-
ఇంటర్నెట్ వినియోగదారుల్లో ఏపీ టాప్
సాక్షి, అమరావతి: అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వేగంగా అందిపుచ్చుకుంటున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. గత నాలుగేళ్లలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంటర్నెట్ వినియోగంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. ఇంటర్నెట్ వినియోగం, ఇంటర్నెట్ సబ్్రస్కిప్షన్లలో దేశంలో అన్ని రాష్ట్రాలను మించిపోయింది. ఈ విషయాన్ని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాలు అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన 2022–23 సుస్థిర ప్రగతి లక్ష్యాల పురోగతి నివేదిక వెల్లడించింది. దేశం మొత్తం ప్రతి వంద మంది జనాభాకు 59.97 ఇంటర్నెట్ సబ్్రస్కిప్షన్లు ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతీ వంద మంది జనాభాకు 120.33 ఇంటర్నెట్ సబ్స్క్రిప్షన్లు ఉన్నాయని నివేదిక వెల్లడించింది. దేశ సగటు, ఇతర రాష్ట్రాలకంటే ఎక్కువగా రాష్ట్రంలో ఇంటర్నెట్ వినియోగం ఉన్నట్లు నివేదిక తెలిపింది. దేశం మొత్తం 2018–19లో ప్రతి వంద మందికి 47.94 ఇంటర్నెట్ సబ్్రస్కిప్షన్లు ఉండగా ఇప్పుడు 59.97కు పెరిగాయి. రాష్ట్రంలో 2018–19లో ప్రతి వంద మందికి 94.59 సబ్్రస్కిప్షన్లు ఉండగా 2022–23 నాటికి 120.33 సబ్్రస్కిప్షన్లకు పెరగడం గమనార్హం. మరే ఇతర రాష్ట్రాల్లోనూ ఇంత పెద్ద సంఖ్యలో సబ్్రస్కిప్షన్లు లేవు. ఆంధ్రప్రదేశ్ తరువాత కేరళలో అత్యధికంగా సబ్్రస్కిప్షన్లు ఉన్నట్లు నివేదిక పేర్కొంది. కేరళలో ప్రతి వంద మందికి 87.50 సబ్్రస్కిప్షన్లు ఉన్నాయి. ఆ తరువాత పంజాబ్లో 85.97 సబ్్రస్కిప్షన్లు ఉన్నాయి. పశ్చిమబెంగాల్లో అత్యల్పంగా 41.26 సబ్్రస్కిప్షన్లు ఉన్నట్లు నివేదిక పేర్కొంది. రాష్ట్రంలో 2019–20 నుంచి ఇంటర్నెట్ సబ్్రస్కిప్షన్లు పెరుగుతూనే ఉన్నాయి. 2021–22లో అంతకు ముందు సంవత్సరానికన్నా కొంత మేర తగ్గినప్పటికీ మరుసటి ఏడాది పెరిగాయి. -
నెట్ ఇంట పల్లెలు
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ భారతంలో ‘ఇంటర్నెట్’వేగంగా విస్తరిస్తోంది. 2022 సంవత్సరంలో దేశవ్యాప్తంగా గ్రామాల్లో 40 శాతం ఇంటర్నెట్ వినియోగం పెరిగినట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. దేశంలో ప్రస్తుతం 72 కోట్ల క్రియాశీల ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారని తేల్చిన సర్వే... వారిలో గ్రామాల్లో 42.5 కోట్ల మంది, పట్టణాల్లో 29.5 కోట్ల మంది వినియోగదారులు ఉన్నట్లు తెలిపింది. ఈ మేరకు ప్రముఖ పరిశోధన సంస్థ నీల్సెన్ ‘ఇండియా ఇంటర్నెట్ రిపోర్ట్–2023’ని విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 30 వేల మందిపై సర్వే చేపట్టి ఈ వివరాలు వెల్లడించింది. దేశవ్యాప్తంగా చూస్తే 12 ఏళ్లకు పైబడిన 45 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్లు వీడియో కంటెంట్ల వీక్షణ, కాలింగ్లో నిమగ్నమవుతున్నట్లు అధ్యయనంలో స్పష్టమైంది. మొత్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కలిపి చూస్తే మహిళల ఇంటర్నెట్ వినియోగంలో 35 శాతం వృద్ధి నమోదైనట్లు నివేదిక తెలిపింది. నివేదికలో ఏముందంటే... ♦ మహిళలు, గ్రామీణ భారతం, అల్పఆదాయవర్గాల ఇళ్లలో ఇంటర్నెట్ యూజర్లు వేగంగా పెరుగుతున్నారు. సగం గ్రామీణ భారతం ఆన్లైన్ సేవల వినియోగంలో 2021తో పోలిస్తే 2022లో నెట్ వాడకం 40 % పెరిగింది. ♦ అదే కాలానికి మహిళల నెట్ వినియోగం 35%, విద్య, ఆదాయపరంగా చివరగా ఉన్న వర్గాల్లో 30% పెరిగింది. ♦ స్మార్ట్ఫోన్ల ద్వారా సమాచారం, వీడియోలషేరింగ్ అధికంగా కొనసాగుతోంది. ♦ 2021తో పోలిస్తే 43% డిజిటల్ పేమెంట్స్ పెరిగాయి ♦ ప్రాంతీయ భాషల ప్లాట్ఫామ్ల పెరుగుదలతో వీడియోల వీక్షణ పెరిగింది. ♦ షార్ట్ వీడియోలు, మ్యూజిక్ల వ్యాప్తిలో వృద్ధి నమోదైంది. ♦ మొత్తం ఇంటర్నెట్ యూజర్లలో 90% రోజువారీ ఉపయోగిస్తున్నవారే. ♦ ప్రతి ముగ్గురిలో ఒకరు బ్యాంకింగ్, ఇతర చెల్లింపుల కోసం నెట్ను వాడుతున్నారు. ♦ గ్రామీణ భారతంలో 8.5 కోట్ల మంది షేరింగ్ ద్వారా ఇతరులతో కలిసి వీడియోలు వీక్షించడంతోపాటు ఆన్లైన్ క్లాసులకు హాజరవుతున్నారు. ♦ తక్కువ ధర హ్యాండ్సెట్ల ద్వారా అత్యధికంగా స్మార్ట్ఫోన్ షేరింగ్ అవుతోంది. ♦ కామ్స్టోర్ డేటా ప్రకారం యూట్యూబ్కు 46.3 కోట్ల మంది యునిక్ విజిటర్స్ ఉన్నారు. ♦ మెటా (ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్ట్రాగామ్ కలిపి)కు 30 కోట్ల నుంచి 50 కోట్ల మంది యూజర్లు ఉండగా ఆయా యాప్ల వినియోగాన్ని బట్టి యూజర్లు పెరుగుతున్నారు. -
సైబర్ క్రైమ్: పిల్లలు ఏం చూస్తున్నారు?
సురేష్ ఇంటికి వస్తూనే వందన మీద కేకేశాడు ‘మన పర్సనల్ ఫొటోలు సోషల్మీడియాలో ఎందుకు పోస్ట్ చేశావ’ని. వందన తన ఫోన్ తీసుకొని చెక్ చేసింది. భర్త చెప్పింది నిజమే. కొడుకు వీడియో గేమ్ ఆడుకుంటానని అదేపనిగా విసిగిస్తుంటే తన మొబైల్ ఫోన్ ఇచ్చింది. ఎని మిదేళ్ల కొడుకు చేసిన నిర్వాకానికి తలకొట్టేసినట్లయ్యింది. సోషల్ మీడియాలో అప్లోడ్ అయిన ఫొటోలు తొలగించి ఊపిరి పీల్చుకుంది. ఎందుకలా చేశావని అడిగితే తనకేమీ తెలియదని ఆటలో మునిగిపోయిన కొడుకును చూస్తూ ‘ఇక నుంచి వీడిని ఫోన్ ముట్టకోనివ్వకూడద’ ని గట్టిగా నిర్ణయించుకుంది. (పేర్లు మార్చడమైది). సురేశ్, వందన విషయంలోనే కాదు పిల్లలున్న ప్రతి ఇంట్లో డిజిటల్ వినియోగంపై తల్లిదండ్రుల్లో ఆందోళన రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. ఊహ తెలియని పిల్లలు ఆన్లైన్లో ఏం చేస్తున్నారో, ఏం చూస్తున్నారో... అనే ఆందోళన ఎక్కువయ్యింది. బడి పాఠాలు కూడా డిజిటల్లోకి మారాక ఇంటర్నెట్ వాడకం పిల్లల్లోనూ పెరిగింది. ఇలాంటప్పుడు పిల్లలకు ఏది మంచి, ఏది చెడు తెలియజేయాల్సిన అవసరం తల్లిదండ్రులకు తప్పక ఉంది. డిజిటల్ శ్రేయస్సు... ఈ రోజుల్లో పిల్లల స్మార్ట్ ఫోన్ స్క్రీన్ సమయాన్ని నియంత్రించడం కష్టమైన పనే. 7నుంచి 13 ఏళ్ల పిల్లలు చాలా రకాల సోషల్ నెట్వర్కింగ్ సైట్లను ఉపయోగిస్తున్నారు. డిజిటల్ శ్రేయస్సు విషయంలో అన్ని వయసుల వారికి అత్యంత ప్రాధాన్యత ఉంది. అలాగే, డిజిటల్ టెక్నాలజీతో మెరుగైన సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ప్రమాదాలు, జాగ్రత్తలపై అవగాహన కలిగి ఉండటం తప్పనిసరి. మన దగ్గరి డేటా.. మన దేశంలో 2021లో ఇంటర్నెట్, సోషల్ మీడియాను వినియోగించేవారి సంఖ్య దాదాపు 1.39 బిలియన్ల జనాభా ఉంది. 1.10 బిలియన్లకు మొబైల్ కనెక్షన్కి యాక్సెస్ ఉంది. వీరిలో 624 మిలియన్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు. 448 మిలియన్ల మంది యాక్టివ్ సోషల్ మీడియా వినియోగదారులు. సగటు ఇంటర్నెట్ వినియోగం రోజుకు 6.36 గంటలు అయితే సోషల్ మీడియా వినియోగం 2.25 గంటలు. మ్యూజిక్ స్ట్రీమింగ్ సేవలను వినడానికి వెచ్చించిన సగటు సమయం 1.53 గంటలు. గేమింగ్లో గడిపే సగటు సమయం 1.20 గంటలు. 16 నుండి 64 సంవత్సరాల మధ్య వయస్సు గల ఇంటర్నెట్ వినియోగదారులలో 92.8% మంది వీడియో గేమ్లు ఆడుతున్నారని నివేదికలు ఉన్నాయి. మార్గదర్శకాలు తప్పనిసరి... ఈ రోజుల్లో పిల్లలు సెకండరీ స్కూల్కి వెళ్లడంతోనే మరింత స్వతంత్రులు అవుతున్నారు. వైవిధ్యమైన అలవాట్లతో మరింత నమ్మకంగా ఇంటర్నెట్ వినియోగదారులుగా మారుతున్నారు. తల్లిదండ్రులు యాప్ ద్వారా కొనుగోళ్లను ఆపేయాలి. పిల్లలతో తరచూ ఇంటర్నెట్ భద్రత గురించి మాట్లాడాలి. పిల్లలకు వ్యక్తిగతం కాకుండా కుటుంబ ఇ–మెయిల్ను సెట్ చేయాలి. వీడియోగేమ్ల రేటింగ్, వయసు బార్లను తనిఖీ చేయాలి. పెద్దలకు చిట్కాలు... ∙పిల్లలు స్క్రీన్ని ఎక్కువగా వాడుతున్నారని టెక్నాలజీ యాక్సెస్ను బ్లాక్ చేయవద్దు. అంటే, ఫోన్లు లాగేసుకోవడం, ఇంటర్నెట్ కట్ చేయడం.. చేయకూడదు. ∙ పిల్లలకు ఇష్టమైన యాప్లు, సైట్లపై మీరూ ఆసక్తి చూపండి. ∙కొన్ని పరిమితులను సెట్ చేయడానికి కంటెంట్ ఫిల్టర్ సాఫ్ట్వేర్లను వాడచ్చు. ∙పడకగది, భోజన సమయం, ప్రయాణంలో.. ఇంటర్నెట్ను వాడద్దని కుటుంబమంతటికీ పరిమితిని నిర్ణయంచండి. ∙ఆన్లైన్లో ఏ వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేయ కూడదో/ఓవర్షేర్ చేయకూడదో తప్పనిసరిగా నేర్పించాలి. ∙ఆఫ్ స్క్రీన్ సమయం, ఆన్స్క్రీన్ సమయాన్ని బ్యాలెన్స్ చేయడం నేర్పాలి. ∙వయసు పరిమితులు (ఉదా: 18 ఏళ్లు) ఉన్న సైట్లకు సైన్ అప్ చేయడానికి మీ చిన్నారికి ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వవద్దు. అవసరం, అవగాహన లేని సమాచారం ఇవ్వాలనుకోకూడదు. పెద్దలు వేసుకోదగిన ప్రశ్నలు ► మీ పిల్లలు ఆన్లైన్ ద్వారా ఎవరితో సంప్రదింపులు జరుపుతున్నారో, ఎందుకు జరుపుతున్నారో, ఈ పరస్పరచర్య నుండి వారు ఏం పొందుతున్నారో .. తెలుసుకోవడం ముఖ్యం. ► ఆన్లైన్లో ఏ సమాచారం గురించి వెతుకుతున్నారు. అందుకు వారు ఉపయోగించే సాధనాలు ఏమిటి, వాటి మూలాలు ఏమిటి.. తనిఖీ చేయడం అవసరం. ► మీ డిజిటల్ కార్యకలాపాల మంచి, చెడు తెలిసే విధానం ఏమిటి, వాటి ప్రభావం పిల్లల మీద ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. ∙పిల్లలు తమ చుట్టూ ఉన్నంత సురక్షితంగా, ఆన్లైన్ వేదికల్లో ఉన్నారా. ఈ తరహా డిజిటల్ శ్రేయస్సుపై అవగాహన, అభ్యాసం ఎప్పుడూ ఆగిపోకూడదు. అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
వన్ ట్రిలియన్ దిశగా ఇంటర్నెట్ ఆర్ధిక వ్యవస్థ, ఆమూడు వర్గాల ప్రజలే కీలకం!
Indian Internet Economy 2030 Forecast: మనదేశ ఇంటర్నెట్ ఆర్థిక వ్యవస్థ 2030 నాటికి వన్ ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారుతుందని ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ రెడ్సీర్ అంచనా వేసింది. రెడ్సీర్ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం గతేడాది 50శాతం వృద్ధితో ముందుకు సాగిన దేశ ఇంటర్నెట్ ఆర్థిక వ్యవస్థ 2030 నాటికి వన్ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారనుంది. ఇంటర్నెట్ వ్యాప్తి రేటు హై-స్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్,పెరిగిన ఆన్లైన్ షాపింగ్, డిజిటల్ కంటెంట్ వినియోగంతో ఆర్ధిక వ్యవస్థ వేగవంతం అయ్యేందుకు ఆజ్యం పోసినట్లు అధ్యయనం తెలిపింది. ►రెడ్సీర్ సీఈఓ, వ్యవస్థాపకుడు అనిల్ కుమార్ మాట్లాడుతూ..వన్ ట్రిలియన్ వినియోగదారుల ఇంటర్నెట్ ఆర్థిక వ్యవస్థకు ఇ-టైలింగ్, ఇ-హెల్త్, ఫుడ్టెక్, ఆన్లైన్ మొబిలిటీ, క్విక్ కామర్స్ వంటి రంగాలు వినియోగ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాదిని సృష్టించడానికి కారణమైందని అన్నారు. ►ఈ సందర్భంగా నివేదిక దేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల్ని మూడు విభాగాలు విభజించింది. ఈ మూడు వర్గాలకు చెందిన ప్రజల అవసరాలు, వారి జీతభత్యాలు, ఇంటర్నెట్ తో ఎలాంటి అవసరం ఉంది? ఇంటర్నెట్ తో వారి సమస్యల్ని ఎలా పరిష్కరించవచ్చు. ఇలా పలు అంశాల ఆధారంగా ఇంటర్నెట్ ఆర్ధిక వ్యవస్థ ఎలా వృద్ధి సాధిస్తుందో రెడ్సీర్ నివేదికను విడుదల చేసింది. ►వాటిలో మొదటిది మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో నివసించే 80-100 మిలియన్ల జనాభా కలిగిన మనదేశానికి చెందిన వాళ్లు సంవత్సరానికి 12వేల డాలర్ల(రూ.9,04,182.00 ఇండియన్ కరెన్సీ ) కంటే ఎక్కువ వార్షిక ఆదాయాన్ని పొందుతారు. ►రెండవ విభాగంలో 100-200 మిలియన్ల జనాభా ఉన్న వీరు సంవత్సరానికి 5వేల నుండి 12వేల డాలర్ల వరకు వరకు పొందేవారు. ►మూడవ వర్గం 400-500 మిలియన్ల జనాభా కలిగిన గ్రామీణ ప్రాంతాలు, టైర్-2 నగరాలు. వీరు ప్రాథమిక వార్షిక ఆదాయం 5వేలడాలర్లు ( రూ.3,76,742.50 ఇండియన్ కరెన్సీ). ఇంటర్నెట్ ఆర్ధిక వ్యవస్థ మరింత అభివృద్ధి చెందడానికి సహాయపడే విభాగం.వారి సమస్యలను పరిష్కరించేలా వారికి సహాయం చేసేందుకు ఇంటర్నెట్ చాలా అవసరమని రెడ్ సీర్ తెలిపింది. ►ఈ మూడు విభాగాలకు చెందిన ప్రజల జీవన విధానం ఇంటర్నెట్ ఆర్ధిక వ్యవస్థ పుంజుకుంటుందని రెడ్ సీర్ రిపోర్ట్ హైలెట్ చేసింది. -
ఒక్క నిమిషానికి ఇంటర్నెట్లో జరిగే విధ్వంసం గురించి తెలుసా?
ఇంటర్నెట్ ఒక గ్లోబల్ కంప్యూటర్ నెట్వర్క్. ఈ భూమ్మీద అతిపెద్ద కమ్యూనికేషన్ వ్యవస్థ. యూజర్లకు వివిధ రకాల సమాచారంతో పాటు పరస్పర సంభాషణల కోసం సౌకర్యాలు అందిస్తున్న వేదిక. అలాంటి వేదికపై ఒక్క నిమిషంలో జరిగే విధ్వంసం ఎలా ఉంటుందో తెలుసా? వరల్డ్ ఎకనమిక్ ఫోరం వెబ్సైట్ తాజాగా ఓ కథనాన్ని ప్రచురించింది. 2021లో వివిధ ఇంటర్నెట్ ప్లాట్ఫామ్స్(సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను కలిపి)లో ఒక్క నిమిషంలో ఏమేం జరిగిందో వివరించింది. బ్రౌజింగ్, స్ట్రీమింగ్, అప్లోడ్, డౌన్లోడ్.. ఇలా మొత్తం వివరాల ఆధారంగా ఈ డేటాను సేకరించి లోరీ లూయిస్ అనే ఆవిడ.. ఈ వివరాల్ని ఆల్యాక్సెస్ వెబ్సైట్లో పొందుపరిచింది. వీటి ఆధారం ఏం తేలిందంటే.. యూట్యూబ్.. 500 గంటల నిడివి ఉన్న కంటెంట్ కేవలం ఒక్క నిమిషంలోనే అప్లోడ్ అయ్యింది. ఇంటర్నెట్లో 197 మిలియన్లకు పైగా ఈమెయిల్స్ పంపించుకుంటున్నారు. వాట్సాప్, ఫేస్బుక్ మెసేంజర్లలో నిమిషానికి 69 మిలియన్ల మెసేజ్లు పంపించుకున్నారు. ఇన్స్టాగ్రామ్లో నిమిషానికి దాదాపు ఏడు లక్షల స్టోరీలు షేర్ అవుతున్నాయి. ప్రొఫెషనల్ సైట్ లింక్డిన్లో సుమారు పదివేల మంది కనెక్ట్ అవుతున్నారు. టిక్టాక్ లాంటి వీడియో కంటెంట్ జనరేటింగ్ యాప్లో ఐదు వేల డౌన్లోడ్లు చేస్తున్నారు నెట్ఫ్లిక్స్లో నిమిషానికి 28 వేలకు పైగా సబ్స్క్రయిబర్స్ వీక్షణ కొనసాగుతోంది. నోట్: మరికొన్ని అంశాలపై పరిశోధన జరిగినప్పటికీ.. పూర్తి స్థాయి లెక్కలు తేలకపోవడంతో ఈ లిస్ట్లో జత చేర్చలేదు. ఆన్లైన్ షాపింగ్, మరికొన్ని ప్లాట్ఫామ్ల వివరాలు పొందుపర్చలేదు. ఇది కేవలం ఆల్యాక్సెస్ డేటా మాత్రమే!. ►ఇంటర్నెట్ ఉపయోగం వల్ల లాభాలు మాత్రమే కాదు.. భూమ్మీదకు కర్బన ఉద్గారాలు విడుదలై వినాశం వైపు అడుగులు కూడా వేస్తోంది. అందుకే ఇంటర్నెట్ యూసేజ్ను తగ్గించాలని, పరిమితంగా వాడాలని సూచిస్తున్నారు పర్యావరణ నిపుణులు. ►ఇంటర్నెట్లో డాటాను లెక్కించడం కష్టమే!. ఒక అంచనా ప్రకారం మాత్రం.. ఒకరోజులో 1.145 ట్రిలియన్ ఎంబీ క్రియేట్ అవుతోంది. చదవండి: మళ్లీ అదే అంధకారమా!.. 20 ఏళ్లు వెనక్కి వెళ్లక తప్పదా?
Pagination
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
కాంగ్రెస్ మేనిఫెస్టో వెనుక విదేశీ హస్తం: కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
- స్టార్ హీరోయిన్ నుంచి కాంట్రవర్సీల వరకు.. సమంత గురించి ఇవి తెలుసా?
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
- Road Accident: నక్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
- Weekly Horoscope: ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అన్న విధంగా ఉంటుంది
- Today Telugu Horoscope: ఈ రాశి వారు శుభకార్యాలలో పాల్గొంటారు
- శక్తులన్నీ ఏకమయ్యాయి
- ఆ పేరే... ఒక నమ్మకం!
Advertisement