దర్శకునిగా ఆస్కార్ గ్రహీత!) -
తొలిసారి బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసిన హీరోయిన్
హీరోయిన్ పూర్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సీమటపాకాయ్ సినిమాతో టాలీవుడ్కు పరిచయమైంది మలయాళ ముద్దుగుమ్మ. అవును సినిమాతో మరింత క్రేజ్ సంపాదించింది. ఆ తర్వాత అఖండ, దృశ్యం-2 వంటి చిత్రాల్లోనూ కనిపించింది. కెరీర్లో బిజీగా ఉన్న సమయంలోనే గతేడాది దుబాయ్కి చెందిన వ్యాపారవేత్త ఆసిఫ్ అలీని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. (ఇది చదవండి: ఘనంగా హీరోయిన్ పూర్ణ సీమంతం.. ఫోటోలు వైరల్) ఆ తర్వాత హీరోయిన్ గర్భం దాల్చినట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తాజాగా నటి బేబీ బంప్ ఫోటోలను తన ఇన్స్టాలో షేర్ చేశారు. నా జీవితంలో ఇదే పెద్ద గిఫ్ట్ ఇదేనంటూ ఆమె బేబీ బంప్తో ఉన్న చిత్రాలు పంచుకున్నారు. ఇటీవలే పూర్ణ సీమంతం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో ఆమె కుటుంబసభ్యులు, సన్నిహితులు కూడా హాజరయ్యారు.ఈ ఫోటోలను స్వయంగా పూర్ణ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. తాజాగా బేబీ బంప్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by Shamna Kkasim ( purnaa ) (@shamnakasim) -
అయ్యో పాపం.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్కు ఇంత దారుణ పరిస్థితేంటీ?
మమతా మోహన్ దాస్. ఈ పేరు మీకు గుర్తుందా? ఏంటీ అప్పుడే మర్చిపోయారా? మన యంగ్ టైగర్ సినిమాతో టాలీవుడ్లో ఏంట్రీ ఇచ్చింది. ఇంకా గుర్తుకు రాలేదా? రాదుగా మరీ.. ఎందుకంటే అలా వెండితెరపై మెరిసి.. ఇలా చటుక్కున్న మాయమైన హీరోయిన్లలో మమతా ఒకరు. టాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ యమదొంగతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన మలయాళ కుట్టి పెద్దగా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత నటించిన హోమం, కృష్ణార్జున సినిమాల్లోనూ పెద్దగా గుర్తింపు రాలేదు. మమతా మోహన్ దాస్ను దర్శకధీరుడు రాజమౌళి తెలుగు తెరకు పరిచయం చేశారు. మమతా మలయాళ చిత్రాలతో పాటు తమిళ, తెలుగు సినిమాల్లోనూ నటించింది. గతంలో క్యాన్సర్ బారిన పడిన నటి ఆ తర్వాత కోలుకుంది. మరో సారి లింఫోమా అనే వ్యాధితో పోరాడి కోలుకున్నారు. రెండు భయంకరమైన వ్యాధులను జయించిన నటికి తాజాగా మరో వ్యాధి సోకింది. ఈ విషయాన్ని తన ఇన్స్టా వేదికగా మమతా మోహన్ దాస్ వెల్లడించింది. తాను ప్రస్తుతం బొల్లి వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపింది. తనకు బొల్లి వ్యాధి సోకిందని.. ఇది తన చర్మం రంగును కోల్పోయేలా చేస్తోందని చెబుతోంది మలయాళ ముద్దుగుమ్మ. క్రానిక్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్తో బాధపడుతున్నట్లు వెల్లడించింది. ఇన్స్టాగ్రామ్లోకి ఫోటోను షేర్ చేస్తూ పోస్ట్ చేసింది. ఆమె పోస్ట్ను చూసిన స్నేహితులు, అభిమానులు స్పందించారు. నువ్వు ఒక ఫైటర్ అంటూ ధైర్యం చెబుతున్నారు. క్యాన్సర్ జయించినట్లే ఇప్పుడు కూడా కోలుకోవాలని పోస్టులు పెడుతున్నారు. మమతా మోహన్దాస్ చివరిసారిగా 2022 మలయాళ చిత్రం జన గణ మనలో కనిపించింది. View this post on Instagram A post shared by Mamta Mohandas (@mamtamohan)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రూపురేఖలు మారాయి
అగ్రి ల్యాబ్ ఎంతో ప్రయోజనం
● ప్రగతి పథంలో దూసుకుపోతున్న గ్రామాలు ● పరుగులు పెడుతున్న అభివృద్ధి పనులు ● వెల్లివిరుస్తున్న ప్రభుత్వ భవనాలు ● నాడు–నేడుతో సమూలంగా మారిన సర్కారు బడులు ● ఇళ్లు కాదు.. ఊళ్లుగా వెలిసిన జగనన్న కాలనీలు ● అబ్బో..! ఎటు చూసినా నయా మెరుగులే!
మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యం
రేపు, ఎల్లుండి కూడా పోస్టల్ బ్యాలెట్
రోబోటిక్ టెక్నాలజీతో మోకాలి మార్పిడి శస్త్రచికిత్స
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ
అబ్బో.. ఆ యువ నాయకుడితో ఎట్టా ఏగేది?
బూటకాల ‘బాబు’
వైఎస్సార్సీపీ జోష్
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement