-
ప్రభుత్వోద్యోగులకు ‘స్వగృహా’లు
భారీ రాయితీపై విక్రయం! బండ్లగూడలో చ.అ. రూ.1,900, పోచారంలో చ.అ. రూ.1,700 సాక్షి, హైదరాబాద్: అవి రాజీవ్ స్వగృహ ఇళ్లు.. సాధారణ ప్రజలు కొనాలంటే చదరపు అడుగుకు రూ.2,700 చెల్లించాలి.. ప్రభుత్వ ఉద్యోగులు మా త్రం రూ.1,900 చెల్లిస్తే సరి. ఈ మేరకు భారీ రాయితీపై స్వగృహ ఇళ్లను ప్రభుత్వోద్యోగులకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూమి విలువ, పన్నులు, ఇతర చార్జీలు లేకుండా, నిర్మాణ వ్యయాన్ని మాత్రమే పరిగణనలోకి తీసు కుని కేటాయించబోతోంది. ఇంత తక్కువ ధరకు కేటాయిస్తే తీవ్ర నష్టమని అధికారులు విన్నవిం చినా ఆ ధరలనే ఖరారు చేసింది. వేలాది ఇళ్లు ఖాళీ బండ్లగూడ, పోచారం వెంచర్లలో రాజీవ్ స్వగృహ వేల సంఖ్య లో ఇళ్లను నిర్మించగా వేయికి మించి అమ్మలేకపోయారు. నిధులు లేవంటూ కొన్ని ఇళ్లను అసంపూర్తిగా ఆపేశారు. ఎలాగోలా పూర్తి చేసి అమ్మేందుకు అధికారులు యత్నిస్తున్న తరు ణంలో ఉమ్మడి రాష్ట్రంలో వారిని బదిలీ చేసి కొత్తవారిని నియమించారు. కొందరు నేతలు, ఆ అధికారులు కుమ్మక్కై ఎస్కలేషన్ చార్జీల పేరుతో దాదాపు రూ.వంద కోట్ల వరకు పక్కదారి పట్టిం చారు. ఆ మొత్తాన్ని కాంట్రాక్టర్లకు చెల్లించినట్టు తేల్చి సర్దుబాటు పేరుతో ఇళ్ల ధరను ఒక్కసారిగా పెంచారు. మార్కెట్ ధర చదరపు అడుగుకు రూ.2,400 ఉంటే స్వగృహ ధరలను రూ.2,700 మార్చారు. దీంతో వాటిని కొనేం దుకు ప్రజలు ముందుకు రాలేదు. వాటిని తమకు కేటాయిం చాలని ప్రభుత్వ ఉద్యోగులు కోరగా.. తెలంగాణ ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. చివరకు ప్రభుత్వం చదరపు అడుగు ధర బండ్ల గూడలో రూ.1,900, పోచారంలో రూ.1,700గా నిర్ధారిం చింది. అసంపూర్తిగా ఉన్నవాటికి రూ.1,700, రూ.1,500 ఖరారు చేసింది. బండ్లగూడలో 2,443, పోచారంలో 1,470 ఇళ్లు విక్రయిస్తారు. పరిశీలించిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, గృహ నిర్మాణ శాఖ చీఫ్ ఇంజినీర్ ఈశ్వరయ్య గురువారం స్వగృహ ఇళ్లను పరిశీలించారు. ఉన్నఫళంగా ప్రభుత్వ ఉద్యోగు లకు వాటిని కేటాయించాలంటే చేపట్టాల్సిన పనుల గురించి వాకబు చేశారు. -
కాకి వాలిందని కారు మార్చిన సీఎం!
బెంగళూరు : కర్ణాటక ముఖ్యమత్రి సిద్దరామయ్య మరో వివాదంలో చిక్కుకున్నారు. గతంలో పెను దుమారం సృష్టించిన 'వాచీ' ఘటన మరవకముందే తాజాగా 'కాకి' కహానీ తెర మీదకు వచ్చింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కొత్త కారు కొన్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రులు అన్నాక కార్లు మార్చడం, కొత్త వాహనాలు కొనుక్కోవడం సాధారణమే. ఇటీవలి సిద్దూ 35 లక్షల రూపాయలతో కొత్త టొయోటా ఫార్చ్యునర్ కారు కొన్నారు. అయితే అసలు విషయం ఏంటంటే..అంతకు ముందు ఆయన వాడిన వాహనంపై కాకి వాలిందట. ఆ కాకి వాహనం బొనెట్ పైనే తిష్టవేసిందట. దాన్ని సిబ్బంది తరిమినా వెళ్లకుండా పది నిమిషాల పాటు కారు బోనెట్ పైనే ఉండిపోయిందట. కాగా ఈ సీన్ను ఎవరో రికార్డ్ చేశారు. అదే ఇప్పుడు సిద్ధ రామయ్యకు తలనొప్పి తెచ్చిపెట్టింది. పాత కారుపై కాకి వాలడం వల్లే సిద్ధ రామయ్య కారు మార్చారంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ముఖ్యమంత్రికి జాతకాలపై నమ్మకమని... అందుకునే 35 లక్షలు ఖర్చు పెట్టి కారు కొన్నారంటు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సీఎంగా బాధ్యతగా ఉండాల్సిన వ్యక్తి ఇలా జాతకాల పిచ్చితో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. గతంలో సిద్దరామయ్య వజ్రాలు పొదిగిన ఈ హబ్లాట్ వాచీ ధర రూ. 70 లక్షలు కావడం, ముఖ్యమంత్రికి అది ఎక్కడి నుంచి వచ్చిందనే విషయమై మీడియాలో బోలెడు కథనాలు వెల్లువెత్తాయి. చివరకు ఈ వ్యవహారం రాష్ట్ర అసెంబ్లీని సైతం కుదిపేసింది. దీనిపై దర్యాప్తు జరిపించాలంటూ బీజేపీ నేతలు ఏకంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ను ఆశ్రయించారు. ఇది కాస్తా చినికి చినికి గాలివానగా మారుతుండటంతో ఎట్టకేలకు దాన్ని వదిలించుకోవడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చిన ముఖ్యమంత్రి.. ఆ వాచీని అసెంబ్లీ స్పీకర్కు అందజేసి, దాన్ని ప్రభుత్వ ఆస్తిగా ప్రకటించిన విషయం తెలిసిందే. -
యువతిని వివస్త్రను చేయలేదు
బెంగళూరు ఘటనపై వివరణ ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వం * ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడి * నివేదిక సమర్పించాలని కోరిన కేంద్రం బెంగళూరు/న్యూఢిల్లీ: టాంజానియా యువతిని నడి రోడ్డుపై వివస్త్రను చేసి భౌతిక దాడికి పాల్పడిన ఘటనతో సంబంధం ఉన్న ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. ఆదివారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన దౌత్యపర వివాదంగా మారింది. ‘ఆ ఘటనతో సంబంధం ఉన్న ఐదుగురు అరెస్టయ్యారు. దీనిపై కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ నాతో మాట్లాడారు. ఘటనపై కేంద్రానికి నివేదిక పంపిస్తాం’ అని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చెప్పారు. కాగా, యువతిని వివస్త్రను చేసినట్లు వస్తున్న వార్తలను కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర ఖండించారు. ఘటనకు గల కారణాలు, తీసుకున్న చర్యలు, బాధితురాలిని కాపాడేందుకు తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదిక సమర్పించాల్సిందిగా కర్ణాటకను కేంద్ర హోం శాఖ సూచించింది. కారకులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్రాన్ని ఢిల్లీలో టాంజానియా హైకమిషనర్ జాన్ కిజాజీ కోరారు. కాగా, జాన్ కిజాజీతో కూడిన బృందం శుక్రవారం బెంగళూరుకు వెళ్లనున్నట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. సిద్ధరామయ్యను వివరణ కోరిన రాహుల్ యువతిపై జరిగిన దాడి ఘటనపై సమగ్ర నివేదిక సమర్పించాలని సీఎం సిద్ధరామయ్యను పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కోరారు. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా రాహుల్ గాంధీ కోరినట్లు పార్టీ జనరల్ సెక్రటరీ దిగ్విజయ్సింగ్ తెలిపారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని, నిందితుల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలని దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. రాహుల్ను టార్గెట్ చేసిన బీజేపీ టాంజానియా యువతిపై జరిగిన దాడి ఘటనకు బాధ్యులైన వారిపై ఇప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై కాంగ్రెస్ను బీజేపీ దుయ్యబట్టింది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడింది. ఈ ఘటనపై రాహుల్ గాంధీ ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించింది. కాంగ్రెస్ ప్రభుత్వం బెంగళూరు నగరానికి అపకీర్తి తెచ్చిందని పేర్కొంది. కర్ణాటక డీజీపీని వెంటనే బదిలీ చేయాలని, సంబంధిత పోలీసు అధికారులను సస్సెండ్ చేయాలని కేంద్ర మంత్రి ముక్తర్ అబ్బాస్ నఖ్వీ డిమాండ్ చేశారు. -
తిరుమలలో కర్ణాటక ముఖ్యమంత్రి
తిరుమల: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సోమవారం తిరుమలకు వచ్చారు. రాత్రి తొమ్మిది గంటలకు పద్మావతి అతిథిగృహానికి చేరుకున్న ఆయనకు రిసెప్షన్ డెప్యూటీ ఈవో వెంకటయ్య, ఏఎస్పీ ఎంవీఎస్ స్వామి పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. కుటుంబ సభ్యులతో మంగళవారం ఆయన శ్రీవారిని దర్శించుకోనున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
Advertisement