-
టీడీపీ నేతల గ్రానైట్ దందా
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ నేతలు విచ్చలవిడిగా దోపిడీ పర్వం సాగించారు. మైనింగ్ మాఫియాకు సహకరించి.. ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన రూ.వందల కోట్ల రాయల్టీని ఎగ్గొట్టి, జేబులు నింపుకున్నారు. డొల్ల కంపెనీలు, దొంగ వే బిల్లులు సృష్టించి ప్రకాశం జిల్లా నుంచి విలువైన గ్రానైట్ను అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలించారు. గ్రానైట్ దోపిడీ వెనుక టీడీపీ మాజీ ఎమ్మెల్యేల పాత్ర ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే, గుంటూరు జిల్లాకు చెందిన ముగ్గురు టీడీపీ మాజీ ఎమ్మెల్యేల ప్రమేయం బయటపడింది. రవాణా శాఖ, సేల్స్ ట్యాక్స్, జీఎస్టీ, విజిలెన్స్ అధికారుల భాగస్వామ్యం ఉన్నట్లు తేలింది. ఒక్కో లారీకి రూ.17 వేలు వసూలు ప్రకాశం జిల్లాలో దాదాపు 2,500 గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఒక్క మార్టూరు ప్రాంతంలోనే 700 వరకు పాలిషింగ్ యూనిట్లున్నాయి. ఇక్కడి నుంచి గ్రానైట్ను ఇతర రాష్ట్రాలకు తరలించాలంటే మూడు సర్టిఫికెట్లు అవసరం. గ్రానైట్ కంపెనీకి చెందిన ఇన్వాయిస్, మైనింగ్ పర్మిట్, ఈ–వే బిల్లు ఉండాలి. చెక్పోస్టుల్లో గానీ, తనిఖీ అధికారులు ఆపినప్పుడు గానీ ఇవి చూపించాల్సి ఉంటుంది. గ్రానైట్ను క్యూబిక్ మీటర్లలో సైజుల వారీగా తరలిస్తారు. సైజులను బట్టి ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించాలి. ప్రతి రూ.లక్ష లావాదేవీకి 18 శాతం జీఎస్టీ (రూ.18,000) చెల్లించాలి. రిజిస్టర్ అయిన కంపెనీ పేరిట ఉన్న మైనింగ్ పర్మిట్, ఈ–వే బిల్లుల ప్రకారం ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించాల్సి ఉంటుంది. కానీ, మైనింగ్ మాఫియా సభ్యులు డొల్ల కంపెనీల పేరిట సృష్టించిన దొంగ ఈ–వే బిల్లులతో గ్రానైట్ లారీలను తరలించారు. దొంగ ఈ–వే బిల్లుల ముద్రణ, నకిలీ మైనింగ్ పర్మిట్ల వ్యవహారం మొత్తం బల్లికురవ కేంద్రంగా సాగినట్లు పోలీసుల విచారణలో తేలింది. అద్దంకి, మార్టూరు నుంచి గ్రానైట్ను సరిహద్దులు దాటించేందుకు ఒక్కో లారీ నుంచి రూ.17 వేల చొప్పున వసూలు చేశారు. ఇందులో రూ.5 వేలు ప్రభుత్వ అధికారులకు, మిగిలిన రూ.12 వేలు టీడీపీ మాజీ ఎమ్మెల్యేలకు వాటాలు ఇచ్చేవారు. అద్దంకి, మార్టూరు నుంచి వినుకొండ, సంతమాగులూరు అడ్డరోడ్డు మీదుగా పిడుగురాళ్ల, దాచేపల్లి, అక్కడినుంచి తెలంగాణకు గ్రానైట్ను అక్రమంగా తరలించేవారు. ఈ మార్గంలో ఎవరైనా అధికారులు ఆపితే వినుకొండకు చెందిన మైనింగ్ మాఫియా రంగప్రవేశం చేసి, వ్యవహారాన్ని చక్కబెట్టేది. ఈ అక్రమ రవాణాకు టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు అండగా నిలిచి రూ.కోట్లు వెనకేసుకున్నారు. గ్రానైట్ దోపిడీ వ్యవహారాన్ని రెండు మూడు రోజుల్లో ఆధారాలతో సహా బహిర్గతం చేయనున్నట్లు ప్రకాశం జిల్లాకు చెందిన ఓ పోలీసు అధికారి చెప్పారు. 270 డొల్ల కంపెనీలు, 16వేల దొంగ వే బిల్లులు ప్రకాశం జిల్లా నుంచి అక్రమంగా తరలిపోతున్న గ్రానైట్ లారీలను ఇటీవల పోలీసులు, విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వినుకొండ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న మైనింగ్ మాఫియాకు చెందిన ఇద్దరు కీలక వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించడంతో అక్రమాల గుట్టు బయటపడింది. 270 డొల్ల కంపెనీలను సృష్టించి, 16,000 దొంగ వే బిల్లులతో ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీని ఎగ్గొట్టినట్లు అధికారులు నిర్ధారించారు. ప్రకాశం జిల్లాలో ఐదు నెలల కాలంలోనే మొత్తం రూ.300 కోట్ల రాయల్టీని ఎగ్గొట్టినట్లు విజిలెన్స్ విభాగం గుర్తించింది. -
భూమి విలువ పెరగనట్టేనా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని భూముల మార్కెట్ విలువ సవరణ ఈ ఏడాదీ జరిగే అవకాశం కనిపించడం లేదు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఇప్పటివరకు జరగని ప్రక్రియకు ఈ ఏడాదైనా అనుమతి వస్తుందని భావించినా, ఇప్పటివరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంతో ఆగస్టు 1 నుంచి అందుబాటులోకి రావాల్సిన సవరణ విలువలు వచ్చేలా లేవు. ఇప్పుడు అనుమతినిచ్చినా ప్రక్రియ పూర్తికి 3నెలలు పడుతుందని, అక్టోబర్ నాటికి సవరించిన విలువలు అందుబాటులోకి వస్తాయని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చెబుతున్నా.. భూముల మార్కెట్ విలువలను సవరించే ప్రక్రియపై సర్కారు ఏమీ తేల్చకపోవడంతో ఈ ఏడాదీ సవరణలు జరిగే అవకాశం లేదని వారు భావిస్తున్నారు. ఆరేళ్ల విలువల ఆధారంగానే.. భూముల క్రయ, విక్రయ లావాదేవీలతో పాటు నష్టపరిహారం చెల్లింపులోనూ మార్కెట్ విలువే కీలకం కానుంది. అయితే, ఉమ్మడి ఏపీలో ఆరేళ్ల క్రితం 2013లో మార్కెట్ విలువను సవరించగా అప్పటి నుంచి అవే ఆధారంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఈ ఆరేళ్లలో జరిగిన అభివృద్ధి, మార్పుల కారణంగా బహిరంగ మార్కెట్లో భూముల విలువలు అమాంతం పెరిగిపోయాయి. ఆరేళ్ల నుంచి మార్కెట్ విలువలో హెచ్చుతగ్గులు లేకపోవడంతో కొన్ని భూములు, ఆస్తులకు రిజిస్ట్రేషన్ల విలువను రెండింతలు ఎక్కువగా వేసి మరీ రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్న సందర్భాలున్నాయి. దీంతో భూముల మార్కెట్ విలువలను సవరించి సహేతుక ధరలను నిర్ధారించాల్సి ఉన్నా ప్రభుత్వం ఆ దిశలో నిర్ణయం తీసుకోవడం లేదు. ఈ ఏడాదీ భూముల విలువలను సవరించే ప్రక్రియకు అనుమతినివ్వాలని కోరుతూ రిజిస్ట్రేషన్ల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు తెలిసింది. ఈ ప్రతిపాదనలపై ప్రభుత్వం ఇప్పటివరకు సమాధానం ఇవ్వకపోవడం గమనార్హం. 50 శాతం అదనపు ఆదాయం ఈ ఆరేళ్ల నుంచి కనీసం 2 సార్లు సవరణ జరగాల్సిన భూముల విలువలు ఆరేళ్ల క్రితం విలువలతోనే ఆగిపోయాయి. ప్రభుత్వ ఖజానాకు ఈ మేరకు రావాల్సిన ఆదాయం తగ్గిపోయింది. మార్కెట్ విలువల సవరణలు జరిగితే రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరుగుతుందని, ప్రభుత్వ ఖజానాకు రిజిస్ట్రేషన్ల ద్వారా 50శాతం ఆదాయం లభిస్తుందని అధికారులు చెపుతున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రూ.5,700 కోట్ల ఆదాయం రాగా, మార్కెట్ విలువలను సవరిస్తే అది రూ.8,500 కోట్లు దాటుతుందని అంచనా. ఇప్పుడు ప్రభుత్వం ఆమోదం తెలిపి అక్టోబర్ నుంచి సవరించిన మార్కెట్ విలువలు వచ్చినా ఈ ఆర్థిక సంవత్సరంలో 1,500 కోట్ల మేర ఆదాయం వస్తుందని తెలుస్తోంది. కానీ, ప్రభుత్వం మాత్రం భూముల విలువలను సవరించేందుకు ససేమిరా అంటుండడం గమనార్హం. సిద్ధమైనా.. పెద్ద కసరత్తే భూముల మార్కెట్ విలువల సవరణ ప్రక్రియకు చాలా కసరత్తు చేయాల్సి ఉంటుంది. ముందుగా రాష్ట్రస్థాయిలో రిజిస్ట్రేషన్లు, వ్యవసాయ, రెవెన్యూ ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలి. ఈ కమిటీ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లా స్థాయిలో కలెక్టర్లు చైర్మన్లుగా కమిటీలను నియమించుకోవాలి. వ్యవసాయ భూములకు ఆర్డీవోలు, వ్యవసాయేతర భూములకు జాయింట్ కలెక్టర్లు కన్వీనర్లుగా కమిటీలను ఏర్పాటు చేసుకుని మండల, గ్రామాల వారీగా భూముల మార్కెట్ విలువను సవరించాల్సి ఉంటుంది. ఆ సవరణ ప్రతిపాదనలను రాష్ట్రస్థాయి కమిటీ పరిశీలించి ప్రభుత్వానికి పంపితే, ప్రభుత్వ ఆమోదం అనంతరం ఉత్తర్వులను జారీ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా జరిగేందుకు కనీసం 3 నెలల సమయం పడుతుందని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చెపుతున్నారు. అయితే, ఆనవాయితీ ప్రకారం భూముల మార్కెట్ విలువలు ఎప్పుడు సవరించినా ఆగస్టు 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. కానీ, ఈ ఏడాది మాత్రం ప్రభుత్వం అనుమతించినా ఆగస్టు1 నుంచి సవరించిన విలువలు అమల్లోకి వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. -
ప్రైవేట్ వ్యక్తి చేతిలో ఖజానా తాళం!
సాక్షి, అమరావతి: పరిపాలనలో పారదర్శకతను కాపాడేందుకు వినియోగించాల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని చంద్రబాబు ప్రభుత్వం అనైతిక చర్యలకు, కమీషన్లు దండుకోవడానికి వాడుకుంటోంది. టెక్నాలజీ పేరుతో ప్రభుత్వ ఫైళ్లు, బిల్లుల చెల్లింపులను ప్రైవేట్ వ్యక్తి చేతుల్లో పెట్టేసింది. సదరు ప్రైవేట్ వ్యక్తి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ ఖజానాను లూటీ చేస్తున్నారు. అందిన చోటల్లా కమీషన్లు మింగేస్తున్నారు. ఈ వ్యవహారం ప్రభుత్వ పెద్దలకు సైతం కాసుల వర్షం కురిపిస్తోంది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ(సీఎఫ్ఎంఎస్) పేరిట సాగుతున్న అవినీతి అంతా ఇంతా కాదు. ఆర్థిక శాఖలో అదనపు కార్యదర్శులకు కూడా ఏం జరుగుతోందో తెలియకుండా పూర్తిగా ప్రైవేట్ వ్యక్తి చేతిలో పెట్టడం ఎంత ప్రమాదమో ప్రభుత్వానికి అర్థం కావడం లేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. లావాదేవీల్లో గోల్మాల్ ప్రభుత్వ బిల్లుల చెల్లింపులు పారదర్శకంగా జరిగేందుకు, పాలనలో జవాబుదారీతనం పెంచేందుకు, నిధుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థను(సీఎఫ్ఎంఎస్) తీసుకొచ్చారు. ఈ వ్యవస్థ నిర్వహణకు అవసరమైన సాఫ్ట్వేర్ను అందించడంలో ఎన్ఐఐటీ అనే సంస్థ విఫలం కావడంతో దాన్ని పక్కనపెట్టారు. రాష్ట్ర విభజన తరువాత ఏపీలో ఎన్ఐఐటీని తప్పించి, ‘సాప్ ఇండియా’ అనే సంస్థకు సాఫ్ట్వేర్ను అందించే బాధ్యత అప్పగించారు. సాప్ ఇండియా రూపొందించిన సాఫ్ట్వేర్తోనే సీఎఫ్ఎంఎస్ కొనసాగుతోంది. అయితే, గత ఏడాదిన్నరగా సీఎఫ్ఎంఎస్ పేరుతో సాగుతున్న ప్రభుత్వ ఆర్థిక లావాదేవీలన్నీ పక్కదారి పట్టాయి. సీఎఫ్ఎంఎస్ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా(సీఈవో) ఒక ప్రైవేట్ వ్యక్తిని నియమించారు. దాంతో పెత్తనమంతా ఆ ప్రైవేట్ వ్యక్తి చేతుల్లోకి వెళ్లిపోయింది. నిబంధనల ప్రకారం.. తొలుత వచ్చిన బిల్లులను తొలుత చెల్లించాలి. ప్రాధాన్యతా క్రమంలో అంటే అత్యవసరాలకు చెందిన బిల్లులను ముందుగా క్లియర్ చేయాలి. గత ఏడాదిన్నరగా ఈ రెండు నిబంధనలను అటుకెక్కించేశారు. స్వప్రయోజనాల కోసమే సీఎఫ్ఎంఎస్ రాష్ట్ర విభజనకు ముందు సీఎఫ్ఎంఎస్ ఇంకా అమల్లోకి రాకముందే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ రూపొందించిన ఫ్లాట్ఫాంపై కాంట్రాక్టర్లు ఎవ్వరూ కూడా బిల్లుల కోసం ఆర్థిక శాఖకు రావాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లో బిల్లు మానటరింగ్ వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చారు. అప్పుడు ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేసిన ఎల్.ప్రేమచంద్రారెడ్డి ఈ వ్యవస్థను అందుబాటులోకి తేవడంతో పీఏవో కార్యాలయానికి వెళ్లి బిల్లు సమర్పించి సీనియారిటీ నెంబర్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకున్నారు. ఆ బిల్లును ఆన్లైన్లో సమర్పిస్తే సీనియారిటీ నెంబర్ జనరేట్ అవుతుంది. ఆ తరువాత బిల్లు సరిగ్గా ఉందా లేదా అనేది స్క్రూటినీ అయిన తర్వాత మళ్లీ సీనియారిటీ నెంబర్ జనరేట్ అవుతుంది. ఆ సీనియారిటీ నెంబర్ మేరకు బిల్లుల చెల్లింపు ఆన్లైన్లో జరిగిపోయేది. అయితే, ఇప్పుడు సీఎఫ్ఎంఎస్ అమల్లోకి వచ్చాక బిల్లుల చెల్లింపులో పారదర్శకతకు పాతర వేశారు. కమీషన్లు ఇచ్చిన వారికే బిల్లులు సీనియారిటీ అనేది లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కమీషన్లు దండుకుని ఏ బిల్లుకు టిక్ పెడితే ఆ బిల్లులను చెల్లించేస్తున్నారు. పలుకుబడి లేని కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుల జరగడం లేదు. ఎన్నికలకు మూడు నెలల ముందు ఆర్థిక శాఖ కార్యకలాపాలన్నీ చంద్రబాబు కనుసన్నల్లోనే నడిచాయి. రెగ్యులర్ ఉద్యోగులతో పాటు ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలను నిలిపివేశారు. ఆశ్రమ పాఠశాలల్లో డైట్ చార్జీలు, హోంగార్డుల వేతనాలను, పోలీసుల టీఏ, డీఏ బిల్లులను కూడా చెల్లించలేదు. ఉద్యోగులు దాచుకున్న భవిష్య నిధి నుంచి పిల్లల వివాహాలు, ఇతర అవసరాల కోసం డబ్బులు తీసుకోకుండా ఆంక్షలు విధించారు. కేవలం చంద్రబాబు చెప్పిన వారికే బిల్లులు చెల్లించేలా సీఎఫ్ఎంస్ వ్యవస్థను దిగజార్చారు. ఏదైనా ఒక రంగంలో ఎంత వ్యయం చేశారో సీఎఫ్ఎంఎస్లో వివరాలుండాలి. కానీ, ఎక్కడా కనిపించడం లేదు. ఒక పద్దు నుంచి మరో పద్దుకు ఇష్టానుసారంగా నిధులను మార్చేస్తున్నారు. ప్రైవేటు వ్యక్తి చేతిలో రాష్ట్ర ఖజానా చంద్రబాబు చెప్పిన ఏ బిల్లులు చెల్లించాలో ఆర్థిక శాఖ కార్యదర్శి రవిచంద్ర సీఎఫ్ఎంఎస్ సీఈవోకు చెప్పేవారు. అంటే ఆర్థిక శాఖ కార్యదర్శి రవిచంద్రకు మాత్రమే తెలియాల్సిన లాగిన్, పాస్వర్డ్ను ప్రవేట్ వ్యక్తి అయిన సీఈవోకు ఇచ్చేశారు. దీంతో రవిచంద్ర చెప్పిన బిల్లులతోపాటు మరికొన్ని బిల్లులను కూడా కమీషన్లు తీసుకుని సీఈవో, మరో ముగ్గురు వ్యక్తులు చెల్లించేస్తున్నారని ఆర్థిక శాఖ వర్గాలు కోడై కూస్తున్నాయి. దీంతో గత ఏడాదిన్నరగా ఆర్థిక శాఖతో పాటు ట్రెజరీ, పీఏవో విభాగాలు డమ్మీగా మారిపోయాయి. ఆర్థిక శాఖ రెగ్యులర్ ఉద్యోగులు చేయాల్సిన పనులన్నీ సీఈవోకు అప్పగించారు. సీఎఫ్ఎంఎస్ పూర్తిగా సీఈవో కనుసన్నల్లో చంద్రబాబు చెప్పినట్లు, రవిచంద్ర చెప్పినట్లు కొనసాగుతోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఆర్థిక శాఖలోని రెగ్యులర్ ఉద్యోగులకే తెలియకుండా చేసేశారు. నిబంధనలకు విరుద్ధంగా వివిధ కార్పొరేషన్లకు చెందిన నిధులను సీఎఫ్ఎంఎస్లోకి తీసుకొచ్చారు. చంద్రబాబు చెప్పిన రంగాలకు ఆయా నిధులను చెల్లించేశారు. దీంతో ఆయా కార్పొరేషన్లలోని ఉద్యోగులకు వేతనాలు ఇచ్చేందుకు నిధుల్లేకుండా పోయాయి. తప్పుడు వ్యవస్థకు రూ.168 కోట్లా? ముగిసిన ఆర్థిక సంవత్సరంలోనే సీఎఫ్ఎంఎస్ నిర్వహణకు ఏకంగా రూ.168 కోట్లు వ్యయం చేశారు. ఇప్పటివరకు రూ.104 కోట్లు ఖర్చు చేయగా, మరో రూ.64 కోట్ల బకాయిలున్నాయి. అంతేకాకుండా అనధికారికంగా మరికొన్ని రూ.వందల కోట్లను సీఎఫ్ఎంఎస్ నిర్వహణకు ఖర్చు పెట్టినట్లు సమాచారం. ఒక్కో ఉద్యోగికి రెండుసార్లు వేతనాలు కొంతమంది కాంట్రాక్టు ఉద్యోగులకు రెండుసార్లు వేతనాల రూపంలో రూ.200 కోట్లు చెల్లించారంటే సీఎఫ్ఎంఎస్ను ఎంతగా దిగజార్చారో అర్థం చేసుకోవచ్చు. దీనిపై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధికారులను నిలదీయడంతో మళ్లీ ఆ నిధులను వెనక్కి తెప్పించారు. డబుల్ ఎంట్రీల బిల్లులను అరికట్టడానికి రూపొందించిన సీఎఫ్ఎంఎస్ను పాలకుల అవసరాలకు అనుగుణంగా మార్చారు. సీఎఫ్ఎంఎస్లో పనిచేయడానికి వివిధ శాఖల నుంచి డిప్యూటేషన్పై 42 మందిని తీసుకున్నారు. అలాగే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్కు చెందిన 43 మందిని తీసుకున్నారు. ఆ తరువాత 145 మందిని రిక్రూట్ చేసుకున్నారు. ఈ రిక్రూట్మెంట్లో రిజర్వేషన్లు పాటించలేదని, అలాగే మరో రెండు ఏజెన్సీల నుంచి కొంత మందిని ఔట్ సోర్సింగ్ కింద తీసుకున్నారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తరువాత కూడా సీఎం చంద్రబాబు తన క్యాంపు కార్యాలయానికి ఆర్థిక శాఖ అధికారులను పిలిపించుకుని, ఏ బిల్లులు చెల్లించాలో ఆదేశాలు జారీ చేశారు. ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధమే. -
అధికారాంతమునా బాబు చేతివాటం
సాక్షి, అమరావతి: గత ఐదేళ్లుగా ప్రాజెక్టుల పేరుతో పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడిన చంద్రబాబు సర్కారు అధికారాంతంలోనూ చేతివాటం ప్రదర్శిస్తోంది. ఎన్నికలకు ముందు తన దోపిడీ పథకానికి మరింత పదును పెట్టింది. ప్రభుత్వ ఖజానాను దోచేసి.. పార్టీకి మరింత ఇం‘ధనం’ సమకూర్చిపెట్టడం ద్వారా ఎన్నికల్లో వెదజల్లడానికి పన్నాగం వేయడమేగాక దీన్ని కేవలం నెలరోజుల్లోనే అమలు చేసింది. ఎన్నికలకు ముందు ఆగమేఘాలపై 17 ప్రాజెక్టులకు పరిపాలన అనుమతి విషయంలో చర్యలు చేపట్టింది. ఆర్థికశాఖ అభ్యంతరాల్ని సైతం తోసిరాజని సాక్షాత్తూ ముఖ్యమంత్రే సంతకం చేసి ఆమోదముద్ర వేయడం గమనార్హం. అంతేగాక జీవో 94ను తుంగలో తొక్కుతూ టెండర్లు నిర్వహించడం ద్వారా రూ.18,648.71 కోట్ల విలువైన పనులను తన కోటరీకి చెందిన నలుగురు కాంట్రాక్టర్లకు కట్టబెట్టారు. ఇందుకోసం జలవనరుల శాఖను పావుగా వాడుకున్నారు. కాంట్రాక్టర్లు ముందే కుమ్మక్కు కావడంతో గరిష్టంగా 13.19% నుంచి కనిష్టంగా 3.52% ఎక్సెస్(అధిక) ధరకు కోట్ చేసి షెడ్యూళ్లను దాఖలు చేసి పనులు దక్కించుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో రూ.ఆరువేల కోట్లు ముడుపుల రూపంలో చేతులు మారినట్టు సమాచారం. సీఎం ‘దోపిడీ’ వ్యూహంలో జలవనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్కుమార్ పావుగా మారారని, నిబంధనల ప్రకారం అంచనా వ్యయాన్ని నిర్ణయించి, టెండర్లు నిర్వహించి ఉంటే రూ. ఆరువేల కోట్లకుపైగా ఖజానాకు ఆదా అయ్యేదని ఆ శాఖ సీనియర్ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తుండడం గమనార్హం. అంతా దోపిడే..: రాష్ట్రంలో కేవలం రూ.17,368 కోట్లతో పెండింగ్ ప్రాజెక్టుల పనులన్నీ పూర్తి చేస్తామని జూలై 28, 2014న విడుదల చేసిన శ్వేతపత్రంలో సీఎం స్పష్టం చేశారు. ఇప్పటివరకు సాగునీటి ప్రాజెక్టుల పనులకు 64,334 కోట్లు ఖర్చుచేసినా.. ఒక్క పెండింగ్ ప్రాజెక్టునూ పూర్తి చేయలేకపోయారు.. ఈ వ్యవహారంలో రూ. 25 వేల కోట్లకుపైగా బాబు అండ్ కో దోచేసినట్టు అధికారవర్గాలే కోడై కూస్తున్నాయి. ఆర్థిక శాఖ అభ్యంతరాలు తుంగలోకి..: ఏదైనా సాగునీటి ప్రాజెక్టు పనులకు పరిపాలన అనుమతివ్వాలంటే.. సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్), హైడ్రలాజికల్ క్లియరెన్స్లు తప్పనిసరి. కానీ ఆ రెండు లేకుండానే కేవలం లైన్ ఎస్టిమేట్లు(ఉజ్జాయింపు అంచనాలు) ఆధారంగా గోదావరి–పెన్నా నదుల తొలిదశ అనుసంధానం, వైకుంఠపురం బ్యారేజీ, వంశధార–బాహుదా అనుసంధానం, వేదవతి ఎత్తిపోతల, ఆర్డీఎస్(రాజోలిబండ డైవర్షన్ స్కీం) కుడికాలువ, సోమశిల హైలెవల్ లిఫ్ట్ కెనాల్ రెండోదశ, ముక్త్యాల ఎత్తిపోతల, వరికపుడిశెల ఎత్తిపోతల, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్–యోగివేమన రిజర్వాయర్–హంద్రీ–నీవా రెండో దశ ఎత్తిపోతల, గుంటూరు ఛానల్ ఆధునికీకరణ, విస్తరణ తదితర పనులకు అనుమతి ఇవ్వాలని ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపారు. హైడ్రలాజికల్ క్లియరెన్స్ లేకపోవడం.. కొన్ని ప్రాజెక్టులకు అంతర్రాష్ట్ర వివాదాలు ఉండటం.. కనీసం డీపీఆర్ లేకపోవడాన్ని ఎత్తిచూపుతూ ఆ ప్రాజెక్టులకు అనుమతిచ్చేందుకు ఆర్థికశాఖ అభ్యంతరం తెలిపింది. దాంతో ఆ ప్రాజెక్టులకు అనుమతిచ్చే ఫైళ్లపై సీఎం నేరుగా సంతకం చేశారు. ప్రాజెక్టుల అంచనా వ్యయాల రూపకల్పనలోనే వంచనకు పాల్పడిన సీఎం.. వాటికి టెండర్ నోటిఫికేషన్ చేయకముందే కోటరీ కాంట్రాక్టర్లతో బేరసారాలకు దిగారు. కమీషన్ ఇచ్చిన కాంట్రాక్టర్లకే పనులు దక్కేలా..: వాస్తవానికి టెండర్లను జూలై 1, 2003న జారీ చేసిన 94 జీవో ప్రకారమే నిర్వహించాలి. కానీ 2014లో చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చాక ఆ జీవోను తుంగలో తొక్కుతూ వచ్చింది. ఎన్నికలకు ముందు చేపట్టే ప్రాజెక్టుల పనులను కోటరీ కాంట్రాక్టర్లకే కట్టబెట్టే వ్యూహంలో భాగంగా.. జీవో 94కు విరుద్ధంగా టెండర్లు నిర్వహిస్తే కఠినచర్యలు తీసుకుంటామని సీఈలను హెచ్చరిస్తూ జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్కుమార్తో తొలుత అంతర్గత ఉత్తర్వులు జారీ చేయించారు. తర్వాత నెలరోజుల వ్యవధిలోనే 17 ప్రాజెక్టులకు సంబంధించిన పనులకు టెండర్లు నిర్వహించాలని ఆదేశించారు. టెండర్ నోటిఫికేషన్ జారీ చేయకముందే కాంట్రాక్టర్లతో బేరసారాలు జరిపి.. వారిని కుమ్మక్కు చేసిన సీఎం చంద్రబాబు.. ప్రాజెక్టుల పనులను పంచేశారు. అనంతరం ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకే పనులు దక్కేలా నిబంధనలు రూపొందించి టెండర్ నోటిఫికేషన్లు జారీ చేయాలంటూ ఆ ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లపై సీఎం ఒత్తిడి తెచ్చారు. వాటికి తలొగ్గిన సీఈలు జీవో 94కు విరుద్ధంగా నిబంధనలను రూపొందించి.. టెండర్ నోటిఫికేషన్లు జారీ చేశారు. అక్రమాలను సక్రమం చేశారనడానికి ఆధారాలు ఇవిగో.. - వైకుంఠపురం బ్యారేజీ పనులకు 13.19 శాతం ఎక్సెస్కు నవయుగ–ఆర్వీఆర్(జేవీ) షెడ్యూలు దాఖలు చేసింది. నిబంధనల ప్రకారం ఐదుశాతం కంటే ఎక్సెస్కు షెడ్యూలు కోట్ చేస్తే టెండర్ రద్దు చేయాలి. కానీ కృష్ణా డెల్టా చీఫ్ ఇంజనీర్పై ఒత్తిడి తెచ్చి.. వాటిని ఆమోదించేందుకు సీవోటీకి పంపారు. ఈలోగా ఐదు శాతం ఎక్సెస్కు షెడ్యూలు దాఖలు చేస్తే టెండర్ రద్దు చేయాలన్న నిబంధన నుంచి సడలింపునిస్తూ జలవనరుల శాఖ కార్యదర్శితో ఉత్తర్వులు జారీ చేయించారు. తర్వాత టెండర్పై సీవోటీ ఆమోదముద్ర వేసింది. - వేదవతి ఎత్తిపోతల, ఆర్డీఎస్ కుడి కాలువ ప్రాజెక్టుల టెండర్లలో జాయింట్ వెంచర్లు(ఒకరు కంటే ఎక్కువ మంది కాంట్రాక్టర్లు జట్టుగా ఏర్పడటం) పాల్గొనడానికి అవకాశం లేదని నిబంధన పెట్టారు. కానీ సీబీఆర్–వైవీఆర్–హెచ్ఎన్ఎస్ఎస్ రెండో దశ ఎత్తిపోతల్లో జాయింట్ వెంచర్లు కూడా టెండర్లలో పాల్గొనవచ్చునని నిబంధన పెట్టారు. దీన్ని ఆమోదిస్తూ జలవనరులశాఖ కార్యదర్శితో ఉత్తర్వులు జారీ చేయించారు. - కోటపాడు–చానుబండ– విస్సన్నపేట ఎత్తిపోతల పనుల్ని ఎంపిక చేసిన కాంట్రాక్టర్కు కట్టబెట్టడానికి జీవో 94కు విరుద్ధంగా ఏకంగా ఎనిమిది నిబంధనలను టెండర్ నోటిఫికేషన్లోచేర్చారు. ఎంపిక చేసిన కాంట్రాక్టర్కు పనులు కట్టబెట్టాక.. వాటికి జీవో 94 నుంచి సడలింపునిస్తూ జలవనరుల శాఖ కార్యదర్శితో ఉత్తర్వులు జారీ చేయించారు. - గోదావరి–పెన్నా నదుల అనుసంధానం తొలిదశ,వంశధార–బాహుదా నదుల అనుసంధానం నుంచి ముక్త్యాల ఎత్తిపోతల వరకూ 17 ప్రాజెక్టుల పనుల టెండర్లలోనూ ఇదే కథ కొనసాగింది. పనులన్నీ నలుగురు కాంట్రాక్టర్లకే 2014కు ముందు సాగునీటి ప్రాజెక్టులకు పారదర్శకంగా టెండర్లు నిర్వహించడంవల్ల గరిష్టంగా 27 శాతం నుంచి కనిష్టంగా 8.77 శాతం లెస్(తక్కువ) ధరలకు పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకొచ్చారు. దీనివల్ల అప్పట్లో ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదా అయ్యింది. కానీ ప్రస్తుతం నెల రోజుల వ్యవధిలో 17 ప్రాజెక్టులకు నిర్వహించిన టెండర్లలో నలుగురు కాంట్రాక్టర్లకే రూ.18,648.71 కోట్ల విలువైన పనులు దక్కాయి. కాంట్రాక్టర్లు ముందే కుమ్మక్కు కావడంతో గరిష్టంగా 13.19 శాతం నుంచి కనిష్టంగా 3.52 శాతం ఎక్సెస్(అధిక) ధరకు కోట్ చేసి షెడ్యూళ్లను దాఖలు చేసి పనులు దక్కించుకున్నారు. సీఎం చంద్రబాబు కమీషన్ల కక్కుర్తి వల్ల ఖజానాకు భారీగా నష్టం చేకూరింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించిన టెండర్లను సీవోటీ రద్దు చేస్తుంది. అయితే సీవోటీ నిర్ణయం తీసుకోక ముందే.. టెండర్లలో పెట్టిన నిబంధనలకు జీవో 94 నుంచి సడలింపునిస్తూ జలవనరుల శాఖ కార్యదర్శితో ఉత్తర్వులు జారీ చేయించారు. దాంతో ఆ పనుల టెండర్లను సీవోటీ ఆమోదించింది. ఈ పనులను ఆగమేఘాలపై కాంట్రాక్టర్లకు కట్టబెడుతూ జలవనరులశాఖ ఒప్పందాలు చేసుకుంది. మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చే దిశగా పావులు కదుపుతున్నారు. -
నిఘా.. నిద్ర నటిస్తోంది!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలోకి రావాల్సిన సొమ్ము వస్తుందా? రాకుంటే ఎందుకు రావడం లేదు, దాని వెనకున్న కారణాలేంటి? ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాల్లో అధికార యంత్రాంగం లేదా కాంట్రాక్టర్ల వ్యవస్థ సరైన రీతిలో పనిచేస్తోందా లేదా అన్న దానిపై ఎప్పటికప్పుడు నివేదికలివ్వాల్సిన రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం గాడితప్పినట్టు కనిపిస్తోంది. గతంలో విజిలెన్స్ విభాగం నుంచి నివేదిక వచ్చిందంటే సంబంధిత అధికారులుగానీ, కాంట్రాక్టర్లుగానీ వణికిపోయే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం పూర్తిగా నత్తనడకన సాగుతోందని సచివాలయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చేయి తడిపితే చాలు.. హైదరాబాద్ నగరంతో పాటు ప్రధాన నగరాల్లో అక్రమ కట్టడాలు నిర్మించే బిల్డర్లు, నిర్మాణాలు చేస్తున్న యజమానుల నుంచి నిబంధనల ప్రకారం జరిమానా వసూలు చేయాల్సి ఉంటుంది. కానీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో ఏ ప్రణాళికైనా వారి జేబులు నింపుకోవడానికే పరిమితమైనట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లి డివిజన్పరిధిలో భవనాలు నిర్మిస్తున్న ఓ బిల్డర్ నిబంధనలు అతిక్రమించి కట్టడాలు సాగిస్తున్నాడని జీహెచ్ఎంసీ నోటీసులు జారీచేసింది. అయితే నోటీసులు స్వీకరించిన సంబంధిత బిల్డర్లు అధికారులకు ఎంతో కొంత సమర్పించుకుని ఊపిరి పీల్చుకున్నారు. ఇంతలోనే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అదే బిల్డర్కు నోటీసులు జారీచేశారు. దీంతో కంగారుపడ్డ సంబంధిత బిల్డర్ జీహెచ్ఎంసీ అధికారిని ఫోన్లో ఆరా తీయగా, తమకు ఇచ్చినట్టుగానే విజిలెన్స్ అధికారులకు కూడా ఇస్తే నిర్మాణం సక్రమంగా సాగుతుందని తేల్చిచెప్పాడు. దీంతో చేసేదేమీలేక సంబంధిత అధికారికి రూ. 3 లక్షలు సమర్పించుకున్నట్టు తెలిసింది. ఇలా హైదరాబాద్లోని వందలాదిమంది బిల్డర్లు, సంబంధిత యజమానులకు ఇదే రీతిలో నోటీసులు జారీచేయడం, వాటి పేరున దండుకోవడం చేస్తున్నట్టు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. మరోవైపు మహబూబాబాద్ జిల్లాలో కూడా ఇదే రీతిలో రేషన్ బియ్యాన్ని రైస్మిల్లర్లకు అమ్ముతున్నారని రెండు సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, దీంతో పోలీస్ శాఖ అధికారులు దాడులు చేసి రెండు లారీలను శుక్రవారం ఉదయం పట్టుకున్నట్టు తెలిసింది. ఈ రెండు ఘటనలే కాదు, ఇలాంటి వ్యవహారాలు చాలానే గుట్టుగా సాగిపోవడానికి విజిలెన్స్ అధికారుల ఆమ్యామ్యాల వ్యవహారమే కారణమని చర్చ జరుగుతోంది. గతంలో నల్లగొండ విజిలెన్స్ అధికారి భాస్కర్రావు లక్ష రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కినా, ఏమాత్రం ప్రభావం లేకపోవడం ఉన్నతాధికారులనే కలవరానికి గురిచేస్తుంది. రిపోర్టులేవి..? ప్రభుత్వాలకు పథకాల అమలు, అమలులో ఉన్న సమస్యలు, అవినీతి వ్యవహారాలు, పక్కదారి పట్టిస్తున్న అధికారుల వివరాలతో కూడిన నివేదికలను ప్రతినెలా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పంపాల్సి ఉంటుంది. ప్రస్తుతమున్న అధికార వ్యవస్థ ఎక్కడా కూడా ఏ పథకాలపైగానీ, ఏ ప్రాజెక్టుపైగానీ, లోపభూయిష్టమైన ఏ వ్యవస్థపైనా ఇప్పటివరకు ఒక్క నివేదిక కూడా పంపిన దాఖలాల్లేవని సచివాలయ వర్గాలు చెబుతున్నా యి. పైగా అక్రమాలపై ఎవరైనా ఫిర్యాదులు చేస్తే అవతలి వ్యక్తికి సమాచారమిచ్చి వసూళ్లు చేసుకుం టున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఇలా ఆరోపణలెదుర్కుంటున్న సంస్థలు, ఆయా వ్యక్తులకు మేలు చేకూర్చేలా నివేదికలివ్వడాన్ని ఇంటెలిజెన్స్, ఏసీబీ అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. పాలన గాడి తప్పినట్టేనా? ఉమ్మడి రాష్ట్రంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు పూర్తి స్థాయి డైరెక్టర్ జనరల్ హోదా అధికారి ఉండి అజమాయిషీ చేసేవారు. కానీ ఇప్పుడు డీజీ లేకపోవడంతో పాలనాపరమైన సమస్యలు రావడం, సమీక్షించే సమయం కూడా లేకపోవడంతో విజిలెన్స్ విభాగం గాడితప్పినట్టు ప్రభుత్వ పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలుగున్నరేళ్లలో విజిలెన్స్ నివేదికలపై ఏ ఒక్క సంస్థపైగానీ, అధికారిపైగానీ చర్యలు తీసుకోలేదంటే పనితీరు ఎలా ఉందో తెలుస్తోంది. ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్గా రాజీవ్ త్రివేది వ్యవహరిస్తున్నారు. అయితే రాజీవ్ త్రివేది హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉండటంతో ఈ విభాగంలో జరుగుతున్న వ్యవహారాలపై దృష్టి పెట్టలేకపోతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. పనిఒత్తిడితో సచివాలయానికే పరిమితం కావడం వల్ల విజిలెన్స్ విభాగం గాడితప్పుతున్నట్టు స్వంత విభాగంలోనే చర్చించుకుంటున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
తప్పక చదవండి
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement