-
నేనేం పాపం చేశానమ్మా..!? పదిరోజుల ఆడపసికందును..
సాక్షి, మిర్యాలగూడ(నల్లగొండ): నవ మాసాలు మోసి జన్మనిచ్చావు..? ఆడ పిల్లనని వదిలించుకున్నావా..? మరో కారణంతో పేగు బంధాన్ని తెంచుకున్నావా..? నా ఆకలి ఎవరు తీరుస్తారు.. ఆలనా పాలనా చూసేవారేరీ..? గుక్కపెట్టి ఏడుస్తున్న ఆ పసికందుకు మాటలు వచ్చి ఉంటే ఇలానే ప్రశ్నల వర్షం కురిపించేదేమో. తల్లిపొత్తిళ్లలో హాయిగా నిద్దరోవాల్సిన రోజుల శిశువు గుక్కపెట్టి ఏడుస్తూ గురువారం నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ బస్టాండ్ పరిసరాల్లో ప్రయాణికుల కంటపడింది.పోలీసులు, ఆర్టీసీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆ శిశువును ఐసీడీఎస్ సిబ్బందికి అప్పగించారు. వివరాలు.. మిర్యాలగూడ ఆర్టీసీ బస్టాండ్ అవరణలో గురువారం సాయంత్రం గుర్తు తెలియని మహిళ రోజుల ఆడ శిశువును ప్రయాణికులు లేని ప్రాంతంలో వదిలి వెళ్లింది. ఆ చిన్నారి గుక్కబట్టి ఏడుస్తుండటంతో ప్రయాణికులు, బిట్ పోలీసులు ఆర్టీసీ డీఎం బొల్లెద్దు పాల్కు సమాచారం అందించారు. ఈ విషయాన్ని బస్టాండ్లో గల విచారణ విభాగం వారు మైక్లో తెలియజేసినా ఎవరూ స్పందించలేదు. దీంతో టూ టౌన్ పోలీసులకు సమాచారం అందించడంతో పోలీస్ సిబ్బంది శిశువును స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ విషయాన్ని వైద్యులు ఐసీడీఎస్ సీడీపీఓ మమతకు సమాచారం అందించడంతో సూపర్వైజర్ మాధవి, అంగన్వాడీ టీచర్లు రజని, పద్మ ఆస్పత్రికి పంపించా రు. ఆడ శిశువును వదిలింది ఎవరు అనే విషయంపై ఆరా తీసినప్పటికి ఫలితం లేదు. స్థానిక టూ టౌన్ సీఐ సురేష్తో మాట్లాడి ఐసీడీఎస్ సిబ్బందికి అప్పగించగా నల్లగొండ శిశుగృహకు తరలించారు. -
ప్రేమపెళ్లిని అడ్డుకున్న అధికారులు
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా మాధవనగర్లోని సాయిబాబా మందిరంలో జరుగుతున్న ఓ ప్రేమ పెళ్లిని ఐసీడీఎస్ అధికారులు అడ్డుకున్నారు. సిరికొండ మండలం పాళ్లరామడుగు గ్రామానికి చెందిన ఇద్దరు మైనర్ యువతీయువకులు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి కులాలు వేరుకావడం, అందులోనూ మైనర్లు కావడంతో పెద్దలు పెళ్లికి అంగీకరించలేదు. దీంతో ఇంట్లో చెప్పాపెట్టకుండా ఇద్దరూ పారిపోయి సోమవారం సాయిబాబా మందిరంలో పెళ్లి చేసుకోవడానికి వెళ్లారు. ఈ విషయం తెలిసిన అధికారులు పెళ్లిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- నేడు నీట్ యూజీ
- విష్ణుకుమారుడి బెదిరింపులు!
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
Advertisement