-
దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలి
తిరుచానూరు : దేశాభివృద్ధిలో విద్యార్థులు, యువకులు కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సూచించారు. తిరుపతి ఎంజీఎం ఉన్నత పాఠశాలలో మూడు రోజులుగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఇన్స్పైర్ ఎగ్జిబిషన్ గురువారం ముగిసింది. ముగింపు సమావేశంలో మంత్రి మాట్లాడుతూ బాల్యంలోనే మేధావులుగా తీర్చిదిద్దేందుకు ఇన్స్పైర్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్రంలో విద్యావిధానంలో మార్పు తీసుకురానున్నట్లు తెలిపారు. ఆడియో, వీడియో లెర్నింగ్ పద్ధతిని తీసుకురానున్నట్లు వెల్లడించారు. అనంతరం జాతీయ స్థాయి ఇన్స్పై ర్ ఎగ్జిబిషన్కు ఎంపికైన విద్యార్థులకు ప్రశంసాపత్రాలను అందజేశారు. జాతీయ స్థాయికి ఎంపికైన విద్యార్థులు తిరుపతిలో జరిగిన రాష్ట్రస్థాయి ఇన్స్పైర్ ఎగ్జిబిషన్కు ఏడు జిల్లాల నుంచి విద్యార్థులు, గైడ్టీచర్లు పాల్గొని వారు రూపొందించిన ప్రయోగాత్మక నమూనాలను ప్రదర్శించారు. ఈ నమూనాలను పరిశీలించిన న్యాయనిర్ణేతలు 24 ఉత్తమ నమూనాలను జాతీయస్థాయికి ఎంపిక చేశారు. వారిలో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలువాయి ఎస్ఎంఎస్వో హైస్కూల్ విద్యార్థి ఎస్కే.మౌలాఅలీ(బీ.రాధాకృష్ణ), నెల్లూరు శ్రీనగర్ కాలనీ వోవల్ స్కూల్ విద్యార్థినీ ఎన్.సంజన, సంగం-తరునవాయి జెడ్పీ హైస్కూల్ విద్యార్థి జీ.రామ్బాబు, సూళూరుపేట-రంగన్నపట్టెడ జెడ్పీపీ హెచ్ఎస్ విద్యార్థి జీ.నాగరాజు ఉన్నారు. ion -
విశాఖకు ఉజ్వల భవిష్యత్తు
రాష్ట్రానికే తలమానికం పరిశ్రమల ఏర్పాటుకు వనరులు అమోఘం మంత్రి గంటా, ఏపీఐఐసీ చైర్మన్ కృష్ణయ్య అనకాపల్లి: ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం అత్యంత ప్రాముఖ్యత గల ప్రాంతంగా రూపుదిద్దుకోనుందని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. అనకాపల్లి బైపాస్రోడ్డులోని ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు క్యాంపు కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో గంటా మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని ఎక్కడో నిర్ణయించనప్పటికీ విశాఖ అభివృద్ధిలో ముందుకు వెళ్లడం ఖాయమని, దీనికి మాస్టర్ప్లాన్ రూపకల్పన జరుగుతుందని తెలిపారు. పారిశ్రామిక అభివృద్ధికి అనుగుణంగా రహదారులు విస్తరించాల్సి ఉందని, అవసరమైన చోట ఫ్లైఓవర్లు నిర్మించాలని పేర్కొన్నారు. జిల్లాలో ప్రభుత్వ, దేవాదాయ, అటవీ భూములను గుర్తించి పరిశ్రమల ఏర్పాటుకు వినియోగించుకునే ప్రతిపాదన ఉందని, దీనికి గానూ ల్యాండ్బ్యాంక్ ఏర్పాటు చేసే ఆలోచన ఉందన్నారు. రాష్ట్రంలో 11 సంస్థలు, 13 పోర్టుల నిర్మాణం జరగనుందని వివరించారు. అనకాపల్లి మండలంలో కూడా ప్రభుత్వ భూములు ఉన్నాయని వాటిని గుర్తించి పరిశమ్రలకు వినియోగించాలని యోచిస్తున్నామన్నారు. గతంలో ఏపీఐఐసీ ద్వారా పరిశ్రమల ఏర్పాటుకు భూములు పొందిన యాజమాన్యాలు వాటిని వినియోగించనట్టు తెలుస్తోందని, అసెంబ్లీ సమావేశాల తర్వాత ఆ సంస్థల ఎండీలు, సీఇఓలతో సమావేశమై భవిష్యత్ ప్రణాళికపై దిశానిర్ధేశం చేస్తామని తెలిపారు. ఏపీఐఐసీ చైర్మన్ కృష్ణయ్య మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటులో నిబంధనలు కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. విశాఖపట్నం రాష్ట్రానికే తలమానికమని, ఇక్కడున్న వనరులు, వాతావరణ స్థితిగతుల కారణంగా పరిశ్రమలతో పాటు అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించేందుకు అవకాశం ఉందని వివరించారు. విశాఖపట్నం భవిష్యత్లో హేపినింగ్ సీటీగానే కాక హేపీ సిటీగా రూపుదిద్దుకుంటుందని ఆశాభావం వ్యక్తం చే శారు. ఎంపీ అవంతి శ్రీనివాసరావు మాట్లాడుతూ విశాఖపట్నంలో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని చెప్పారు. ఆర్థిక నగరంగా విశాఖ అభివృద్ధి చెందుతుందన్నారు. ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ తన నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములున్నాయని, తద్వారా ఉద్యోగ అవకాశాలు మెరగుపరుస్తామని పేర్కొన్నారు. పెందుర్తి ఎంఎల్ఏ బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ తన నియోజకవర్గంలోని ఫార్మాసిటీ పరిధిలో ఉన్న సమస్యలు, డిమాండ్లు వివరించారు. ఈ సందర్భంగా ఏపీఐఐసీ చైర్మన్ కృష్ణయ్యను మంత్రి గంటా, ఎంపీ అవంతితో పాటు ఎమ్మెల్యేలు దుశ్శాలువా కప్పి సీల్డుతో సన్మానించారు. పాయకరావుపేట ఎమ్మెల్యే వి. అనిత, పరవాడ జడ్పీటీసీ పైలా జగన్నాథరావు, అనకాపల్లి దేశం పార్టీ నాయకులు బుద్ధ నాగజగదీశ్, మళ్ల సురేంద్ర, రొంగళి శ్రీరామమూర్తి, కాయల మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
Advertisement