-
అధికారులను కదిలించిన ‘బరితెగింపు’ కథనం
తాండూరు/ యాలాల: ఇసుక అక్రమ రవాణాను అధికారులు సీరియస్గా తీసుకున్నారు. తాండూరు, యాలాల పరిధిలోని కాగ్నా, కాక్రవేణి వాగుల నుంచి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న విషయంపై ఈనెల 8వ తేదీన ‘సాక్షి’ పత్రికలో ‘బరి తెగింపు’ శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురితమైంది. దీనిపై సబ్ కలెక్టర్ హరినారాయణ్ స్పందించారు. ఎస్పీ రాజకుమారి, సబ్కలెక్టర్ నేతృత్వంలో మంగళవారం అర్ధరాత్రి విజిలెన్స్ అధికారుల బృందం దాడులు నిర్వహించింది. యాలాల మండలంలోని కోకట్, విశ్వనాథ్పూర్, యాలాల, లక్ష్మీనారాయణపూర్ తదితర ప్రాంతాల్లో విజిలెన్స్ అధికారులు రెండు వాహనాల్లో వచ్చారు. అర్ధరాత్రి ఆయా గ్రామాలతోపాటు వాగుల్లో తనిఖీలు నిర్వహించారు. తాండూరుకు చెందిన సాజిద్, జాకీర్లు రెండు లారీల్లో అక్రమంగా కర్ణాటకకు ఇసుకను తరలిస్తుండగా విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేసి పట్టుకున్నారు. రెండు లారీలు పట్టుపడడంతో ఇసుక మాఫియాకు చెందిన మరో ఆరు లారీలు ఇసుకను నింపుకోకుండానే తప్పించుకుపోయాయి. దాడులతో ఇసుక మాఫియా హడలిపోయింది. అధికారులకు చిక్కకుండా వాహనాలను రహస్య ప్రాంతాలకు తరలించి తప్పించుకున్నారు. బుధవారం ఉదయమే సబ్కలెక్టర్ హరినారాయణ్ యాలాలకు వచ్చారు. కాగ్నా, కాక్రవేణి వాగుల్లో తనిఖీలు నిర్వహించారు. కోకట్ నుంచి కాగ్నా వాగు నుంచి ఓ కిలోమీటర వరకు సబ్ కలెక్టర్ నడుచుకుంటూ వెళ్లి తనిఖీలు చేశారు. సంగమేశ్వర దేవాలయం వరకు వాగులో సబ్కలెక్టర్ ఇసుక తవ్వకాల తీరును పరిశీలించారు. తరువాత విశ్వనాథ్పూర్ గ్రామానికి వెళ్లగా అక్కడ పెద్దఎత్తున ఇసుక డంపు కనిపించగా సబ్కలెక్టర్ ఆశ్చర్యపోయారు. డంప్ను సీజ్ చేయించారు. అనంతరం ఆయన యాలాలకు వెళుతుండగా బాలుర ఉన్నత పాఠశాల సమీపంలో పెద్ద ఇసుక డంప్ చూసి సబ్కలెక్టర్ ఆగ్రహించారు. వెంట ఉన్న యాలాల తహసీల్దార్ వెంకట్రెడ్డిపై మండిపడ్డారు. ‘రోడ్డు పక్కన ఇంత పెద్ద ఇసుక డంపు ఉంటే మీరు ఏం చేస్తున్నారు.. అసలు డ్యూటీ చేస్తున్నారా? నిద్రపోతున్నారా? ఇసుక డంపులు సీజ్ చేయడానికి వికారాబాద్ నుంచి నేనే రావాలా? అంటూ ఆగ్రహించారు. అక్కడ కూడా డంపు సీజ్ చేయించారు. డంపులు ఉంటే మీరేం చేస్తున్నారంటూ యాలాల వీఆర్ఓ అంజిలయ్యపైనా మండిపడ్డారు. వీఆర్ఓకు షోకాజ్ నోటీసు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. సబ్కలెక్టర్ తనిఖీల్లో కోకట్, విశ్వనాథ్పూర్, యాలాల గ్రామాల్లో సుమారు 90 ట్రాక్టర్ల ఇసుక డంపులు బయటపడ్డాయి. వాటిని సీజ్ చేయించారు. ఆర్అండ్బీ చేపట్టే అభివృద్ధి పనులకు సీజ్ చేసిన ఇసుకను వినియోగించేలా చూడాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. అర్దరాత్రి విజిలెన్స్ దాడులతోపాటు ఉదయం సబ్కలెక్టర్ తనిఖీలతో ఇసుక మాఫియాకు ముచ్చెమటలు పట్టాయి. విజిలెన్స్ దాడులతో రాత్రే ఇసుక మాఫియా తోకముడవగా.. ఉదయం సబ్కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీలకు రావడంతో ఇసుకాసురులు బెంబేలెత్తిపోయారు. దాదాపు మూడున్నర గంటలపాటు సబ్కలెక్టర్ తనిఖీలు నిర్వహించడంతో ఇసుక మాఫియా వణికిపోయింది. ఇసుక అక్రమ రవాణాను అరికడతాం: సబ్కలెక్టర్ దాడుల అనంతరం సబ్కలెక్టర్ హరినారాయణ్ యాలాల తహసీల్దార్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఎస్పీతో మాట్లాడి క్రితం రోజు రాత్రి విజిలెన్స్ అధికారులతో తనిఖీలు చేయించినట్టు ఆయన వెల్లడించారు. ఈ తనిఖీల్లో రెండు లారీల్లో కాగ్నా వాగు నుంచి కర్ణాటకలోని గుల్బర్గాకు అక్రమంగా ఇసుక తరలిస్తుండగా బండమీదిపల్లి సమీపంలో విజిలెన్స్ అధికారులు పట్టుకొని సీజ్ చేశారన్నారు. ఈ లారీలను రాత్రే పరిగి పోలీసుస్టేషన్కు తరలించామని చెప్పారు. ఇసుక డంప్లు లభించిన ప్రాంతాలు ఎవరివో గుర్తించి వారిని బైండోవర్ చేస్తామన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందున ఇసుక అక్రమ రవాణాపై పూర్తి స్థాయిలో దృష్టిసారించలేదన్నారు. వచ్చే నెల రోజుల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తామన్నారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న లారీలు, ట్రాక్టర్ల యజమానుల పేర్లు సేకరించామన్నారు. గుర్తించిన వాహనాల యజమానులను బైండోవర్ చేస్తామన్నారు. ఇందుకు రూ.లక్ష పూచీకత్తు తీసుకుంటామని స్పష్టం చేశారు. అయినా మళ్లీ ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. అధికారుల పాత్ర ఉన్నట్టు తేలితే వారిపైనా చర్యలు ఉంటాయన్నారు. రాత్రి సీజ్ చేసిన రెండు లారీలు తాండూరుకు చెందిన సాజిద్, జాకీర్లవిగా గుర్తించామని యాలాల ఎస్ఐ రవికుమార్ చెప్పారు. విజిలెన్స్ అధికారులు రాత్రి తమకు రెండు లారీలతోపాటు డ్రైవర్లు వసీం, మహబూబ్లను తమ కస్టడీకి ఇచ్చారని పరిగి సీఐ ప్రసాద్ చెప్పారు. -
రెండోసారి పట్టుబడితే క్రిమినల్ కేసు
యాలాల: ఇసుక అక్రమ రవాణా చేస్తూ రెండో సారి పట్టుబడితే వాహన యజమానిపై క్రిమినల్ కేసు నమోదు చేయనున్నట్లు సబ్కలెక్టర్ హరినారాయణ్ హెచ్చరించారు. మంగళవారం ఆహార భద్రత కార్డులు, పింఛన్ల దరఖాస్తుల పరిశీలన కార్యక్రమాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. యాలాల తహసీల్దార్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..మండల పరిధితో పాటు తాండూరు కాగ్నా నది నుంచి ఇసుక అక్రమ రవాణకు అడ్డు అదుపులేకుండా పోతోందన్నారు. అక్రమార్కుల చర్యలకు కళ్లెం వేసేందుకు పోలీసు, రెవెన్యూ అధికారుల సమన్వయంతో ముందుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఈ విషయమై ఇప్పటికే జిల్లా ఎస్పీ రాజకుమారితో చర్చించామన్నారు. ఇసుక అక్రమ రవాణ చేస్తూ మొదటిసారి పట్టుబడిన వాహన యజమానికి జరిమానా విధిస్తామని, అదే వాహనం రెండో సారి పట్టుబడితే యజమానిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామన్నారు. మండల పరిధితోపాటు తాండూరు, బషీరాబాద్ మండల పరిధిలోని కాగ్నా నది నుంచి ఇసుక తరలింపునకు ప్రభుత్వపరంగా ఎలాంటి అనుమతి ఇవ్వడం లేదన్నారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడే పలు వాహనాలకు నెంబర్లు లేని విషయాన్ని సబ్కలెక్టర్ దృష్టికి స్థానికులు తేగా జిల్లా రవాణా అధికారితో చర్చించి, అటువంటి వాహనాలు దొరికితే సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఆధార్ సీడింగ్ చేయకున్నా రేషన్ యథాతథం ఆధార్ సీడింగ్ చేయని వారికి రేషన్ కోటా కట్ చేస్తున్నారంటూ వస్తున్న వార్తలను నమ్మవద్దన్నారు. ఆధార్ సీడింగ్ చేసుకున్నా, చేసుకోకపోయినా రేషన్ సరఫరా యథాతథంగా జరుగుతుందని సబ్కలెక్టర్ వివరించారు. అనంతరం బాణాపూర్లో దరఖాస్తుల పరిశీలన కార్యక్రమాన్ని పరిశీలించారు. ఆయనతో పాటు యాలాల తహసీల్దార్ వెంకట్రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ షౌకత్ అలీ తదితరులు ఉన్నారు. -
వికారాబాద్ సబ్కలెక్టర్గా హరినారాయణ్
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: వికారాబాద్ సబ్కలెక్టర్ కాట ఆమ్రపాలి బదిలీ అయ్యారు. రాష్ట్ర స్త్రీ, శిశుసంక్షేమశాఖ డెరైక్టర్గా ఆమెను బదిలీ చేస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె స్థానంలో హరినారాయణ్ను నియమించారు. 2011 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ఈయన తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు. నిజామాబాద్ జిల్లా బోధన్ సబ్కలెక్టర్గా పనిచేసిన ఆయనకు ఇటీవల స్థానచలనం కలిగించినా పోస్టింగ్ ఇవ్వలేదు. దీంతో కొన్ని రోజులుగా పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న హరినారాయణ్ను వికారాబాద్ సబ్కలెక్టర్గా నియమిస్తూ తాజాగా ఉత్తర్వులిచ్చింది. దాదాపు రెండేళ్లు సబ్కలెక్టర్గా పనిచేసిన ఆమ్రపాలి సమర్థ అధికారిగా పేరుతెచ్చుకున్నారు. ముక్కుసూటితనంతో పాలనా వ్యవ హారాల్లో దూకుడు ప్రదర్శించారు. -
‘అంగన్వాడీ’ ఇంటర్వ్యూలు
బోధన్ టౌన్, న్యూస్లైన్ : జుక్కల్ నియోజక వర్గంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టుల భర్తీ నిమిత్తం శనివారం బోధన్లో ఇంటర్వ్యూలు నిర్వహించారు. అభ్యర్థులను జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ సింధే, సబ్ కలెక్టర్ హరినారాయణన్ ఇంటర్వ్యూ చేశారు. జుక్కల్ నియోజకవర్గంలో మూడు అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు, ఎనిమిది మినీ అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు, 11 అంగన్వాడీ ఆయాల పోస్టుల భర్తీ కోసం ఇంటర్వ్యూలు నిర్వహించామని సబ్ కలెక్టర్ పేర్కొన్నారు. ఎంపికైన వారి జాబితాను త్వరలో మద్నూర్ సీడీపీఓ కార్యాలయానికి పంపుతామని తెలిపారు. నేడు బాన్సువాడకు.. ఆదివారం బాన్సువాడ నియోజకవర్గానికి సంబంధించి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు సబ్ కలెక్టర్ తెలిపారు. ఉదయం 10 గంటలకు బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయానికి రావాలని సూచించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement