-
Us: అమెరికాలో మరో భారతీయుడి హత్య
వాషింగ్టన్: అమెరికాలో భారతీయ విద్యార్థులు,భారత సంతతికి చెందిన వారిపై ఇటీవల తరచుగా దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల్లో వారు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇదే కోవలో తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది. వాషింగ్టన్ డౌన్టౌన్లోని హోటల్ బయట రోడ్డుపై జరిగిన వాగ్వాదంలో గుర్తు తెలియని దుండగుడి చేతిలో భారత సంతతికి చెందిన ఓ వ్యాపారవేత్త హత్యకు గురయ్యారు. ఈ నెల 2న జరగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భారత సంతతికి చెందిన వివేక్ తనేజా(41) అనే వ్యక్తి అమెరికా ప్రభుత్వానికి సాంకేతిక సహకారం అందిస్తున్న ‘డైనమో టెక్నాలజీస్’ కో ఫౌండర్. వర్జీనియాలో వివేక్ నివాసముంటున్నారు. ఫిబ్రవరి 2న వాషింగ్టన్ డౌన్టౌన్లోని ఓ రెస్టారెంట్కు వెళ్లిన ఆయన అర్థరాత్రి 2 గంటల సమయంలో బయటకు వచ్చారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తితో వాగ్వాదం జరిగింది. ఇది కాస్తా కొట్టుకునేదాకా రావడంతో దుండగుడు వివేక్ తలపై దాడి చేశాడు. వివేక్ను విచక్షణా రహితంగా నేలకేసి కొట్టాడు. తలకు తీవ్రంగా గాయమవ్వడంతో ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వివేక్ ప్రాణాలు కోల్పోయారు. DC Police just released this video of a person of interest in the case of a man assaulted outside Shoto Restaurant on 15th Street NW on Friday at 2am. 41-year-old Vivek Taneja of Alexandria was seriously injured. He passed away Wednesday. pic.twitter.com/DgwLyQms8y — Spencer Allan Brooks (@SpencerSays) February 9, 2024 ఇదీ చదవండి.. పాక్లో నవాజ్, బిలావల్ ప్రభుత్వం -
లండన్ లో భారతీయ సంతతికి చెందిన వ్యక్తి దారుణ హత్య
-
ఐర్లాండ్ ప్రధానిగా రెండోసారి భారత సంతతి వ్యక్తి
డబ్లిన్: భారత సంతతికి చెందిన లియో వరాద్కర్ ఐర్లాండ్ ప్రధానమంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. రొటేషన్ పద్ధతిలో ఫిన్గేల్ పార్టీకి చెందిన వరాద్కర్కు మరోసారి అవకాశం దక్కింది. 2017లో తొలిసారి ప్రధానిగా ఎన్నికయ్యారు. 2020లో ఫిన్గేల్, మార్టిన్ ఫియన్నాఫెయిల్ పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు రొటేషన్ పద్ధతిలో వరాద్కర్కు మరో అవకాశం లభించింది. మైఖెల్ మార్టిన్ స్థానంలో ప్రధానిగా ప్రమాణం చేయనున్నారు. రెండోసారి అవకాశం లభించిన క్రమంలో డబ్లిన్లోని ఐర్లాండ్ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మాట్లాడారు లియో వరాద్కర్. ‘ మన పౌరులందరికీ కొత్త ఆశలు, కొత్త అవకాశాలను అందించాలనే కాంక్షతో వినయంగా, సంకల్పంతో ఈ నియామకాన్ని అంగీకరిస్తున్నా. ఐర్లాండ్ ప్రధానిగా అవకాశం రావటం జీవతకాల పురస్కారం. గత 100 సంవత్సరాల్లో సాధించిన అభివృద్ధి ఆధారంగా రానున్న తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని పాలన సాగిస్తా. అన్ని రంగాల్లో దేశం అభివృద్ధి చెందేలా ప్రణాళికలు రచించి పక్కాగా అమలుపరుస్తాను. కరోనా వ్యాప్తి సమయంలో సహకారం అందించిన మైఖేల్ మార్టిన్కు కృతజ్ఞతలు.’ అని పేర్కొన్నారు వరాద్కర్. ప్రస్తుతం 43 ఏళ్ల వయసున్న లియో ఐర్లాండ్లోనే అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానిగా గతంలోనే చరిత్ర సృష్టించారు. 38 ఏళ్లకే అత్యున్నత పదవిని చేపట్టారు. ఈ పదవి చేపట్టిన తొలి భారత సంతతి వ్యక్తిగానూ నిలిచారు. డబ్లిన్లోని ట్రినిటీ కళాశాలలో మెడికల్ డిగ్రీ అందుకున్న వరాద్కర్.. మొదట ప్రాక్టీస్ మొదలు పెట్టినా రాజకీయాల్లో చురుకుగా పాల్గొనేవారు. 2007 తొలిసారి గెలుపొందారు. 2015లో స్వలింగ వివాహాలను చట్టబధ్దం చేసింది. ఈ క్రమంలో తాను గే అని బహిరంగంగానే ప్రకటించారు. ఇదీ చదవండి: ఉక్రెయిన్పై క్షిపణుల వర్షం.. రష్యా మాస్టర్ ప్లాన్తో తీవ్ర ఇబ్బందులు -
వార్నీ.. అందుకని ఆమెను హత్య చేశాడట!
ఆమె హత్య కేసు ఒక సంచలనం. నాలుగేళ్లుగా నిందితుడి కోసం గాలింపు చేస్తూనే ఉన్నారు అధికారులు. ఏ దేశంలో ఉన్నాడో తెలిసి కూడా.. ట్రేస్ చేయలేకపోయాడు. చివరికి... ఆచూకీ చెబితే భారీ నజరానా ఇస్తామని ప్రకటించారు కూడా. ఎలాగైతేనేం భారత్లో అతన్ని మొత్తానికి అదుపులోకి తీసుకున్నారు. అయితే హత్యకు ప్రేరేపించిన కారణం తెలిసి.. మన పోలీసులు కంగు తిన్నారు. 24 ఏళ్ల తోయా కార్డింగ్లీ.. అక్టోబర్ 21, 2018 నుంచి కనిపించకుండా పోయింది. దీంతో ఆందోళన చెందిన కుటుంబం క్వీన్స్లాండ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కట్ చస్తే.. మరుసటి రోజు తోయా శరీరం అతిదారుణంగా.. బీచ్ ఇసుకలో పాతిపెట్టిన స్థితిలో పోలీసుల కంట పడింది. ఆమె పెంపుడు కుక్కను ఆ దగ్గర్లోనే ఉన్న ఓ చెట్టుకు కట్టేసి ఉంచారు. ఉన్మాదంతో కూడిన, దారుణమైన హత్య.. అని తోయా హత్య కేసుపై ఆస్ట్రేలియా పోలీసులు ప్రకటన చేశారు. ఆపై దర్యాప్తులో సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా.. రాజ్విందర్ సింగ్ అనే మేల్ నర్స్పై అనుమానపడ్డారు. అయితే ఘటన జరిగిన 48 గంటల్లోపే భార్యాపిల్లలతో పాటు ఉద్యోగాన్ని వదిలేసి దేశం విడిచి పారిపోయాడు రాజ్విందర్ సింగ్. దీంతో రాజ్విందర్పై అనుమానం బలపడింది. ఎయిర్పోర్ట్లో విమానం ఎక్కేముందు అతని ఫొటోను కూడా పోలీసులు ఆచూకీ కోసం ఉపయోగించుకున్నారు. కానీ, ఇండియాలో అతని ఎక్కడ ఉన్నాడనే ఆచూకీ కష్టతరంగా మారింది. దీంతో మోస్ట్ వాంటెడ్ రాజ్విందర్ సింగ్ ఆచూకీ కోసం రకరకాల ప్రయత్నాలు చేశారు. కిందటి ఏడాది మార్చిలో భారత విదేశాంగ శాఖ సాయం కోరింది క్వీన్స్లాండ్ పోలీస్ శాఖ. ఈ క్రమంలో.. తాజాగా రాజ్విందర్ గురించి సమాచారం అందించిన వాళ్లకు 1 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు (సుమారు రూ. 5.5 కోట్లు) బహుమతి ప్రకటించింది క్వీన్స్లాండ్ ప్రభుత్వం. అయితే తాజాగా రాజ్విందర్ను శుక్రవారం ఢిల్లీలోని జీటీ కర్నల్ రోడ్లో స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ.. క్వీన్స్లాండ్ పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు. అతన్ని ఆస్ట్రేలియా ప్రభుత్వానికి అప్పగించే విషయంలో త్వరలో కోర్టు విచారణ జరుగుతుందని వెల్లడించారు. అయితే హత్యకు దారి తీసిన పరిణామం గురించి రాజ్విందర్ చెప్పిన విషయంతో ఢిల్లీ పోలీసులు కంగుతిన్నారు. భారత సంతతికి చెందిన రాజ్విందర్ సింగ్.. ఆస్ట్రేలియాలో నర్సుగా పని చేసేవాడు. 2018 అక్టోబర్ 21వ తేదీన తన భార్యతో గొడవ పడ్డాడు. ఆ కోపంలో కత్తి, కొన్ని పండ్లు తీసుకుని రిలాక్స్ అయ్యేందుకు బీచ్కు వెళ్లాడు. సరిగ్గా అదే సమయంలో.. తోయా కార్డింగ్లీ తన పెంపుడు కుక్కతో అక్కడికి వచ్చింది. ఆ కుక్క రాజ్విందర్ను చూసి పదేపదే మొరిగిందట. అసలే భార్యతో గొడవ పడిన చిరాకులో ఉన్న అతను.. ఈ విషయంలో ఆమెతో వాగ్వాదానికి దిగారు. అది చిలికి చిలికి హత్యకు దారి తీసిందని నేరం ఒప్పుకున్నాడు రాజ్విందర్. తొలుత ఆమెను కత్తితో కసి తీరా పొడిచాడు. ఆపై రక్తపు మడుగులో పడి ఉన్న ఆమెను లాక్కెళ్లి.. ఇసుక దిబ్బల్లో పాతేశాడు. ఆ కుక్కను వెంటాడి పట్టుకుని చెట్టుకు కట్టేశాడు. ఆపై రక్తపు మరకలు ఉన్న కత్తిని నీళ్లలోకి విసిరేశాడు. ఇంటికి తిరిగి వచ్చాక ఆ రోజంతా ఆందోళనగానే ఉన్నాడు. ఆ మరుసటి రోజు ఎవరికీ చెప్పకుండా లగేజ్ సర్దుకుని భారత్కు పయనం అయ్యాడు. హత్య చేసి పారిపోయి వచ్చాక.. ఎవరితో సంబంధం లేకుండా ఉన్నాడు రాజ్విందర్ సింగ్. అటు భార్యతోగానీ ఇటు తల్లిదండ్రులతో కానీ ఎలాంటి సంభాషణలు జరపలేదు. కానీ, పంజాబ్-ఢిల్లీ మధ్యే మార్చిమార్చి తిరుగుతూ వచ్చాడు. అధికారులు గుర్తు పట్టకుండా గెటప్ మార్చేస్తూ పోయాడు. ఇక ఇప్పుడు హత్యకు అతను కారణం చెప్పడంతో ఇక్కడి పోలీసుల వంతు పూర్తైంది. అతన్ని ప్రశ్నించడం పూర్తి కావడంతో.. కోర్టులో ప్రవేశపెడతాం అని ఓ ఢిల్లీ పోలీస్ అధికారి తెలిపాడు. రాజ్విందర్ సింగ్ మీద ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీస్ కూడా జారీ చేసింది. మరోవైపు అప్పగింత చట్టం(extradition act) కింద నవంబర్ 21వ తేదీన పాటియాలా హౌజ్ కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ కూడా ఇష్యూ చేసింది. దీంతో ఢిల్లీ పోలీసుల గాలింపు ముమ్మరం అయ్యింది. అందిన కొద్దిపాటి సమాచారంతో అతనున్న గ్రామంలో ఇంటి ఇంటికి వెళ్లి గాలింపు చేపట్టారు. చివరకు.. గడ్డం, తలపాగాతో ఉన్న రాజ్విందర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది కూడా: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. చూసేయండి -
యాపిల్ కంపెనీకే షాకిచ్చాడు.. ఏకంగా రూ.140 కోట్లు కొట్టేసిన ఉద్యోగి!
చేసిన తప్పుకి ఎప్పటికైనా శిక్ష పడక మానదు. ఈ మాటే చాలా సార్లు వినే ఉంటాం. సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురైంది భారతి సంతతికి చెందిన ఉద్యోగికి. అన్నం పెట్టిన కంపెనీకే కన్నం వేశాడు. దొరికినంత దోచుకున్నాడు, అయితే పాపం పండి చివరికి దోషిగా నలుగురిలో నిలబడ్డాడు. ఈ ఘటన అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భారత సంతతికి చెందిన 52 ఏళ్ల ధీరేంద్ర ప్రసాద్.. కాలిఫోర్నియాలోని యాపిల్ సంస్థలో 2008-18 వరకు పనిచేశాడు. కంపెనీలో దొంగ ఇన్ వాయిస్ లు సృష్టించడం, ఎలక్ట్రానిక్ భాగాలు దొంగిలించడం, కంపోనీలో లేని సర్వీసులకు కూడా డబ్బులు వసూలు చేయడం లాంటివి చేశాడు. ఈ మోసం 2011 నుంచి ప్రారంభమై 2018 వరకు కొనసాగించాడు. అలా కంపెనీలో 17 మిలియన్ డాలర్లకు (భారత కరెన్సీ ప్రకారం) పైగా దోచుకున్నాడు. ఎట్టికేలకు ఈ విషయం బయటకు రావడంతో ప్రసాద్ కటకటాలపాలయ్యాడు. కోర్టులో దీనిపై విచారణ జరపగా.. ఇందులో రాబర్ట్ గ్యారీ హాన్సెన్, డాన్ ఎమ్ బేకర్ అనే మరో ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నట్లు తెలిపాడు. చివరికి కంపెనీని $17 మిలియన్లకు పైగా మోసం చేసినట్లు కోర్టులో అంగీకరించాడు. అయితే ఈ కేసుకు సంబంధించి తదుపరి వాయిదా 2023 మార్చి 14న ఉండనుంది. అంతవరకు ప్రసాద్ పోలీసు కస్టడీలో ఉంచనున్నారు. ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ ప్రోగ్రామ్ సహాయంతో ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ద్వారా ప్రాసిక్యూషన్ జరిగింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement