-
కరోనా: ఇటలీ చేరుకున్న భారత వైద్య బృందం
రోమ్ : ఇతర దేశాల నుంచి భారత్కు చేరుతున్న వారితో కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉన్న హెచ్చరికల నేపథ్యంలో భారత వైద్య బృందం శుక్రవారం ఇటలీకి చేరుకుంది. అక్కడ వివిధ విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులతో పాటు, భారత పౌరులకు కరోనా పరీక్షలు నిర్వహించడానికి లియెనార్డో డా విన్సీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. వారికి కరోనా పరీక్షలు నిర్వహించిన అనంతరం ప్రత్యేక విమానంలో భారత్కు తరలించనున్నారు. కాగా దీనికంటే ముందు ఇటలీలోని భారతీయులకు కోవిడ్ 19 పరీక్షలు నిర్వహించడానికి భారత్ రాయబార కార్యాలయం ఇటాలియన్ అధికారులతో సంప్రదింపులు జరిపింది. అయితే ఇటలీలో ఇప్పటికే కరోనా అధికంగా ప్రభావం చూపుతున్నందున భారతీయులకు వైద్యసాయం అందించేదుకు అక్కడి అధికారులు ఇందుకు అంగీకరించలేదు. (కరోనా భయం: నా సోదరి శవాన్ని తీసుకువెళ్లండి..) ఈ నేపథ్యంలో స్పందించిన భారత ప్రభుత్వం.. స్వయంగా భారత్ వైద్యాధికారులు ఇటలీకి పంపించింది. ఇండియన్ మిషన్ ప్రకారం ఇటలీలో సుమారు 1.6 లక్షల మంది భారతీయులు నివాసం ఉంటున్నారు. వారిలో 3,800 మంది విద్యార్థులు ఉన్నారు. ఇటలీలోని పలు ప్రాంతాల్లో ఉన్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులపై సంప్రదింపులు జరుపుతున్నామని, రాయబార కార్యాలయంలోని ఓ అధికారి తెలిపారు. ఇక ఇటలీకి చేరుకున్న భారత వైద్య బృందం రెండు, మూడు రోజులపాటు అక్కడే ఉంటారని ఇటలీ భారత రాయబారి రీనాట్ సంధు తెలిపారు.(ఆర్మీకి సోకిన కరోనా వైరస్) అక్కడి భారతీయులకు కరోనా టెస్ట్లు నిర్వహించి నెగిటివ్ వచ్చిన వారిని తిరిగి ఇండియాకు పంపిస్తామని తెలిపారు. వాళ్లు భారత్కు వచ్చాక 14 రోజుల పాటు మళ్లీ వైద్య పరీక్షలు నిమిత్తం నిర్బంధంలో ఉంటారని వెల్లడించారు. కాగా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 1, 34, 500 కరోనా కేసులు నమోదవ్వగా, 4,900 మందికి పైగా మరణించారు. చైనా తర్వాత కరోనా మహమ్మారి ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతం ఇటలీనే. ఇప్పటి వరకు ఇటలీలో 15, 113 కరోనా కేసులు నమోదవ్వగా 1000 మందికి పైగా మృత్యువాత పడ్డారు. (కరోనా: ‘ఈ మధ్యకాలంలో ఇదే గొప్ప బహుమతి’) -
ఎన్ఎంసీ బిల్లుకు లోక్సభ ఆమోదం
న్యూఢిల్లీ: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత వైద్య మండలి(ఎంసీఐ) స్థానంలో జాతీయ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ)ను ఏర్పాటు చేసే బిల్లుకు లోక్సభ సోమవారం ఆమోదం తెలిపింది. దీనివల్ల వైద్య విద్యారంగంలో పారదర్శకత ఏర్పడుతుందనీ, అనవసరమైన తనిఖీల ప్రహసనం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ బిల్లు ద్వారా దేశవ్యాప్తంగా వైద్యవిద్యలో ఏకీకృత విధానాలను తీసుకురానున్నారు. ఇందులోభాగంగా ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ పరీక్షను పీజీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి అర్హత పరీక్షగా పరిగణిస్తారు. అలాగే విదేశాల్లో ఎంబీబీఎస్ చదివి భారత్లో పీజీ కోర్సుల్లో చేరే విద్యార్థుల కోసం ఓ స్క్రీనింగ్ టెస్ట్ను నిర్వహించనున్నారు. ఈ స్క్రీనింగ్ పరీక్షకు నేషనల్ ఎగ్జిట్ టెస్ట్(నెక్టŠస్)గా నామకరణం చేశారు. ఎన్ఎంసీ చట్టం వల్ల ప్రభుత్వ, ప్రైవేటు వైద్యకళాశాల్లో 50 శాతం సీట్లు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్) విద్యార్థులకు అందుతాయని ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ఈ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందిన మూడేళ్ల లో నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ను నిర్వహిస్తామన్నారు. పోంజి బిల్లుకు ఆమోదం: చిట్ఫండ్ పేరుతో జరుగుతున్న మోసాలను అరికట్టే ‘అనియంత్రిత డిపాజిట్ స్కీంల నిషేధ’ బిల్లును సోమవారం పార్లమెంట్ ఆమోదించింది. పేద డిపాజిటర్ల సొమ్ముకు రక్షణ కల్పించడం, వసూలు చేసిన డబ్బును తిరిగిచ్చేలా చూడటం ఈ బిల్లు ఉద్దేశం. ఈ బిల్లు చట్టరూపం దాల్చితే చట్ట విరుద్ధంగా వసూళ్లకు పాల్పడిన వారికి జరిమానా, జైలుశిక్ష పడనున్నాయి. ఈ విషయమై ఆర్థికమంత్రి అనురాగ్సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ..‘ ‘చట్టంలోని లొసుగుల ఆధారంగా కొందరు వ్యక్తులు నిరుపేదలకు భారీవడ్డీ ఆశచూపి నగదును వసూలుచేస్తున్నారు. తాజా బిల్లులో పోంజి పథకంతో పాటు స్నేహితులు, పరిచయస్తులు, బంధువుల నుంచి వసూలు చేసే రియల్ఎస్టేల్ సంస్థలపైనా చర్యలు తీసుకునేలా నిబంధనలు చేర్చాం. సంబంధిత వ్యక్తులకు ఏడా ది నుంచి పదేళ్ల వరకు జైలుశిక్షతో పాటు రూ.2 లక్షల నుంచి రూ.50 కోట్ల వరకు జరిమానా విధించవచ్చు. పోంజి స్కీమ్లకు సంబంధించి దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 978 కేసులు నమోదు కాగా, వీటిలో 326 కేసులో పశ్చిమబెంగాల్లోనే నమోదయ్యాయి’ అని తెలిపారు. ఈ బిల్లును లోక్సభ జూలై 24న ఆమోదించింది. ‘ఉన్నావ్’ ప్రమాదంపై సభలో రగడ.. ఉన్నావ్ రేప్ బాధితురాలి కారును ఓ లారీ అనుమానాస్పద రీతిలో ఢీకొట్టడంపై ప్రతిపక్షాల ఆందోళనలతో రాజ్యసభ దద్దరిల్లింది. ఎస్పీ నేత రామ్గోపాల్ యాదవ్ మాట్లాడుతూ.. బాధితురాలిని చంపే ప్రయత్నం జరిగింద ఆరోపించారు. ప్రతిపక్ష సభ్యులు యాదవ్కు మద్దతుగా నినాదాలు చేయడంతో రాజ్యసభ మధ్యాహ్నానికి వాయిదాపడింది. -
ఎంసీఐ స్థానంలో ఇక పాలక మండలి
న్యూఢిల్లీ: అవినీతిలో కూరుకుపోయిన భారతీయ వైద్య మండలి (ఎంసీఐ–మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా)ని రద్దు చేసి, దాని బాధ్యతలను పరిపాలక మండలికి అప్పగిస్తూ కేంద్రం బుధవారం ఆర్డినెన్స్ జారీచేసింది. ఆ వెంటనే ఆర్డినెన్స్కు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఎంసీఐని రద్దు చేసి దాని స్థానంలో కొత్త సంస్థను ఏర్పాటుచేసేందుకు ఉద్దేశించిన బిల్లును పార్లమెంటు ఆమోదించేంత వరకు ఎంసీఐ అధికారాలన్నీ ఈ పరిపాలక మండలి వద్ద ఉంటాయి. ఎంసీఐ స్థానంలో జాతీయ వైద్య కమిషన్ను ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించిన బిల్లు పార్లమెంటులో పెండింగ్లో ఉండటం తెలిసిందే. నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్, ఎయిమ్స్–ఢిల్లీ డైరెక్టర్ రణదీప్ గులేరియా, పీజీఐఎంఈఆర్–చండీగఢ్ డైరెక్టర్ జగత్ రామ్, నిమ్హాన్స్–బెంగళూరు డెరెక్టర్ గంగాధర్, నిఖిల్ టాండన్(ఢిల్లీ ఎయిమ్స్)లు పరిపాలక మండలిలో సభ్యులుగా ఉంటారు. -
రెన్యువల్ కోసం నకిలీ రోగులు!
సాక్షి, న్యూఢిల్లీ: ఎంబీబీఎస్ కోర్సులో రెన్యువల్ అనుమతి కోసం నకిలీ పేషెంట్లను చూపారన్న కారణంగా వికారాబాద్ జిల్లాకు చెందిన మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కు సుప్రీంకోర్టు రూ.2 కోట్ల జరిమానా విధించింది. ఈ మేరకు జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే, జస్టిస్ లావు నాగేశ్వర్రావుతో కూడిన ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. 2018–19 విద్యా సంవత్సరం కోసం ఎంబీబీఎస్ ప్రవేశాల అనుమతి రెన్యువల్కు మహావీర్ సంస్థ దరఖాస్తు చేసుకుంది. ఈ నేపథ్యంలో 2017 నవంబర్ 8, 9 తేదీల్లో భారత వైద్య మండలి(ఎంసీఐ)కి చెందిన నిపుణుల కమిటీ తనిఖీ చేసింది. ఈ తనిఖీలో కళాశాలలో అనేక లోపాలను గుర్తించిన కమిటీ మరో బ్యాచ్లో ప్రవేశాలు కల్పించేందుకు వీలుగా రెన్యువల్కు అనుమతి ఇవ్వరాదని కేంద్రానికి సిఫారసు చేసింది. ఈ లోపాలను వైద్య కళాశాలకు కూడా తెలిపింది. ఈ నేపథ్యంలో లోపాలను సరిచేసుకుంటూ సరిదిద్దిన చర్యలను చూపుతూ కళాశాల నివేదిక సమర్పించింది. తద్వారా మరోసారి తమ అభ్యర్థనను పరిశీలించాలని కళాశాల విన్నవించగా కేంద్రం అందుకు సమ్మతించి సమీక్షించాలని ఎంసీఐని కోరింది. 9 రకాల లోపాల గుర్తింపు.. ఈ నేపథ్యంలో 13 మార్చి 2018న మరోసారి తనిఖీ జరిగింది. రెండుసార్లు జరిగిన తనిఖీ నివేదికలను పరిశీలించిన ఎంసీఐ కార్యనిర్వాహక కమిటీ తీవ్రమైన లోపాలను గుర్తించింది. ఫ్యాకల్టీ 22 శాతం తక్కువగా ఉన్నారని, రెసిడెంట్ డాక్టర్లు 42.85 శాతం తక్కువగా ఉన్నారని గుర్తించింది. ఆసుపత్రిలో ఉన్న పేషెంట్లు నిజమైన పేషంట్లు కాదని, చికిత్స అవసరమైనంత పరిస్థితి లేదని గుర్తించింది. ఇలా 9 రకాల లోపాలను గుర్తించింది. ఈ నేపథ్యంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ ఈ కళాశాలకు రెన్యువల్ అనుమతి ఇవ్వొద్దని కేంద్రానికి సిఫారసు చేసింది. ఈ సిఫారసును ఓవర్సైట్ కమిటీ ఆమోదించింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆ కళాశాల సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీంతో తుది నిర్ణయం తీసుకునేలోపు మరోసారి సమీక్షించాలని సుప్రీం కోర్టు మే 23న ఉత్తర్వులు జారీచేసింది. కేంద్రం అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకుని కళాశాలకు రెన్యువల్ అనుమతి ఇవ్వరాదన్న ఎంసీఐ సిఫారసును ఆమోదించింది. ఈ నేపథ్యంలో కళాశాల మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కాగా, నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికలో తాము జోక్యం చేసుకోబోమని, కేంద్రం నిర్ణయంలోనూ జోక్యం అవసరం లేదని ధర్మాసనం పేర్కొంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నవారిని ఇన్పేషెంట్లుగా ఉంచుకోవాల్సిన అవసరం లేదని, ఎలాంటి ఆరోగ్య సమస్యల్లేని వారిని ఆస్పత్రిలో చేర్పించి రెన్యువల్ తెచ్చుకోవాలని చూసిన కళాశాల యాజమాన్యం మోసపూరితమైన చర్యకు పాల్పడిందని పేర్కొంది. పిటిషన్ను కొట్టివేయడంతో పాటు ఆరోగ్యవంతులను పేషెంట్లుగా చూపిన కారణంగా నాలుగు వారాల్లోగా రూ.2 కోట్ల జరిమానా సుప్రీంకోర్టు అడ్వకేట్ ఆన్ రికార్డ్స్ వెల్ఫేర్ ఫండ్లో జమ చేయాలని ధర్మాసనం ఆదేశించింది. -
‘నీట్’లో సీటెక్కడ?
సాక్షి, అమరావతి: ‘నీట్’ పరీక్ష ద్వారా ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల కోసం పోటీపడిన రాష్ట్రంలోని వేలాది మంది అభ్యర్థులు అడ్మిషన్ ఎక్కడ వస్తుందనే అంచనాల్లో తలమునకలై ఉన్నారు. తొలిసారిగా ఏపీ జాతీయ పూల్లోకి వెళ్లడంతో దేశవ్యాప్తంగా ఏ కళాశాల ఎలాంటిదో తెలియక.. వచ్చిన ర్యాంకుతో ఏ కళాశాలలో సీటు వస్తుందో అర్ధంకాక సతమతమవుతున్నారు. గత ఏడాది రాష్ట్ర సీట్లు జాతీయ పూల్లో లేవు. ఈ ఏడాది కొత్తగా చేరడంతో రాష్ట్రంలోని 280 సీట్లకు పైగా జాతీయ కోటాలోకి వెళ్లాయి. అలాగే, అన్ని రాష్ట్రాలకు చెందిన 4,400 జాతీయ పూల్ సీట్లకు అన్ని రాష్ట్రాలూ పోటీపడవచ్చు. తాజాగా గత సోమవారం ‘నీట్’ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో.. తమ ర్యాంకుకు ప్రభుత్వ సీటు లేదా కన్వీనర్ కోటా సీటు వస్తుందో రాదోనన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది. కాగా, అనేకమంది అభ్యర్థులకు 460 నుంచి 480 మార్కులు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మార్కులతో కన్వీనర్ కోటా సీటు వస్తుందో లేదోనన్న టెన్షన్లో అభ్యర్ధులు ఉన్నారు. 500 మార్కులు దాటిన అభ్యర్థులు మాత్రం సీటు వస్తుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. సీట్ల కోతతో మరింత అసంతృప్తి మన రాష్ట్రంలో ఈ ఏడాది 49వేల మంది పైచిలుకు అభ్యర్థులు ‘నీట్’ పరీక్ష రాశారు. అయితే, ఈ ఏడాది నాలుగు ప్రైవేటు కళాశాలలకు సంబంధించిన మొత్తం సీట్లకు భారతీయ వైద్యమండలి అనుమతి నిరాకరించింది. దీనివల్ల కన్వీనర్ కోటా సీట్లు కోల్పోయినట్లయింది. సీట్లు తగ్గడంతో మెరుగైన మార్కులు సాధించినా ఫలితం ఉండదని అభ్యర్థులు వాపోతున్నారు. దీంతో అభ్యర్థులు కేటగిరీల వారీగా గత ఏడాది కటాఫ్ మార్కులు, ఏ ర్యాంకు వరకూ సీటు వచ్చింది.. వంటి వివరాలను ఆరా తీస్తున్నారు. నీట్ అభ్యర్థుల్లో ఆందోళన దేశవ్యాప్తంగా సుమారు 82 వైద్య కళాశాలల్లో 11వేల పైచిలుకు సీట్లకు అనుమతి ఇవ్వకపోవడంపై అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. ఈ విషయమై ఆయా ప్రైవేటు వైద్య కళాశాలలు ఇప్పటికే న్యాయస్థానాలను ఆశ్రయించాయి. ఎంసీఐ నిర్ణయాన్ని రాజస్థాన్ హైకోర్టు ఇప్పటికే తప్పుబట్టింది. మరికొన్ని రాష్ట్రాల్లోనూ ఇలా కేసులు నమోదవుతున్నాయి. ఓ వైపు కళాశాలల మంజూరును సరళతరం చేస్తామంటూనే మరోవైపు సీట్లను తొలగించడం వెనుక ఏదో ఉందని ప్రైవేటు వైద్య కళాశాలలు తమ వ్యాజ్యాల్లో పేర్కొన్నాయి. ఇది పూర్తిగా ఎంసీఐ తీసుకున్న ఏకపక్ష నిర్ణయంగా పలు వైద్యకళాశాలలు అభివర్ణించాయి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
తప్పక చదవండి
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
Advertisement