-
41 ఏళ్ల క్రితం చనిపోతే..ఇప్పుడామె..!
నేరాలు ఎంత అనాలోచితంగా, కుట్రపూరితంగా చూస్తుండగానే క్షణాల్లో జరిగిపోతాయి. ఆ ఘటనలు మిగిల్చే నష్టం, బాధ అంతా ఇంతా కాదు. ఆఖరికి వాటి ఇన్విస్టిగేషన్ కూడా ఓ పట్టాన వీడని మిస్టరీలా ఉండిపోతాయి. అంత తేలిగ్గా చిక్కుముడి వీడదు. ఒక్కోసారి ఏళ్లకు ఏళ్లు పడుతుంది. బాధితులకు తీరని మనో వ్యధ జీవితాంతం ఉంటుంది. ఆ వ్యక్తి తాలుకా వివరాలు బంధువులకు చేరక ఒకవైపు, ఆ కేసులోని చిక్కులు వీడక అధికారులు మరోవైపు ఇలా ఇరువురు తెలియని నరకం చూస్తారు. అలాంటి ఒక గాథ ఇది. 41 ఏళ్ల క్రితం నాటి మహిళ అదృశ్యం కేసు. ఆమె ఏమైంది? ఎలా చనిపోయింది? అనేది తెలియని ఓ అంతుచిక్కని మిస్టరీ. కానీ ఇప్పుడు ఆమె ఎవరనేది ఇప్పటికీ గుర్తించి ఆ బాధితురాలి కూతురికి తెలియజేస్తే.. వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందనేది మాటలకందని భావోద్వేగమే కదా!. ఒరెగాన్లోని కొన్నీ లోరైన్ క్రిస్టెన్సన్ అనే మహిళ కనిపించకుండా పోయింది. ఆమె చివరిసారిగా 1982లో టేనస్సీలోని నాష్విల్లేలో కనిపించింది. ఆ తర్వాత నుంచి కనిపించకుండా పోయింది. దీంతో ఆమె బంధువులు మిస్సింగ్ కేసుగా ఫైల్ చేశారు. కానీ ఆమె ఆచూకీ ఎక్కడన్నది కానరాకుండా పోయింది. ఆ తర్వాత కొన్నాళ్లకి ఆమె ఇండియానాలోని ఓ గ్రామంలో చనిపోయినట్లు పోలీసులు కనుగొన్నారు. అక్కడ ఆమెకు సంబంధించిన వస్తువులు హైహిల్స్, బంగారు ఉంగరం తదితర వస్తువులను కొన్నీగా స్వాధీనం చేస్తుకున్నారు విచారణలో ఆమె వేటగాళ్ల చేతిలో శవమైనట్లు విచారణలో తేలింది. ఆమె మృతదేహానికి సంబంధించిన అవశేషాలు అదృశ్యమైన కొన్నీ లోరైన్ అవశేషాలతో సరిపోలాయి. దీంతో ఆమె గురించి వారి బంధువులకు తెలయజేయాలనే ఉద్దేశ్యంతో కరోనర్ కార్యాలయంలో ఫోరెన్సిక్ ఆంత్రోపాలజీ విభాగంలో స్టోర్ చేశారు పోలీసులు. ఆమె తుపాకీ గాయం కారణంగా మరణించినట్లు పోస్ట్మార్టం రిపోర్ట్లో వెల్లడైంది. అయితే కొన్నీ లోరైన్ హత్య ఎలా జరిగిందనేది తెలియరాలేదు పోలీసులకు. అయితే విచారణలో వాకింగ్ కోసం బయటకు వచ్చిందని, అప్పుడామె నాలుగు నెలల గర్భవతి అని తేలింది. అలాగే ఆమెకు ఓ ఏడాది కూతురు కూడా ఉందని, ఆమెను తన తోపాటు బయటకు తీసుకువెళ్ల లేదని తేలింది. ఇక ఇండియానా స్టేట్ పోలీస్ ఫోరెన్సిక్ లాబరేటరీ ఆమెకు సంబంధించిన అవశేషాలను, డీఎనే రిపోర్ట్ని వెబ్సెట్లో అందుబాటులో ఉంచడమే గాక ఆమె దుస్తులను, తాలుక వస్తువులను భద్రపరిచారు. ఆమె అవశేషాలు బంధువులకు చేర్చేలా గుర్తింపు చర్యలు ముమ్మరంగా సాగించింది. ఎట్టకేలకు ఆమె అవశేషాలు ఘటన జరిగిన 41 ఏళ్లకు ఆమె కూతురు చెంతకు చేరాయి. ఆమె తాలుకు బంగారపు ఉంగరం, వజ్రాలు అన్నింటిని అధికారలు ఆమెకు అందజేశారు. తన తల్లి ఏమైందీ? ఎక్కడుంది? అనే సమాధానంలేని వేల ప్రశ్నకు ఆ కూతురికి ఇన్నేళ్లకు సమాధానాలు దొరికాయి. తల్లి గురించి తెలుసుకోగలిగానని ఆనందపడాలో ఎలా అనాథలా చనిపోయిందని తెలుసుకుని బాధపడాలో తెలియని ఉద్విగ్న స్థితితో ఉక్కిరిబిక్కిరి అయ్యింది కొన్నీ లోరైన్ కూతురు. పైగా తన తల్లి ఆచూకి కనీసం ఇప్పటికైనా తనకు తెలిసేలే కృషి చేసినందుకు పోలీసులుకు వేవేల కృతజ్ఞతలు తెలుపుకుంది. ఆ అవశేషాలను ఖననం చేసి..తన తల్లికి భారంతో కూడిన హృదయంతో ఘనంగా వీడ్కోలు పలికింది ఆ కూతురు. (చదవండి: వింత ఘటన: ఓ మహిళ టూత్బ్రెష్ని అనుకోకుండా మింగేసింది! అంతే..) -
వేటగాళ్ల నయా ట్రెండ్
చంద్రగిరి (తిరుపతి జిల్లా): వన్యప్రాణుల వేటలో వేటగాళ్లు కొత్త రూటులు వెతుకుతున్నారు. గతంలో వన్యప్రాణులను వేటాడేందుకు తుపాకులు, ఉచ్చులను వాడేవారు. అయితే ఇప్పుడు వేట కుక్కలను ఇందుకు వినియోగిస్తున్నారు. వీటితో వన్యప్రాణులను వేటాడుతున్నారు. ఇందుకోసం వేట కుక్కలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. వన్యప్రాణులను వేటాడాక వాటి మాంసాన్ని భారీ ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా తిరుపతి జిల్లా చంద్రగిరి మండల పరిధిలోని పనపాకం సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి తిరుగు ప్రయాణమవుతున్న తమిళనాడుకు చెందిన ఇద్దరు వేటగాళ్లను అటవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ద్విచక్ర వాహనంతో పాటు రెండు వేట కుక్కలను అదుపులోకి తీసుకుని పనపాకం అటవీ కార్యాలయానికి తరలించారు. పనపాకం పరిసర ప్రాంతాల్లో విచ్చలవిడిగా వేట.. గత కొంతకాలంగా పనపాకం పరిసరాల్లోని ఈటలదొడ్డి, బొప్పిగుట్ట, వెదురుల కొండ, కందరవారి గుట్ట, మొరవగట్టు, నచ్చు బండ, గుడిసె గుట్ట, దొంగలబండ, మాలవాడి చెరువు ప్రాంతాల్లో విచ్చలవిడిగా వేట సాగిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే తమిళనాడు నుంచి వచ్చిన మంజు, సాయిలకు స్థానికంగా ఉండే ఓ వ్యక్తి సహకరిస్తున్నట్లు చెబుతున్నారు. వీరు ఆదివారం రాత్రి వేటకు వెళ్లినా ఫలితం లేకపోవడంతో సోమవారం తిరుగు ప్రయాణంలో అటవీ అధికారులకు పట్టుబడ్డారు. వేటగాళ్ల సెల్ఫోన్లను పరిశీలించిన అటవీ అధికారులు ఆశ్చర్యపోయారు. వాటిలో వేట కుక్కలకు శిక్షణ ఇచ్చే వీడియోలు, కుక్కలు.. అడవి పందులను వేటాడే వీడియోలు ఉన్నాయి. గతంలోనూ పనపాకం పరిసర ప్రాంతాల్లో స్థానికులతోపాటు ఇతర ప్రాంతాలవారు వేట సాగించినట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అటవీ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కఠిన చర్యలు తీసుకుంటాం.. అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణులను వేటాడితే ఎంతటివారిపైనైనా కఠిన చర్యలు తీసుకుంటాం. సోమవారం పనపాకం అటవీ చెక్పోస్టు వద్ద స్వా«దీనం చేసుకున్న కుక్కలు పెంపుడు జంతువులే. వేటకు శిక్షణ ఇచ్చేందుకు వీటిని తీసుకొ చ్చినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని పూచీకత్తుపై విడుదల చేశాం. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించాం. స్వా«దీనం చేసుకున్న శునకాలను సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు చర్యలు చేపట్టాం. – మాధవీలత, ఎఫ్ఆర్వో, పనపాకం రేంజ్ -
రాకాసి మొసలి
ఈ రాకాసి మొసలి అమెరికాలోని మిసిసిపీ రాష్టంలో వేటగాళ్ల బృందానికి దొరికింది. యజూ నదిలో ఇటీవల వేటకు వెళ్లిన వేటగాళ్ల బృందానికి ఈ అతిభారీ మొసలి చిక్కింది. దీని పొడవు 14.3 అడుగులు, బరువు 364.007 కిలోలు. మిసిసిపీలో ఇదివరకు దొరికిన భారీ మొసలి కంటే ఇది పొడవులోను, బరువులోను ఎక్కువగా ఉండటంతో ఈ మొసలి కొత్త రికార్డును నెలకొల్పింది. మిసిసిపీలోనే 2017లో ఒక భారీ మొసలి దొరికింది. దాని పొడవు 14.0 అడుగులు, బరువు 347.67 కిలోలు. యజూ నది ఒడ్డుకు చేరువలో ఉండే జనాలు ఇక్కడకు తమ పెంపుడు కుక్కలను విహారానికి తీసుకొస్తుంటారు. కొంతకాలంగా ఈ మొసలి ఒడ్డుకు వచ్చి తిరుగుతూ, దొరికిన కుక్కనల్లా పలారం చేసేస్తుండటంతో దీనికోసం వేటగాళ్లు రంగంలోకి దిగాల్సి వచ్చింది. వేటగాళ్లు పట్టి తెచ్చిన ఈ మొసలి పొడవు, బరువు వివరాలను మిసిసిపీ వన్యప్రాణులు, జలచరాలు, ఉద్యానవనాల సంరక్షణ శాఖ అధికారులు నమోదు చేసుకున్నారు. ఆరేళ్ల కిందట దొరికిన భారీ మొసలి రికార్డును ఇది అధిగమించిందని వారు ప్రకటించారు. -
వజ్రాల వేట.. కొందరికే ‘అదృష్టం’.. ఇక్కడే ఎందుకంటే?
తొలకరి పలకరించగానే వారిలో ఆశలు చిగురిస్తాయి. సద్ది సిద్ధం చేసుకుని పొలాల బాట పడతారు. నేలలో అణువణువూ శోధిస్తారు. ప్రతి రాయి కదుపుతారు. మెరిసే రాళ్లను సేకరిస్తారు. వాటిని తీసుకెళ్లి ఏజెంట్లకు చూపుతారు. అది వజ్రమైతే వారి పంట పండినట్లే! లేదంటే మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతారు. ఇలా ఏటా వజ్రాల వేట నిరాటంకంగా సాగుతోంది. దశాబ్దాలుగా సాగుతున్న ఈ వేటలో కొందరు లక్షాధికారులు కాగా... మరికొందరు అన్వేషకులుగానే మిగిలిపోయారు. అనంతపురం డెస్క్: వజ్రాల పేరు చెప్పగానే టక్కున గుర్తుకొచ్చే ఊరు వజ్రకరూరు. ఇక్కడ దొరుకుతున్న వజ్రాల కారణంగానే కవులూరు గ్రామం కాస్తా కాలక్రమేణా కరూరుగా.. వజ్రకరూరుగా రూపాంతరం చెందింది. ఇక్కడ వజ్రాలు ఉన్నట్లు బ్రిటీష్ హయాంలోనే గుర్తించారు. అప్పట్లోనే ప్రత్యేక కంపెనీ ఏర్పాటుచేసి అన్వేషణకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వపరంగా వజ్రాన్వేషణ అంత లాభదాయకంగా లేదు కానీ.. సామాన్యుల అన్వేషణ మాత్రం ఏటా కొనసాగుతూనే ఉంది. ప్రతి ఏటా జూన్ మొదటి వారంలో తొలకరి వర్షాలు మొదలు కాగానే వజ్రకరూరు ప్రాంతం కొత్త వ్యక్తులతో కళకళలాడుతూ ఉంటుంది. వజ్రకరూరు చుట్టూ ఐదు కిలోమీటర్ల మేర ఎర్రనేలలు జనంతో రద్దీగా కనిపిస్తాయి. ఒక్కో పొలంలో 30–40 మంది వజ్రాల కోసం వెతుకుతుంటారు. బలమైన వర్షాలు పడినప్పుడు ఈ సంఖ్య వందకు పైగానే ఉంటుంది. వాననీటి ప్రవాహం వల్ల భూమిలోని వజ్రాలు పైకి తేలి.. దిగువ ప్రాంతాలకు కొట్టుకొచ్చే అవకాశం ఉండడంతో ఎక్కువమంది ఆ దిశగా అన్వేషణ సాగిస్తుంటారు. స్థానికులే కాకుండా ఉమ్మడి అనంతపురం జిల్లా నలుమూలలు, కర్నూలు, వైఎస్సార్ జిల్లాలు, కర్ణాటక ప్రాంతాల నుంచి కూడా వాహనాల్లో ఇక్కడికి వచ్చి వజ్రాన్వేషణలో నిమగ్నమవుతున్నారు. ఇతర ప్రాంతవాసుల రాక 15 ఏళ్లుగా ఎక్కువైంది. కొందరు రోజుల తరబడి స్థానికంగానే ఉంటూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వజ్రకరూరు ప్రాంతంలో లభించే వజ్రాలు అత్యంత విలువైనవిగా చెబుతుంటారు. రూ.లక్ష మొదలుకుని రూ.50 లక్షలకు పైగా విలువైన వజ్రాలు ఇక్కడ లభిస్తున్నట్లు సమాచారం. వజ్రకరూరు, రాగులపాడు, కమలపాడు, బోడిసానిపల్లి, పొట్టిపాడు గ్రామాల పరిధిలోని ఎర్ర నేలల్లో అన్వేíÙంచే వారికి ఏటా 15 నుంచి 20 వజ్రాలు దొరుకుతున్నట్లు అంచనా. వీటిని గుత్తి, కర్నూలు జిల్లా పెరవలి, జొన్నగిరి తదితర ప్రాంతాలకు చెందిన వ్యాపారులు గుట్టుచప్పుడు కాకుండా కొనుగోలు చేస్తున్నారు. వజ్రం రంగు, జాతిని బట్టి క్యారెట్ల రూపంలో లెక్కగట్టి ధర నిర్ణయిస్తున్నారు. విక్రయదారులకు డబ్బుతో పాటు బంగారం ముట్టజెబుతున్నారు. విక్రయదారులకు ధర నచ్చని పక్షంలో టెండర్ పద్ధతిలో వజ్రాలను వ్యాపారులు కొనుగోలు చేస్తుండడం గమనార్హం. వజ్రాన్వేషణ జరిగే ప్రాంతాల్లో ప్రత్యేకంగా తమ మనుషుల (ఏజెంట్లు)ను పెట్టి వజ్రాలు దొరికిన వారి సమాచారం వ్యాపారులు సేకరించుకుంటున్నారు. వజ్రకరూరుతో పాటు ఈ ప్రాంతానికి 50 కి.మీ.లోపే దూరం ఉన్న కర్నూలు జిల్లా జొన్నగిరి, తుగ్గలి, పగిడిరాయి ప్రాంతాల్లోనూ వజ్రాలు లభిస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో వజ్రాలు లభించే కింబర్లైట్ పైపులు భూఉపరితలానికి అతి దగ్గరలో ఉన్నాయని గనులు, భూగర్భశాఖ అధికారులు చెబుతున్నారు. దానికితోడు ఈ ప్రాంతంలోని భూమి గడిచిన ఐదువేల సంవత్సరాల్లో దాదాపు అర కిలోమీటరు మేర కోతకు గురైందని, అందుకే ఇక్కడ తరచూ వజ్రాలు దొరుకుతున్నాయని అంటున్నారు. వజ్రకరూరు ప్రాంతంలో వజ్రాన్వేషణకు 1934 సంవత్సరంలోనే బ్రిటీష్ వారు ‘ది న్యూ వజ్రకరూరు డైమండ్ మైనింగ్ కంపెనీ లిమిటెడ్’ స్థాపించారు. వజ్రాలు లభించే పొలాలను సేకరించారు. ఈ కంపెనీని స్వాతంత్య్రం వచ్చాక 1970లో నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎండీసీ) పరిధిలోకి తెచ్చారు. 1974 నుంచి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) ఆధ్వర్యంలో వజ్రాన్వేషణ చేపడుతున్నారు. ఈ సంస్థ ఆధ్వర్యంలోనే వజ్రకరూరులోని వజ్రాల ప్రక్రమణ కేంద్రం (డైమండ్ ప్రాసెసింగ్ ప్లాంట్) నడుస్తోంది. ఒకప్పుడు ఇక్కడ కార్యకలాపాలు చురుగ్గా జరిగేవి. వివిధ కారణాలతో ప్రస్తుతం మందగించాయి. కొన్ని ప్రైవేటు సంస్థలు కూడా ఈ ప్రాంతంలోని వజ్ర నిక్షేపాలపై దృష్టి సారించినప్పటికీ మైనింగ్కు మాత్రం ముందుకు రాలేదు. -
వేటగాళ్ల ఉచ్చుకు యువకుడు బలి
తిర్యాణి(లింగాపూర్): కొమురంభీమ్ జిల్లా లింగాపూర్ మండలం దంపూర్ గ్రామంలో అడవి జంతువుల కోసం వేటగాళ్లు వేసిన ఉచ్చుకు గురువారం రాత్రి ఓ యువకుడు బలయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తిర్యాణి మండలం దంతన్పెల్లి గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు భీమన్న దేవుని గంగస్నానం కోసం గురువారం దంపూర్ గ్రామం మీదుగా కాలినడకన జన్నారం వైపు వెళ్లారు. గంగస్నానం ముగించుకుని తిరిగి వస్తున్న క్రమంలో రాత్రివేళ దంపూర్ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో జంతువుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి దంతన్పల్లి గ్రామానికి చెందిన ఆత్రం భీమ్రావు(21) అక్కడికక్కడే మృతి చెందాడు. భీమ్రావుతోపాటు ఉన్న ఆత్రం పావుగా అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఇతడికి లింగాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అనంతరం ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి ఆత్రం భీము ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపార
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
- Rishabh Pant: భారీ ప్రమాదం నుంచి మైదానం వరకు..
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Advertisement