-
రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు!
* 1.20 కోట్ల ఎకరాలకు ఐదేళ్లలో నీరిచ్చేలా రాష్ట్ర సాగునీటి శాఖ ప్రణాళిక * ఏఐబీపీ కింద రూ.7,099 కోట్లు, హర్ ఖేత్ కో పానీ కింద రూ.8వేల కోట్లు * కేంద్రం నుంచి కోరాలని నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగుకు యోగ్యమైన ప్రతీ ఎకరా భూమికి నీటిని అందించేలా రాష్ట్ర సాగునీటి ప్రణాళిక సిద్ధమైంది. మొత్తంగా 1.20 కోట్ల ఎకరాల భూమికి వివిధ పద్ధతుల్లో పూర్తి స్థాయిలో సాగునీరందించేలా కార్యాచరణను తయారు చేశారు. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్వై) లో భాగంగా కేంద్రం తీసుకొచ్చిన ‘హర్ ఖేత్ కో పానీ’, ‘పర్ డ్రాప్-మోర్ క్రాప్’, వాటర్షెడ్ డెవలప్మెంట్, గ్రామీణ ఉపాధి హామీ పథకం, సత్వర సాగునీటి ప్రాయోజిత కార్యక్రమం (ఏఐబీపీ) పథకాలను ఉపయోగించుకొని, వాటికింద ఇచ్చే నిధులను రాబట్టుకునేందుకు వీలుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ, నీటి పారుదల శాఖ, గ్రామీణాభివధ్ధి శాఖలు కలిసి సంయుక్తంగా జిల్లాల వారీ ప్రణాళికలను సిద్ధం చేశాయి. వీటికి రాష్ట్ర స్టాండింగ్ కమిటీ ఆమోదముద్ర వేయగా, ఒకట్రెండు రోజుల్లో ఈ నివేదికను కేంద్రానికి పంపనున్నారు. కొత్తగా చేపట్టిన పీఎంకేఎస్వై కింద ‘ప్రతి సాగుభూమికి నీరు’ పథకంలో భాగంగా రాష్ట్ర సమగ్ర సాగునీటి ప్రణాళికను సిద్ధం చేయాలని గతంలోనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆదేశించింది. దేశ వ్యాప్తంగా ఎక్కువగా బోర్లు, బావుల కిందే వ్యవసాయ భూమి సాగులో ఉండగా, భూగర్భ జలాలు తగ్గడంతో పంటల విస్తీర్ణం తగ్గి ఉత్పాదకత పడిపోతోంది. ఈ దృష్ట్యా పీఎంకేఎస్వై పథకాన్ని తెరపైకి తెచ్చిన కేంద్రం.. సాగు భూమి విస్తీ ర్ణం పెంచాలని నిర్ణయం తీసుకుంది. రానున్న ఐదేళ్లలో దీనికోసం రూ.50 వేల కోట్ల మేర నిధులు కేటాయించేందుకు సిద్ధమని ప్రకటిం చింది. ఈ నేపథ్యంలో కేంద్రం మార్గదర్శకాల కు అనుగుణంగా జిల్లాల్లో సాగు యోగ్యమైన భూ విస్తీర్ణం ఎంత, ఇప్పటికే జరుగుతున్న సాగు విస్తీర్ణం ఎంత, ఇందులో బోర్లు, బావు లు, భారీ, మధ్య, చిన్నతరహా ప్రాజెక్టుల కింద సాగు జరుగుతున్న ఆయకట్టు ఎంత, మిగతా ప్రాంతాన్ని సాగులోకి తెచ్చేందుకు ఎలాంటి కార్యాచరణ అమలు చేయాలన్న దానిపై రాష్ట్ర నీటి పారుదల శాఖ కసరత్తు పూర్తి చేసి నివేదిక తయారు చేసింది. 1.20 కోట్ల ఎకరాలకు సాగునీటిని అందించేలా కార్యాచరణ పూర్తి చేసింది. దీనికోసం ఏఐబీపీ కింద చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణాల పూర్తికి రూ.7.099 కోట్లు, హర్ ఖేత్ కో పానీ పథకం కింద రూ.8 వేల కోట్లు కేటాయించాల్సిందిగా కేంద్రాన్ని కోరేందుకు నిర్ణయించింది. ఇందు లో రూ.5వేల కోట్లను మిషన్ కాకతీయ పనులకు ఖర్చు చేయనున్నారని తెలిసింది. -
1.42 లక్షల కోట్లతో ‘సాగు’దాం!
- 1.68 కోట్ల ఎకరాలకు ఐదేళ్లలో నీరిచ్చేలా రాష్ట్ర సాగునీటి ప్రణాళిక - సాగునీటి ప్రాజెక్టులు, వాటర్షెడ్, సూక్ష్మసేద్యం పథకాల ద్వారా... - ప్రధానమంత్రి కృషి సించయ్ యోజన కింద అమలుకు నిర్ణయం - 24న కేంద్రానికి నివేదిక సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరా భూమికి నీరందించేలా రాష్ట్ర సాగునీటి ప్రణాళిక సిద్ధమైంది. మొత్తంగా 1.68 కోట్ల ఎకరాలకు నీరందించే కార్యాచరణ తయారైంది. ప్రధానమంత్రి కృషి సించయ్ యోజన(పీఎంకేఎస్వై) పథకంలో భాగంగా కేంద్రం తీసుకొచ్చిన ‘హర్ ఖేత్ కో పానీ’, ‘పర్ డ్రాప్-మోర్ క్రాప్’, వాటర్షెడ్ డెవలప్మెంట్, గ్రామీణ ఉపాధి హామీ పథకం, సత్వర సాగునీటి ప్రాయోజిత కార్యక్రమం(ఏఐబీపీ) పథకాలను ఉపయోగించుకొని, వాటి కింద ఇచ్చే నిధులను రాబట్టుకునేందుకు వీలుగా జిల్లాల వారీ ప్రణాళికలను వ్యవసాయ శాఖ, నీటి పారుదల శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖలు కలసి సంయుక్తంగా సిద్ధం చేశాయి. ఈ నెల 24న రాష్ట్ర సాగునీటి ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలోని కృషి భవన్లో జరిగే సమావేశంలో పీఎంకేఎస్వై పథకానికి నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న కేంద్ర వ్యవసాయ శాఖకు అందజేయనుంది. ప్రతి ఎకరాకు నీరు నీటి పారుదల శాఖ నివేదిక ప్రకారం.. రాష్ట్రంలో మొత్తంగా 2.87 కోట్ల ఎకరాల భూ విస్తీర్ణం ఉండగా, అందులో సాగు యోగ్యభూమి 1.68 కోట్ల ఎకరాలు ఉంది. ఇందులో గోదావరి పరీవాహకం పరిధిలో 1.56 కోట్లు, కృష్ణా పరిధిలో 1.31 కోట్ల ఎకరాలు ఉంది. ప్రస్తుతం ఇందులో 60 లక్షల ఎకరాలకు సాగు నీరందుతుండగా, మరో 52 లక్షల ఎకరాలకు నీరందించేలా ప్రాజెక్టుల నిర్మాణం ప్రభుత్వం చేపట్టింది. అయితే వివిధ పథకాల ద్వారా సాగు యోగ్యమయ్యే ప్రతి ఎకరాకు అంటే 1.68 కోట్ల ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయించిన కేంద్రం.. వివిధ పథకాలను తీసుకొచ్చింది. ఈ పథకాలను ఉపయోగించుకుంటూ జిల్లాల వారీగా ఐదేళ్ల ప్రణాళికను నీటి పారుదల శాఖ సిద్ధం చేసింది. ఈ కార్యక్రమం అమలుకు మొత్తంగా 1.42 లక్షల కోట్ల వ్యయం ఈ ఐదేళ్లలో చేయాల్సి ఉంటుందని లెక్కగట్టారు. ఇందులో ఏఐబీపీ కింద రూ. 58,953.23 కోట్లు, హర్ కేత్కో పానీ పథకం కింద రూ. 30,884.13 కోట్లు, పర్ డ్రాప్-మోర్ క్రాప్ కింద రూ.16,498.98 కోట్లు, వాటర్షెడ్ పథకాల కింద రూ.7,400.11 కోట్లు, రాష్ట్ర ప్రణాళిక నుంచి రూ.20,749.38 కోట్ల వ్యయ అంచనా వేశారు. ఒక్కో పథకం కింద వృద్ధి చేసే ఆయకట్టు వివరాలను అందులో పొందుపరిచారు. ఇందులో ఏఐబీపీ పథకాల ఖర్చు నీటి పారుదల శాఖ ద్వారా జరగనుండగా, హర్ కేత్కో పానీ నిధులను చిన్న నీటి పారుదల శాఖ, పర్ డ్రాప్-మోర్క్రాప్ నిధులను ఉద్యాన శాఖ, వాటర్షెడ్ పథకాల నిధులను గ్రామీణాభివృద్ధి శాఖ సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఈ మొత్తం నిధుల్లో రూ.67,136.75 కోట్లను పీఎంకేఎస్వై పథకంలో భాగంగా రాష్ట్రం తన వాటా కింద ఖర్చు చేయనుండగా మిగతా నిధులకు కేంద్రం సహకా రం అందించాల్సి ఉం టుంది. కేంద్రం ఏ మేరకు సహకారం అందిస్తున్న దానిపై ఇప్పుడే స్పష్టత ఇవ్వలేమని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. కసరత్తు పూర్తి... కేంద్ర ప్రభుత్వం కొత్తగా చేపడుతున్న పీఎంకేఎస్వై కింద ‘ప్రతి సాగుభూమికి నీరు’ పథకంలో భాగంగా రాష్ట్ర సమగ్ర సాగునీటి ప్రణాళికను సిద్ధం చేయాలని ఈ ఏడాది జనవరిలో కేంద్రం రాష్ట్రాన్ని ఆదేశించింది. రానున్న ఐదేళ్లలో దీనికోసం రూ.50 వేల కోట్ల మేర కేటాయించేందుకు సిద్ధమని ప్రకటించింది. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగానే జిల్లాలో సాగు యోగ్యమయ్యే భూ విస్తీర్ణం, సాగు విస్తీర్ణం , ఇందులో బోర్లు, బావులు, భారీ, మధ్య, చిన్నతరహా ప్రాజెక్టుల కింద సాగు జరుగుతున్న ఆయకట్టు, మిగతా ప్రాంతాన్ని సాగులోకి తెచ్చేందు కు ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలనే అంశాలపై నీటిపారుదల శాఖ కసరత్తు పూర్తి చేసింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
తప్పక చదవండి
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- ముస్లిం రిజర్వేషన్లే రద్దు
- ‘నల్లసూరీడు’పై నజర్
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
Advertisement