-
పైజామా జేబులో బొంగరం
‘అర్ధరాత్రి సమయం. అమ్మ నగలన్నీ వేసుకుంది. తక్కినవి మూట కట్టుకుంది. నాకంటే ఆరేళ్లు చిన్నది చెల్లెలు. దానికి పాలు బాగా తాగించి భుజాన వేసుకుంది. నేను మాత్రం నాకున్న ఒకే ఒక ఆస్తి బొంగరాన్ని నా పైజామా జేబులో పెట్టుకున్నాను. అందరం కాందిశీకులంగా మారి ఆవలి సరిహద్దుకు బయలుదేరాం. చీకటి. భీతి గొలుపుతున్న అరణ్యమార్గం. అందరి కళ్లు చీమ చిటుక్కుమన్నా రెప్పలు విప్పార్చి భయంతో, కోపంతో మొరిగినట్టుగా చూస్తున్నాయి. నడిచాం.. నడిచాం.. అమ్మ రక్తపు వాంతి చేసుకుంది. చెల్లి భుజం నుంచి జారి మట్టిలో కలిసిపోయింది. నేను నా బాల్యాన్ని అక్కడే భూస్థాపితం చేసి ఇటువైపుకు చేరుకున్నాను’... గుల్జార్ కవిత ఇది. దేశ విభజన సమయంలో అతనికి పన్నెండు పదమూడేళ్లు ఉంటాయి. నేటి పాకిస్తాన్ లోని జీలం నుంచి వాళ్ల కుటుంబం ఢిల్లీకి చేరుకుంది. రెఫ్యూజీ క్యాంప్లో గుల్జార్ బాల్యం గడిచింది. ఇక్కడకొచ్చాక కూడా వీళ్లుంటున్న రోషనారా రోడ్, సబ్జీమండీల్లో నరమేధాన్ని చూశాడు. ‘మా స్కూల్లో రోజూ ప్రేయర్ చదివే కుర్రాణ్ణి చంపారు’ అంటాడు. ‘సబ్జీమండీలో శవాల మీద పాత కుర్చీలు, విరిగిన మంచాలు వేసి తగలబెట్టడం చూశాను’ అంటాడు. ‘ఇరవై ముప్పై ఏళ్లు అవే పీడకలల్లో వెంటేడేవి’ అని వగస్తాడు. సిక్కులు కష్టజీవులు. గుల్జార్ తండ్రి టోపీలు, చేతిసంచుల దుకాణం తెరిచాడు. పాకిస్తాన్ నుంచి వచ్చిన సిక్కులు ‘మా ఊరివాడు ఒక్కడు కనిపించినా చాలు’ అని వెతుక్కుంటూ తిరిగేవారు. కొందరు గుల్జార్ తండ్రి దగ్గరకు వచ్చి గుల్జార్ వాళ్ల ఇంట్లోనే తల దాచుకునేవారు. ‘మా ఇల్లే ఒక రెఫ్యూజీ క్యాంప్గా మారింది. నాకు పడుకోవడానికి చోటే లేదు’ అని చెప్పుకున్నాడు గుల్జార్. ఇదీ ఒకందుకు మంచిదే అయ్యింది. గుల్జార్కు కరెంటు లేని స్టోర్రూమ్ ఇవ్వబడింది. ఒకడే కుర్రవాడు.. తోడుగా లాంతరు. వీధి చివరకు వెళ్లి పావలా ఇస్తే వారంలో ఎన్ని పుస్తకాలైనా అద్దెకు తెచ్చుకోవచ్చు. అలా గుల్జార్ పఠనం స్టోర్రూమ్లో లాంతరు కింద మొదలైంది. ‘ఒకరోజు ఒక పుస్తకం అద్దెకు తెచ్చుకున్నాను. అది ఇంతకుముందు చదివిన పుస్తకాల వలే లేదు. చదివాను. మరసటి రోజు అదే రచయిత రాసిన మరో పుస్తకం చదివాను. భలే అనిపించింది. ఆ తర్వాత ఆ రచయిత సెట్ అంతా ఉర్దూలో ఉంటే తెచ్చుకుని చదివాను. దారీ తెన్నూ లేని ఒక కాందిశీక పిల్లవాడి జీవితాన్ని మార్చడానికే బహుశా ఆ రచయిత నాకు తారసపడ్డాడేమో. అతని పేరు రవీంద్రనాథ్ టాగోర్’ అంటాడు గుల్జార్. ఇంటి నిండా కాందిశీక బంధుమిత్రులు ఉండిపోవడంతో గుల్జార్కు జరిగిన మరో మంచి బొంబాయిలో ఉన్న సోదరుడి దగ్గర ఉండమని తండ్రి పంపించడం. అక్కడే గుల్జార్ సొట్టలుపోయిన కార్లకు పెయింట్ వేసే పని మొదలెట్టాడు. అప్పటికే అతడికి రంగులు తెలుసు. బొమ్మలు తెలుసు. కవిత్వంలోని పదచిత్రాలు తెలుసు. ‘ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ ’ (పి.డబ్బ్యు.ఏ) వారాంతపు మీటింగ్లకు వెళ్లి కవిత్వం చదివితే సినీకవి శైలేంద్ర మెచ్చుకుని బిమల్ రాయ్కు పరిచయం చేశాడు. ‘కార్లకు పెయింట్ వేయడం కంటే సినిమాల్లో రాస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి’ అని బిమల్ రాయ్ ‘బందిని’లో మొదటి పాట రాయించాడు– ‘మోర గోర అంగ్ లైలె’. తర్వాత గుల్జార్ హృషీకేశ్ ముఖర్జీకి ప్రధాన అనుచరుడయ్యాడు. ఆ తర్వాత సాగిందంతా గుల్జార్ జైత్రయాత్ర. గుల్జార్ కవి, రచయిత, స్క్రీన్ ప్లే రైటర్, సినీ కవి, మాటల రచయిత, దర్శకుడు. అనువాదకుడు, బాలల రచయిత, టెలివిజన్ డైరెక్టర్... ‘హర్ ఫన్ మౌలా’. సకల కళాకోవిదుడు. ‘నేను నా దేశవాసుల మనోఫలకం మీద కవిగా మిగలాలని కోరుకుంటున్నా’ అని అభిలషిస్తాడు గుల్జార్. అయితే మన దేశంలో పాప్యులర్ కల్చర్లో ఉన్న వ్యక్తి సీరియస్ సాహిత్యంలో ఎంత పని చేసినా ఎంతో ఎరుకతో వ్యవహరిస్తే తప్ప సాహిత్యముద్రను ముందువరుసలో పొందలేడు. గుల్జార్ సాహిత్యకృషి కంటే అతని సినిమా కృషే ఎప్పుడూ ముందుకొస్తూ ఉంటుంది. గుల్జార్ కవిత్వానికి ఉన్న పాఠకుల కంటే అతని సినిమా పాటలకు ఉన్న శ్రోతలు విస్తారం కావడమే కారణం. చిత్రమేమిటంటే గుల్జార్కు ‘దాదాసాహెబ్ ఫాల్కే’ వచ్చినప్పుడు ఆనందించినవారు ఎందరో మొన్న ‘జ్ఞానపీఠ్’ ప్రకటించినప్పుడు సంతోషించినవారు అందరు. ఇలా ‘దాదాసాహెబ్’, ‘జ్ఞానపీఠ్’ రెండూ అందుకున్న సృజనమూర్తి మన దేశంలో ప్రస్తుతానికి మరొకరు లేరు. ‘ఎప్పుడైనా ఒంటరిగా కూచుని నా కవిత్వం మొత్తం చూసుకున్నప్పుడు ఇందులో ఇంత ఉదాసీనత ఎందుకుందా అని బెంగటిల్లుతాను’ అంటాడు 90 ఏళ్లకు సమీపిస్తున్న గుల్జార్. జీవితాన్ని, ప్రేమను, మానవీయ అనుబంధాలను, ప్రకృతి ప్రదర్శించే ఐంద్రజాలంలో పొందగల ఆనందాలను... ఊరటను, చిన్నచిన్న ఫిర్యాదులను, పెద్దపెద్ద సర్దుబాట్లను రాస్తూ వచ్చిన గుల్జార్ ఈ దేశపు వర్తమాన ముఖచిత్రాన్ని అనునిత్యం న్యూస్పేపర్లలో చూసి ఉదాసీనత చెందుతూనే ఉంటాడు. మరల మరల ప్రేమను పంచాల్సిన సంకల్పాన్ని పొందుతూనే ఉంటాడు. కత్తులు నిద్రలేచే రాత్రులు మరోమారు దేశంలో అరుదెంచకూడదని కలవరపడే గుల్జార్, పైజామా జేబులో బొంగరాన్ని దాచుకుని బుగ్గలపై కన్నీటి చారికలతో మిగిలిన మరో బాలుడి గాథ ఈ దేశం భవిష్యత్తులో వినరాదని దుఆ చేస్తాడు. హిందీని, ఉర్దూను కలిపి తాను మాట్లాడేభాషను ‘హిందూస్తానీ’గా పేర్కొనే గుల్జార్ తన పేరుకు తగ్గట్టు ఈ హిందూస్తాన్ ఒక పూలతోటై విరబూయాలని, సుగంధాలను వెదజల్లుతూనే ఉండాలని కలంతో సందేశాలను పంపుతూనే ఉంటాడు. -
Jnanpith Awards 2023: గుల్జార్, రామభద్రలకు జ్ఞానపీఠ్
న్యూఢిల్లీ: ప్రముఖ ఉర్దూ కవి గుల్జార్, సంస్కృత పండితుడు జగద్గురు రామభద్రాచార్య ప్రతిష్టాత్మక 58వ జ్ఞానపీఠ్ పురస్కారానికి ఎంపికయ్యారు. జ్ఞానపీఠ్ ఎంపిక కమిటీ శనివారం ఈ విషయం వెల్లడించింది. 2023వ సంవత్సరానికి గాను ఈ ఇద్దరు ప్రముఖులకు అవార్డు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలియజేసింది. 2022వ సంత్సరానికి గాను గోవా రచయిత దామోదర్ మౌజోకు జ్ఞానపీఠ్ లభించింది. ప్రసిద్ధ బాలీవుడ్ సినీ రచయిత, ఉర్దూ కవి సంపూరణ్ సింగ్ కాల్రా అలియాస్ గుల్జార్(89)ను ఇప్పటికే ఎన్నో పురస్కారాలు వరించాయి. 2002లో సాహిత్య అకాడమీ అవార్డు స్వీకరించారు. 2013లో దాదాసాహెబ్ ఫాలే్క, 2004లో పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. ఐదు సార్లు జాతీయ ఫిలిం అవార్డు పొందారు. స్లమ్డాగ్ మిలియనీర్, మాచీస్, ఓంకారా, దిల్ సే, గురు వంటి చిత్రాల్లో ఆయన రాసిన పాటలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. స్లమ్డాగ్ మిలియనీర్లోని ‘జై హో’ పాటకు 2009లో ఆస్కార్ అవార్డు దక్కింది. బహుముఖ ప్రజ్ఞాశాలి రామభద్రాచార్య ఉత్తరప్రదేశ్లో జన్మించిన జగద్గురు రామభద్రాచార్య(74) మధ్యప్రదేశ్లోని చిత్రకూట్లో తులసీ పీఠాన్ని స్థాపించారు. రామానంద ప రంపరలో ప్రస్తుతం ఉన్న నలుగురు జగద్గురువుల్లో ఆయన కూడా ఒకరు. రెండు నెలల వయసులో ఇన్ఫెక్షన్ వల్ల కంటి చూపు కోల్పోయారు. ఐదేళ్ల వయసులోనే భగవద్గీతను, ఎనిమిదేళ్ల వయసులో రామచరితమానస్ను కంఠస్తం చేశారు. రామభద్రాచార్య బహు ముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగాంచారు. 22 భాషల్లో మాట్లాడగలరు. సంస్కృతం, హిందీ, అవ«దీ, మైథిలీ తదితర భాషల్లో రచనలు చేశారు. 240కిపైగా పుస్తకాలు రాశారు.2015లో కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది. -
ఆ విషయాన్ని సిగ్గులేకుండా అడిగేశా: విద్యాబాలన్
బాలీవుడ్ నటి విద్యాబాలన్ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. స్టార్ హీరోలతో తనదైన నటనతో మెప్పించింది భామ. న్యూ ఇయర్ వేళ 44వ వసంతంలో అడుగుపెట్టింది సీనియర్ నటి. ఆమె బర్త్డే సందర్భంగా పలువురు ప్రముఖులు ఆమె విషెష్ తెలియజేశారు. కెరీర్లో విద్యాబాలన్కు ఎదురైన అనుభవాలను గతంలో ఓ ఇంటర్వ్యూలో మీడియాతో పంచుకున్నారు. అప్పట్లో ప్రముఖ దర్శకుడు గుల్జార్ సినిమాలో నటించాలని తన కోరిక అని తెలిపింది. ఆయన సినిమాలో నటించేందుకు ఎలాంటి సిగ్గులేకుండా అడిగానని చెప్పుకొచ్చింది. 'ఏక్ యాడ్ ఫిల్మ్ కర్ లీజియే మేరే సాథ్' అని అడిగానని వెల్లడించింది. (ఇది చదవండి: Chiranjeevi: ఆ విషయంలో చరణ్కు, నాకు పోలికే లేదు) విద్యాబాలన్ మాట్లాడుతూ..' దేవుడి దయ వల్ల నా అవసరాలు తీరాయి. మా తల్లిదండ్రులు మాకు స్వేచ్ఛ ఇచ్చారు. మా సోదరి యాడ్ ఏజెన్సీకి వైస్ ప్రెసిడెంట్. నేను సినిమాల్లోకి రావాలనుకున్నా. కానీ నేను ఎప్పుడూ దీర్ఘకాలికమైన లక్ష్యాలు పెట్టుకోలేదు. నేను భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచిస్తా. దానివల్ల నా జీవితం సంతోషంగా ఉంది. నేను గుల్జార్ సాబ్తో కలిసి పనిచేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా. కానీ అతను ఇకపై దర్శకత్వం వహించడని తెలిసింది. చాలాసార్లు గుల్జార్ సాబ్తో 'ఏక్ యాడ్ ఫిల్మ్ కర్ లీజియే మేరే సాథ్' అని సిగ్గులేకుండా అడిగా. నేను ఉడీ అలెన్తో కూడా పని చేయాలనుకుంటున్నా' అని అన్నారు. 2005లో సంజయ్ దత్ నటించిన పరిణీత చిత్రంతో విద్యాబాలన్ బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత లగే రహో మున్నా భాయ్ (2006), భూల్ భూలయ్యా (2007), ది డర్టీ పిక్చర్ (2011), మిషన్ మంగళ్ (2019) లాంటి సూపర్ హిట్ చిత్రాలలో నటించింది. శకుంతలా దేవి (2020) మూవీలోనూ మెరిసింది విద్యా చివరిసారిగా సురేష్ త్రివేణి చిత్రం జల్సాలో జర్నలిస్ట్ పాత్రలో కనిపించింది. ఈ చిత్రంలో షెఫాలీ షా, మానవ్ కౌల్ కూడా నటించారు. ఆమె తదుపరి చిత్రంలో నటుడు ప్రతీక్ గాంధీ సరసన నటిస్తోంది. ఇందులో ఇలియానా డిక్రూజ్, సెంధిల్ రామమూర్తి కూడా నటిస్తున్నారు. కాగా.. గుల్జార్ మౌసం (1975), అంగూర్ (1982), మాచిస్ (1996), హు టు టు (1999) సినిమాలకు దర్శకత్వం వహించారు. (ఇది చదవండి: నిర్మాతతో డేటింగ్.. అఫీషియల్గా ప్రకటించిన నటి) -
భజ్జీ మాటలే నిజమయ్యాయి.. పీసీఏ అధ్యక్ష పదవికి రాజీనామా
పంజాబ్ క్రికెట్ అసోసియేషన్(పీసీఏ)లో అక్రమాలు ఎక్కువయ్యాయంటూ టీమిండియా మాజీ క్రికెటర్ హర్బజన్ సింగ్ ఇటీవలే పేర్కొన్న సంగతి తెలిసిందే. బోర్డు సభ్యులు పేర్లు బయటపెట్టకుండా హర్భజన్ చేసిన వ్యాఖ్యలు పంజాబ్ క్రికెట్లో కలకలం రేపింది. పీసీఏ చీఫ్ అడ్వైజర్గా ఉన్న భజ్జీ చేసిన వ్యాఖ్యలే తాజాగా నిజమయ్యాయి. పీసీఏ అధ్యక్షుడిగా ఉన్న గుల్జార్ ఇందర్ సింగ్ చహల్ బుధవారం రాత్రి తన పదవికి రాజీనామా చేశాడు. పీసీఏలో గుల్జార్ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. గుల్జార్ సహా అతని బృందం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. కాగా మే నెలలో పీసీఏ అధ్యక్షుడిగా ఎన్నికైన గుల్జార్కు ఆ పదవి మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. తనపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలడంతో పదవికి రాజీనామా చేస్తున్నట్లు గుల్జార్ చహల్ పేర్కొన్నారు. ఇక హర్భజన్ రాసిన లేఖలో ఏముందంటే.. ''ప్రస్తుత పీసీఏ అధ్యక్షుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్నాడని గడిచిన వారం పది రోజులుగా పంజాబ్ క్రికెట్ ప్రేమికులు, స్టేక్ హోల్డర్ల నుంచి పలు ఫిర్యాదులు అందుకుంటున్నా.ఇది పారదర్శకత,క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని నాకు అనేక ఫిర్యాదులు అందుతున్నాయి. ఓటింగ్ హక్కులతో దాదాపు 150 మంది సభ్యులను చేర్చుకోవడానికి పీసీఏ తీవ్రంగా ప్రయత్నిస్తుందని తెలుస్తున్నది. ఇది బీసీసీఐ రాజ్యాంగానికి విరుద్ధం. అంతేగాక పీసీఏ మార్గదర్శకాలు, పారదర్శకత ఉల్లంఘన కిందికే వస్తుంది.. ఈ వ్యవహారానికి సంబంధించి ఇదివరకే బీసీసీఐ అంబుడ్స్మెన్ కు ఫిర్యాదులు కూడా అందినట్టు తెలుస్తున్నది. పీసీఏలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు తమపై వచ్చిన ఆరోపణలను కప్పిపుచ్చుకోవడానికి, అక్రమాలను దాచడానికి కనీసం సాధారణ సమావేశాలకు కూడా పిలవకుండా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. వారి స్వప్రయోజనాల కోసం క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు'' అంటూ పేర్కొన్నాడు. చదవండి: పంజాబ్ క్రికెట్ అసోసియేషన్కు భజ్జీ వార్నింగ్.. -
AR Rahman: 'ఈ ఒక్కసారి నా పిలుపు వినండి’
‘ఇప్పటివరకూ చాలా విన్నారు ఈ ఒక్కసారి నా పిలుపు వినండి’ అని భూమి తల్లి పిలుస్తోంది. ‘ఈ జగతి ఆశతో నిండి ఉంది. ఈ నేల నీలిమతో నిండి ఉంది. హాయిగా ఊపిరి పీల్చుకోండి. స్వస్థత పడండి’ అని చెబుతోంది. మహమ్మారి రోజులలో మనుషులకు స్థయిర్యం ఇచ్చేందుకు గుల్జార్ రాసిన ‘మేరి పుకార్ సునో’ పాటను రహమాన్ కంపోజ్ చేశారు. ఆరుగురు గాయనులు గానం చేశారు. ఈ కాలానికి అవసరమైన గీతం ఇది. కరోనా మహమ్మారి వేళ ప్రజలందరూ ధైర్యాన్ని కోల్పోయారు. స్థయిర్యాన్ని జార్చుకున్నారు. వారిని తిరిగి వారిలా చేయాలి. అందుకు అమ్మే పూనుకోవాలి. అలా భూమి తల్లి తన పిల్లలకు ధైర్యం చెప్పడానికి పిలుస్తున్న పిలుపునే ‘మేరి పుకార్ సునో’ పాటగా ఆస్కార్ అవార్డు గ్రహీత గుల్జార్ రాశారు. మరో ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ.ఆర్.రహమాన్ ట్యూన్ చేశారు. దేశంలోని భిన్న ప్రాంతాలకు చెందిన గాయనీమణులు– అల్కా యాగ్నిక్, శ్రేయా ఘోషాల్, సాధనా సర్గం, చిత్ర, షాషా తిరుపతి, అసీస్ కౌర్ ఆ భూమితల్లికి గొంతునిచ్చారు. సోనీ మ్యూజిక్ ఈ పాటను విడుదల చేసింది. ఈ వెలుతురు తీసుకోండి గుల్జార్ ఈ పాటను గొప్పగా రాశారు. ‘నా నేల మీది బతికే పిల్లలారా... నా మాట వినండి... ఇప్పటి దాకా చాలా విన్నారు... ఈసారి నన్ను వినండి’ అనే పల్లవితో మొదలెట్టారు. చరణంలో భూమి తల్లి చేత ‘సూర్యుని దగ్గర ఎంతో వెలుతురు ఉంది. తీసుకొని పంచుకోండి. ఆకాశం నిండా గాలే. గుండెల నిండా పీల్చుకోండి’... అని అనిపిస్తారు. రెండో చరణంలో ‘ఈ అనంత విశ్వంలో ఈ భూమి ఒక్కటి మీది... ఎన్ని మోకరింపులు ఎన్ని ప్రార్థనలో దీని మీద... జీవితం చాలా ఉంది... మీ మీ మట్టి పొత్తిళ్లను జీవితంతో నింపుకోండి’... అని రాశారు. ఇలా పాటంతా భూమి తన పిల్లలతో మాట్లాడుతుంది. ఏమిటి సందేశం? ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఆందోళన ఉంది. ప్రతి ఒక్కరిలో సంవేదన ఉంది. అయినా పర్వాలేదు. అందరం ఒక్కతాటిపై రావచ్చు. ఒకరికి ఒకరు తోడుగా నిలవచ్చు. ధైర్యాన్ని కూడగట్టుకోవచ్చు. మళ్లీ జీవితాన్ని నిర్మించుకోవచ్చు... మానవులు ఎన్నో కష్టాలు దాటి వచ్చారు... ఈ కష్టం కూడా దాటేస్తారు... అందుకు భూమి తల్లే సాక్ష్యం... అని ఈ పాట చెబుతోంది. ‘ఈ పాట ఒక స్వాంతనం... ఓదార్పు. భూమి తల్లి తన కూతుళ్ల (గాయనుల) ద్వారా జనంతో మాట్లాడుతోంది. ఆమె గొంతును మహిళా సింగర్లు తప్ప ఇంకెవరు వినిపించగలరు. గుల్జార్ గారూ నేను కలిసి చేసిన ఆలోచన ఈ పాట’ అని దీనిని కంపోజ్ చేసిన ఏ.ఆర్.రహమాన్ అన్నారు. ‘ఈ నేల మన నుంచి వాగ్దానం అడుగుతోంది... జీవితాన్ని కోల్పోవద్దని. మనమంతా భూమికి వాగ్దానం చేయాలి... అవును.. మేము లేచి నిలబడతాం... ఈ గాలులు వీచనిస్తాం... ఈ కెరటాలు విరిగి పడుతూనే ఉండేలా చూస్తాం అని చెప్పాలి. ఆ మాటలే పాటలో రాశాను’ అంటారు గుల్జార్. బాధను మర్చిపోవడానికి ‘ఈ లాక్డౌన్ల కాలంలో ఇంట్లోనే ఉండటం కొన్నాళ్లు బాగానే ఉండింది. కాని ఆ తర్వాత బాధ మొదలైంది’ అంటారు చిత్ర. ఆమె ‘మేరి పుకార్ సునో’ పాటలో దక్షణాది ప్రతినిధిగా కనిపిస్తారు. ‘నేను ఇంట్లో ఎక్కువ రోజులు ఉండలేను. ఎందుకంటే నా కూతురు నందన (మరణించింది) జ్ఞాపకాలు చుట్టుముడతాయి’ అంటారామె. ‘నాలాగే ఎందరో ఈ కరోనా కాలంలో ఎంతో బాధను, కష్టాన్ని భరిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈ పాటలాంటిది ఒక పెద్ద ఓదార్పు. రహమాన్ ఎప్పుడు పాడమన్నా నేను మూడు నాలుగు రకాలుగా పాడి వినిపిస్తాను. ఈసారి నేరుగా రికార్డింగ్ లేదు. ఇంటి నుంచి పాడి పంపించాను.’ అన్నారు చిత్ర. ‘అయినవారిని కోల్పోవడం కంటే మించిన బాధలేదు. నా కూతురు మరణించాక అలాంటి దుఃఖమే ఎదురైన వారు నా దగ్గరికొచ్చి ఆ బాధ ఎలా మర్చిపోవాలో చెప్పమ్మా అని అడుగుతుంటారు. నేనేం చెప్పగలను? పనిలో పడితే అదే కొంచమైనా తగ్గుతుంది అంటాను. నా కూతురు పోయిన దుఃఖాన్ని పనిలో పోగొట్టుకునే ప్రయత్నం చేస్తాను. కాని అప్పుడప్పుడు కడుపు భగ్గుమన్న భావన కలుగుతూనే ఉంటుంది’ అంటారు చిత్ర. కష్టకాలంలో కళే మనిషికి ఓదార్పు. ఈ సమయంలో ఇలాంటి పాట స్త్రీల గొంతుక నుంచి వినడం నిజంగానే ఒక అమ్మ నుంచి విన్న నిశ్చింత. తల్లి ఒడిలో తల పెట్టుకున్నంత నెమ్మది. ఇక ఏ భయం లేదన్న దిటవు. ఆ దిటవే ఇప్పుడు కావాలి. – సాక్షి ఫ్యామిలీ
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement