-
అభివృద్ధి పథంలో
శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల నేడు కళాశాల వార్షికోత్సవం యూనివర్సిటీ క్యాంపస్, న్యూస్లైన్: రాయలసీమ ప్రాంతంలో వ్యవసాయ అభివృద్ధి, వ్యవసాయ విద్య, నూతన పరిశోధనల కోసం ఏర్పా టైన ఎస్వీ వ్యవసాయ కళాశాల 53 వసంతాలు పూర్తి చేసుకుంది. శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల 1961లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో(ప్రస్తుతం ఆచార్య ఎన్.జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం) మూడవ కళాశాలగా ఏర్పాటైంది. నాటి నుంచి దిన దినాభివృద్ధి చెందుతూ ఈ రోజున భారతదేశంలో చాలా ముఖ్యమైన వ్యవసాయ కళాశాలగా గుర్తింపు పొందింది. మొట్టమొదట ఈ కళాశాల స్థాపించినప్పుడు వ్యవసాయంలో డిగ్రీ ప్రోగ్రాం మాత్రమే ఉండేది. 1968లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు ప్రారంభించారు. తదనంతరం ఈ కళాశాలలో అన్ని విభాగాల్లో డాక్టరేట్(పీహెచ్డీ) ప్రోగ్రాం కూడా ప్రారంభించారు. భారతదేశంలో మొట్టమొదటి సారిగా 1980-81వ సంవత్సరంలో ఇక్కడి ఆఖరి సంవత్సరం విద్యార్థులకు ‘గ్రామీణ వ్యవసాయ పని అనుభవ పథకం’ ప్రవేశపెట్టారు. దీనిలో విద్యార్థులు ఒక సెమిస్టర్ అంతా రైతులతో పాటు గ్రామాల్లో ఉంటూ, వ్యవసాయంలో మెళకువల గురించి తెలుసుకుంటూ, విశ్వవిద్యాలయం వారి పరిశోధన ఫలితాలను రైతు సోదరులకు అందిస్తూ కోర్సు పూర్తి చేస్తారు. అదే విధంగా ‘వ్యవసాయ కృషి అనుభవ పథకం’ 2010-11లో ప్రారంభించారు. ఈ కళాశాలలో అధ్యాపకులు తరగతుల్లో పాఠాలు బోధించటమే కాకుండా రైతు సోదరులకు పంటలకు సంబంధించిన పరిశోధన ఫలితాలను అందజేస్తున్నారు. ఈ కళాశాల కొట్టాల, నాగయ్యగారి పల్లె గ్రామాలను దత్తత తీసుకుని ఆ గ్రామాల్లోని రైతులకు నిరంతరం వ్యవసాయ సూచనలు ఇస్తూ వారి ప్రగతికి ఇతోధికంగా తోడ్పడుతున్నారు. దినదినాభివృద్ధి చెందుతున్న శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల గురువారం వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. కళాశాల అభివృద్దికి మరింత కృషి చేస్తామని కళాశాల ప్రిన్సిపాల్ ఎన్పీ.ఈశ్వర రెడ్డి తెలిపారు. -
పీజీ కోర్సులకు విద్యార్థులు కరువు
కోదాడటౌన్, న్యూస్లైన్: ఒకప్పుడు యూనివర్సిటీ కళాశాలల్లోనే ఉన్న పోస్టు గ్రాడ్యుయేషన్(పీజీ) కోర్సులలో చేరాలంటే విద్యార్థులు రేయింబవళ్లు కష్టపడి చదవాల్సి ఉండేది. సీటు వస్తే ఎవరెస్టు శిఖరం ఎక్కినట్టు ఆనందపడేవారు. అది గతం. ఇప్పుడు కాలం మారింది. గతంలో పీజీ కోర్సులకు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో యూనివర్సిటీ పరిధిలోని అనుబంధ కళాశాలల్లో కూడా ఈ కోర్సులు ప్రారంభించేందుకు అధికారులు ఇబ్బడి ముబ్బడిగా అనుమతులు ఇచ్చేశారు. దీంతో విద్యార్థుల సంఖ్యకన్నా కోర్సులలో సీట్లు ఎక్కువ కావడంతోపాటు జిల్లాలోని అనుబంధ కళాశాలలు ఉస్మానియా యూనివర్సిటీ పరిధి నుంచి మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోకి రావడంతో విద్యార్థులు జిల్లాలోని కళాశాలల్లో చేరడానికి ముందుకు రావడం లేదు. కోర్సుల కోసం లక్షల రూపాయలతో ల్యాబ్లు నిర్మించి, పరికరాలు కొనుగోలు చేసిన కళాశాలలు విద్యార్థులు చేరకపోవడంతో తలలు పట్టుకున్నాయి. ఒక్కొక్క కోర్సులో 30-40 సీట్లు ఉన్నప్పటికీ సింగిల్ డిజిట్లో కూడా విద్యార్ధులు చేరకపోవడంతో ఏమి చేయాలో అర్ధం కావడం లేదని కళాశాలల నిర్వాహకులు అంటున్నారు. డిమాండ్ కోర్సులకే దిక్కులేదు జిల్లాలోని 28 డిగ్రీ కళాశాలల్లో అనుబంధంగా పీజీ కోర్సులను ప్రారంభించారు. వీటిలో ఎమ్మెస్సీ రసాయనశాస్త్రం, భౌతికశాస్త్రం, గణితశాస్త్రం, జంతుశాస్త్రం, వృక్షశాస్త్రం కోర్సులతో పాటు ఎమ్మెస్సీ బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ కోర్సులను కూడా ప్రైవేట్ కళాశాలలు ప్రారంభించాయి. వీటిలో ఎమ్మెస్సీ రసాయనశాస్త్రానికి ఐదారు సంవత్సరాల వరకు బాగా డిమాండ్ ఉండేది. మెనేజ్మెంట్ కోటాలో కళాశాలల వారు ఒక్కో సీటుకు రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు వసూలు చేసేవారు. ప్రస్తుతం కౌన్సెలింగ్ ఫీజు కంటే తక్కువగా కనీసం రూ.20వేలు చెల్లించి చేరమన్నా చేరేవారు కరువయ్యారు. జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేటలలోని నాలుగు కళాశాలలు మినహా మిగతా 24 కళాశాలల్లో ఒకరి నుంచి ఐదుగురు విద్యార్థులు మాత్రమే చేరారు. వారికి తరగతులు నిర్వహించలేక కొన్ని కళాశాలల వారు వెనక్కి పంపుతుండగా, మరికొందరు ఇతర కళాశాలల్లో చేరమని చెబుతున్నారు. దీంతో విద్యార్థులు అయోమయంలో పడిపోతున్నారు. డిమాండ్ ఉన్న రసాయనశాస్త్రం పరిస్థితే ఇలా ఉంటే మిగతా కోర్సుల పరిస్థితి చెప్పనక్కరలేదు. పీజీ కోర్సుల ప్రారంభానికి ఒక్కో కళాశాల ప్రయోగశాలలు, పరికరాల కోసం రూ.ఐదు లక్షల నుంచి రూ.పది లక్షలు ఖర్చుచేశారు. ఇప్పుడు విద్యార్థులు చేరకపోవడంతో ఆ ఖర్చంత భరించాల్సి వస్తుందని వాపోతున్నారు. పీజీ కోర్సులను పూర్తి చేసినా సరైన ఉపాధి అవకాశాలు దొరక్కపోవడం, ఇంటర్స్థాయి నుంచే విద్యార్థులు ఇంజనీరింగ్ వైపు మరలడంతో ఈ దుస్థితి ఏర్పడుతున్నట్లు విద్యావేత్తలు అంటున్నారు. మీరే నింపుకోండి ఉస్మానియా, మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని పీజీ కోర్సుల కౌన్సెలింగ్ను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించింది. ఇప్పటికే మూడుసార్లు కౌన్సెలింగ్ నిర్వహించినా జిల్లాలోని కళాశాలల్లో చేరేవారు కరువ య్యారు. దీంతో యూనివర్సిటీ అధికారులు చేతులెత్తేసి మీ సీట్లను మీరే నింపుకోండని కళాశాలల వారికి చెప్పి చేతులుదులుపుకున్నారు. దీంతో సగంమంది విద్యార్థులైనా లేకుంటే కాలేజీలు మూసివేసే పరిస్థితి దాపురించటంతో కళాశాలల నిర్వాహకులు విద్యార్థుల వేటలో పడ్డారు. ఈ సంవత్సరం జిల్లాలోని 20కి పైగా డిగ్రీ కళాశాలల్లో పీజీ కోర్సులను మూసివేసుకునేందుకు యాజమాన్యాలు సిద్ధమవుతున్నాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ముస్లిం మహిళలతో కలిసి వైఎస్ భారతి ప్రార్థన
నీ ముఖానికి డ్యాన్సా? ట్రోలింగ్పై స్పందించిన నటి
చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటో చెప్పి చంద్రబాబు కళ్ళు తెరిపించిన జగన్
‘‘అమేథీ నుంచి పోటీలో రాహుల్ బంట్రోతు’’
జగన్ ను కదలనివ్వని జనాభిమానం @హిందుపూర్
Priyamani: ట్రెడిషనల్ డ్రెస్లో కవ్విస్తున్న ప్రియమణి.. లేటెస్ట్ ఫోటోలు వైరల్
చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
కలల సాకారం కోసం పోరాడితేనే 'స్టార్'
తప్పక చదవండి
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- ఆ రాష్ట్రంలో రెండు రోజులు డ్రై డే!
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా?: సెహ్వాగ్ చురకలు
- భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- మీసాలున్నాయని 80 మందిని తొలగించిన కంపెనీ!
Advertisement