-
ప్లాట్ఫాం టిక్కెట్ చార్జీ పెంపు
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి రద్దీ నియంత్రణ దృష్ట్యా దక్షిణమధ్య రైల్వే ప్లాట్ఫాం టికెట్ల ధరలను తాత్కాలికంగా పెంచింది. ఈ నెల 8వ తేదీ నుంచి 20 వరకు కాచిగూడ రైల్వేస్టేషన్లో ప్లాట్ఫాం టికెట్ చార్జీలను రూ.10 నుంచి రూ.20కి పెంచినట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్.రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. కాచిగూడ నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికుల కోసం వచ్చే బంధుమిత్రుల రద్దీని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పండుగ సీజన్లో పెద్ద ఎత్తున జన సమూహం ప్లాట్ఫారంపై ప్రవేశించకుండా నియంత్రించేందుకు, రద్దీ వల్ల ప్రయాణికులకు కలిగే అసౌకర్యాన్ని నివారించడానికి చార్జీలను పెంచినట్లు పేర్కొన్నారు. కోవిడ్ నియంత్రణ దృష్ట్యా కూడా అనవసరమైన వ్యక్తులు ప్లాట్ఫాంలపైకి రాకుండా నియంత్రించాల్సి ఉందన్నారు. -
సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండగకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేష్ ఓ ప్రకటనలో తెలిపారు. కాచిగూడ–శ్రీకాకుళం(07016) స్పెషల్ ట్రైన్ జనవరి 7,14,21,28, ఫిబ్రవరి 4,11,18,25, మార్చి 3,10,17,24,31 తేదీల్లో సాయంత్రం 6.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.15 గంటలకు శ్రీకాకుళం చేరుతుంది. తిరుపతి–కాచిగూడ (07479) స్పెషల్ ట్రైన్ జనవరి 9, 16, 23, 30, ఫిబ్రవరి 6, 13, 20, 27, మార్చి 5, 12, 19, 26, ఏప్రిల్ 2 తేదీల్లో సాయంత్రం 5 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.30కు కాచిగూడ చేరుకుంటుంది. కాచిగూడ– శ్రీకాకుళం (07148/ 07147) స్పెషల్ ట్రైన్ జనవరి 5, 19, 26, ఫిబ్రవరి 2, 9, 16, 23, మార్చి 1, 8, 15, 22, 29 తేదీల్లో సాయంత్రం 6.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.55కు శ్రీకాకుళం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో జనవరి 6, 13, 20, 27, ఫిబ్రవరి 3, 10, 17, 24, మార్చి 2, 9, 16, 23, 30 తేదీల్లో సాయంత్రం 5.15 కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.30 కు కాచిగూడ చేరుకుంటుంది. ఇవీ చూడండి.. పండగ వేళ ప్రత్యేక రైళ్లు విజయనగరం, కాకినాడకు వెళ్లాలంటే... -
రైలు ప్రమాదంపై కమిటీ విచారణ వేగవంతం
హైదరాబాద్ : కాచిగూడ రైల్వే స్టేషన్లో రెండు రోజుల క్రితం హంద్రీ ఇంటర్సిటీని ఎంఎంటీఎస్ ఎక్స్ప్రెస్ ఢీకొట్టిన సంగతి తెలిసిందే. సంఘటనకు సంబంధించి కాచిగూడ స్టేషన్ మేనేజర్ కార్యాలయంలో విచారణ ప్రారంభమైంది. ఈ విచారణకు రైల్వే సేఫ్టీ కమిషనర్ రామ్కృపాల్ నేతృత్వంలో విచారణ కొనసాగనుంది. కాగా నేడు విచారణలో భాగంగా స్టేషన్ మేనేజర్ రవీందర్, డివిజన్ రీజనల్ మేనేజర్ ఎన్వీఎస్ ప్రసాద్, అడిషనల్ డివిజన్ రీజనల్ మేనేజర్ సాయిప్రసాద్లు రైల్వేసేఫ్టీ కమిషనర్ ముందు విచారణకు హాజరయ్యారు. విచారణలో భాగంగా ప్రత్యక్ష సాక్షులను, స్థానికులను, ప్రమాద సమయంలో స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారిని విచారించనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక రైల్వే సేఫ్టీ కమీషనర్, ఇతర అధికారులు ఘటనాస్థలానికి చేరుకొని ప్రమాదస్థలాన్ని, ప్రమాదం జరిగిన తీరును పరిశీలించనున్నారు. గురు, శుక్రవారాల్లో హైదరాబాద్ రైల్భవన్లో ఈ ఘటనపై అధికారులను సుదీర్ఘంగా విచారించనున్నారు. చదవండి : కాచిగూడ రైలుప్రమాదంపై హైలెవల్ కమిటీ.. -
మృత్యుంజయుడిగా నిలిచిన లోకోపైలట్
సాక్షి, హైదరాబాద్ : కాచిగూడ స్టేషన్లో రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో కేబిన్లో ఇరుక్కుపోయిన ఎంఎంటీఎస్ లోకోపైలట్ చంద్రశేఖర్ ఎట్టకేలకు ప్రాణాలతో బయటపడ్డాడు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) దాదాపు ఎనిమిదిన్నర గంటలపాటు శ్రమించి ఆయన్ను బయటకు తీశాయి. సోమవారం ఉదయం 10.30 గంటలకు ప్రమాదం జరగ్గా.. సాయంత్రం 6.40 గంటలకు చంద్రశేఖర్ను సురక్షితంగా బయటకు తీయగలిగాయి. క్యాబిన్లో ఇరుక్కున్న లోకో పైలట్ చంద్రశేఖర్ 8 గంటల ఉత్కంఠ... ప్రమాదంలో ఇంటర్సిటీ రైలు ఇంజిన్.. ఎంఎంటీఎస్ ముందు భాగాన్ని చీల్చు కుంటూ డ్యాష్బోర్డును స్వల్పంగా ధ్వంసం చేసి ఆగిపోయింది. దీంతో లోకోపైలట్ చంద్రశేఖర్ అందులో ఇరుక్కుపోయారు. నిమిషాల వ్యవధిలోనే ఎన్డీఆర్ఎఫ్, ఆర్పీఎఫ్ బలగాలు సహాయక చర్యలు మొదలుపెట్టాయి. ఉదయం 11 గంటలకు ఇంటర్సిటీ రైలు ఇంజిన్ను కదలకుండా చేసి, ఎంఎంటీఎస్ రైలు ఎడమవైపు ఐరన్ షీటును కట్టర్లతో తొలగించారు. దాని వెనకాలే చంద్రశేఖర్ ఇరుక్కుని ఉండటంతో అక్కడ నుంచి మిగతా జాగ్రత్తగా చేతులతోనే కట్ చేయడం ప్రారంభించారు. 11.15 గంటలకు లోకోపైలట్కు ఆక్సిజన్ పెట్టారు. నిరంతరం ఫ్లూయిడ్స్ ఎక్కిస్తూ.. బీపీ చెక్ చేస్తూ.. అతడు మత్తులోకి జారిపోకుండా మాట్లాడిస్తూ ఆపరేషన్ కొనసాగించారు. సాయంత్రం 5.25 గంటలకు రైలుకు ఎడమ పక్కన ఉన్న ఐరన్షీటు పూర్తిగా తొలగించారు. రక్త ప్రసరణ లేకపోవడంతో అతడి కాలు వాచిపోయి ఉన్న సంగతి అప్పుడు గుర్తించారు. సాయంత్రం 5.30 గంటలకు చంద్రశేఖర్ తల కనిపించడంతో వైద్యులు వెళ్లి ధైర్యం చెప్పారు. భయపడవద్దని మరికొద్ది నిమిషాల్లో బయటికి వస్తావని చెప్పారు. సాయంత్రం 6.05 గంటలకు డ్యాష్ బోర్డులో ఇరుక్కున్న చంద్రశేఖర్ వెనక ఉన్న మరో ఐరన్షీట్ను తొలగించారు. అయినా తల, ఛాతి, వెన్ను అలాగే ఉండిపోయాయి. సాయంత్రం 6.40 గంటలకు మిగిలిన భాగాలను కూడా కత్తిరించి, అతడిని బయటకి తీసుకొచ్చారు. వెంటనే చంద్రశేఖర్ను అంబులెన్స్లో ఆసుపత్రికి పంపించారు. రియల్ హీరో ‘నిశాంత్’ ప్రమాదం జరిగాక అక్కడి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ కానిస్టేబుల్ నిశాంత్ చివరి వరకు అక్కడే ఉన్నాడు. చంద్రశేఖర్ని నిత్యం మాట్లాడిస్తూ.. అతనికి నీళ్లు ఇస్తూ.. ధైర్యం చెబుతూ వచ్చాడు. రైలును కట్టర్లతో కోస్తున్నపుడు చంద్రశేఖర్పై నిప్పురవ్వలు ఎగిసిపడకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. నిశాంత్కు తోడుగా రైల్వే సిబ్బంది శ్రీను, ఆక్సిజన్ సిలిండర్ను చివరి వరకు పట్టుకున్న స్టేషన్ ఉద్యోగి రాజు.. లోకోపైలట్ను సురక్షితంగా బయటకు తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు. -
కాచిగూడ వద్ద ప్రమాదం.. పలు రైళ్ల రద్దు
సాక్షి, హైదరాబాద్ : కాచిగూడ రైల్వేస్టేషన్లో ఎంఎంటీఎస్ రైలు, హంద్రీ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ను ఢీకొన్న ప్రమాద ఘటన నేపథ్యంలో సోమవారం కాచిగూడ మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లను రద్దు చేశారు. 12 ఎంఎంటీఎస్ రైళ్లు, 16 ప్యాసింజర్ రైళ్లు, మరో 3 ఎక్స్ప్రెస్లను రద్దు చేశారు. అలాగే 38 రైళ్లు పాక్షికంగా రద్దు కాగా, మరో 7 రైళ్లను వివిధ మార్గాల్లో మళ్లించారు. 6 రైళ్ల వేళల్లో మార్పులు చేశారు. ఎంఎంటీఎస్ రైళ్ల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. లింగంపల్లి నుంచి ఫలక్నుమా వరకూ రాకపోకలు సాగించే ఎంఎంటీఎస్ సర్వీసులు సికింద్రాబాద్ వరకే పరిమితమయ్యాయి. నాంపల్లి నుంచి ఫలక్నుమా మధ్య సర్వీసులు కూడా నిలిచిపోయాయి. కొన్నింటిని పాక్షికంగా రద్దు చేయగా, మరికొన్నింటిని దారి మళ్లించారు. రద్దయిన రైళ్లు.. కాచిగూడ–చెంగల్పట్టు (17652), కాచిగూడ–టాటానగర్ (07438/07439), కాచిగూడ–చిత్తూరు (12797/12798) ఎక్స్ప్రెస్ రైళ్లు రద్దయ్యాయి. కాచిగూడ–గుంటూరు ఎక్స్ప్రెస్, ఫలక్నుమా–ఉందానగర్, ఉందానగర్–సికింద్రాబాద్, కాచిగూడ–కర్నూల్ సిటీ, మహబూబ్నగర్–మీర్జాపల్లి, మహబూబ్నగర్–కాచిగూడ రైళ్లు రద్దయ్యాయి. షోలాపూర్–ఫలక్నుమా (57659) రైలును సనత్నగర్ వరకే పరిమితం చేశారు. బోధన్–మహబూబ్నగర్ ప్యాసింజర్ రైలు మల్కాజిగిరి వరకే పరిమితమైంది. మల్కాజిగిరి–మహబూబ్నగర్ మధ్య నడిచే రైలును రద్దు చేశారు. మిర్యాలగూడ–కాచిగూడ ప్యాసింజర్ రైలు ను సీతాఫల్మండి వద్ద నిలిపివేశారు. కాచిగూడ నుంచి మిర్యాలగూడ వెళ్లవలసిన రైలును సీతాఫల్మండి నుంచి నడిపారు. బోధన్–మహబూబ్నగర్, నిజామాబాద్–కాచిగూడ రైళ్లను మల్కాజిగిరి వరకు పరిమితం చేశారు. వికారాబాద్–కాచిగూడ రైలు సికింద్రాబాద్ వరకు పరిమితమైంది. మేడ్చల్–కాచిగూడ రైలును బొల్లారం వరకే నడిపారు. నడికుడి–కాచిగూడ రైలు మల్కాజిగిరి వరకు నడిపారు. పలు రైళ్ల దారి మళ్లింపు.. అమరావతి–తిరుపతి బైవీక్లీ ఎక్స్ప్రెస్ (12766)ను బొల్లారం–సికింద్రాబాద్–గుంతకల్–గుత్తి మీదుగా మళ్లించారు. కాచిగూ డ–చెంగల్పట్టు (17652) ఎక్స్ప్రెస్ను సికింద్రాబాద్–రాయ్చూర్–గుంతకల్–గుత్తి మీదుగా మళ్లించారు. కోయంబత్తూర్–హజ్రత్ నిజాముద్దీన్ (12647) ఎక్స్ప్రెస్ను డోన్–గుంతకల్–సికింద్రాబాద్ మార్గంలో మళ్లించారు. నాగర్సోల్–చెన్నై (16004) ఎక్స్ప్రెస్ను సికింద్రాబాద్, రాయచూర్, గుంతకల్ మీదుగా మళ్లించారు. కాచిగూడ–రేపల్లె (17625) రైలు సోమవారం రాత్రి 10.10కి బయలుదేరవలసి ఉండగా దీనిని అర్ధరాత్రి 12.30కి మార్చారు.
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
కదన రంగంలోకి కమల దళపతులు
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
Advertisement