-
నువ్వు ఎవడివిరా అంటూ విచక్షణా రహితంగా పొడిచి..
ఖిలా వరంగల్: కరీమాబాద్ ఉర్సుగుట్ట జంక్షన్లో శనివారం అర్ధరాత్రి యువకుడి హత్య కలకలం రేపింది. గంజాయి మత్తులో ఓ యువకుడు స్నేహితులతో కలిసి ముగ్గురు యువకులపై దాడి చేశాడు. అందులో ఒకరు ప్రాణాలు కోల్పోగా మరో యువకుడు ప్రాణాపాయ స్థితిలో ఎంజీఎంలో చికిత్స పొందుతున్నాడు. మరో యువకుడు స్వల్పగాయాలతో బయటపడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. కరీమాబాద్ ఎస్ఆర్ఆర్ తోటకు చెందిన వనం సుధాకర్కు ఇద్దరు కుమారులు కార్తీక్, వనం రాకేశ్(26) ఉన్నారు. రాకేశ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో పీఈటీగా పనిచేస్తున్నాడు. శనివారం స్కూల్కు వెళ్లి వచ్చిన తర్వాత సాయంత్రం స్నేహితులను కలిసి వస్తానని ఇంట్లో చెప్పి కరీమాబాద్ ఉర్సుగుట్ట జంక్షన్లో ఉన్న మరుపల్లి నిఖిల్ బేకరికి వెళ్లాడు. అక్కడ నిఖిల్, శ్రీనాథ్, వంశీలతో రాకేశ్ మాట్లాడుతుండగా కడిపికొండ నుంచి బైక్పై వచ్చిన ఇద్దరు యువకులు నిఖిల్ బేకరి ఎదుట మూత్ర విసర్జన చేశారు. ఈక్రమంలో నిఖిల్, రాకేశ్ మూత్రవిసర్జన చేసిన యువకులను నిలదీశారు. దీంతో నువ్వు ఎవడివిరా అంటూ షాపు నిర్వాహకుడిని ప్రశ్నిస్తూ బైక్పై వచ్చిన వారు గొడవకు దిగారు. మాటామాటా పెరిగి ఘర్షణ తీవ్రస్థాయికి చేరింది. ఇంతలో బైక్పై వచ్చిన గాడుదల రాజేశ్తోపాటు మరో వ్యక్తి ఫోన్ చేసి బంటి, యోగి భాస్కర్ను పిలుపించుకున్నారు. ఓ పక్క ఇరువురు మాట్లాడుతుండగానే గాడుదల రాజేశ్ తన వద్ద ఉన్న కత్తి తీసి రాకేశ్ను విచక్షణారహితంగా పొడిచి హత్య చేశాడు. ఈక్రమంలో అడ్డుకోబోయిన నిఖిల్, శివపై దాడి చేశాడు. దీంతో నిఖిల్ కుప్పకూలాడు. శివ పారిపోతుండగా వెంటపడి కత్తితో దాడి చేశారు. అతడు స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ఆ తర్వాత రాజేశ్ కత్తి చూపిస్తూ అడ్డువస్తే అందరికీ ఇదే గతి పడుతోందని హెచ్చరిస్తూ ఘటనా స్థలం నుంచి వెళ్లిపోయాడు. శివ మిల్స్కాలనీ పోలీసులతో పాటు గాయపడిన నిఖిల్ తల్లిదండ్రులు, రాకేశ్ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. చదవండి: (వికటించిన కుటుంబనియంత్రణ ఆపరేషన్.. ఇద్దరు మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం) రాకేశ్, నిఖిల్ను 108 వాహనంలో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు రాకేశ్ మృతి చెందినట్లు ధ్రువీకరించారు. నిఖిల్ను ఎమర్జెనీ వార్డుకు తరలించారు. మృతుడి సోదరుడు వనం కార్తీక్ ఆదివారం మిల్స్కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేయగా హత్యా నేరం కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఇన్స్పెక్టర్ ముస్క శ్రీనివాస్ తెలిపారు. కాగా, స్నేహితుల వద్దకు వెళ్లకుంటే బతికేవాడి బిడ్డా అంటూ వనం రాకేశ్ మృతదేహంపై పడి తల్లిదండ్రులు రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. పాతకక్షలే కారణమా..? రాకేశ్ హత్య అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది. ఇరువురు యువకుల మధ్య పాతకక్షలు ఉన్నాయా..?, క్షణికావేశంలో కత్తితో దాడి చేశారా..? అనే కోణంలో పోలీసుల విచారణ కొనసాగుతుంది. కాగా, ఇరువురి మధ్య పాతకక్షలు ఉన్నాయని స్థానికులు చర్చించుకుంటున్నారు. పోలీసు కస్టడీలో నిందితుడు యువకుడి హత్య కేసుతో సంబంధమున్న ఇరువురిని పోలీసులు ఇప్పటికే గుర్తించినట్లు తెలుస్తోంది. ఇందులో ప్రధాన నిందితుడు శివనగర్లోని ఏసీరెడ్డి నగర్కు చెందిన గాడుదల రాజేశ్ను కస్టడీలోకి తీసుకున్నట్లు సమాచారం. అలాగే, అతడితోపాటు మరో ఐదుగురు దాడిలో పాల్గొన్నట్లు విశ్వనీయంగా తెలిసింది. మిగతా వారి ఆచూకీ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నట్లు సమాచారం. -
భూమి కోసం ఘర్షణ
సాక్షి, కరీమాబాద్ : వరంగల్ 21వ డివిజన్ కరీమాబా ద్ నానమియాతోట వద్ద వివాదాస్పద భూమి విషయమై మంగళవారం ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. బాధిత కుటుంబాలు, స్థాని కులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నానమియాతోటలోని సర్వేనెంబర్ 340, 341 లోని సుమారు ఎకరం భూమి తనదేనంటూ కరీమాబాద్కు చెందిన టీఆర్ఎస్ నాయకుడు, రియల్టర్ వొగిలిశెట్టి అనిల్కుమార్తో పాటు ఆయన అనుచరులు బాలకొంరెల్లి, లింగమూర్తి, సాధిక్, ఖాజా, రబ్బాని, రాజు రాతి ఖనీలు పాతేందుకు మంగళవారం ప్రయత్నించారు. దీంతో స్థానికంగా ఉన్న గుడిసెవాసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మద్య గొడవ జరగడంతో అనిల్కుమార్తో పాటు అతని అనుచరులు.. గుడిసెవాసులైన ఎండీ హసన్, ఎండీ ఆలం, ఎండీ అబ్బు, గౌసియాబేగం, ఎండీ బాబాపై పారతో దాడిచేయగా గాయపడ్డారు. వీరిని వెంటనే ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఇందులో ఎండీ హసన్ తీవ్రంగా గాయపడడంతో అతనిని గార్డియన్ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో మిల్స్కాలనీ పోలీసులకు జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేసినట్లు గుడిసెవాసుల నాయకుడు ముక్కెర రామస్వామి తెలిపారు. కాందీశీకుల భూమి.. నానామియా తోటలోని 340, 341 సర్వే నం బర్లలోని భూమి కాందీశీకులదని, ఈ భూమి కోర్టు కేసులో ఉండగా ఇలా దాడి చేసి గాయపరిచారని రామస్వామి వివరించారు. గాయపడిన వారిని సీపీఎం జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి, నాయకురాలు రత్నమాల పరామర్శించా రు. అలాగే మిల్స్కాలనీ సీఐ సత్యనారాయణ పూర్తి వివరాలు తీసుకున్నారు. ఇదిలా ఉండగా తమ కనీలు పాతేందుకు వెళ్తే అడ్డుకోవడంతో పాటు బాలకొంరెల్లి, సాదిక్, లింగమూర్తి, ఖా జాపాష, రబ్బాని నీలపై దాడిచేసి గాయపరిచినట్లు అనిల్కుమార్ తెలిపారు. ఇలాంటి సమస్య వస్తుందనే ఈ నెల 25న మిల్స్కాలనీ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. భూమి ఎవరిదో తేల్చాలని తహసీల్దార్కు సూచించా.. వివాదాస్పదంగా మారిన కరీమాబాద్లోని నానామియాతోట వద్ద భూమి ఎవరిదో తేల్చాలని ఖిలావరంగల్ తహసీల్దార్ కిరణ్కుమార్కు సూచించాను. అప్పటివరకు ఎవరూ ఎలాంటి గొడవలకు దిగొద్దు. ఏది ఉన్నా సామరస్యంగా సమస్య పరిష్కరించుకోవాలి. – నన్నపునేని నరేందర్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే -
ఇంజక్షన్ వికటించి బాబు మృతి
సాక్షి, కరీమాబాద్ (వరంగల్): నగరంలోని రంగశాయిపేటలోని ఓ పిల్లల ఆస్పత్రిలో ఇంజక్షన్ వికటించి ఏడు నెలల బాబు మృతి చెందిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగెం మండలం కాట్రపల్లి గ్రామానికి చెందిన వర్కాల మమత, రత్నాకర్ దంపతులు దగ్గు, జ్వరంతో బాధపడుతున్న తమ ఏడు నెలల బాబు (రుత్విక్)ను తీసుకుని రంగశాయిపేట కార్తీకేయ పిల్లల దవాఖానకు వచ్చారు. అక్కడ డాక్టర్ దయానందసాగర్ ఉదయం 11.30 ఇంజక్షన్ వేసి పంపించారు. అయితే కొంతసేపటి తర్వాత బాబు రుత్విక్ తీవ్ర అస్వస్తతకు గురికావడంతో తిరిగి ఆస్పత్రి వరకు తీసుకుకావడంలోపే మృతి చెందాడు. దీంతో డాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే తమ బాబు మృతి చెందాడంటూ బాబు తల్లిదండ్రులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో మిల్స్కాలనీ సీఐ సత్యనారాయణ సంఘటనా స్థలానికి చేరుకుని బాబు మృత దేహాన్ని ఎంజీఎంకు తరలించారు. అలాగే డాక్టర్ దయానందసాగర్ను మిల్స్కాలనీ పోలీస్స్టేషన్కు తరలించారు. ఇందులో నా తప్పు లేదు.. ఈ నెల 21 జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్న ఏడు నెలల బాబును తీసుకుని నా వద్దకు వచ్చారు. నేను ఆ రోజు కావాల్సిన సిరప్ మందులు రాసి ఇచ్చి పంపించారు. తగ్గక పోతే మళ్లీ రమ్మన్నాను. వారు గురువారం ఉదయం 11.30 గంటలకు రాగానే ఓఆర్ఎస్తో పాటు అమికాషన్ ఇంజక్షన్ ఇచ్చి పంపిచాను. వెళ్లిపోయిన వారు మళ్లీ మధ్యాహ్నం 1.30 గంటలకు వచ్చారు. అప్పటికే బాబు మృతి చెందాడు. ఇందులో నా తప్పేమి లేదు. నేను సరిగానే ట్రీట్మెంట్ చేశా. – దయానందసాగర్, వైద్యుడు -
బస్సులోనే డ్రైవర్కు రాఖీ కట్టిన చెల్లెలు
సాక్షి, కరీమాబాద్(కరీంనగర్) : హైదరాబాద్లోని కుషాయిగూడలో ఉంటున్న గట్టు కృష్ణవేణి తన అన్నయ్యకు రాఖీ కట్టుందుకు వరంగల్ అర్బన్ జిల్లాలోని ఉర్సుకు గురువారం వచ్చింది. అయితే ఆమె సోదరుడు ఆర్టీసీ లోకల్ డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్న గడ్డం జితేందర్ అప్పటికే డ్యూటికీ వెళ్లాడు. ఈ క్రమంలో కృష్ణవేణి అన్నయ్యకు ఫోన్చేయగా.. వరంగల్ బస్టాడ్ ప్రాంతంలో ఉన్నానని చెప్పడంతో ఆమె అక్కడికే వెళ్లి బస్సులోనే రాఖీ కట్టి తన ఆనందాన్ని పంచుకుంది. -
నాణ్యత లేని మద్యాన్న భోజనం
కరీమాబాద్: విద్యార్ధులకు అందించే మద్యాన్న భోజనంలో నాణ్యత లేదని వరంగల్ గ్రేటర్ కాంగ్రేస్ వర్కింగ్ అధ్యక్షులు రాజనాల శ్రీహరి అన్నారు. నగరంలోని కరీమాబాద్ ప్రభుత్వ ప్రాధమిక, ఉన్నత పాఠశాలలోని మద్యాన్న భోజన పథకాన్ని పరిశీలించారు. విద్యార్ధులకు ఎలాంటి ఆహార పదార్ధాలు పెడుతున్నారో పరీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మద్యాన్న భోజన పతకాన్ని అనుభవంలేని ఏజంట్లకు ఇవ్వడంతో పాటు వారి నుంచి వేరొకరికి చేతులు మారుతుండంతో విద్యార్ధులకు మెనూ ప్రకారం భోజనం అందడం లేదని అన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గూడూరు మల్లేషం, కోటేశ్వర్రావు, వీరాచారి, రఘు, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, శివ, రాజేందర్, అమరలింగం తదితరులు పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Namita Dubey: నిజమైన యాక్టర్స్.. తమ పాత్ర గురించే ఆలోచిస్తారు!
చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..
రూ. 10కే హెయిర్ కటింగ్.. 4 గంటలు వేచి ఉంటున్న జనం!
ఇంట గెలవని రాణి..!
కారులో వెళ్తుండగా గ్రామస్తులు అడ్డుకుని చితకబాదారు: నటుడు
కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..
సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..
Health: మెనోపాజ్ వల్ల హార్మోన్స్ సమస్యా? అయితే ఇలా చేయండి!
గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం
వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement