-
నాలుగేళ్ల లవ్కు బ్రేకప్.. సినిమాకు ఒప్పుకోరేమోనని టెన్షన్!
ప్రేమలో ఉన్నంతసేపు ఒకరిని విడిచి మరొకరు ఉండలేమంటారు. బ్రేకప్ అయ్యాక ముఖం చూడటానికి కూడా ఇష్టపడరు. కానీ ఇక్కడ చెప్పుకునే జంట మాత్రం చాలా ప్రొఫెషనల్. సినిమా కోసం పర్సనల్ విషయాలను పక్కనపెట్టి కలిసిపోయారు, కేవలం సెట్స్లోనే! సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ ఒకప్పుడు ప్రేమపక్షులన్న విషయం తెలిసిందే! అయితే సల్మాన్ ఎంతోమందితో ప్రేమాయణం నడిపాడు, కానీ ఏదీ సక్సెస్ కాలేదు. అలాగే కత్రినాతో నడిపిన ప్రేమ వ్యవహారం కూడా మూణ్నాళ్ల ముచ్చటగానే మారింది. కొంతకాలానికే ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. అసౌకర్యంగా ఉంటుంది అది జరిగిన కొంతకాలానికే డైరెక్టర్ కబీర్ ఖాన్ 'ఏక్ థా టైగర్' సినిమాను పట్టాలెక్కించే పనిలో పడ్డాడు. కానీ ఈ లవ్ బర్డ్స్ బ్రేకప్ వల్ల ఇద్దరూ సినిమాలో నటించేందుకు ఒప్పుకుంటారో, లేదోనని తెగ టెన్షన్ పడ్డాడు. దాని గురించి అతడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'కత్రినా, నాకు ఇంట్లో మనిషిలా అనిపిస్తుంది. సినిమా గురించి చెప్పగానే వెంటనే సంతకం చేసింది. తర్వాత సల్మాన్ ఖాన్ ఇంటికి వెళ్లాం. అసలే బ్రేకప్ అయింది. అలాంటి సమయంలో కలిసి పని చేయాలంటే ఎంతో అసౌకర్యంగా ఉంటుంది. కత్రినా అని తెలిసి కూడా ఆయన ఒప్పుకుంటాడో, లేదోనని టెన్షన్ పడుతూనే తన ఇంటికి వెళ్లాం. హీరోయిన్గా కత్రినాను సెలక్ట్ చేశాం అని చెప్పాను. 5-10 నిమిషాలు మౌనంగా ఉన్న తర్వాత సరే చేసేద్దాం అన్నారు. మా గుండె నుంచి పెద్ద భారం దిగిపోయినట్లనిపించింది' అని చెప్పుకొచ్చాడు. కాగా సల్మాన్- కత్రినా నాలుగేళ్లపాటు డేటింగ్ చేశారు. 2009లో విడిపోయారు. తర్వాత కత్రినా రణ్బీర్ కపూర్తో ప్రేమలో పడింది. కానీ ఈ బంధం కూడా నిలవలేదు. వీళ్లిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నాక విక్కీ కౌశల్ను లవ్ చేసింది. 2021లో వీరు పెళ్లి చేసుకున్నారు. చదవండి: పదేళ్ల క్రితం ఆశపడ్డాడు.. చివరికి అది నెరవేరకుండానే.. -
ఏకంగా తొమ్మిది చిత్రాలు.. ఆ దర్శకుల్లో టాప్ ఎవరంటే.. రాజమౌళి మాత్రం!
ఒక సినిమా వందకోట్లు కలెక్షన్స్ రావడమంటే అంతా ఈజీ కాదు. స్టార్ హీరోల సినిమాలకైతే వాళ్ల క్రేజ్ను బట్టి వసూళ్లు రాబట్టడం జరుగుతూ ఉంటోంది. ఇక హీరోల సంగతి పక్కన పెడితే.. దర్శకుడే సినిమాకు ప్రధాన బలం. వారి కథ, స్క్రీన్ ప్లేను బట్టి సినిమా హిట్టా, ఫ్లాపా అనే టాక్ తెచ్చుకోవడంపై ఆధారపడి ఉంటుంది. అదే కాకుండా కంటెంట్ ఉంటే చిన్న సినిమా అయినా సరే బాక్సాఫీస్ వద్ద వందకోట్లు కొల్లగొట్టడం చూస్తుంటాం. కానీ ఓకే దర్శకుడి తెరకెక్కించిన తొమ్మిదికి పైగా చిత్రాలు వంద కోట్లు రాబట్టమంటే మామూలు విషయం కాదు. అలాంటి అరుదైన ఘనత సాధించిన దర్శకధీరుడి గురించి తెలుసుకుందాం. తొమ్మిది చిత్రాల దర్శకుడు 2000ల మధ్యకాలంలో భారతీయ సినిమాలు.. దేశీయ కలెక్షన్లతో వందకోట్ల మార్కు చేరుకున్న సినిమాలుగా గుర్తించారు. ఆ తర్వాత దేశవ్యాప్తం కలెక్షన్లతో పాటు ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లు దాటిన సినిమాలను వంద కోట్ల క్లబ్లో చేర్చారు. చాలా మంది హీరోల సినిమాలు రూ.100 కోట్ల క్లబ్లో చేరాయి. కానీ వందకోట్ల వసూళ్లు సాధించిన సినిమాలు నిర్మించిన దర్శకుల సంఖ్య మాత్రం ఇలా వేళ్లమీదే లెక్కపెట్టొచ్చు. ఇలాంటి అరుదైన మైలురాయిని అందుకున్న దర్శకుల్లో రోహిత్ శెట్టి ఒకరు. ఆయన నిర్మించిన తొమ్మిది చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లు వసూళ్లు సాధించాయి. అత్యధికంగా రూ.100 కోట్ల వసూళ్లు సాధించిన సినిమాలు తీసిన భారతీయ దర్శకుడిగా పేరు సంపాదించారు. గోల్మాల్ 3తో మొదలై.. గోల్మాల్ 3 చిత్రంతో మొదలైన రోహిత్ ప్రభంజనం సూర్యవంశీ వరకు కొనసాగింది. అతను నిర్మించిన చిత్రాల్లో రూ. 423 కోట్ల కలెక్షన్స్తో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా చెన్నై ఎక్స్ప్రెస్ నిలిచింది. ఆ తర్వాత సింగం (రూ. 157 కోట్లు), బోల్ బచ్చన్ (రూ. 165 కోట్లు), సింగం రిటర్న్స్ (రూ. 219 కోట్లు), దిల్వాలే (రూ. 377 కోట్లు), గోల్మాల్ ఎగైన్ (రూ. 311 కోట్లు), సింబా (రూ. 400 కోట్లు) ఉన్నాయి. అయితే అయితే రోహిత్ శెట్టి తెరకెక్కించిన కొన్ని చిత్రాలు నిరాశపరిచనవి కూడా ఉన్నాయి. వాటిలో జమీన్ (రూ. 18 కోట్లు), సండే (రూ. 32 కోట్లు), సర్కస్ (రూ. 62 కోట్లు)తో రూ. 100 కోట్లు రాబట్టని లిస్ట్లో ఆరు సినిమాలు ఉన్నాయి. ప్రతి సినిమా 100 కోట్లే.. తన ప్రతి సినిమా 100 కోట్ల క్లబ్లో చేరిన ఘనత కరణ్ జోహార్ సొంతం. దిల్వాలే దుల్హనియా లే జాయేంగేలో ఆదిత్య చోప్రాకు అసిస్టెంట్గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన చిత్రనిర్మాత, 1998లో కుచ్ కుచ్ హోతా హైతో దర్శకుడిగా మారారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 107 కోట్లను రాబట్టి.. ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత కభీ ఖుషీ కభీ గమ్, కభీ అల్విదా నా కెహనా, మై నేమ్ ఈజ్ ఖాన్, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, ఏ దిల్ హై ముష్కిల్ రూ.100 కోట్లు దాటాయి. ఇటీవల విడుదలైన రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీతో ఏడో చిత్రం కూడా ఈ లిస్ట్లో చేరిపోయింది.. రూ.100 కోట్ల చిత్రాల దర్శకులు వీళ్లే.. ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లకు పైగా వసూలు సాధించిన దర్శకులు కూడా ఉన్నారు. డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఐదు చిత్రాలు ఈ లిస్ట్లో ఉన్నాయి. ఆ తర్వాత కబీర్ ఖాన్, రాజ్కుమార్ హిరానీ ఒక్కొక్కరు నాలుగు సినిమాలు ఉన్నాయి. దర్శకు ధీరుడి నాలుగు చిత్రాలు టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన చిత్రాలు నాలుగు ఉన్నాయి. వాటిలో మగధీర, బాహుబలి-1, బాహుబలి-2, ఆర్ఆర్ఆర్ ఉన్నాయి. అయితే రాజమౌళి తెరకెక్కించిన రెండు సినిమాలు మాత్రం రూ.1000 కోట్ల వసూళ్లను దాటేశాయి. ఈ ఘనత సాధించిన ఏకైక దర్శకుడిగా రాజమౌళి మాత్రమే నిలిచారు . -
అత్యంత ధనవంతులైన డైరెక్టర్ల లిస్ట్లో రాజమౌళి
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ధనవంతులైన దర్శకులు ఎవరో తెలుసా? స్క్రీన్పై అభిమానులకు వినోదాన్ని అందిస్తూ కోట్లు సంపాదించిన డైరెక్టర్లను వేళ్ల మీదే చెప్పొయొచ్చు. అలాంటి ఇండియాలో ధనవంతులైన దర్శకులెవరో ఓ లుక్కేద్దాం. జీక్యూ ఇండియా తాజాగా దర్శకుల జాబితాను ప్రకటించింది. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ జాబితాలో టాలీవుడ్కు చెందిన ఎస్ఎస్ రాజమౌళి మాత్రమే ఉన్నారు. బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ గురించి బాలీవుడ్తో పాటు దక్షిణాదిలో పరిచయం అక్కర్లేదు. సూపర్ హిట్ సినిమాలతో ఫేమస్ అయ్యారు. ఆయనకు దాదాపు రూ.1640 కోట్ల ఆస్తులతో మొదటిస్థానంలో ఉన్నారు. రెండోస్థానంలో రాజ్కుమార్ హిరాణీ రూ.1105 కోట్లతో నిలవగా.. రూ.940 కోట్లతో సంజయ్ లీలా భన్సాలీ మూడోస్థానం పొందారు. ఆ తర్వాత వరుసగా రూ.720 కోట్లతో అనురాగ్ కశ్యప్, రూ.300 కోట్లతో కబీర్ ఖాన్, రూ.280 కోట్లతో రోహిత్ శెట్టి, రూ.158 కోట్లతో ఎస్ఎస్ రాజమౌళి, రూ.76 కోట్లతో జోయా అక్తర్ నిలిచారు. View this post on Instagram A post shared by GQ India (@gqindia) -
'83' సినిమా రివ్యూ
టైటిల్: 83 నటీనటులు: రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణె, పంకజ్ త్రిపాఠి, జీవా, హార్దీ సంధు, తాహీర్ భాసిన్, చిరాగ్ పాటిల్, సాకిబ్ సలీమ్ తదితరులు దర్శకుడు: కబీర్ ఖాన్ నిర్మాతలు: రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణె, కబీర్ ఖాన్, విష్ణు వర్దన్ ఇందూరి, సాజిద్ నడియడ్వాలా, రిలియన్స్ ఎంటర్టైన్మెంట్, ఫాంటమ్ ఫిల్మ్స్ సినిమాటోగ్రఫీ అసీమ్ మిశ్రా ఎడిటింగ్ నితిన్ బెద్ సంగీతం: జూలియస్ పేకియం స్వరాలు: ప్రీతమ్ విడుదల: డిసెంబర్ 24, 2021 క్రికెట్ను గ్రౌండ్లో, టీవీల్లో చూసి ఎంజాయ్ చేయడమే కాదు సినిమాగా వెండితెరపై ఆవిష్కరించిన అంతే ఉత్సాహం చూపిస్తారు అభిమానులు. క్రికెట్.. అంటే కేవలం ఒక ఆట కాదు. ఎందరో అభిమానులకు అది ఒక ఎమోషన్. కుల మతాలకు అతీతంగా ప్రజలను ఏకం చేసిన మతం క్రికెట్. ఈ మతం 1983 భారత క్రికెట్ టీమ్ సాధించిన వరల్డ్ కప్తో పునాది వేసుకుందని చెప్పవచ్చు. కపిల్ దేవ్ పాత్రలో రణ్వీర్ సింగ్ నటించిన తాజా సినిమా '83'. ఈ సినిమాలో భారతదేశానికి తొలి ప్రపంచకప్ అందించిన కపిల్ దేవ్ నేతృత్వంలోని టీమిండియా జర్నీని వెండితెరపై ఆవిష్కరించారు. అప్పుడు జరిగిన మ్యాచ్ను కొంతమంది టీవీల్లో వీక్షించగా.. మరికొంతమంది రేడియోల్లో విన్నారు. టీమిండియా విజయాన్ని తమ గెలుపుగా భావించి సంబురాలు చేసుకున్నారు. తర్వాతి తరానికి 25 జూన్, 1983 ఒక చరిత్ర. ఆ చరిత్రను వెండితెరపై ఆవిష్కరించారు డైరెక్టర్ కబీర్ ఖాన్. మరీ ఈ రోజు విడుదలైన '83' సినిమా ఎలా ఉందంటే? కథ: 1983లో భారత్ వరల్డ్ కప్ గెలిచిన సంగతి తెలిసిందే. అప్పటివరకు ఇండియా టీమ్ను ఒక జట్టుగా కూడా చూడలేదు క్రికెట్ ప్రపంచం. అనేక అవమానాలు అడుగడునా ఎదుర్కొన్న భారత జట్టు వరల్డ్ కప్ ఫైనల్ వరకు ఎలా చేరింది. అప్పటికే రెండు సార్లు ప్రపంచకప్ గెలుచుకున్న వెస్టండీస్పై ఎలాంటి అంచనాలు లేని భారత్ గెలిచి వరల్డ్ కప్ ఎలా కొల్లగొట్టింది. ఈ క్రమంలో ఇండియన్ క్రికెటర్లకు కుటుంబ సభ్యులకు ఉన్న రిలేషన్ ఎలా ఉంది. వరల్డ్ కప్ గురించి ఇండియన్ క్రికేట్ టీమ్ సభ్యులు ఏమనుకున్నారు. కప్ గెలవడానికి ముందు క్రికెట్లో ఇండియాను భారతీయులు, విదేశీయులు ఎలా చూశారనేదే 83 చిత్రం కథ(83 movie review). విశ్లేషణ: క్రికెట్లో తమకంటూ ఒక స్థానం ఉండాలని పరితపించిన సగటు భారతీయుడి కథ ఇది. 1983 వరల్డ్ కప్ను భారత్ గెలుచుకోవడం ఒక భావోద్వేగపు సంఘటన. అందుకే దీన్ని ఒక సినిమాలా చూడలేం. సగటు సినీ ప్రేక్షకుడిగా కాకుండా క్రికెట్ ఆడే చిన్న పిల్లాడిలా చూస్తే సినిమా అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. 1983లో హర్యనా హరికేన్ కపిల్ దేవ్ సారథ్యంలో ఇండియా ప్రపంచ కప్ సాధించిన సంగతి తెలిసిందే. అయితే ప్రేక్షకుడికి కథ ఎలాగు ముందే తెలుసు. కాబట్టి తెలిసిన కథను ప్రేక్షకుడు తెరపై చూడాలంటే సినిమా బాగా కనెక్ట్ కావాలి. అంటే అప్పుడు జరిగిన సంఘటనలు, అప్పటి ఎమోషన్ను కళ్లకు కట్టనట్లు చూపించాలి. ఆ ఎమోషన్ను సినిమా ప్రారంభం నుంచి చివరి దాకా కొనసాగించడంలో దర్శకుడు కబీర్ ఖాన్ కొంతవరకు విజయం సాధించాడనే చెప్పవచ్చు. వరల్డ్ కప్ సిరీస్ ప్రారంభం నుంచి కప్ గెలిచే వరకూ భారత్ ఎలా నిలదొక్కుకుందని దర్శకుడు బాగా చూపించాడు. అప్పటివరకు ఇండియాలో మత ఘర్షణలు అనేకంగా జరిగేవి. ఈ మత ఘర్షణలకు ఒక్కసారిగా ముగింపు పలికింది 1983 వరల్డ్ కప్. ఈ అంశాన్ని తెరపై ఆవిష్కరించి విజయం సాధించాడు కబీర్ ఖాన్. ఈ సినిమాలో అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ రోజున ఇండియా-పాకిస్తాన్ సరిహద్దుల్లో భారత సైన్యానికి పాక్ ఆర్మీ ఒక్క రోజు కాల్పుల విరమణ ఇవ్వడం, ఇంగ్లాండ్లో పనిచేస్తున్న భారతీయుల ఎమోషన్, పలు చోట్ల అల్లర్లను సినిమాలో సాధ్యమైనంత వరకూ బాగానే చూపించారు. అయితే కపిల్ భార్య రోమి భాటియా, మదన్ లాల్ భార్య అను మోహన్ ఫైనల్ మ్యాచ్లో ఇండియా ఓడిపోతుందని స్టేడియం నుంచి హోటల్కు వెళతారు. ఈ దృశ్యాలను మాత్రం ప్రేక్షకుల హృదయాలకు తాకేలా తీయడంలో విఫలమయ్యారనే చెప్పవచ్చు. సినిమా ఫస్టాఫ్ స్లోగా నడిచినట్లు అనిపించినా.. సెకాండాఫ్ మాత్రం బాగుంటుంది. క్యాస్టింగ్, సాంకేతికంగా బాగానే వర్క్ చేసినట్టు కనిపిస్తుంది. అప్పటి కాలాన్ని తెరపై చక్కగా ఆవిష్కరించారు. ఆర్ట్, కమెరా పనితనం మొత్తంగా చిత్ర బృందం ఎఫర్ట్ స్క్రీన్పై కనిపించింది. చిత్రంలో 1983 వరల్డ్ కప్లో జరిగిన పలు దృశ్యాలను చూపించడం బాగుంది. అప్పటి మ్యాచ్ను మళ్లీ లైవ్లో చూసిన అనుభూతిని ఇస్తుంది. సినిమాలో అక్కడక్కడ పలువురు ప్రముఖ క్రికెటర్లు కనిపించడం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎవరెలా చేశారంటే ? సినిమాలో రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణె, పంకజ్ త్రిపాఠి వంటి భారీ తారగణంతో అప్పటి విజయాన్ని తెరపై చూపించిన ప్రయత్నమిది. కపిల్ దేవ్ పాత్రలో రణ్వీర్ సింగ్ ఎంతో చక్కగా ఒదిగిపోయాడు. గెటప్ దగ్గర నుంచి ఆట ఆడే తీరు వరకు కపిల్ను దింపేశాడు రణ్వీర్ సింగ్. ఆ పాత్రకు ఏం చేయాలో అంతా చేసి విజయం సాధించాడు. కపిల్ దేవ్ భార్య రోమి భాటియాగా దీపికా పదుకొణె బాగానే ఆకట్టుకుంది. అయితే ఆమె పాత్ర ప్రభావం సినిమాలో అంతగా కనిపించదు. మాన్ సింగ్గా పంకజ్ త్రిపాఠికి మరో ఛాలెంజ్ రోల్ దక్కింది. ఆ పాత్రకు తగిన న్యాయం చేశాడు పంకజ్ త్రిపాఠి. క్రిష్ణమాచారి శ్రీకాంత్గా జీవా తన నటనతో మెప్పించాడు. మిగతా నటీనటులు వారి పాత్రలకు తమ పరిధిమేర నటించి ఆకట్టుకున్నారు. ఈ సినిమాకు తెలుగు డబ్బింగ్ను అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పించింది. రణ్వీర్ సింగ్కు హీరో సుమంత్ డబ్బింగ్ చెప్పగా.. జీవాకు నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ చెప్పిన డబ్బింగ్ బాగా సూట్ అయింది. మొహిందర్ అమర్నాథ్ పాత్రలో సాకీబ్ నటించగా.. అతడి తండ్రి పాత్ర లాలా అమర్నాథ్గా మొహిందర్ అమర్నాథ్ నటించడం విశేషం. అలాగే సందీప్ పాటిల్ పాత్రలో ఆయన కుమారుడు చిరాగ్ పాటిల్ నటించాడు. 1983 వరల్డ్ కప్ విశేషాలు, హైలెట్స్, అభిమానుల సందడి ఎలా ఉందో చూడాలంటే '83' చిత్రం మంచి ఎంపిక. -
ది ఫర్గాటన్ ఆర్మీ.. గిన్నిస్ రికార్డు
ముంబై: ప్రముఖ ఫిల్మ్మేకర్ కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ‘ది ఫర్గాటన్ ఆర్మీ’ గిన్నిస్ ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. ఆజాద్ హింద్ ఫౌజ్కు చెందిన వెలుగు చూడని వీరులకు నివాళిగా ముంబైలోని సబర్బన్ హోటల్లో శుక్రవారం రాత్రి భారీ సంగీత కార్యక్రమం నిర్వహించారు. ఇందులో దాదాపు 1000 మంది గాయకులు, వాయిద్యకారులు పాల్గొన్నారు. దీంతో భారత సినిమాటిక్ సంగీత బ్యాండ్లో నిర్వహించిన అతిపెద్ద కార్యక్రమంగా ఇది నిలిచిందని గిన్నిస్ ప్రపంచ రికార్డుల అడ్జడికేటర్ స్వాప్నిల్ దంగారికర్ ప్రకటించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
‘రాహుల్ పేరు చెబితే ఓట్లు పడవు’
కాంగ్రెస్తోనే అన్నివర్గాలకు సముచిత న్యాయం
హామీలు నెరవేర్చడంలో రేవంత్ విఫలం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తాం..
మూడోసారి మోదీ సర్కారే..
రోడ్డు ప్రమాదంలో నవ వరుడు దుర్మరణం
ఏటా కోటి ఉద్యోగాల భర్తీ ఏమైంది?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement