-
నోటిఫికేషన్లో అర్హతలే అంతిమం..పిటిషనర్ అప్పీల్ను కొట్టేసిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యాసంస్థల్లో ప్రిన్సిపాల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లో పేర్కొన్న అర్హతలే అంతిమమని హైకోర్టు స్పష్టం చేసింది. సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం అవసరం లేదని భావిస్తూ.. పిటిషన్ను కొట్టివేసింది. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని గురుకుల విద్యాసంస్థల్లో ప్రిన్సిపాల్ పోస్టుల భర్తీకి 2017లో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. బీఈడీలో, పోస్టు గ్రాడ్యుయేషన్లో ఒకే రకమైన సబ్జెక్టులు చదివిన వారే అర్హులన్న నిబంధన పెట్టింది. అయితే పీజీలో, బీఈడీలో వేర్వేరు సబ్జెక్టులు చదివిన వారిని కూడా అర్హులుగా పరిగణనలోకి తీసుకునేలా ఉత్తర్వులు జారీ చేయాలని నిజామాబాద్ జిల్లాకు చెందిన కె.శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ వాదనను సింగిల్ జడ్జి తోసిపుచ్చారు. దీనిపై పిటిషనర్ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. సీజే జస్టిస్ సతీష్చంద్రశర్మ, జస్టిస్ అభినంద్కుమార్ షావిలి ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది కె.ఉదయశ్రీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరఫున డి.బాలకిషన్ రావు వాదనలు వినిపించారు. పిటిషనర్ బయోసైన్స్, తెలుగు మెథడాలజీలో బీఈడీ చేశారని, పీజీలో కెమిస్ట్రీ చేశారని బాలకిషన్రావు పేర్కొన్నారు. ఇదే తరహా పిటిషన్ను గతంలో హైకోర్టు కొట్టేసిందని గుర్తు చేశారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం.. సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యాసంస్థల ప్రిన్సిపాల్ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ జారీ చేసిన నోటిఫికేషన్లోని అర్హతలే అంతిమమని తీర్పునిచ్చింది. పిటిషన్ను కొట్టేసింది. -
‘రిజర్వేషన్ల అక్రమాలపై విచారణ జరిపించాలి’
సాక్షి, హైదరాబాద్: గురుకుల టీచర్ల నియామకాలలో టీఎస్పీఎస్సీ రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేయలేదని, దానిపై విచారణ జరిపించాలని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్లోని బీసీ కమిషనర్ కార్యాలయాన్ని నిరుద్యోగులతో కలిసి ముట్టడించారు. ముట్టడి అనంతరం బీసీ కమిషన్ చైర్మన్ బి.ఎస్.రాములు, వి.కృష్ణ మోహన్, ఆంజనేయులు గౌడ్, గౌరి శంకర్తో కూడిన బెంచ్ ముందు నిరుద్యోగులతో కలిసి సమావేశమై పలు అభిప్రాయాలను వెల్లడించారు. -
గురుకుల టీచర్ల భర్తీలో అవకతవకలు: కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నిర్వహిం చిన గురుకుల టీచర్ల భర్తీలో రిజర్వేషన్ల అమలులో అవకతవకలు, అక్రమాలు జరిగాయని బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్లోని బీసీ భవన్లో నిరుద్యోగ అభ్యర్థులు నిర్వహించిన సమావేశానికి కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. గురుకుల టీచర్ల రిక్రూట్మెంట్ రిజర్వేషన్ల అమలులో అక్రమాలు జరగడంతో వందలాది మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉద్యోగాలు రాకుండా తీవ్ర అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. ఓపెన్ కాంపిటీషన్లో రావాల్సిన మెరిట్ అభ్యర్థులను రిజర్వేషన్లలో భర్తీ చేశారని, సర్వీస్ కమిషన్ వారు తప్పుడు విధానాలను అవలంబిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభ్యర్థులకు జరిగిన అన్యాయంపై పబ్లిక్ సర్వీస్ కమిషనర్ వెంటనే చర్యలు తీసుకోకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో గుజ్జ కృష్ణ, కోట్ల శ్రీనివాస్, బి.ఆర్.కృష్ణ, బర్క కృష్ణ యాదవ్ పాల్గొన్నారు. -
గురుకుల టీచర్ల భర్తీకి రెండంచెల పరీక్ష
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ గురుకుల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 2,444 పోస్టుల భర్తీలో అమలు చేయాల్సిన పరీక్షల విధానాన్ని ప్రభుత్వం ఖరారు చేసింది. టీఎస్పీఎస్సీ మొదటిసారిగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీని చేపడుతుండడంలో కొత్త విధానాన్ని రూపొందించింది. రెండంచెల విధానంలో (ప్రిలిమినరీ, మెయిన్) ఈ పరీక్షలను నిర్వహించాలని స్పష్టం చేసింది. అన్ని పోస్టులకు నిర్వహించే పరీక్షల్లో ఆబ్జెక్టివ్ విధానాన్ని అనుసరించాలని పేర్కొంది. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ), పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), ప్రిన్సిపల్ పోస్టులకు రెండంచెల్లో పరీక్షలను నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నా.. మొదటి పరీక్షకు ప్రిలిమినరీ అనే పేరు మాత్రం పెట్టలేదు. అదే జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ పోస్టులకు నిర్వహించే పరీక్షలకు మాత్రం ప్రిలిమినరీ (స్క్రీనింగ్ టెస్టు) పరీక్ష, మెయిన్ పరీక్ష నిర్వహిస్తామని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ గురువారం జీవో 229 జారీ చేశారు. ప్రిన్సిపల్, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ పోస్టుల భర్తీలో 30 మార్కులతో ఇంటర్వ్యూ/డెమాన్స్ట్రేషన్/ముఖాముఖి ఉం టుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పోస్టు ల భర్తీకి డిస్క్రిప్టివ్ విధానం అమల్లోకి తెచ్చే ఆలోచనలు జరిగినా, ఆబ్జెక్టివ్ విధానంలోనే పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం ఓకే చెప్పింది. ఇదీ పేపర్ల విధానం టీచర్ పోస్టులకు.. ►మొదటి పరీక్షలో ఒక పేపరు ఉంటుంది. పేపరు-1: జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, బేసిక్ ప్రొఫీషియెన్సీ ఇన్ ఇంగ్లిష్ అంశాల్లో ప్రశ్నలు ఉంటాయి. 150 ప్రశ్నలతో 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. 150 నిమిషాల సమయం ఇస్తారు. ► రెండో పరీక్షను మెయిన్ ఎగ్జామినేషన్గా 300 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. పేపరు-1: ఈ పరీక్షను 150 మార్కులకు నిర్వహిస్తారు. పెడగాజీ/స్కూల్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అంశాల్లో ప్రశ్నలు ఉంటాయి. 150 ప్రశ్నలు, 150 మార్కులు, 150 నిమిషాలు. పేపరు-2: సంబంధిత సబ్జెక్టులో నిర్వహిస్తారు. 150 ప్రశ్నలు, 150 మార్కులు, 150 నిమిషాలు. ప్రిన్సిపల్ పోస్టులకు.. ► మొదటి పరీక్షలో ఒక పేపరు ఉంటుంది. పేపరు-1: జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, బేసిక్ ప్రొఫీషియెన్సీ ఇన్ ఇంగ్లిష్ అంశాల్లో ప్రశ్నలు ఉంటాయి. 150 ప్రశ్నలతో 150 మార్కులకు నిర్వహిస్తారు. 150 నిమిషాల సమయం ఇస్తారు. ► రెండో పరీక్షను మెయిన్ ఎగ్జామినేషన్గా నిర్వహిస్తారు. రెండు పేపర్లు ఉంటాయి. పేపరు-1: పెడగాజీ, స్కూల్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అంశాల్లో ప్రశ్నలు ఉంటాయి. 150 ప్రశ్నలు, 150 మార్కులు, 150 నిమిషాలు. పేపరు-2: రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్ వర్క్, స్కూల్ ఆర్గనైజేషన్, టీచర్ ఎంపవర్మెంట్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అంశాల్లో ప్రశ్నలుంటాయి. 150 ప్రశ్నలు, 150 మార్కులు, 150 నిమిషాలు. అదనంగా 30 మార్కులకు ఇంటర్వ్యూ/డెమాన్స్ట్రేషన్/ముఖాముఖి ఉంటుంది. జూనియర్ లెక్చరర్ పోస్టులకు.. ►ప్రిలిమినరీ పేరుతో మొదటి పరీక్ష ఉంటుంది. పేపరు-1: జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, బేసిక్ ప్రొఫీషియెన్సీ ఇన్ ఇంగ్లిష్ అంశాల్లో ప్రశ్నలు ఉంటాయి. 150 ప్రశ్నలతో 150 మార్కులకు నిర్వహిస్తారు. 150 నిమిషాల సమయం ఇస్తారు. ►రెండో పరీక్షను మెయిన్ ఎగ్జామినేషన్గా నిర్వహిస్తారు. ఇందులో 2 పేపర్లు ఉంటాయి. పేపరు-1: పెడగాజీ, స్కూల్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అంశాల్లో ప్రశ్నలు ఉంటాయి. 100 ప్రశ్నలు, 100 మార్కులు ఉంటాయి. 90 నిమిషాల సమయం ఇస్తారు. పేపరు-2: సంబంధిత సబ్జెక్టులో ఉంటుంది. 200 మార్కులకు 200 ప్రశ్నలతో నిర్వహిస్తారు. 180 నిమిషాల సమయం ఇస్తారు. అదనంగా ఇంటర్వ్యూ/డెమాన్స్ట్రేషన్/ముఖాముఖి 30 మార్కులకు ఉంటుంది. డిగ్రీ లెక్చరర్, ఫిజికల్ డెరైక్టర్ పోస్టులకు ► ప్రిలిమినరీ (స్క్రీనింగ్ టెస్టు) పేరుతో మొదటి పరీక్ష ఉంటుంది. పేపరు-1: జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, బేసిక్ ప్రొఫీషియెన్సీ ఇన్ ఇంగ్లిష్ అంశాల్లో ప్రశ్నలు ఉంటాయి. 150 ప్రశ్నలతో 150 మార్కులకు నిర్వహిస్తారు. ► రెండో పరీక్షను మెయిన్ ఎగ్జామినేషన్గా నిర్వహిస్తారు. ఒక పేపరు ఉంటుంది. పేపరు-1: సంబంధిత సబ్జెక్టులో ఉంటుంది. 300 మార్కులకు నిర్వహిస్తారు. 150 ప్రశ్నలకు 150 నిమిషాల సమయం ఉంటుంది. అదనంగా ఇంటర్వ్యూ/డెమాన్స్ట్రేషన్/ముఖాముఖి 30 మార్కులకు ఉంటుంది. ఆర్ట్, క్రాఫ్ట్ తదితర స్పెషల్ టీచర్లకు పేపరు-1గా ఒక పేపరు ఉంటుంది. ఇందులో జనరల్ స్టడీస్, సంబంధిత సబ్జెక్టులో జ్ఞానంపై 200 మార్కులకు 200 ప్రశ్నలతో పరీక్ష నిర్వహిస్తారు. 180 నిమిషాల సమయం ఇస్తారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
Advertisement