-
లండన్ ఎయిర్పోర్టులో ప్రమాదం.. రెండు విమానాల ఢీ..
లండన్: అప్పుడప్పుడు అనుకోకుండా జరిగే చిన్న చిన్న పొరపాట్లు పెద్ద ప్రమాదాలకు కారణమవుతాయి. శనివారం లండన్లోని హీత్రూ విమానాశ్రయంలో వర్జిన్ అట్లాంటిక్ బోయింగ్ 787 విమానం.. బ్రిటిష్ ఎయిర్వేస్ ఎయిర్బస్ A350 విమానాన్ని అనుకోకుండా ఢీ కొట్టిన సంఘటన వెలుగులోకి వచ్చింది. బ్రిటన్లో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఒకటైన హీత్రూలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన ఒక వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణీకులకు ఎలాంటి గాయాలు కాలేదని ఏవియేషన్ అధికారులు తెలిపారు. Just witnessed a plane crash at Heathrow! A tug pushing back a Virgin 787, crashed the wing into a BA A350 #Heathrow #BritishAirways #VirginAtlantic pic.twitter.com/9VmiP6uwQr — Alex Whittles (@PurpleFrogAlex) April 6, 2024 ఈ ప్రమాదం జరిగిన వెంటనే బృందం అప్రమత్తమైంది. ఘటనా స్థలానికి ఫైర్ ఇంజిన్లు కూడా చేరుకున్నాయి. ఇంజినీరింగ్ బృందాలు విమానాలను పర్యవేక్షిస్తున్నాయి. ప్రస్తుతం ఆ వాటిని సర్వీసు తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ ప్రభావం కస్టమర్ల మీద పడకుండా ఉండటానికి ప్రత్యామ్నాయ విమానం అందించినట్లు బ్రిటిష్ ఎయిర్వేస్ ఒక ప్రకటనలో తెలిపింది. Accident at #heathrow involving a #virginatlantic #boeing787 and a #britishairways #A350 #bigjettv @BigJetTVLIVE pic.twitter.com/Hm5Vh6ehrc — specialise cyclists (@slaytor_roger) April 6, 2024 -
ఎయిర్పోర్ట్లో యురేనియం కలకలం
లండన్: లండన్లోని అత్యంత రద్దీగా ఉండే హీత్రో అంతర్జాతీయ విమానాశ్రయంలో యురేనియం ఉన్న పార్సిల్ కలకలం సృష్టించింది. రెండు వారాల క్రితం అంటే గత ఏడాది డిసెంబర్ 29న జరిగిన ఈ ఘటనలో ఆలస్యంగా వెలుగుచూసింది. పాకిస్తాన్లోని కరాచీ నగరం నుంచి ఈ పార్సిల్ బ్రిటన్కు చేరినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. తుక్కు ఖనిజాలకు సంబంధించిన కార్గో పార్సిళ్ల మధ్యలో ఈ యురేనియం నింపిన పార్సిల్ ఒకదానిని ఎయిర్పోర్ట్ కార్గో సిబ్బంది స్కానింగ్ తనిఖీల సమయంలో గుర్తించారు. ఒక ఖనిజం కడ్డీల అడుగున దీనిని దాచి ఉంచినట్లు అధికారులు తెలిపారు. వెంటనే దీనిని బోర్డర్ ఆఫీసర్లకు అప్పగించగా దూరంగా నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి దేశ ఉగ్రవ్యతిరేక దళాలకు ఇచ్చేశారు. దీనిపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. కరాచీ నుంచి ఒమన్లోని మస్కట్కు అక్కడి నుంచి ఒమన్ ఎయిర్లైన్స్ ద్వారా లండన్కు వచ్చినట్లు తేల్చారు. ఇరాన్ జాతీయులకు అందజేసేందుకే దానిని బ్రిటన్కు తరలించారని బ్రిటిష్ మీడియాలో వార్తలొచ్చాయి. పాక్, ఒమన్లలో తనిఖీలను దాటించేసి బ్రిటన్కు యురేనియంను తరలించడం ఆందోళనకర విషయమని బ్రిటన్ సైన్యంలో రసాయనిక ఆయుధాల విభాగం మాజీ అధిపతి హ్యామిస్ బ్రెటన్ గార్డన్ వ్యాఖ్యానించారు. శిలల నుంచి సేకరించే రేడియోధార్మిక యురేనియంను అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, రియాక్టర్లలో ఇంధనంగా వినియోగిస్తారు. జలాంతర్గామి, అణ్వాయుధాల్లోనూ వాడతారు. లండన్ ఎయిర్పోర్ట్లో ప్రత్యక్షమైన పార్సిల్తో మాకు ఎలాంటి ప్రమేయం లేదని పాకిస్తాన్ తేల్చి చెప్పింది. మీడియాలో వచ్చే వార్తలన్నీ ఊహాత్మకమని పాకిస్తాన్ విదేశాంగ శాఖ స్పష్టంచేసింది. -
ఫస్ట్క్లాస్ టికెటెలా కొన్నాడో?
ముంబై: లండన్ హిత్రూ విమానాశ్రయంలో తనకు జాతి వివక్ష అనుభవం ఎదురైందని ప్రముఖ బాలీవుడ్ నటుడు సతీశ్ షా చెప్పారు. ఫస్ట్క్లాస్లో ప్రయాణానికి టికెటెలా కొన్నాడంటూ ఇద్దరు ఎయిర్పోర్టు సిబ్బంది తనను ఉద్దేశించి మాట్లాడుకున్నారని తెలిపారు. భారతీయుడిని కాబట్టి కొన్నానంటూ నవ్వుతూ బదులిచ్చానని వెల్లడించారు. సతీశ్ ట్వీట్ వైరల్గా మారింది. 12,000 లైక్లు రాగా 1,300 మంది రీట్వీట్ చేశారు. భారతీయుడిని కాబట్టి ఖరీదైన టికెట్ కొన్నానంటూ సతీశ్ షా జవాబు చెప్పడం పట్ల నెటిజన్లు హర్షం వ్యక్తం చేశారు. బ్రిటిషర్లు భారత్ను 200 ఏళ్లపాటు పాలించకపోతే ఇప్పుడు భారతీయులకు ఇంగ్లాండ్ ఒక కాలనీగా మారి ఉండేదని ఓ నెటిజన్ అభిప్రాయపడ్డారు. సతీశ్ షా ను హిత్రూ విమానాశ్రయం ట్విట్టర్లో క్షమాప ణ కోరింది. ఆ సంఘటనకు సంబంధించిన ఇతర వివరాలు ఉంటే ఇవ్వాలని విన్నవించింది. -
నేను సేఫ్గా చేరుకున్నా: హీరోయిన్
భారత్లో కరోనా తీవ్రత అధికమవుతుండటంతో జనాలు భయాందోళన చెందుతున్నారు. తారల సంగతి సరేసరి... షూటింగ్స్కు నో చెప్పి ఇంట్లో నుంచి బయట కాలు మోపడం లేదు. ఇక దక్షిణాది కన్నా బాలీవుడ్లో, హాలీవుడ్లో పేరు ప్రఖ్యాతలు గడిస్తున్న హీరోయిన్ రాధికా ఆప్టే తాజాగా ఇండియాకు వచ్చింది. వచ్చిన పని ముగియగానే తిరుగు ప్రయాణమై లండన్లోని హీత్రో ఎయిర్పోర్టులో దిగింది.. అసలే కరోనా భయంతో ఎయిర్పోర్టులో భద్రత కట్టుదిట్టం చేయడమే కాక రకరకాల పరీక్షల పేరిట ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో రాధికాకు విమానాశ్రయంలో ఎన్ని ఇబ్బందులు తలెత్తాయో, ఎంత అసౌకర్యానికి లోనైందోనని ఆమె అభిమానులు, బంధువులు కాస్త కలవరపాటుకు లోనయ్యారు. దీనిపై రాధికా స్పందిస్తూ తనకు ఎలాంటి ఇబ్బంది ఎదురవలేదని, ఎవరూ కంగారు పడాల్సిన పని లేదని స్పష్టం చేసింది. (బొద్దుగా ఉన్నానని వద్దన్నారు!) ‘స్నేహితులు, బంధువుల నుంచి నాకు ఎన్నో మెస్సేజ్లు కుప్పలు తెప్పలుగా వచ్చి పడ్డాయి. మీరు కురిపించిన ప్రేమకు కృతజ్ఞతలు. నేను లండన్లో క్షేమంగా దిగాను. అక్కడ నాకు ఎలాంటి అసౌకర్యం కలగలేదు. ఇమ్మిగ్రేషన్ అధికారులు అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. విమానాశ్రయం అంతా నిర్మానుష్యంగా ఉంది’ అని చెప్పుకొచ్చింది. నిజానికి లండన్ నుంచి భారత్కు వెళ్లే ఫ్లైట్లో అసలు జనాలే లేరని, కానీ అక్కడి నుంచి లండన్కు తిరిగొచ్చే విమానం మాత్రం జనాలతో కిక్కిరిసిపోయిందని తెలిపిందీ మరాఠీ భామ. కరోనా ఎఫెక్ట్తో తన బిజీ షెడ్యూల్కు విరామం ఇచ్చి సామాజిక దూరాన్ని పాటించేందుకు సిద్ధమైనట్లు తన లేటెస్ట్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తెలుస్తోంది. (నా సక్సెస్ భిన్నం బాస్) View this post on Instagram #Golden #lastdayofwork #socialdistancingstartstomorrow A post shared by Radhika (@radhikaofficial) on Mar 17, 2020 at 8:05am PDT -
వీడు మామూలోడు కాడు : వైరల్
లండన్ : అన్నం పెట్టిన ఇంటికే కన్నం పెట్టాడు. తెలివిగా దోచుకున్నానని సంబరపడి అడ్డంగా దొరికిపోయాడు. విలాసవంతమైన జీవితం గడపాలన్న ఓ పనివాడి దుర్బుద్ధి అతడిని జైలు పాలు చేసింది. వివరాల్లోకి వెళితే.. లండన్కు చెందిన రస్సెల్ లిబ్రండ అక్కడి హాత్రో విమానాశ్రయంలోని ‘‘బ్రేజన్ బూట్స్’’ దుకాణంలో పనిచేసేవాడు. కానీ, కొన్ని నెలల క్రితం పనిమానేసి అక్కడినుంచి వెళ్లిపోయాడు. అతడు వెళ్లిపోయిన తర్వాత షాపు యాజమాన్యం నగదు లావాదేవీల్లో పెద్ద మొత్తం తేడాను గమనించారు. ఇందుకు గల కారణం తెలుసుకోవటానికి సీసీ కెమెరాలను పరిశీలించి చూడగా నోరెళ్లబెట్టాల్సిన పరిస్థితి. అక్కడ పని మానేసి వెళ్లిపోయిన లిబ్రండ డబ్బు దొంగలించటం వారికంట పడింది. డబ్బుల కౌంటర్ దగ్గర ఉండే లిబ్రండ కస్టమర్లు ఇచ్చిన నగదును(ముఖ్యంగా పెద్దనోట్లను) మడతపెట్టి అటు ఇటు చూసి టక్కున జేబులో పెట్టుకునే వాడు. తన తలపైనే సీసీ కెమెరా ఉందన్న సంగతి తెలియక విచ్చలవిడిగా డబ్బు దొంగలించాడు. ఇలా ఒక వారంలో 700 పౌండ్ స్టెర్లింగులు మాయం చేశాడు. ఒకటి రెండు సార్లు కాదు ఏకంగా 130 సార్లు మొత్తం 16000(రూ. 13లక్షలు) పౌండ్ స్టెర్లింగులు దొంగలించాడు. దీంతో షాపు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. లిబ్రండ కోసం అతడి ఇంటికి వెళ్లి చూడగా ఖరీదైన బట్టలు, బంగారు నగలు, కంప్యూటర్లు, ఐ ఫోన్స్, టీవీలు దర్శనమిచ్చాయి. వాడ్రోబ్లోని బ్యాగ్లో లిబ్రండ దాచుకున్న 6000 పౌండ్ స్టెర్లింగులు దొరికాయి. దీంతో లిబ్రాండాను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కొద్దిరోజుల తర్వాత కోర్టులో హాజరుపరచగా 18నెలల జైలు శిక్షతో పాటు 2000 పౌండ్ స్టెర్లింగులు జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారికి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం..
ఎన్నికలప్పుడే గుర్తొస్తాయి!
ఓటర్లకు అందుబాటులో ‘చాట్బాట్’ యాప్
హజ్ యాత్రికులకు నేడు వ్యాక్సినేషన్
రోడ్డు ప్రమాదంలో పీఎస్ మృతి
అక్రమ మద్యం అమ్ముతున్న ఇద్దరి అరెస్టు
No Headline
మెరుగైన వైద్యసేవలు అందించాలి
కనీసం ఇలాంటప్పుడైనా చెప్పుకోవడానికి మీరు ఏదైనా చేసుంటే బావుండేద్సార్!
నిలకడగా శిశువు ఆరోగ్య పరిస్థితి
తప్పక చదవండి
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement