-
గెలవలేని యుద్ధం చేసిన పాక్
కార్గిల్ యుద్ధం జరిగి పాతికేళ్లవుతోంది. మే 3న పాక్ చొరబాట్లను మొదటిసారి కనుగొన్న తర్వాత, జూలై 26న భారత్ తన విజయాన్ని ప్రకటించ డానికి ముందు దాదాపు మూడు నెలలు నెత్తుటి యుద్ధం కొనసాగింది. 18,000 అడుగుల ఎత్తులో, ఎన్నో సవాళ్లతో కూడిన ఈ ప్రాంతంలో యుద్ధం అనేది సైన్యం లాఘవానికి నిజమైన పరీక్ష. అధికారులు, సైనికులు మానవాతీత దృఢత్వాన్ని ప్రదర్శించడం, దేశం కోసం ప్రాణాలు ధారపోయడానికి కూడా సిద్ధమైనందునే విజయం సాధ్యపడింది. భారత్కు వ్యతిరేకంగా పాక్ సైనిక పంథాను అనుసరించడం వల్ల ఎటువంటి లాభం లేదని కార్గిల్ విధ్వంసం గట్టిగా బయటపెట్టింది. స్థాయిలోనూ, విస్తృతిలోనూ పరిమితమే అయినప్పటికీ, కార్గిల్ రెండు దేశాలలో లోతైన విశ్లేషణను ప్రేరేపించింది.1999 ఫిబ్రవరి 20న, నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి, అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆహ్వానం మేరకు పాకిస్తాన్లో చరిత్రాత్మక దౌత్య పర్యటనకు బయలుదేరారు. మరుసటి రోజు, ఇద్దరు ప్రధానులు లాహోర్ డిక్లరేషన్ పై సంతకం చేశారు. రెండు దేశాల మధ్య శాంతి, స్థిరత్వం, తమ ప్రజల పురోగతి, శ్రేయస్సు గురించిన భాగస్వామ్య దార్శనికతను ఇరువురు నేతలూ ప్రతిబింబించారు.ఉద్రిక్తతలను పెంచిన 1998 అణు పరీక్షల ఛాయల నుండి ఉద్భవించిన ఈ ప్రకటన, సరిహద్దుకు ఇరువైపులా చక్కటి ప్రశంసలు పొందింది. అయితే విచారకరంగా, ఈ ఆశావాదం భ్రమగా మారింది. వాఘా సరిహద్దులో వాజ్పేయికి షరీఫ్ అభివాదం చేస్తున్నప్పుడే, పాకిస్తాన్ సైనికులు కార్గిల్ సెక్టార్లోని నియంత్రణ రేఖ (ఎల్ఓసీ)ను దాటి ప్రజల జ్ఞాపకాల్లో నిలిచిపోయిన టోలోలింగ్, టైగర్ హిల్ వంటి పర్వత శిఖరాల్లో కందకాలు తవ్వుతున్నారు.18,000 అడుగుల ఎత్తులో ఉన్న కార్గిల్ భౌగోళికపరంగా అసాధారణమైన సవాళ్లతో కూడినది. అటువంటి విపరీతమైన పరిస్థి తులలో యుద్ధం అనేది సైన్యం లాఘవానికి నిజమైన పరీక్ష. అయితే అధికారులు, సైనికులు మానవాతీత దృఢత్వాన్ని ప్రదర్శించడం, దేశం కోసం ప్రాణాలు ధారపోయడానికి కూడా సిద్ధమైనందునే విజయం సాధ్యపడింది.మే 3న పాక్ చొరబాట్లను ప్రాథమికంగా కనుగొన్న తర్వాత, జూలై 26న భారతదేశం విజయాన్ని ప్రకటించడానికి ముందు దాదాపు మూడు నెలల కాలం కార్గిల్లో నెత్తుటి యుద్ధం కొనసాగింది. పాకిస్తాన్ సైన్యం ఈ పోరాటంలో తన ప్రమేయాన్ని నిరాకరించింది, నేలకొరిగిన తన సైనికులను గుర్తించడానికి నిరాకరించింది. ఇది వారి త్యాగానికి అంతిమ అవమానం అని చెప్పాలి.స్థాయిలోనూ, భౌగోళిక విస్తృతిలోనూ పరిమితమే అయినప్ప టికీ, కార్గిల్ యుద్ధం రెండు దేశాలలో లోతైన వ్యూహాత్మక విశ్లేషణను ప్రేరేపించింది. వేసుకున్న లెక్కలు తప్పడంపై పాక్లోనూ; నిఘా వైఫల్యం కారణంగా చొరబాట్లను గుర్తించలేక పోవడంతో సహా, జాతీయ భద్రతా అంతరాలపై భారత్లోనూ పెద్ద చర్చ జరిగింది.యుద్ధం ముగిసిన మూడు రోజుల తర్వాత, పాకిస్తాన్ దురాక్ర మణకు దారితీసిన సంఘటనలను సమీక్షించడానికీ, సాయుధ చొర బాట్లకు వ్యతిరేకంగా జాతీయ భద్రతను కాపాడే చర్యలను సిఫార్సు చేయడానికీ భారత ప్రభుత్వం కార్గిల్ సమీక్షా కమిటీ (కేఆర్సీ)ని ఏర్పాటు చేసింది. రాజకీయ, అధికార, సైనిక, నిఘా సంస్థలు యథా తథ స్థితిపై స్వార్థ ఆసక్తిని పెంచుకున్నాయని ఈ కమిటీ పేర్కొంది. కార్గిల్ అనుభవం, కొనసాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం, అణుబాంబుతో కూడిన భద్రతా వాతావరణాన్ని పరిగణనలోకి తీసుకుని జాతీయ భద్రతా వ్యవస్థపై సమగ్ర సమీక్ష అవసరమని కమిటీ నొక్కి చెప్పింది.కేఆర్సీని అనుసరించి వచ్చిన మంత్రుల బృందం నివేదిక, జాతీయ భద్రతా సమస్యలపై స్వతంత్ర భారతదేశంలో చేపట్టిన అత్యంత సమగ్ర పరిశీలన అని చెప్పవచ్చు. గూఢచార యంత్రాంగం, అంతర్గత భద్రత, సరిహద్దు నిర్వహణ. రక్షణ నిర్వహణను అంచనా వేయడానికి నాలుగు టాస్క్ఫోర్స్లను ఏర్పాటు చేశారు.ఈ రెండు నివేదికలు జాతీయ భద్రతా నిర్వహణలో అనేక మార్పులకు దారితీశాయి. కేంద్రీకృత కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ను నిర్వహించడానికి 2004లో జాతీయ సాంకేతిక పరిశోధనా సంస్థను ఏర్పర్చారు. సైన్యం నిర్దిష్ట గూఢచార అవసరాలను తీర్చడానికి రక్షణ నిఘా సంస్థ ఏర్పడింది. మెరుగైన ఇంటర్–ఏజెన్సీ సమాచారం భాగస్వామ్యాన్ని, సమన్వయాన్ని పెంపొందించడానికి బహుళ ఏజెన్సీ కేంద్రం కూడా ఏర్పాటయింది. రక్షణ వ్యవస్థ కొంత పునర్ని ర్మాణానికి గురైంది. ఇందులో సమీకృత రక్షణ సిబ్బందిని ఏర్పాటు చేయడం, వ్యూహాత్మక బలగాలు, అండమాన్ నికోబార్ కమాండ్ల స్థాపన, త్రివిధ బలగాలకు ఆర్థిక, పరిపాలనా అధికారాలు పంపిణీ చేయడం వంటివి ఉన్నాయి. మంత్రుల బృందం సిఫార్సు చేసిన విధంగా 2020లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ నియామకం జరిగింది.కొన్ని సిఫార్సులు పాక్షికంగా మాత్రమే అమలైనాయి. ‘ఒకే సరి హద్దులో అనేక బలగాలు ఉండటం కూడా బలగాల జవాబు దారీతనం లోపానికి దారితీసిం’దని మంత్రుల బృందం నివేదిక పేర్కొంది. ‘జవాబుదారీతనాన్ని తేవడానికి, సరిహద్దు వద్ద బలగాల మోహరింపును పరిగణనలోకి తీసుకునేటప్పుడు ‘ఒక సరిహద్దు, ఒక బలగం’ సూత్రాన్ని అవలంబించవచ్చు’ అని సూచించింది. ఈ సూత్రాన్ని ఇంకా చైనాతో వాస్తవ నియంత్రణ రేఖ దగ్గర వర్తింపజేయాల్సే ఉంది. ఇక్కడ భారత సైన్యం, ఇండో–టిబెటన్ సరిహద్దు పోలీసులు వేర్వేరు కమాండ్ ఏర్పాట్లలో మోహరించారు.జాతీయ భద్రతా సిద్ధాంతం లేకపోవడం, ఆర్థిక సంవత్సరానికి మించి సైన్యానికి నిధుల నిబద్ధత లేకపోవడం వంటి బలహీనతలను మంత్రుల బృందం ఎత్తి చూపింది. పరిష్కరించాల్సిన ఇతర సమస్యలు ఏవంటే, త్రివిధ బలగాల హెడ్క్వార్టర్స్ను ప్రభుత్వంలో మరింతగా ఏకీకృతం చేయడం, సాయుధ దళాలు ఉమ్మడిగా ఉండటం. ఇప్పటికీ ఈ లోటుపాట్లు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ వైపు కూడా, కార్గిల్ పరాజయంపై చాలా బహిరంగ చర్చ జరిగింది. ఆ యుద్ధం పౌర–సైనిక సంబంధాల వక్ర స్వభావాన్ని బహిర్గతం చేసింది. సైనిక లక్ష్యాలను రాజకీయ, దౌత్యపరమైన పరిశీలనలు లేకుండా రూపొందించారు. నసీమ్ జెహ్రా రాసిన ‘ఫ్రమ్ కార్గిల్ టు ది కూ’ పుస్తకంలో, మే 17న సైన్యం అప్పటి ప్రధాని షరీఫ్కు కార్గిల్ సైనిక చర్యపై తొలి వివరణాత్మక సమాచారాన్ని అందించిందని రాశారు. ఆ సమయానికి, సైనికులు అప్పటికే నియంత్రణ రేఖ వెంబడి స్థానాలను ఆక్రమించారు.యుద్ధం తరువాత, దానికి పన్నాగం పన్నిన జనరల్స్ పాత్ర పరిశీలనలోకి రావాలి. దీనికి బదులుగా, పాకిస్తాన్ సైన్యం రాజకీయ నాయకత్వానికి నిందను ఆపాదించడానికి ప్రయత్నించింది. పెరుగుతున్న ఈ అపనమ్మకం చివరకు 1999 అక్టోబర్లో షరీఫ్ను అధికారం నుండి తొలగించిన సైనిక కుట్రకు దారితీసింది.భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ సైనిక పంథాను ఉపయోగించడం వల్ల ఎటువంటి లాభం లేదని కార్గిల్ విధ్వంసం గట్టిగా బయట పెట్టింది. భారత్తో ఉద్రిక్తతలను తగ్గించడానికి మార్గాలను కనుగొనే బదులు, పాకిస్తాన్ సైన్యం వెనక్కితగ్గి ఉగ్రవాదులను ఉపయోగించింది. యుద్ధం తర్వాత జమ్మూకశ్మీర్లో హింస పెరిగింది. కశ్మీర్పై మక్కువ పెంచుకోవడం మానుకోవాలనీ, బలమైన ఆర్థిక వ్యవస్థ నిర్మాణంపై పాకిస్తాన్ దృష్టి పెట్టాలనీ పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. దేశం తన పరిమితులు, ప్రాధాన్యతల గురించి నిర్దాక్షిణ్యంగా వాస్తవికంగా మారాలని పాకిస్తాన్ మాజీ దౌత్యవేత్త షాహిద్ అమీన్ రాశారు. ఏమైనప్పటికీ, పాకిస్తాన్ను గెలవలేని సంఘర్షణలోకి నెట్టిన ప్రధాన సమస్యలు పెద్దగా పరిష్కారం కాలేదు. సైన్యం ఇప్ప టికీ దేశ పగ్గాలను నియంత్రిస్తోంది. కశ్మీర్పై వాగాడంబరం కొనసాగు తోంది. ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. పైగా, ఉగ్రవాద సంస్థ లకు పాక్ ప్రభుత్వ మద్దతు కొనసాగుతోంది.నేడు, భారతదేశం చాలా శక్తిమంతమైన దేశం. ఇప్పుడు కార్గిల్ తరహా ఘటన అసంభవంగా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ, 1999 సంఘర్షణ పాకిస్తాన్ రాజ్యయంత్రాంగపు నిర్లక్ష్య స్థాయిని వెల్లడి చేసింది. ఆ దేశంలోని ప్రస్తుత పరిస్థితులు ఆ ముద్రను తొలగించ డానికి పెద్దగా అనుకూలించవు.లెఫ్ట్నెంట్ జనరల్ డీఎస్ హుడా (రిటైర్డ్) వ్యాసకర్త మాజీ నార్తర్న్ ఆర్మీ కమాండర్(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
Lok sabha elections 2024: వాజ్పేయి మేజిక్
ప్రాంతీయ పార్టీల దన్ను లేనిదే సంపూర్ణ ఆధిక్యం అసాధ్యమని గుర్తించిన బీజేపీ 13వ లోక్సభ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. 20కి పైగా పార్టీలను నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) గూటి కిందకు తెచ్చి మెజారిటీ సాధించింది. సొంత బలం పెరగకున్నా భాగస్వాముల సాయంతో మళ్లీ అధికారంలోకి వచ్చి దేశాన్ని ఐదేళ్లూ విజయవంతంగా పాలించింది. కాంగ్రెస్ మాత్రం అంతర్గత సంక్షోభంతో బాగా దెబ్బ తిన్నది..1998 ఎన్నికల తర్వాత బీజేపీ ఏర్పాటు చేసిన నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) జాతీయ రాజకీయాల్లో పార్టీ గ్రాఫ్ బలపడేందుకు దోహదపడింది. దీనికి వాజ్పేయి తొలి చైర్మన్ కాగా జార్జ్ ఫెర్నాండెజ్ కనీ్వనర్. బీజేపీతో పాటు జేడీ (యూ), శివసేన, టీడీపీ, జేడీ(ఎస్) కూటమిలో ముఖ్ పార్టీలుగా ఉన్నాయి. 1999 లోక్సభ ఎన్నికలు సెపె్టంబర్ 5 నుంచి అక్టోబర్ 3 దాకా ఐదు దశల్లో జరిగాయి.కార్గిల్ యుద్ధం, ఫోఖ్రాన్ అణు పరీక్షలు బీజేపీకి బాగా కలిసొచ్చాయి. వాజ్పేయి చరిష్మా కూడా తోడై ఎన్డీఏకు 298 స్థానాలు దక్కాయి. 1984 తర్వాత ఏ పార్టీకైనా, సంకీర్ణానికైనా లోక్సభలో మెజారిటీ దక్కడం అదే తొలిసారి. బీజేపీకి 182 సీట్లొస్తే కాంగ్రెస్ 114తో పరిమితమైంది.సీపీఎం 33, టీడీపీ 29, సమాజ్వాదీ 26, జేడీయూ 21 సీట్లు గెలుచుకున్నాయి. సీపీఐకి కేవలం నాలుగు సీట్లే రావడంతో జాతీయ పార్టీ హోదా కోల్పోయింది! ఫలితాల అనంతరం డీఎంకే వంటి మరిన్ని పార్టీలు చేరడంతో ఎన్డీఏ కూటమి మరింత బలపడింది. అక్టోబర్ 13న ప్రధానిగా వాజ్పేయి మూడోసారి ప్రమాణం చేశారు. మొత్తమ్మీద 1996 నుంచి 1999 మధ్య మూడేళ్లలో లోక్సభకు ఏకంగా మూడుసార్లు ఎన్నికలు జరగడం విశేషం!కాంగ్రెస్లో సంక్షోభంకాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియాగాంధీ బాధ్యతలు స్వీకరించిన ఏడాదికే పార్టీలో ముసలం మొదలైంది. జన్మతః విదేశీయురాలైన సోనియాను ప్రధాని అభ్యరి్థగా అంగీకరించేందుకు సీనియర్ నేతలు శరద్ పవార్, పీఏ సంగ్మా, తారిఖ్ అన్వర్ తీవ్రంగా వ్యతిరేకించారు. కలత చెందిన సోనియా రాజీనామా చేశారు. కాంగ్రెస్ ఆమెకు మద్దతుగా నిలిచింది.కార్యకర్తలు నిరసనలు, నిరాహార దీక్షలతో హోరెత్తించారు. చివరికి 1999 మే 20న పవార్, సంగ్మా, అన్వర్పై కాంగ్రెస్ బహిష్కరణ వేటు వేసింది. దాంతో సోనియా రాజీనామాను వెనక్కు తీసుకుని పార్టీ సారథిగా కొనసాగారు. ఈ పరిణామం ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రతికూలంగా మారింది. బీజేపీ ‘స్వదేశీ వాజ్పేయి – విదేశీ సోనియా’ నినాదాన్ని ఎత్తుకుంది. సోనియా అధ్యక్షతన కాంగ్రెస్కు అవే తొలి ఎన్నికలు.పవార్ సొంత పార్టీసోనియాగాంధీ విదేశీయతను ప్రశ్నించి కాంగ్రెస్ నుంచి బయటకు వచి్చన శరద్పవార్, పీఏ సంగ్మా, తారిఖ్ అన్వర్ జూన్ 10న నేషనలిస్ట్ కాంగ్రెస్ పేరిట సొంత పార్టీ పెట్టుకున్నారు. తొలి ఎన్నికల్లోనే 2.27 శాతం ఓట్లతో 8 స్థానాలను కైవసం చేసుకున్నారు. గుజరాత్ అల్లర్లునరేంద్ర మోదీ పాలనలోని గుజరాత్లో 2002 ఫిబ్రవరిలో చెలరేగిన మత ఘర్షణలతో వాజ్పేయి సర్కారు బాగా అప్రతిష్టపాలైంది. సబర్మతి ఎక్స్ప్రెస్కు అల్లరి మూకలు నిప్పంటించడంతో అయోధ్య నుంచి తిరిగొస్తున్న 59 మంది హిందూ భక్తులు మరణించారు. తర్వాత నెల పాటు చెలరేగిన హింసలో వెయ్యి మందికి పైనే చనిపోయారు. ఈ హింసాకాండను వాజ్పేయి ఖండించినా దాన్ని అరికట్టలేదన్న అపవాదు మూటగట్టుకున్నారు.విశేషాలు...► ప్రధానిగా వాజ్పేయి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్వర్ణ చతుర్భుజి పేరిట హైవేలను విస్తరించారు. ప్రధాని గ్రామీణ్ సడక్ యోజనతో రూరల్ రోడ్లకు అక్షరాలా మహర్దశ పట్టింది.► టెలికం సేవల విస్తరణకు కీలక అడుగులు పడ్డాయి. లైసెన్స్ ఫీజుల స్థానంలో ఆదాయ పంపిణీ విధానం ప్రవేశపెట్టారు. 2000 సెపె్టంబర్ 15న బీఎస్ఎన్ఎల్ను ఏర్పాటు చేశారు.► ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ విభాగం ఏర్పాటైంది. బాల్కో, హిందుస్థాన్ జింక్, ఐపీసీఎల్, వీఎస్ఎన్ఎల్ వంటి అగ్రగామి కంపెనీలను ప్రైవేటీకరించారు.►పెట్రోలియం ధరలపై నియంత్రణ ఎత్తేయడానికి వాజ్పేయి సర్కారే బీజం వేసింది.13వ లోక్సభలో పార్టీల బలాబలాలు(మొత్తం స్థానాలు 543) పార్టీ స్థానాలు బీజేపీ 182కాంగ్రెస్ 114సీపీఎం 33టీడీపీ 29సమాజ్వాదీ 26జేడీ(యూ) 21శివసేన 15బీఎస్పీ 14ఇతరులు 109 – సాక్షి, నేషనల్ డెస్క్ -
Kargil Vijay Diwas: ఘర్ మే ఘుస్ కే...
ద్రాస్ (లద్దాఖ్): భారత్ తన గౌరవ ప్రతిష్టలను కాపాడుకోవడానికి నియంత్రణ రేఖను దాటడానికి సిద్ధంగా ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. అలాంటి పరిస్థితి వస్తే సైనికులకు సహకారం అందించడానికి పౌరులందరూ సన్నద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్గిల్ యుద్ధంలో విజయం సాధించి 24 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం దేశమంతా విజయ్ దివస్ జరుపుకుంది. ద్రాస్లోని కార్గిల్ యుద్ధ స్మారకం వద్ద ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో రాజ్నాథ్ మాట్లాడుతూ రష్యా, ఉక్రెయిన్ మధ్య ఏడాది దాటినా ఇంకా యుద్ధం కొనసాగుతోందని అంటే పౌరులు భాగస్వాములు కావడం వల్లేనని అభిప్రాయపడ్డారు. పొరుగుదేశమైన పాకిస్తాన్ కవి్వంపు చర్యల్ని పరోక్షంగా ప్రస్తావించిన ఆయన మన దేశ గౌరవాన్ని, మర్యాదని కాపాడుకోవడానికి ఎంత తీవ్రమైన చర్యలకైనా దిగుతామని హెచ్చరించారు. పొరుగుదేశం రెచ్చగొట్టే చర్యలకి దిగితే నియంత్రణ రేఖ దాటుతామన్నారు. ‘‘మన దేశంలో యుద్ధం పరిస్థితులు వస్తే సైనిక బలగాలకు ప్రజలు ఎప్పుడూ అండగా ఉంటారు. పరోక్షంగా తమ సహకారాన్ని అందిస్తారు. ఈ సారి అవసరమైతే ప్రత్యక్షంగా యుద్ధభూమిలో పాల్గొనాలని, దానికి తగ్గట్టు మానసికంగా సంసిద్ధులు కావాలని కోరుతున్నాను’’ అని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. దేశ ప్రయోజనాలను కాపాడుకునే అంశంలో మన సైన్యం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కార్గిల్ యుద్ధం సమయంలో భారత ఆర్మీ పాకిస్తాన్కేకాక యావత్ ప్రపంచానికి సందేశం పంపించిందన్నారు. పాకిస్తాన్ మనకి వెన్నుపోటు పొడవడంతో కార్గిల్ యుద్ధం వచి్చందన్నారు. అంతకు ముందు కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్ల సమాధుల్ని సందర్శించి పుష్ఫగుచ్ఛాలుంచి నివాళులరి్పంచారు. ప్రధాని నివాళులు కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన సైనికులకు రాష్టపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ , కేంద్ర మంత్రులు, ఇతర నాయకులు నివాళులర్పించారు. విజయ్ దివస్ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము ట్వీట్ చేశారు. ‘‘మన దేశ సైనికుల అపూర్వమైన విజయాన్ని దేశం గుర్తు చేసుకుంటోంది. దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన అమరులందరికీ నివాళులరి్పస్తున్నాను. దేశం కోసం త్యాగం చేసిన వారి గాథలన్నీ తరతరాలకు స్ఫూర్తి దాయకం’’ అని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. ప్రధాని మోదీ తన ట్వీట్లో కార్గిల్ విజయ్ దివస్ భారత వీరుల ధైర్య గాథల్ని గుర్తు చేస్తుందని, ప్రజలందరికీ వారు స్ఫూర్తిదాయకంగా నిలిచారని పేర్కొన్నారు. అమరులందరికీ హృదయపూర్వక నివాళులరి్పస్తున్నట్టుగా పేర్కొన్నారు. 1999లో కార్గిల్ను ఆక్రమించిన పాకిస్తాన్ సైన్యాన్ని తిప్పికొట్టి భారత్ విజయ దుందుభి మోగించింది. -
కరడుగట్టిన సైనిక నియంత.. ‘కార్గిల్’ విలన్
భారత గడ్డపై పుట్టి, కార్గిల్ యుద్ధంతో మనల్ని దొంగదెబ్బ తీసిన తెంపరి ముషారఫ్! కశ్మీర్ సమస్యను అంతర్జాతీయ అంశంగా మార్చడానికే అందుకు తెగించినట్టు తన ఆత్మకథ ‘ఇన్ ద లైన్ ఆఫ్ ఫైర్’లో రాసుకున్నారు కూడా. నాటి ప్రధాని నవాజ్ షరీఫ్కు కూడా తెలియకుండా ముషారఫ్ స్వయంగా పథక రచన చేసిన కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్కు ఘోర పరాభవం మిగిలింది. 1999 మే 3న మొదలైన యుద్ధం జూలై 26న ముగిసింది. భారత్ 527 మంది సైనికులను కోల్పోగా 4,000 మందికిపైగా పాక్ జవాన్లు హతమయ్యారు. ఢిల్లీలో పుట్టి... పర్వేజ్ ముషారఫ్ 1943 ఆగస్టు 11న నాటి ఉమ్మడి భారతదేశ రాజధాని ఢిల్లీలో సాధారణ మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. మాతృ భాష ఉర్దూ. 1947లో దేశ విభజనతో ఆయన కుటుంబం పాకిస్తాన్లోని కరాచీకి తరలివెళ్లింది. తండ్రి సయీద్ ముషారఫుద్దీన్ ఉద్యోగరీత్యా ముషారఫ్ 1956 దాకా టర్కీలో ఉన్నారు. తర్వాత కరాచీ, లాహోర్లలో చదువుకున్నారు. 1961లో పాకిస్తాన్ మిలటరీ అకాడమీలో చేరారు. 1964లో ఆర్టిలరీ రెజిమెంట్లో అడుగుపెట్టారు. 1971లో కంపెనీ కమాండర్గా భారత్–పాక్ యుద్ధంలో పాల్గొన్నారు. తర్వాత సైన్యంలో అంచెలంచెలుగా ఎదిగారు. 1998లో నాటి ప్రధాని నవాజ్ షరీఫ్ ఆయన్ను చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా నియమించారు. ‘జాయింట్ చీఫ్స్ స్టాఫ్ కమిటీ’ చైర్మన్గా 1999 ఏప్రిల్ 9న అదనపు బాధ్యతలు సైతం అప్పగించారు. నియంత పాలన పాక్, భారత్ ప్రధాన మంత్రులు షరీఫ్, వాజ్పేయి మధ్య 1999 ఫిబ్రవరి 21న చరిత్రాత్మక లాహోర్ శాంతి ఒప్పందం కుదిరిన కొన్ని నెలలకే కార్గిల్ యుద్ధానికి ముషారఫ్ తెగబడ్డారు. దీనిపై ఇంటా బయటా విమర్శలు ఎదుర్కొన్నారు. తనను తొలగించేందుకు నవాజ్ షరీఫ్ ప్రయత్నించడంతో 1999 అక్టోబర్లో సైనిక కుట్రతో ఆయన్ను గద్దె దింపారు. పాకిస్తాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్గా ప్రకటించుకుని పాలకునిగా మారారు. 2001లో దేశాధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. తొమ్మిదేళ్లపాటు పాలించారు. ఉగ్రవాదంపై యుద్ధం పేరిట అమెరికాతో చేతులు కలిపారు. మితవాద, ప్రగతిశీల ఇమేజీ కోసం ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలను నిషేధించి వాటి ఆగ్రహానికి గురయ్యారు. ముషార్రఫ్పై పలుమార్లు హత్యాయత్నాలూ జరిగాయి. 2008లో తప్పనిసరిగా పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహిస్తానని ప్రకటించారు. ఎన్నికల తర్వాతి పరిణామాల్లో రాజీనామా చేసి దుబాయ్ పారిపోయారు. 2013 మార్చిలో తిరిగొచ్చి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నించినా అనర్హత వేటు పడింది. నవాజ్ గెలిచాక ముషార్రఫ్పై మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్య సహా పలు కేసులు నమోదయ్యాయి. 2019లో ప్రత్యేక కోర్టు ఆయనకు మరణశిక్ష విధించింది! – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘లోక్మత్’ ఆధ్వర్యంలో.. కార్గిల్ స్మారక భవనం
ద్రాస్ (లదాఖ్): జమ్మూ కశ్మీర్లోని ద్రాస్ సెక్టర్లో లోక్మత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన కార్గిల్ స్మారక భవనాన్ని జవాన్లకు అంకితం చేశారు. కార్గిల్ యుద్ధ విజయానికి గుర్తుగా నిర్మించిన కార్గిల్ వార్ మెమోరియల్ రక్షణ విధుల్లో ఉండే జవాన్ల సౌకర్యార్థం లోక్మత్ మీడియా గ్రూప్ దీన్ని నిర్మించింది. పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ పద్ధతుల్లో నిర్మించిన ఈ భవనాన్ని లోక్మత్ మీడియా ఎడిటోరియల్ గ్రూప్ చైర్మన్, మాజీ ఎంపీ విజయ్ దర్దా చేతుల మీదుగా జవాన్లకు అంకితం చేశారు. గడ్డ కట్టించే చలిలో స్మారక పరిరక్షణ విధుల్లో ఉండే జవాన్లకు ఈ భవనం ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా దర్గా ఆశాభావం వెలిబుచ్చారు. కార్యక్రమంలో లెఫ్టినెంట్ జనరల్ అనింద్య సేన్గుప్తా, మేజర్ జనరల్ నాగేంద్ర సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: ‘మేమూ ‘యోగి’ స్టైల్లోనే వెళ్తాం’.. బీజేపీ నేత హత్యపై సీఎం హెచ్చరిక!
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పక్కాగా పరిశీలన..
జనజాతర సభ సైడ్లైట్స్
కాంగ్రెస్కు అండగా ఉండాలి..
తలసేమియాపై అవగాహన
కాంగ్రెస్కు ఓటేస్తే దండగ
పకడ్బందీగా ఈవీఎంల కమిషనింగ్
నాణ్యమైన విద్యుత్ తీగలు వినియోగించాలి
‘వంశీని గెలిపిస్తే జిల్లా పేరు మారుస్తారు’
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement