-
త్వరలో ఖైదీలకు క్షమాభిక్ష
సాక్షి, హైదరాబాద్: యావజ్జీవశిక్ష పడిన ఖైదీల క్షమాభిక్షను త్వరలో అమలు చేస్తామని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి జైళ్లశాఖ ఉన్నతాధికారులతో కూడిన కమిటీ ఇటీవలే ముసాయిదా విధి విధానాలు తయారు చేసి ప్రభుత్వానికి అందజేసినట్టు తెలిపారు. ప్రభుత్వ స్థాయిలో ఖైదీల విడుదలకు రివ్యూ కమిటీని ఏర్పాటు చేసి త్వరలో తగు నిర్ణయం తీసుకుంటామన్నారు. నూతనంగా నిర్మించిన జైళ్లశాఖ ప్రధాన కార్యాలయాన్ని శుక్రవారం హోంమంత్రి నాయిని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో మరెక్కడా లేనివిధంగా తెలంగాణ జైళ్లశాఖను తీర్చిదిద్దామని వివరించారు. మహాపరివర్తన కార్యక్రమం ద్వారా ఖైదీలలో మార్పులు తీసుకొస్తున్నామని చెప్పారు. జైళ్లశాఖ కేవలం ఖైదీల భద్రతా విధులు మాత్రమే కాకుండా.. వారిని ప్రధాన మానవ వనరుగా పరిగణించి పలు సామాజిక సేవా అభివృద్ధి పథకాలు రూపొందించడం అభినందనీయమన్నారు.చంచల్గూడ జైలు తరలింపునకు కనీసం నాలుగేళ్ల సమయం పట్టవచ్చని పేర్కొన్నారు. జైళ్లశాఖ ఆధ్వర్యంలో ఉద్యోగమేళా: డీజీ వీకే సింగ్ జైళ్లశాఖ ఆధ్వర్యంలో శిక్ష పడిన ఖైదీలకు వివిధ రంగాలలో శిక్షణ ఇస్తున్నట్టు డెరైక్టర్ జనరల్ (డీజీ) వీకే సింగ్ తెలిపారు. శిక్ష పూర్తి చేసుకుని జైలు నుంచి బయటకు వెళ్లినవారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఒకట్రెండ్ నెలల వ్యవధిలో ఉద్యోగమేళా నిర్వహిస్తామన్నారు. ఇందుకోసం వివిధ కంపెనీలను ఆహ్వానిస్తామని తెలిపారు. నల్లగొండ జిల్లా దేవరకొండలో ప్రభుత్వం కేటాయించిన వెయ్యి ఎకరాల్లో ఓపెన్ జైలు ఏర్పాటుచేయనున్నట్టు చెప్పారు. ఖైదీలను గౌరవప్రదమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుతున్నామని, భవిష్యత్తులో జైళ్లశాఖ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. కార్యక్రమంలో జైళ్లశాఖ హైదరాబాద్ రేంజ్ డీఐజీ నర్సింహ, వరంగల్ రేంజ్ డీఐజీ కె.కేశవనాయుడు, చంచల్గూడ జైలు సూపరింటెండెంట్ సైదయ్య ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
బంగారు తెలంగాణలో పసిడి చోరీలా?
- రాష్ట్రంలో నేరాలు బాగా పెరిగాయి: ఎమ్మెల్సీ ప్రభాకర్ - ప్లేబాయ్ క్లబ్లకు అనుమతులా?:పొంగులేటి సుధాకర్రెడ్డి - శాంతి భద్రతలు బాలేదని ప్రజలంటే రాజీనామా చేస్తా: నాయిని సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై గురువారం శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో విపక్ష, అధికార సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరిగింది. బంగారు తెలంగాణలో దొంగలు బంగారాన్నంతా దోచుకుంటున్నారని.. పోలీసులు మాత్రం సెల్ఫోన్లలో పేకాట ఆడుకుంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నేరాలు బాగా పెరిగాయని జాతీయ క్రైమ్ రికార్డులు చెబుతున్నాయన్నారు. పొత్తి కడుపులో మాదక ద్రవ్యాలతో ఓ ఆఫ్రికన్ యువతి హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పట్టుబడటం, సోషల్ మీడియా ఆధారంగా నగరంలో ఓ మహిళ ఐఎస్ఐఎస్ వైపు యువతను మళ్లిస్తుండటం వంటి సంఘటనలు చూస్తుంటే శాంతి భద్రతలపై ప్రభుత్వం పట్టించుకోవడం లేదనిపిస్తోందన్నారు. హైదరాబాద్ను విశ్వనగరంగా చేయాలంటున్న సర్కారు... భద్రతపై దృష్టిసారించకపోతే పెట్టుబడిదారులు హైదరాబాద్కు రారన్నారు. శాంతిభద్రతల సమస్య దృష్ట్యా పేకాట క్లబ్లను మూసేయించామని చెబుతున్న సర్కారు... మాదాపూర్లో ప్లేబాయ్ క్లబ్లకు ఎందుకు అనుమతి ఇచ్చిందో చెప్పాలని మరో సభ్యుడు పొంగులేటి సుధాకర్రెడ్డి డిమాండ్ చేశారు. విపక్ష సభ్యుల వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన హోంత్రి నాయిని నర్సింహారెడ్డి రాష్ట్రంలో శాంతి భద్రతలు సజావుగా లేవని ప్రజలతో అనిపిస్తే తాను పదవికి రాజీనామా చేస్తానని, బాగున్నాయని ప్రజలు చెబితే రాజీనామా చేస్తారా అంటూ సవాల్ విసిరారు. దేశంలోని ముఖ్య నగరాల కంటే హైదరాబాద్లోనే క్రైమ్రేట్ తక్కువగా ఉందని నాయిని స్పష్టం చేశారు. 2013లో 513 గొలుసు దొంగతనాలు జరగ్గా 2014లో కేసులు 388కు తగ్గాయని...2015 ఆగస్టు నాటికి 206 కేసులే నమోదయ్యాయన్నారు. కరుడు కట్టిన నేరస్తులపై పీడీ యాక్ట్ మోపుతున్నామని, నేరాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి పోలీస్ నిఘా పెంచామన్నారు. లక్ష సీసీ కెమెరాల ఏర్పాటు టెండరు ప్రక్రియ ప్రారంభమైందని, కమాండ్ అండ్ కంట్రోల్స్టేషన్ నిర్మాణాన్ని కూడా వేగవంతం చేస్తున్నామన్నారు. ప్రభాకర్ ‘పేకాట’ వాఖ్యలను తప్పుబట్టిన మంత్రి హరీశ్రావు.. నిద్రాహారాలు మాని ప్రజలకు రక్షణ కల్పిస్తున్న పోలీసుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదని, వెంటనే ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలన్నారు. అయితే తాను పోలీస్ కమిషనర్ చేసిన కామెంట్నే ప్రస్తావించానని ప్రభాకర్ సమర్థించుకున్నారు. మరోవైపు గతంలో పేకాట క్లబ్బులను నడిపిన చరిత్ర కాంగ్రెస్ ఎమ్మెల్సీలదేనన్న మంత్రి హరీశ్ వాఖ్యలపై విపక్షనేత షబ్బీర్ అలీ మండిపడ్డారు. పేకాట క్లబ్బులను న డిపిన ఎమ్మెల్సీలు సభలో ఉంటే వారి పేర్లు చెప్పాలని, మాజీ ఎమ్మెల్సీలైనట్లయితే వారిక్కడ లేనందున ఆరోపణలు చేయడం సంస్కారం కాదని...హరీశ్రావు తక్షణం ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement