-
ట్రిపుల్ఐటీ కళాశాల స్థల పరిశీలన
జిల్లాలో ట్రిపుల్ ఐటీ కళాశాల ఎక్కడ ఏర్పాటు చేయాలన్న అంశంపై చర్చించేందుకు రాజీవ్గాంధీ యూనివర్సిటీ చాన్సలర్ కేసీ రెడ్డి శుక్రవారం కలెక్టర్ పోలా భాస్కర్తో సమావేశమయ్యారు. వారిరువురూ కలిసి పామూరు మండలం దూబగుంట, ఒంగోలు మండలం యర్రజర్లలో స్థలాలను పరిశీలించారు. వేలాది మంది విద్యార్థులకు వసతులు సమకూర్చేందుకు ఆ ప్రాంతం అనువుగా ఉంటుందా.. అక్కడి నీటి లభ్యత ఎలా ఉంటుందనే అంశాలపై ఆరా తీశారు. సాక్షి, దూబగుంట్ల (పామూరు): మండలంలోని దూబగుంట్లకు మంజూరైన ట్రిపుల్ ఐటీ కళాశాల స్థలాన్ని శుక్రవారం కలెక్టర్ పోలా భాస్కర్, ఆర్జీయూకేటీ చాన్సెలర్, ప్రొఫెసర్ కె.చెంచిరెడ్డితో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా దూబగుంట్ల వద్ద కళాశాలకు కేటాయించిన 208.45 ఎకరాల స్థలంకు సంబంధించిన వివరాలను కందుకూరు ఆర్డీఓ రామారావును అడిగి తెలుసుకుని మ్యాప్ను పరిశీలించారు. నీటి వసతి గురించి దూబగుంట్ల గ్రామస్తులతో మాట్లాడగా నీటి వసతి ఉందని కళాశాలకు కేటాయించిన స్థలానికి సమీపంలోనే బత్తాయి తోటలు సాగుచేస్తున్నామని వారు కలెక్టర్కు వివరించారు. అనంతరం కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ట్రిపుల్ ఐటీ కళాశాల నిర్మాణానికి సంబంధించి మౌలిక వసతులు, నీటి వసతి, మొదలైన విషయాలను కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. 1000 మంది విద్యార్థులు ఈవిద్యాసంవత్సరంతో కలిపి ప్రస్తుతం మొత్తం 4 వేల మంది విద్యార్థులు కళాశాలలో ఉంటారని తాత్కాలికంగా వీరికి క్లాసులు నిర్వహించేందుకు ఒంగోలు రావు అండ్ నాయుడు కళాశాలలో వసతిని పరిశీలిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. నూతనంగా కళాశాల ఏర్పాటు చేస్తే 1000 మంది విద్యార్థులకు గాను రోజుకు కనీసం 70 వేల లీటర్ల నీరు అవసరమవుతుందన్నారు. ఇంతనీటి వసతి ఇక్కడ ఉందా అని ఆర్డీఓను అడిగారు. అదేవిధంగా బోర్లు వేస్తే ఎంతలోతులో నీరు పడతాయని అధికారులను అడగ్గా 100 అడుగులు కావాలని..అయితే నీటిలో ఫోరైడ్ కూడా ఉందన్నారు. ఈ సందర్భంలో కొంతమంది గ్రామస్తులు కలుగజేసుకుని తమకు వెలిగొండ కాలువ సమీపంలో నెల్లూరు జిల్లాలోని పెద్దిరెడ్డిపల్లె రిజర్వాయర్కు వెళ్తుందని, దాని నుంచి పైప్లైన్ వచ్చే అవకాశముందని కలెక్టర్ దృష్టికితెచ్చారు. దీంతో వెలిగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్ మరో ఏడాది పడుతుందని, రెండో టన్నెల్ కేవలం 40 మీటర్లే పూర్తయిందని రానున్న జనవరిలో పనులు ప్రారంభించినా కనీసం 2 లేదా 3 సంవత్సరాలు పడుతుందన్నారు. అదేవిధంగా వెలిగొండ ప్రాజెక్టు పూర్తయినా శ్రీశైలం ప్రాజెక్టులో నీరు 854 అడుగులు దాటితేనే అప్పటి పరిస్థితులను బట్టి ప్రాధాన్యాతా క్రమంలో మొదట తాగునీరు, ఆతరువాత సాగునీటికి ప్రాధాన్యం ఇస్తారని దీనికి కొంత సమయం పడుతుందని వివరించారు. అప్పటిదాకా వర్షాధారంపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఉందన్నారు. అయినా ప్రతిపాదిత ట్రిపుల్ ఐటీ కళాశాలకు నీటి వసతిపై ఇరిగేషన్ అధికారులతో చర్చింది నివేదికను ప్రభుత్వానికి పంపుతామని తెలిపిన ఆయన సీఈతో ఫోన్లో మాట్లాడారు. దూబగుంట్ల వద్ద ప్రతిపాదిత ట్రిపుల్ ఐటీ కళాశాల ప్రాంతానికి నీటివసతిపై వివరాలు అడిగారు. ఈసందర్భంగా గ్రామస్తులు ట్రిపుల్ ఐటీ కళాశాల తరలిపోతుందా అని ఆందోళన వ్యక్తం చేశారు. వెనుకబడ్డ మాప్రాంతానికి కళాశాల వచ్చిందనే ఉద్దేశంతోనే పశువులకు మేతకోసం ఉన్న భూములను సైతం కళాశాల కోసం ఇచ్చామని కలెక్టర్కు వివరించారు. దీంతో అలాంటిది ఏమీలేదని వేలాది మంది విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడంకోసం అన్ని రకాల సౌకర్యాల పరిశీలనలో నీటివసతి, రవాణా వంటి అవసరాల కోసం క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికను ప్రభుత్వానికి ఇస్తామని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ వెంకట్రావు, ఇంజినీర్ శాస్త్రి, తహసీల్దార్ దిలీప్కుమార్, డీపీఆర్ఓ కె.ఎన్.రెడ్డి, డీటీ నాసరుద్దీన్, సర్వేయర్ విష్ణు, వీఆర్ఓ వెంకటస్వామి పాల్గొన్నారు. ‘రావ్ అండ్ నాయుడు’లో తాత్కాలిక క్యాంపస్ ఒంగోలు టౌన్: ఒంగోలు ట్రిపుల్ ఐటీకి సంబంధించి స్థానిక దక్షిణ బైపాస్రోడ్డులోని రావ్ అండ్ నాయుడు ఇంజినీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేస్తున్న టెంపరరీ క్యాంపస్లోని పనులను రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ చాన్సెలర్ కేసీ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఒంగోలుకు ట్రిపుల్ ఐటీ మంజూరైనప్పటికీ ఇడుపులపాడులో తరగతులు నిర్వహిస్తున్నారు. గత మూడు బ్యాచ్లకు ఇడుపులపాడులోని ట్రిపుల్ ఐటీ కాలేజీ క్యాంపస్లో తరగతులు జరుగుతున్నాయి. నాలుగో బ్యాచ్ అయిన ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి ఒంగోలులోనే ట్రిపుల్ ఐటీ తరగతలు నిర్వహించాలని నిర్ణయించారు. అందుకుగాను స్థానిక దక్షిణ బైపాస్రోడ్డులోని రావ్ అండ్ నాయుడు ఇంజినీరింగ్ కాలేజీలో టెంపరరీ క్యాంపస్ ఏర్పాటు చేశారు. ఈ క్యాంపస్లో 2019–2020 విద్యా సంవత్సరానికి సంబంధించి తొలి బ్యాచ్తోపాటు గత ఏడాదికి సంబంధించిన బ్యాచ్ తరగతులు నిర్వహించేలా చర్యలు చేపట్టారు. రావ్ అండ్ నాయుడు ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థులకు సంబంధించిన డైనింగ్ హాల్, బాత్రూమ్ల పనులు జరుగుతున్నాయి. ఇవి పూర్తయిన వెంటనే ట్రిపుల్ ఐటీ తరగతులు ఇక్కడ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో రావ్ అండ్ నాయుడు ఇంజినీరింగ్ కాలేజీలో జరుగుతున్న పనులను చాన్సెలర్ కేసీ రెడ్డి స్వయంగా పరిశీలించారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయన వెంట ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ సి. వెంకట్రావు ఉన్నారు. యర్రజర్లలో స్థల పరిశీలన ఒంగోలు ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఇక్కడికి సమీపంలోని యర్రజర్లలో ఏర్పాటు చేసే విషయమై చాన్సెలర్ కేసీ రెడ్డి అక్కడి స్థలాలను పరిశీలించారు. ట్రిపుల్ ఐటీ కాలేజీ నిర్మాణానికి సరిపడే విధంగా స్థలం ఉందా, విద్యార్థులకు పూర్తి స్థాయిలో వసతులు సమకూర్చేందుకు ఆ ప్రాంతం అనువుగా ఉందా, అక్కడ నీటి లభ్యత ఏవిధంగా ఉందన్న వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్తో భేటీ రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ చాన్సెలర్ కేసీ రెడ్డి జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్తో ఆయన చాంబర్లో భేటీ అయ్యారు. ట్రిపుల్ ఐటీ ఎక్కడ ఏర్పాటు చేయాలన్న విషయమై కలెక్టర్తో చర్చించారు. గత ప్రభుత్వ హయాంలో పామూరు మండలం దూబగుంట వద్ద ట్రిపుల్ ఐటీ నిర్మాణానికి స్థలాన్ని సేకరించారు. జిల్లా కేంద్రానికి దూరంగా ఉండే ప్రాంతంలో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేస్తే రవాణా పరంగా, అక్కడ విద్యార్థులకు తాగునీటి పరంగా తలెత్తే సమస్యల గురించి కేసీ రెడ్డి కలెక్టర్తో చర్చించారు. యర్రజర్లలో చూసిన స్థలం గురించి కూడా కలెక్టర్తో చర్చించారు. -
భూ గ్రహణం
► ప్రారంభమవని ట్రిపుల్ఐటీ భూసేకరణ ► రెవెన్యూను రూ.47 కోట్లు ఇచ్చిన ట్రిపుల్ఐటీ ► నోటిఫై చేసిన భూమిని విక్రయించే ప్రయత్నాలు ► పట్టించుకోని ప్రస్తుత పాలకులు, అధికారులు ► ఉన్నత విద్య సెక్రటరీ వద్ద నిలిచిపోయిన ఫైల్ నూజివీడు ట్రిపుల్ఐటీకి అవసరమైన భూముల సేకరణపై రెవెన్యూ అధికారులు అలసత్వం వహిస్తున్నారు. ఆర్జీయూకేటీ నిధులు మంజూరుచేసి రెవెన్యూ శాఖకు అప్పగించినా భూ సేకరణలో ఒక్క అడుగుకూడా ముందుకు పడలేదు. ఏడాది కాలంలో నెలకొన్న జాప్యం కారణంగా వేల మంది ఇంజినీరింగ్ విద్యార్థులు అరకొర వసతులతో సతమతమవుతున్నారు. నూజివీడు : స్థానిక ట్రిపుల్ ఐటీ కళాశాలలో ఏడు వేల మంది విద్యార్థులు ఇంజినీరింగ్ విద్య అభ్యసిస్తున్నారు. ప్రారంభంలో ఈ కళాశాలను కేవలం వంద ఎకరాల విస్తీర్ణంలోనే ఏర్పాటు చేశారు. ఇది సరిపోని నేపథ్యంలో మరో వంద ఎకరాలు కావాలంటూ ఆర్జీయూకేటీ ఉన్నతాధికారులు ఆరేళ్లుగా అనేక సార్లు ప్రభుత్వానికి లేఖలు రాశారు. ఈ నేపథ్యంలో ట్రిపుల్ ఐటీ అవసరాన్ని గమనించిన ప్రభుత్వం గత ఏడాది జనవరిలో కళాశాలను ఆనుకుని ఉన్న 113.60 ఎకరాల భూమిని గుర్తించి, దానిని సేకరించేందుకు జీవో జారీచేసింది. దీంతో రెవెన్యూ ఉన్నతాధికారులకు ఆర్జీయూకేటీ రూ.47 కోట్లు అప్పగించినా భూమిని సేకరించడంలో మాత్రం అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. కలెక్టర్ నుంచి ప్రతిపాదన వెళ్లినా.. ట్రిపుల్ ఐటీకి అవసరమైన 113.60 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం జీవో జారీ చేసిన తరువాత ఎన్నికలు వచ్చాయి. ఆ తరువాత కొత్త ప్రభుత్వం ఏర్పడింది. అయినప్పటికీ ఈ ఏడాది జనవరి వరకు ఉన్న కలెక్టర్ రఘునందనరావు విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని భూ సేకరణకు ప్రతిపాదనలను సిద్ధం చేసి రాష్ట్ర ఉన్నతవిద్య సెక్రటరీ టేబుల్ పైకి ఫైల్ పంపించారు. అయితే అక్కడకు వెళ్లిన ఫైల్ను ఎవరూ పట్టించుకోకపోవడంతో భూసేకరణకు సంబంధించి ఎలాంటి అడుగు ముందుకు పడలేదు. భూసేకరణను త్వరితగతిన జరుపుతారనే ఆశతో ఆర్జీయూకేటీ జీవో విడుదలైన వెంటనే రూ.47 కోట్లను రెవెన్యూ ఉన్నతాధికారులకు జమచేసింది. అయినప్పటికీ భూసేకరణ ప్రక్రియ అంగుళం కూడా ముందుకు కదలడం లేదు. ప్లాట్లు వేసే ప్రయత్నాలు ట్రిపుల్ ఐటీకి అవసరమైన భూసేకరణ కోసం ప్రభుత్వం కేటాయించిన భూములకు సంబంధించి కొంతమంది తమ భూములను ప్లాట్లు వేసి విక్రయించేపనిలో నిమగ్నమైనట్లు ప్రచారం జరుగుతోంది. నూజివీడు పరిధిలోని సర్వే నంబరు 1061/4 నుంచి 1061/17వరకు ఉన్న 113.60 ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అయితే రాష్ట్ర విభజన తరువాత నూజివీడు రాజధాని అవుతుందేమోనని ఎంతో ఆశపడినా అలాంటిదేమీ జరగలేదు. అయినప్పటికీ గతంలో కంటే కొద్దిగా భూముల ధరలు పెరిగిన నేపథ్యంలో ట్రిపుల్ ఐటీని ఆనుకుని ఉన్న భూమిని ట్రిపుల్ఐటీకి ఇచ్చే కంటే గుట్టుచప్పుడు కాకుండా అనధికారికంగా ప్లాట్లు వేసి విక్రయించడానికి ఆ భూముల యజమనాలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒకసారి భూసేకరణ నిమిత్తం ప్రభుత్వం నోటిఫై చేసిన తరువాత ఆ భూమిని విక్రయించడానికి, కొనడానికి కుదరదు. కొన్నట్లయితే కొనుక్కున్నవారు నష్టపోయే ప్రమాదం ఉంది. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు మాత్రం తమకేమీ తెలియదన్నట్లు మొద్దునిద్ర నటిస్తున్నారు. విద్యార్థులకు అందుబాటులో లేని సదుపాయాలు ట్రిపుల్ ఐటీకి చాలినంత భూమి లేకపోవడంతో స్థాపించి ఆరేళ్లు గడిచినా నేటికి ఇంకా పలు సదుపాయాలు అందుబాటులోకి రాలేదు. ఇంజినీరింగు విద్యార్థులకు ముఖ్యంగా సెంట్రల్ లైబ్రరి అవసరం. ఇంజినీరింగులో ప్రతి బ్రాంచికి డిపార్ట్మెంటల్ భవనాలు, పరిపాలన భవనం, కాన్ఫరెన్స్హాల్, ఆడిటోరియం, పరిశోధనలకు ప్రత్యేకమైన వింగ్, బాస్కెట్బాల్, వాలీబాల్, షటిల్ కోర్టులతో పాటు స్విమ్మింగ్పూల్, వ్యాయామశాలలతో పాటు ఆటస్థలం అందుబాటులో ఉండాలి. ఇవేమీ లేనప్పటికీ విద్యార్థులు చదువులను కొనసాగిస్తున్నారు. రెవెన్యూ అధికారులు స్పందించి భూసేకరణ జరపాలని విద్యార్థులు, ట్రిపుల్ఐటీ వర్గాలు కోరుతున్నాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాయ్బరేలీలో రాహుల్కు దినేష్ పోటీనివ్వగలరా?
తెలివైన కోతి : శాస్త్రవేత్తలు సైతం ఫిదా
రాజకీయ ఎంట్రీ? జ్యోతిక సమాధానమిదే!
వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి
అనకాపల్లిలో కలకలం.. బూడి ముత్యాలనాయుడు హత్యకు కుట్ర!
కాంగ్రెస్కు షాక్.. ‘ప్లీజ్ పోటీ చేయలేను’
ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్
రోహిత్ శర్మకు వెన్నునొప్పి.. ఆందోళనలో ఫ్యాన్స్!
ఢిల్లీలో కుమారి ఆంటీ తరహా ఎపిసోడ్
సరైన సమయంలో సరైన పుస్తకం 'మూడు దారులు’!
తప్పక చదవండి
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- ఆ రాష్ట్రంలో రెండు రోజులు డ్రై డే!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- మీసాలున్నాయని 80 మందిని తొలగించిన కంపెనీ!
- అగ్ని ప్రమాదం.. చిన్నపాటి ఖర్చుతో మరింత భద్రం!
- స్టార్క్ దెబ్బకు ఇషాన్ బౌల్డ్.. రితిక రియాక్షన్ వైరల్
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
Advertisement