-
Cricket in Olympics: ఒలింపిక్స్లో క్రికెట్
ముంబై: లాంఛనం ముగిసింది. ఎట్టకేలకు క్రికెట్ ఒలింపిక్స్ క్రీడల్లో పునరాగమనం చేయనుంది. 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్తోపాటు స్క్వా‹Ù, బేస్బాల్/సాఫ్ట్బాల్, లాక్రాస్ (సిక్స్–ఎ–సైడ్), ఫ్లాగ్ ఫుట్బాల్ క్రీడాంశాలను కొత్తగా చేర్చారు. ఐదు కొత్త క్రీడాంశాలకు లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో అనుమతి ఇవ్వాలని ఎగ్జిక్యూటివ్ బోర్డు చేసిన ప్రతిపాదనలకు సోమవారం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సభ్యులు ఓటింగ్ ద్వారా ఆమోదం తెలిపినట్లు ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాక్ ప్రకటించారు. 99 మంది ఐఓసీ సభ్యుల్లో ఇద్దరు మాత్రమే ఈ ఐదు క్రీడాంశాల ప్రతిపాదనను వ్యతిరేకించగా... 97 మంది సమ్మతించారు. లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో క్రికెట్ ఈవెంట్ను టి20 ఫార్మాట్లో పురుషుల, మహిళల విభాగాల్లో ఆరు జట్ల మధ్య నిర్వహిస్తారు. ఆతిథ్య దేశం హోదాలో అమెరికా జట్లకు నేరుగా ఎంట్రీ లభిస్తుంది. ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా మిగతా ఐదు జట్లను నిర్ణయించే అవకాశముంది. ► 1877లో క్రికెట్లో తొలి టెస్టు మ్యాచ్ జరిగింది. 1900 పారిస్ ఒలింపిక్స్లో ఒకే ఒకసారి క్రికెట్ మెడల్ ఈవెంట్గా ఉంది. పారిస్ గేమ్స్లో కేవలం ఫ్రాన్స్, బ్రిటన్ జట్లు మాత్రమే పాల్గొన్నాయి. బ్రిటన్ జట్టుకు స్వర్ణం, ఫ్రాన్స్ జట్టుకు రజతం లభించాయి. ఆ తర్వాత క్రికెట్ విశ్వ క్రీడల జాబితాలో చోటు కోల్పోయింది. టెస్టు, వన్డే ఫార్మాట్ల బదులు మూడు, నాలుగు గంటల్లో ఫలితం వచ్చే టి20 ఫార్మాట్ రాకతో క్రికెట్ స్వరూపమే మారిపోయింది. విశ్వవ్యాప్తంగా జరుగుతున్న టి20 లీగ్లు ఎంతోమంది క్రికెటర్లకు కొత్తగా అవకాశాలు కలి్పస్తుండటంతోపాటు ఆరి్థకంగా వారిని ఆదుకుంటున్నాయి. ప్రస్తుతం ఫుట్బాల్ తర్వాత ప్రపంచంలో అత్యధిక ఆదరణ కలిగిన క్రీడగా క్రికెట్కు గుర్తింపు వచ్చింది. ఫలితంగా 128 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు క్రికెట్ ఒలింపిక్స్లో పునరాగమనం చేయనుంది. ► ప్రస్తుతానికి క్రికెట్తోపాటు మిగతా నాలుగు కొత్త క్రీడాంశాలు లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ వరకే పరిమితం కానున్నాయి. తదుపరి ఒలింపిక్స్ క్రీడల్లోనూ క్రికెట్ కొనసాగడమనేది ఆయా దేశాల కార్యనిర్వాహక కమిటీల ఆసక్తిపై ఆధారపడి ఉంది. ఐఓసీ నిబంధనల ప్రకారం ఒలింపిక్స్ క్రీడల ఆతిథ్య దేశానికి తమకు నచి్చన కొన్ని క్రీడాంశాలను అదనంగా చేర్చే వెసులుబాటు ఉంది. 2032 ఒలింపిక్స్ ఆ్రస్టేలియాలోని బ్రిస్బేన్ నగరంలో జరుగుతాయి. 2036 ఒలింపిక్స్ ఆతిథ్యానికి భారత్ ఆసక్తి కనబరుస్తోంది. ఆ్రస్టేలియా, భారత్లో క్రికెట్కు విపరీతమైన ఆదరణ ఉండటంతో 2032, 2036 ఒలింపిక్స్ల్లోనూ క్రికెట్ కొనసాగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ► ‘విశ్వవ్యాప్తంగా 2.5 బిలియన్ అభిమానులు కలిగిన ప్రపంచంలోని రెండో అత్యధిక ఆదరణ కలిగిన క్రికెట్ క్రీడను ఒలింపిక్స్లోకి స్వాగతం పలుకుతున్నాం. అమెరికాలోనూ మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీ ద్వారా ఈ ఆటకు ఆదరణ పెరుగుతోంది. వచ్చే ఏడాది అమెరికా–వెస్టిండీస్ సంయుక్తంగా టి20 ప్రపంచకప్కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. నా మిత్రుడు విరాట్ కోహ్లికి సామాజిక మాధ్యమాల్లో ప్రపంచ వ్యాప్తంగా 340 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. బాస్కెట్బాల్ దిగ్గజం లేబ్రాన్ జేమ్స్, అమెరికన్ ఫుట్బాల్ స్టార్ టామ్ బ్రేడీ, గోల్ఫ్ స్టార్ టైగర్ వుడ్స్కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు కోహ్లికి ఉన్నారు. అందుకే క్రికెట్ కేవలం కొన్ని దేశాలకే పరిమితం కాకుండా విశ్వవ్యాప్తంగా ఆదరణ పొందాలనే ఉద్దేశంతో ఒలింపిక్స్లో చోటు కల్పిస్తున్నాం’ అని లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ స్పోర్ట్స్ డైరెక్టర్, ఒలింపిక్ చాంపియన్ షూటర్ నికోలో కాంప్రియాని వ్యాఖ్యానించాడు. ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్కు చోటు లభించడంపట్ల ఐఓసీ సభ్యురాలు, ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ యజమాని నీతా అంబానీ హర్షం వ్యక్తం చేశారు. ఒలింపిక్స్లో క్రికెట్ శాశ్వతంగా కొనసాగేందుకు తమవంతుగా అన్ని చర్యలు తీసుకుంటామని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చైర్మన్ గ్రెగ్ బార్క్లే తెలిపారు. ► రగ్బీ తరహాలో ఆడే ఫ్లాగ్ ఫుట్బాల్కు... స్వా్వష్కు ఒలింపిక్స్లో తొలిసారి స్థానం దక్కింది. బేస్బాల్/సాఫ్ట్బాల్కు వచ్చే ఏడాది పారిస్లో జరిగే ఒలింపిక్స్లో చోటు దక్కకపోయినా... అమెరికాలో ఎంతో ప్రాచుర్యం ఉండటంతో బేస్బాల్/సాఫ్ట్బాల్ లాస్ ఏంజెలిస్లో మళ్లీ కనిపిస్తాయి. ► హాకీ తరహాలో ఆడే లాక్రాస్ క్రీడాంశం 1904 సెయింట్ లూయిస్ ఒలింపిక్స్లో, 1908 లండన్ ఒలింపిక్స్లో మెడల్ ఈవెంట్గా ఉంది. ఆ తర్వాత 1928 అమ్స్టర్డామ్, 1932 లాస్ ఏంజెలిస్, 1948 లండన్ ఒలింపిక్స్లో ప్రదర్శన క్రీడగా కొనసాగి ఆ తర్వాత చోటు కోల్పోయింది. చదవండి: WC 2023: ఎదుటి వాళ్లను అన్నపుడు నవ్వుకొని.. మనల్ని అంటే ఏడ్చి గగ్గోలు పెట్టడం ఎందుకు? అతడికి స్ట్రాంగ్ కౌంటర్ The proposal from the Organising Committee of the Olympic Games Los Angeles 2028 (@LA28) to include five new sports in the programme has been accepted by the IOC Session. Baseball/softball, cricket (T20), flag football, lacrosse (sixes) and squash will be in the programme at… — IOC MEDIA (@iocmedia) October 16, 2023 -
2028 ఒలింపిక్స్లో క్రికెట్!
ముంబై: అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ఓటింగ్ లాంఛనం పూర్తయితే 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో క్రికెట్ పునరాగమనం చేస్తుంది. మరోవైపు బాక్సింగ్పై నీలినీడలు కమ్ముకున్నాయి. అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్యపై ఐఓసీ వేటుకు సిద్ధమైన నేపథ్యంలో బాక్సింగ్ను ఒలింపిక్స్లో కొనసాగించాలనే నిర్ణయాన్ని నిలిపివేసింది. మరోవైపు కొత్తగా కాంపౌండ్ ఆర్చరీ ఈవెంట్ను చేర్చాలన్న ప్రతిపాదనను తిరస్కరించింది. 2028లో అమెరికా నిర్వహించనున్న ఈ విశ్వక్రీడల కోసం క్రికెట్ సహా మరో నాలుగు క్రీడలు బేస్బాల్–సాఫ్ట్బాల్, ఫ్లాగ్ ఫుట్బాల్, లాక్రోసి (సిక్సెస్), స్క్వాష్ ఆటలు చేర్చే ప్రతిపాదనల్ని ఐఓసీ ఎగ్జిక్యూటీవ్ బోర్డు ఆమోదించింది. ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ నేతృత్వంలోని కమిటీ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది. దీంతో కేవలం లాంఛనప్రాయమైన ఓటింగ్ మాత్రమే మిగిలుంది. ముంబైలో ప్రస్తుతం జరుగుతున్న ఐఓసీ సెషన్స్లోనే ఆ లాంఛనం కూడా ఆదివారం పూర్తి కానుంది. ఎగ్జిక్యూటివ్ కమిటీ అమోదం లభించడంతో ఓటింగ్లో ఏ సమస్య ఎదురవదు. మెజారిటీ ఓట్లు ఖాయమవుతాయి. ‘విశ్వవ్యాప్తంగా క్రికెట్ విశేష ఆదరణ పొందుతోంది. ముఖ్యంగా టి20 ఫార్మాట్ అందర్ని అలరిస్తుంది. వన్డే ప్రపంచకప్ అయితే ఏళ్ల క్రితమే విజయవంతమైంది. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్కు క్రికెట్ దగ్గరైంది’ అని ఐఓసీ చీఫ్ థామస్ బాచ్ అన్నారు. ఆదివారం ఓటింగ్ ప్రక్రియ పూర్తయితే లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో టి20 ఫార్మాట్లో క్రికెట్ నిర్వహిస్తారు. చివరిసారి 1900 పారిస్ ఒలింపిక్స్లో క్రికెట్ను ఆడించారు. ఆ తర్వాత క్రికెట్ను విశ్వ క్రీడల నుంచి తొలగించారు. -
క్రికెట్ ప్రేమికులకు శుభవార్త.. ఇకపై.. ‘ఒలింపిక్స్’లో కూడా.. గ్రీన్ సిగ్నల్
Cricket's Inclusion In 2028 Los Angeles Games: క్రికెట్ ప్రేమికులకు శుభవార్త..! విశ్వ క్రీడల్లో క్రికెటర్లను చూడాలన్న అభిమానుల కల 2028లో తీరనుంది. ఇప్పటికే ఆసియా క్రీడల్లో క్రికెట్ను చేర్చిన విషయం తెలిసిందే. తాజాగా.. లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్ను చేర్చడానికి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించి ఐఓసీ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. ఈ విషయం గురించి ఏఓసీ అధ్యక్షుడు థామస్ బాష్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా... లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్ చేర్చాలన్న నిర్వాహకుల ప్రతిపాదనకు కమిటీ అంగీకారం తెలిపినట్లు ప్రకటించారు. 2028 ఒలింపిక్స్లో కొత్తగా చేర్చనున్న ఐదు క్రీడాంశాల్లో కూడా క్రికెట్ కూడా ఉందని వెల్లడించారు. ఆ ఐదు క్రీడల్లో ఒకటిగా క్రికెట్ కూడా కాగా ఒలింపిక్స్లో అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో క్రికెట్ మ్యాచ్లు నిర్వహించనున్నారు. బేస్బాల్/సాఫ్ట్బాల్, ఫ్లాగ్ ఫుట్బాల్(నాన్- కాంటాక్ట్ అమెరికన్ ఫుట్బాల్), స్క్వాష్, లాక్రోస్లతో పాటు క్రికెట్ కూడా చేర్చనున్నారు. కాగా అక్టోబరు 15 నుంచి 17 వరకు ముంబైలో ఐఓసీ సమావేశ నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఈ క్రమంలో ఇప్పటికే ఐఓసీ సభ్యులు ముంబైకి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో.. ఎగ్జిక్యూటివ్ బోర్డు మీటింగ్ రెండో రోజున థామస్ బాష్ ఈ మేరకు ప్రకటన చేశారు. తొలి అడుగు.. పసిడి పతకాలతో చరిత్ర ఇక ఇటీవల ఆసియా క్రీడలు-2023 సందర్భంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి తొలిసారి క్రికెట్ జట్లను చైనాకు పంపిన విషయం తెలిసిందే. హోంగ్జూలో టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నమెంట్లో భారత మహిళల, పురుష జట్లు స్వర్ణ పతకాలు సాధించాయి. హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలో మహిళా జట్టు, రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని టీమిండియా ద్వితీయ శ్రేణి జట్లు ఆసియా క్రీడల్లో అడుగుపెట్టిన ఎడిషన్లోనే గోల్డ్ మెడల్స్ గెలిచి చరిత్ర సృష్టించాయి. కాగా క్రికెట్కు భారత్లో ఉన్న క్రేజ్ దృష్ట్యా ఒలింపిక్స్లో ఈ క్రీడను చేర్చడం ద్వారా నిర్వాహకులు పెద్ద ఎత్తున ప్రసార హక్కుల రూపంలో ఆర్జించే అవకాశం ఉంది. చదవండి: WC 2011లో నేనే కెప్టెన్ అయి ఉంటే అతడిని తప్పక తీసుకునేవాడిని.. కానీ! -
అంతర్జాతీయ బాక్సింగ్ సంఘంపై వేటు
International Boxing Association: అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఐబీఏ)పై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) నిషేధం విధించింది. అయితే పారిస్ ఒలింపిక్స్లో బాక్సర్లకు ఏ ఇబ్బంది లేకుండా పోటీ పడే అవకాశమిచ్చారు. కొన్నేళ్లుగా ఐబీఏ వివాదాలతో వార్తల్లో నిలిచింది. సమస్యల్ని పరిష్కరించుకోవాలని ఐఓసీ ఎన్ని సార్లు సూచించినా ఐబీఏ మాత్రం పెడచెవిన పెట్టింది. దీంతో ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ నేతృత్వంలో ఎగ్జిక్యూటివ్ బోర్డు ఐబీఏను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. గ్యాంజస్ గ్రాండ్మాస్టర్స్, ముంబా మాస్టర్స్ గెలుపు దుబాయ్: గ్లోబల్ చెస్ లీగ్లో భాగంగా తొలి రోజు జరిగిన రెండు మ్యాచ్ల్లో అప్గ్రాడ్ ముంబా మాస్టర్స్, గ్యాంజస్ గ్రాండ్మాస్టర్స్ జట్లు గెలుపొందాయి. గ్యాంజస్ గ్రాండ్మాస్టర్స్ 10–4 పాయింట్లతో చింగారి గల్ఫ్ టైటాన్స్పై, ముంబా మాస్టర్స్ 8–7 పాయింట్లతో త్రివేణి కాంటినెంటల్ కింగ్స్ జట్టుపై విజయం సాధించాయి. ముంబా మాస్టర్స్కు ఆడిన ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక తమ ప్రత్యర్థులతో గేమ్లను ‘డ్రా’ చేసుకున్నారు. -
2024 Paris Olympics: పారిస్ ఒలంపిక్స్ను బహిష్కరించాలి: పోలండ్
వార్సా: 2024 పారిస్ ఒలంపిక్స్లో రష్యా, బెలారస్ల ప్రాతినిధ్యాన్ని అంగీకరిస్తే తీవ్ర పరిణామాలుంటాయని పోలండ్ హెచ్చరించింది. రష్యా, బెలారస్లు ఒలంపిక్స్ పాల్గొనే పక్షంలో పోలండ్, లిథువేనియా, ఎస్టోనియా, లాట్వియా దేశాలు ఆ క్రీడలను బహిష్కరిస్తాయని పోలండ్ మంత్రి కమిల్ చెప్పారు. ఆ రెండు దేశాల క్రీడాకారులకు అవకాశమివ్వాలన్న అంతర్జాతీయ ఒలంపిక్ కమిటీ నిర్ణయాన్ని ఖండించారు. ఈ నెల 10న జరిగే ఐవోసీ భేటీలో ఈయూ, యూకే, అమెరికా, కెనడాలతోపాటు ఉక్రెయిన్పై రష్యా ఆక్రమణను వ్యతిరేకించే 40 దేశాలు గ్రూపుగా ఏర్పడాలన్నారు. ఈ 40 దేశాలు గనుక బహిష్కరిస్తే ఒలంపిక్స్ నిర్వహణకు అర్థమే లేకుండా పోతుందని చెప్పారు. రష్యా పాల్గొంటే తాము ఒలంపిక్స్ను బహిష్కరిస్తామని ఉక్రెయిన్ ఇప్పటికే స్పష్టం చేసింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement