-
#CM YS Jagan: గూగుల్ ట్రెండ్స్లో టాప్ సీఎం జగన్
ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ ప్రజల తీర్పు సుస్పష్టంగా ఉండబోతుందని గూగుల్ ట్రెండ్స్ చెబుతున్నాయి. ఏపీ రాజకీయాల గురించి చేసే వేర్వేరు ప్లాట్ఫాంలపై చేసే పోస్టులను విశ్లేషించి, ఎవరిపై ఏ టాపిక్పై ఎంత సమయం గడుపుతున్నారన్న దాన్ని బట్టి.. గూగుల్ ట్రెండ్స్ ఫలితాలు ఇస్తుంది. ఏపీ పాలిటిక్స్కు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి టాప్లో ఉండగా.. దరిదాపుల్లో కూడా చంద్రబాబు లేకపోవడం గమనార్హం. గూగుల్ ట్రెండ్స్కు సంబంధించి రెండు రకాల రిపోర్టులు పరిశీలిద్దాం. ఒకటి 90 రోజులకు సంబంధించి, మరొకటి గత 30 రోజులకు సంబంధించి. ముందుగా గడిచిన 90 రోజుల ట్రెండ్స్ చూస్తే.. యావరేజ్ ఇంటరెస్ట్ ఓవర్ టైం ►సీఎం వైఎస్ జగన్- 39 నిమిషాలు ►చంద్రబాబు నాయుడు- 12 నిమిషాలు (ఒక్కో యూజర్ ఆయా వ్యక్తుల మీద ఒక రోజు వెచ్చించిన సమయం) గడచిన 90 రోజుల్లో సీఎం జగన్కు దగ్గరగా చంద్రబాబు వచ్చింది ఒకే ఒక సారి. అది కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పుడు మాత్రమే. ఆ కేసులో చంద్రబాబు విజ్ఞప్తిని తోసిపుచ్చింది సుప్రీంకోర్టు. తనపై కేసు కొట్టేయాలంటూ వేసిన క్వాష్ పిటిషన్ను సుప్రీంకోర్టు అంగీకరించలేదు. పైగా అరెస్ట్ సబబేనని తేల్చిచెప్పింది కూడా. ఇక గడచిన 30 రోజులు అంటే ఎన్నికల వేడి బాగా పెరిగిన తర్వాత గూగుల్ ట్రెండ్స్ను పరిశీలిస్తే.. యావరేజ్ ఇంటరెస్ట్ ఓవర్ టైం ►సీఎం వైఎస్ జగన్- 45 నిమిషాలు ►చంద్రబాబు నాయుడు- 16 నిమిషాలు తెలుగు భాషలో ఉన్న మీడియాలో సింహాభాగం చంద్రబాబు, ఆయన మనుష్యుల చేతిలో ఉంది. ఇన్నాళ్లు చంద్రబాబు, ఎల్లోమీడియా ఏది చెప్పినా అది నిజమని నమ్మేవారు. ఇప్పుడు జనం ముందు సోషల్ మీడియా పుణ్యమా అని అసలు నిజాలను నెటిజన్లు మాత్రం బయటకు తీస్తూనే ఉన్నారు. అందుకే ఎన్నికల వేళ చంద్రబాబును మరింత దూరం పెట్టారు. -
గూగుల్ ట్రెండ్స్ లో ట్రెండ్ సృష్టించిన సీఎం జగన్
-
గూగుల్ సెర్చ్లో ట్రెండ్ కరోనాదే.. టాప్ 10 జాబితా ఇదే!
Google Search 2021 Trends: ఏదైనా కొత్త విషయం తెలుసుకోవాలన్నా, ఏదైనా విషయం మీద వార్తలో, వివరాలో కావాలన్నా ఆశ్రయించేది ‘గూగుల్’నే. జనం దేనిపై ఆసక్తిగా ఉన్నారో, ఎప్పుడెప్పుడు దేని గురించి సెర్చ్ చేస్తున్నారో గూగుల్ ట్రెండ్స్ చెప్పేస్తుంది. అలా 2021లో భారతీయులు ఎక్కువగా వెతికినది దేని గురించో తెలుసా.. కరోనాకు సంబంధించే. ఇదొక్కటే కాదు.. వివిధ అంశాల్లో జనం దేనిగురించి ఎక్కువగా వెతికారో గూగుల్ ట్రెండ్స్ తాజాగా వెల్లడించింది. ఆ వివరాలేంటో చూద్దామా? – సాక్షి సెంట్రల్డెస్క్ టాప్–10లో ఉన్నవి ఇవీ.. మొత్తంగా ఏడాదంతా కలిపి చూస్తే.. గూగుల్ సెర్చ్లో ఐపీఎల్ టాప్లో.. కరోనా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్కు సంబంధించిన కోవిన్ పోర్టల్ రెండో స్థానంలో నిలిచాయి. ఆ తర్వాతి స్థానాల్లో ఐసీసీ టీ20 వరల్డ్ కప్, యూరో కప్, టోక్యో ఒలింపిక్స్, కోవిడ్ వ్యాక్సిన్, ఫ్రీఫైర్ గేమ్ రిడీమ్ కోడ్, కోపా అమెరికా, నీరజ్ చోప్రా, ఆర్యన్ ఖాన్ (షారూక్ఖాన్ కుమారుడు) గురించి నెటిజన్లు వెతికారు. దగ్గరిలో ‘కోవిడ్’గురించే.. మనం ఉన్న ప్రాంతంలో మనకు కావాల్సిన అవసరాల కోసం చేసే ‘నియర్ మి’సెర్చ్లో.. కోవిడ్ వ్యాక్సిన్, కోవిడ్ పరీక్షల కోసమే కోసమే జనం అత్యధికంగా వెతికారు. తర్వాతి స్థానాల్లో ఫుడ్ డెలివరీ, ఆక్సిజన్ సిలిండర్, కోవిడ్ హాస్పిటల్, టిఫిన్ సెంటర్, సీటీ స్కాన్, టేక్ఔట్ రెస్టారెంట్స్, ఫాస్టాగ్, డ్రైవింగ్ స్కూల్ నిలిచాయి. మొత్తంగా ‘నియర్ మి’సెర్చ్ టాప్–10లో ఐదు అంశాలు కరోనాకు సంబంధించినవే. ఎలా చేయాలనే లిస్టులోనూ.. ఏదైనా పని ఎలాచేయాలనే దానికి సంబంధించిన ‘హౌ టు’సెర్చ్లో నూ కరోనా అంశాలే ఎ క్కువగా నిలిచాయి. కోవిడ్ వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎలాగనే దానిపైనే ఎ క్కు వ మంది సెర్చ్ చేశారు. ఆ తర్వాత వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ డౌన్లోడ్, ఆక్సిజన్ స్థాయిలు పెంచుకోవడమెలా? పాన్–ఆధార్ లింకేజీ, ఇంట్లో ఆ క్సిజన్ తయారీ, డోగె కాయిన్ (వర్చువల్ కరె న్సీ) కొనేదెలా? బనానా బ్రెడ్ తయారీ, బిట్కా యిన్లో ఇన్వెస్ట్ చేసేదెలాగనే వాటిపై వెతికారు. మార్కుల శాతాన్ని లెక్కించడం ఎలాగనేదానిపై చాలామంది సెర్చ్ చేయడం గమనార్హం నీరజ్ చోప్రానే టాప్ భారతీయుల్లో ఎక్కువగా క్రీడాకారుడు నీరజ్ చోప్రా గురించి గూగుల్ సెర్చ్ చేశారు. బాలీవుడ్ హీరో షారూక్ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్, నటి షెహనాజ్ గిల్, నటి శిల్పాషెట్టి భర్త రాజ్ కుంద్రా, స్పేస్ ఎక్స్ అంతరిక్ష సంస్థ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్, నటుడు విక్కీ కౌశల్, క్రీడాకారులు పీవీ సింధు, భజరంగ్ పునియా, సుశీల్కుమార్, ఫ్యాషన్ డిజైనర్ నటాషా దలాల్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. బ్లాక్ ఫంగస్ ఏంటని వెతుకుతూ.. ఏదైనా అంశం గురించి తెలుసుకునేందుకు వాడే ‘వాట్ ఈజ్’సెర్చ్లో గత ఏడాది ‘బ్లాక్ ఫంగస్’టాప్లో నిలిచింది. కరోనా రెండో వేవ్ సమయంలో.. బ్లాక్ ఫంగస్ కేసులు పెరిగిపోవడంతో అదేమిటనే దానిపై జనం గూగుల్లో వెతికారు. ఇక గణితానికి సంబంధించి.. ‘వందకు కారకం (ఫ్యాక్టోరియల్ ఆఫ్ హండ్రెడ్)’ఏమిటి? తాలిబాన్ ఏంటి? అఫ్గానిస్తాన్లో ఏం జరుగుతోంది? రెమ్డెసివిర్ ఏమిటి, నాలుగుకు స్వే్కర్ రూట్ ఏమిటి? స్టెరాయిడ్లు, టూల్కిట్, స్క్విడ్గేమ్, డెల్టాప్లస్ వేరియంట్ ఏమిటన్న దానిపై నెటిజన్లు సెర్చ్ చేశారు. వార్తల్లో నిలిచినవేంటి? ఎప్పటికప్పుడు జరిగే వార్తాంశాల సెర్చింగ్లో గత ఏడాది టోక్యో ఒలింపిక్స్ టాప్లో నిలిచింది. బ్లాక్ ఫంగస్, అఫ్గానిస్తాన్ వార్తలు, బెంగాల్ ఎన్నికలు, టౌక్టీ తుఫాను, కరోనా రెండోవేవ్ లాక్డౌన్, సూయజ్ కెనాల్లో నౌక చిక్కకుపోయిన సంక్షోభం, ఢిల్లీ శివార్లలో రైతుల ఆందోళనలు, బర్డ్ఫ్లూ వ్యాప్తి, యాస్ తుఫానుకు సం బంధించిన వార్తలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. పాత, కొత్త రుచుల కోసం.. గత ఏడాది లాక్డౌన్ సమయంలో చాలా మంది గూగుల్లో వివిధ రకాల వంటలు ఎలా చేయాలనేదానిపై విపరీతంగా సెర్చ్ చేశారు. అందులో పాత, కొత్త రుచుల కలయిక ఉండటం గమనార్హం. ఇనోకి మష్రూమ్ (పుట్టగొడుగుల వంటకం) ఇందులో టాప్లో నిలిచింది. తర్వాతి స్థానాల్లో మోదక్, మేతీ మటర్ మలాయి, పాలక్, చికెన్ సూప్, పోర్న్స్టార్ మర్తిని (కాక్టెయిల్), లసగ్నా, కుకీస్, మటర్ పనీర్, కడా వంటకాలు నిలిచాయి. -
గూగుల్ ఇయర్ ఇన్ సెర్చ్ 2021: మనోడు కాదు.. అయినా తెగ వెతికారు!
Google Year in Search 2021.. Billionaire Elon Musk was Searched Extensively By Indians: ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా సెర్చింజన్ గూగుల్ ‘ఇయర్ ఇన్ సెర్చ్ 2021’ లిస్ట్ను రిలీజ్ చేసింది. కరోనా హవాను తట్టుకుని ఇండియన్ ప్రీమియర్ లీగ్.. భారత్లో ఓవరాల్ టాప్ సెర్చ్ లిస్ట్లో నిలిచింది. ఇక మిగతా జాబితాలోనూ వార్తల్లో నిలిచిన వైవిధ్యమైన అంశాలు, కరోనా సంబంధిత టాపిక్స్ సెర్చ్ ట్రెండ్లో టాప్లో నిలిచాయి. సాధారణంగా సినీ సెలబ్రిటీలు, ముఖ్యంగా సన్నీ లియోన్, కత్రినా కైఫ్ లాంటి ఫీమేల్ సెలబ్రిటీల గురించి మనోళ్ల వెతుకులాట ఎక్కువగా కొనసాగుతూ వచ్చేది. అయితే ఈ ఏడాది కొంచెం భిన్నంగా Google Year in Search 2021లో భారతీయుల వెతుకులాట కొనసాగింది. ఇక పర్సనాలిటీ లిస్ట్లో టోక్యో ఒలింపిక్స్ పసిడి పతక విజేత నీరజ్ చోప్రా టాప్లో నిలవగా.. ఈ లిస్ట్లో ఒక్కరు తప్ప అంతా మన దేశస్తులే ఉన్నారు. ఆ ఒక్కరు ఎవరో కాదు.. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్. 278 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా కొనసాగుతున్నాడు ఎలన్ రీవ్ మస్క్. ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడిగా, టెస్లా సీఈవోగా కొనసాగుతున్న ఎలన్ మస్క్.. ఇండియన్ గూగుల్ ఇన్ సెర్చ్ 2021 లిస్ట్లో ఐదవ స్థానంలో నిలిచాడు. భారత్లో టెస్లా ఈవీ ఎంట్రీ ప్రయత్నాలు, స్పేస్ఎక్స్కు చెందిన శాటిలైట్ ఇంటర్నెట్ సేవల కంపెనీ ‘స్టార్లింక్’ కనెక్షన్ ఇచ్చే ప్రయత్నాలతో పాటు స్పేస్ఎక్స్ ప్రయోగాలు, పలు అంతర్జాతీయ పరిణామాల్లో జోక్యం కారణంగా ఎలన్ మస్క్ గురించి ఎక్కువగా వెతికారు భారతీయులు. క్లిక్: లక్ష కోట్లకుపైగా నష్టం.. అయినా ‘అయ్యగారే’ నెంబర్ 1! మరోవైపు పోటీదారు కంపెనీలపై చేసే వెకిలి కామెంట్లు.. ఇచ్చే ప్రకటనలు, క్రిప్టో కరెన్సీ మీద తన వైఖరి, టెస్లాలో షేర్ల అమ్మకం, సోషల్ మీడియాలో ఆరున్నర కోట్ల మంది ఫాలోవర్స్.. వెరసి ఎలన్ మస్క్ గురించి భారతీయుల్లో ఒకరకమైన ఆసక్తిని కలగజేసింది. ఇంకోవైపు వ్యక్తిగత అంశాలతోనూ 50 ఏళ్ల ఎలన్ మస్క్ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ఊహకందని చేష్టలతో ‘థగ్ లైఫ్’ పర్సనాలిటీగా ఎలన్ మస్క్కి భారతీయ యువతలోనూ మాంచి క్రేజ్ దక్కింది. అంతేకాదు ఆనంద్ మహీంద్రా లాంటి వ్యాపార దిగ్గజాలు సైతం ఎలన్ మస్క్ వ్యవహారాల్ని నిశితంగా పరిశీలిస్తూ.. అప్పుడప్పుడు స్పందిస్తుంటారు కూడా. చదవండి: రాజకీయాల నుంచి ''ఆ ముసలోళ్లను ఎలిమినేట్ చేయండి సార్''..! -
2020లో ఐపీఎల్ టాప్, ఎలాగంటే..
సాక్షి, అమరావతి : మన దేశంలో కోవిడ్ మహమ్మారిపైనా క్రికెట్ ఆధిపత్యం సాధించింది. కోవిడ్ వైరస్ నిలువెల్లా వణికించిన తరుణంలోనూ గూగుల్లో అత్యధిక శాతం మంది క్రికెట్పైనే ఆసక్తి చూపించారు. 2020లో గూగుల్లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన అంశంగా ఐపీఎల్ నిలిచింది. దాని తర్వాతే కరోనా వైరస్ గురించి జనం వెతికారు. ఈ రెండింటి తర్వాత అమెరికా ఎన్నికలు, పీఎం కిసాన్ యోజన, బిహార్ ఎన్నికల అంశాలు వరుసగా మూడు, నాలుగు, ఐదవ స్థానాల్లో ఉన్నాయి. 2020లో ఎక్కువ మంది వెతికిన అంశాల జాబితాను గూగుల్ ఇటీవల విడుదల చేసింది. త్రిపుర రాష్ట్రంలో అత్యధికంగా ఐపీఎల్ క్రికెట్ గురించి సెర్చ్ చేయగా, మన రాష్ట్రంలో 41 శాతం మంది మాత్రమే దీని ఆరా తీశారు. తెలంగాణలో మన కంటె ఒక్క శాతం ఎక్కువ మంది సెర్చ్ చేశారు. ఏపీలో ఈ అంశంపై విశాఖపట్నం, భీమవరం, చిత్తూరు నుంచి అత్యధికంగా.. నంద్యాల, అనంతపురంలో అతి తక్కువగా శోధించారు. కరోనాపై హిందూపూర్, చిత్తూరులో ఎక్కువ ఆసక్తి కరోనా వైరస్ గురించి గోవా, జమ్మూ–కశ్మీర్, మేఘాలయ రాష్ట్రాల్లో 90 శాతం మంది సెర్చ్ చేయగా, మన రాష్ట్రంలో 42 శాతం, తెలంగాణలో 54 శాతం సెర్చ్ చేశారు. మన రాష్ట్రంలో ఈ అంశాన్ని హిందూపూర్, శ్రీకాకుళం, చిత్తూరు ప్రాంతాల్లో ఎక్కువ మంది సెర్చ్ చేయగా.. విశాఖ, విజయవాడ ప్రాంతాల్లో చాలా తక్కువ మంది సెర్చ్ చేయడం గమనార్హం. కేరళలో అతి తక్కువగా 30 శాతం మంది మాత్రమే దీని గురించి వెతికారు. (చదవండి: అదే టీమిండియా కొంపముంచింది..) మన చూపంతా అమెరికా ఎన్నికలపైనే అమెరికా ఎన్నికల గురించి మన రాష్ట్రంలో 38 శాతం మంది, తెలంగాణలో 42 శాతం మంది సెర్చ్ చేయడం విశేషం. ఐపీఎల్, కరోనా అంశాల సెర్చింగ్లో 20వ స్థానంలో ఉన్న ఏపీ ఈ అంశంలో నాలుగో స్థానంలో ఉండడం విశేషం. ఆశ్చర్యకరంగా పీఎం కిసాన్ యోజన ఈ సంవత్సరం టాప్ సెర్చింగ్ జాబితాలో ఉంది. దీన్ని బట్టి రైతుల అంశం ప్రజల్లో విస్తృతంగా నానుతున్నట్లు స్పష్టమైంది. ప్రముఖ వ్యక్తుల్లో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్, టీవీ జర్నలిస్టు అర్నాబ్ గోస్వామి, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్, అమితాబ్, కమలా హారిస్ గురించిన సమాచారం కోసం ఎక్కువ మంది వెతికారు. ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ నటించిన దిల్ బేచారాను ఎక్కువ మంది సెర్చ్ చేశారు. తమిళ సినిమా సూరారై పొట్రు, బాలీవుడ్ సినిమాలు తన్హజి, శకుంతలాదేవి గురించి ఆ తర్వాత అన్వేషించారు. టీవీ, వెబ్ సిరీస్లో నెట్ఫ్లిక్స్లో విడుదలైన క్రైం డ్రామా మనీ హీస్ట్ గురించి ఎక్కువ మంది అన్వేషించారు. స్కామ్స్టర్ హర్షద్ మెహతా స్టోరీ, హిందీ బిగ్బాస్–14 గురించి ఆ తర్వాత ఎక్కువగా వెతికారు. (చదవండి: ఒలింపిక్స్కు మళ్లీ ఎంత కష్టమొచ్చే..!) తాజా పరిణామాలపై ఇలా.. వార్తలకు సంబంధించి నిర్భయ కేసు, లాక్డౌన్స్, ఇండియా–చైనా సరిహద్దు పరిణామాలు, మిడతల దండు, రామ మందిరం సమాచారం కోసం ఎక్కువ మంది సెర్చ్ చేశారు. లాక్డౌన్ కారణంలో ఇళ్లల్లోనే ఉండిపోయిన జనం పన్నీర్ ఎలా తయారు చేయాలనే దానిపై గూగుల్లో ఎక్కువగా వెతికారు. ఆ తర్వాత ఇమ్యూనిటీని ఎలా పెంచుకోవాలి, పాన్–ఆధార్కార్డు ఎలా లింక్ చేసుకోవాలి, ఇంట్లోనే శానిటైజర్ ఎలా తయారు చేసుకోవాలి వంటి వాటి గురించి అన్వేషించారు. కరోనా వైరస్ అంటే ఏమిటి (వాట్ ఈజ్) అనే దాని గురించి అత్యధిక మంది సెర్చ్ చేశారు. అలాగే సోషల్ మీడియా ట్రెండ్ అయిన బినాడ్ గురించి, ప్లాస్మా థెరపీ గురించి వెతికారు. స్థానికంగా తమ ఇళ్లకు ఏవి దగ్గరగా ఉన్నాయో తెలుసుకునేందుకు నెటిజన్లు గూగుల్లో అన్వేషించారు. దగ్గరలోని ఫుడ్ షెల్టర్స్ గురించి అత్యధికులు అన్వేషించారు. దగ్గరలో కోవిడ్ టెస్ట్, మద్యం షాపు గురించి జనం వెతికారు. క్రికెట్పైనా జనం ఆసక్తి మన దేశంలో క్రికెట్కు సంబంధించిన అంశాలపైనే జనం ఆసక్తి చూపుతారు. ఏ సంవత్సరమైనా క్రికెట్పైనే మన వాళ్లకు ఆసక్తి ఎక్కువ అని ఈ ట్రెండ్స్ని బట్టి అర్థమవుతోంది. విద్యా సంబంధిత అంశాలు, ఓటీటీ ప్లాట్ఫాంలు, రాజకీయ అంశాలు, ఎన్నికల గురించి తెలుసుకునేందుకు కూడా మన రాష్ట్ర ప్రజలు ఉత్సుకత ప్రదర్శిస్తారు. – శ్రీ తిరుమల, డిజిటల్ మార్కెటింగ్ నిపుణుడు, విజయవాడ
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సూప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
IPL 2024 PBKS VS CSK: రుతురాజ్ను వెంటాడుతున్న దరిద్రం
ఉంగరంతో ఆరోగ్యం పదిలం!
Shobha Shetty Engagement: గ్రాండ్గా ప్రియుడితో సీరియల్ నటి శోభా శెట్టి ఎంగేజ్మెంట్ (ఫోటోలు)
గ్రాండ్గా నటుడి కుమార్తె రిపెప్షన్ వేడుక.. సందడి చేసిన ప్రముఖ తారలు!
సీఎం జగన్ రేపటి ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ ఇదే
నాన్న చనిపోయినా వేళ్లలేదు.. బంధువులంతా తిట్టారు: కోవై సరళ ఎమోషనల్
IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
తప్పక చదవండి
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement