-
ఐఎస్ అగ్రనేత బగ్దాదీ కుమారుడు హతం
బీరుట్: సిరియా ప్రభుత్వ దళాలతో పోరాడుతూ ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ అగ్రనేత అబు బకర్ అల్ బగ్దాదీ కుమారుడు హుథయ్ఫా అల్ బద్రీ మృతి చెందినట్లు ఐఎస్ ప్రకటించింది. ఈ మేరకు బద్రీ మరణం గురించి తమ సోషల్ మీడియా అకౌంట్లలో మంగళవారం రాత్రి వెల్లడించింది. ఓ అస్సాల్ట్ రైఫిల్ను పట్టుకుని ఉన్న యువకుడి ఫొటోను కూడా చూపుతూ అతడి పేరును హుథయ్ఫా అల్ బద్రీగా పేర్కొంది. సెంట్రల్ సిరియన్ ప్రావిన్స్ ఆఫ్ హోమ్స్లోని థర్మల్ విద్యుత్ కేంద్రం వద్ద సిరియా, రష్యా బలగాలతో పోరాడుతూ చనిపోయినట్లు తెలిపింది. అయితే ఎప్పుడు హతమయ్యాడనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ‘ఇంఘిమసీ ఆపరేషన్’లో భాగంగా బద్రీ హతమైనట్లు ఐఎస్ తెలిపింది. సంప్రదాయ ఆత్మాహుతి బాంబింగ్ మెషీన్లకు ‘ఇంఘిమసీ ఆపరేషన్’ కొంత భిన్నంగా ఉంటుంది. పాత ఆత్మాహుతి దాడుల్లో భాగంగా లక్ష్యాలను చేరుకున్న వెంటనే సూసైడ్ బాంబర్లు తమను తాము పేల్చేసుకుంటారు. ఇంఘిమసీ ఆపరేషన్లో మాత్రం జిహాదిస్టులు తమ వద్ద ఉన్న తుపాకీలు, గ్రెనేడ్లు పూర్తయ్యే వరకు పోరాడతారు. అవి అయిపోగానే తమను తాము పేల్చేసుకుంటారు. -
ఇరాక్లో ఇస్లామిక్ స్టేట్ ఘాతుకం
బాగ్దాద్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రసంస్థకు చెందిన ఓ సూసైడ్ బాంబర్ ఆత్మాహుతి దాడిలో 31 మంది మృతిచెందారు. ఈ ఘటన ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఇరాక్ పోలీసుల కథనం ప్రకారం.. నార్త్ బాగ్దాద్ ఏరియాలో మృతిచెందిన వ్యక్తి అంత్యక్రియల నిమిత్తం వందలాది మంది వచ్చారు. సరిగ్గా మధ్యాహ్నం సమయంలో ఆ ప్రాంతంలో ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. దీంతో మొత్తం 31 మంది మృత్యువాత పడగా, మరో 65 మందికి పైగా గాయాలపాలైనట్లు తెలిపారు. గాయపడ్డవారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని, అయితే బాధితులు ఈ ఘటనపై నోరు విప్పే పరిస్థితిలో లేరని అధికారులు చెప్పారు. గాయపడ్డవారిలో కొందరి పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. నార్త్ బాగ్దాద్, మోసుల్ పట్టణంలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై ఇరాక్ భద్రతా బలగాలు దాడులు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఈ ఆత్మాహుతి దాడి జరిగిందని ఓ సిబ్బంది స్థానిక మీడియాకు తెలిపారు. -
గొడ్డలితో దాడిచేసింది మావాడే
బెర్లిన్: జర్మనీలో ఉగ్రవాదదాడికి తమదే బాధ్యతని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఈ దాడి జరిగిన కొన్ని గంటల తర్వాత ఐసిస్ ఈ మేరకు ప్రకటించింది. సోమవారం అర్ధరాత్రి రైలు ట్రూచిన్జెన్ నుంచి వువర్జ్బర్గ్ వెళ్తుండగా ఓ యువకుడు కత్తి, గొడ్డలితో ప్రయాణికులపై దాడి చేశాడు. ఈ దాడిలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న జర్మనీ భద్రత సిబ్బంది రంగంలోకి దిగి... యువకుడిని కాల్చి చంపాయి. దాడికి పాల్పడిన యువకుడిని 17 ఏళ్ల శరణార్థిగా భద్రత దళాలు గుర్తించాయి. రెండేళ్ల క్రితం జర్మనీకి వచ్చాడు. ఈ యువకుడు ఇస్లామిక్ స్టేట్ ఫైటర్ అని ఆ సంస్థ వెల్లడించింది. బాంబులు, తుపాకీలతో దాడులు చేసే ఐఎస్ ఉగ్రవాదులు ఇటీవల విభిన్న మార్గాల్లో దాడులకు పాల్పడుతున్నారు. ఫ్రాన్స్లోని నీస్ నగరంలో ఇటీవల ఉగ్రవాదులు జనసమూహంపై ట్రక్ నడిపారు. ఈ దాడిలో 84 మంది మరణించగా, చాలా మంది గాయపడ్డారు. ఈ దాడికి పాల్పడింది తామేనని ఐసిస్ ప్రకటించింది. తాజాగా జర్మనీలో కత్తి, గొడవలితో ఉగ్రవాది దాడి చేశాడు. -
ఉపవాసం విరమించారని ...
బీరూట్: ఆ ఇద్దరు ముస్లిం యువకులు ఆహారం తీసుకున్నారు. అది రంజాన్ వేళల్లో... ఆ విషయం ఐఎస్ సంస్థకు చెందిన ఉగ్రవాదులకు తెలిసింది. అంతే అగ్గి మీద గుగ్గిలమయ్యారు. సదురు యువకులిద్దరిని ఐఎస్ ఉగ్రవాదులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని స్తంభాలకు కట్టేసి రాత్రి వరకు అలాగే ఉంచాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా వారికి శిక్షను అమలు చేశారు. అంతేకాకుండా ముస్లిం పవిత్ర మాసమైన రంజాన్ని వీరిద్దరు అత్రికమించారని ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ ఘటన బీరూట్ డైయిర్ ఈజోర్ ప్రావిన్స్లోని మాయాదీన్ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. ఈ మేరకు సిరియాకు చెందిన మానవహక్కుల సంఘ పర్యవేక్షకులు మంగళవారం వెల్లడించారు. ఈ ఇద్దరు ముస్లిం యువకులు 18 ఏళ్ల కంటే చిన్నవారేనని స్పష్టం చేసింది. ముస్లిం పవిత్ర మాసం రంజాన్ గత గురువారం ప్రారంభమైంది. ముస్లింలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఆ మాసంలో ఉదయం నుంచి సూర్యాస్తమయం వరకు నీరు, ఆహారం తీసుకోకుండా ఉంటారన్న విషయం తెలిసిందే. అయితే ఇద్దరు యువకులు రంజాన్ నియమ నిబంధనలను అత్రికమించడంతో ఐఎస్ ఉగ్రవాద సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. రంజాన్ నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఐఎస్ ఈ విధంగా ముస్లింలను హెచ్చరించింది. -
ఐఎస్ అధీనంలో కీలక నగరం
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement